సర్కార్ కమాల్..తెలంగాణలో సాగు ఢమాల్..!!
తెలంగాణలో వ్యవసాయంకు పెద్ద దెబ్బ తగిలింది. ఖరీఫ్ సీజన్లో సాగునీరుపై నెలకొన్న అనిశ్చితి, ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన రైతు భరోసా పథకం ఆలస్యం కారణంగా ఈ సారి ఖరీఫ్ సీజన్లో పంటపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సీజన్ ముగిసేందుకు మరో 50 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పంటలైన వరి, పత్తి, ధాన్యాల సాగుపై సందిగ్ధత నెలకొంది.
మనకు అందుతోన్న సమాచారం మేరకు ఆగష్టు 10వ తేదీ నాటికి కేవలం 84.6 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాధారణంగా ఖరీఫీ సీజన్లో 1.29 కోట్ల ఎకరాల్లో నాట్లు వేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల కేవలం 65.4శాతం మేరకే నాట్లు జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది 99.9 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి కాగా మొత్తం ఖరీఫ్ సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో పంట సాగైంది.
అయితే ఇప్పటికీ నాట్లు పూర్తి కాకపోవడంతో రైతుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై చర్చ జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో సాగునీరు అందడం, రైతు భరోసా అందడంతో వ్యవసాయంలో వృద్ధి నమోదయ్యేదని కానీ ఈసారి ఆగష్టు నెల వచ్చినప్పటికీ నాట్లు వేసే కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోవడం, సాగునీరు కొరత ఉండటంతో పూర్తిస్థాయిలో నాట్లు చేపట్టలేకపోయామని రైతులు చెబుతున్నారు.
కొన్ని జిల్లాలు పూర్తిగా సాగునీరు పై ఆధారపడి వ్యవసాయం జరుగుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. రైతులు కూడా పంట వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వీటన్నిటికీ సమగ్ర కారణం భూగర్భ జలాలు అడుగంటిపోవడమే. గతేడాది 6.17మీటర్ల వరకు భూగర్భ జలాలు ఉండగా అది 2.08 మీటర్లకు పడిపోయింది.
అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉండగా.. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో వ్యవసాయం అత్యంత దారుణంగా ఉంది. కృష్ణ నదీ జలాలపైనే ఆధారపి ఉన్న నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో కేవలం 60శాతం మాత్రమే పంట సాగు జరిగింది. ఖరీఫ్ సీజన్లో ఈ స్థాయిలో పంట సాగు జరగడం ఇదే తొలిసారి అని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెరుకు, వరి, ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె, పత్తి వంటి ప్రధాన పంట సాగుపై తీవ్ర ప్రభావం పడింది.
ఇదిలా ఉంటే తెలంగాణలో పంట సాగు ఇంత తీవ్రంగా పడిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని విరుచుకుపడ్డారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతాంగం ఎంత సంబరంగా వ్యవసాయం చేసిందో ఇప్పటి ప్రభుత్వంలో అదే రైతాంగం ఎలా దిగాలుగా ఉందో చెప్పుకొచ్చారు. ఖరీఫ్ సీజన్లో అత్యంత పేలవంగా పంటసాగు జరుగుతోందంటే ఎవరు కారణమని ప్రశ్నించారు. దశాబ్దకాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో ఎనిమిది నెలల్లోనే వ్యవసాయ విధ్వంసం జరిగిందని మండిపడ్డారు.



తాజా ఆరోపణలతో అదానీ స్టాక్స్ పడిపోతాయా? మార్కెట్ నిపుణుల సమాధానమిదే..! అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. సెబీ చైర్పర్సన్ మాధుబి పురి బచ్, ఆమె భర్తకు అదానీ ఆఫ్షోర్ వ్యాపారంలో వాటాలు ఉన్నాయని ఆరోపించింది. మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన క్రమంలో సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అదానీ గ్రూప్ స్టాక్స్ పతనమవుతాయా? మార్కెట్ నిపుణుల ఏమంటున్నారు? అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ మరోసారి అదానీ గ్రూప్ని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే, ఈసారి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్ పర్సన్ మాధుబి పురి బచ్ని ఈ అంశంలోకి తీసుకొచ్చింది. అదానీ గ్రూప్ మారిషస్ ఆఫ్షోర్ ఫండ్స్లో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కొత్త ఇన్వెస్ట్గేటివ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పనితీరుపై చర్చకు దారితీసింది. సోమవారం ఆగస్టు 12వ తేదీన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పతనమయ్యే అవకాశం ఉందా? అనేది ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. మరి ఈ అంశంపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? 2023లో అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ అదానీ గ్రూప్పై తీవ్ర ఆరోపణలు చేసింది. కృత్రిమంగా షేర్ల విలువను పెంచి లాభపడిందని, స్టాక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలను గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినప్పటికీ ఆ సమయంలో గ్రూప్ కంపెనీల స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. సుమారు 100 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయి. అయితే, ఆ తర్వాత తమ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. దీంతో అదానీ గ్రూప్ షేర్లు వేగంగా కోలుకున్నాయి. హిండెన్బర్గ్ ఆరోపణల ముందు సమయంలోని విలువను దాటి ట్రేడింగ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్నకు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. అవి అదానీ పోర్ట్స్ అండే సెజ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఎన్డీటీవీ ఉన్నాయి. తాజా ఆరోపణలపై స్టాక్ మార్కెట్ నిపుణులు స్పందిస్తున్నారు. 2023తో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు వేరని గుర్తు చేశారు. హిండెన్బర్గ్ తాజా ఆరోపణల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నారు. సోమవారం నాటి ట్రేడింగ్లో అదానీ స్టాక్స్లో భారీ అమ్మకాలు ఉండకపోవచ్చని, అలాగే స్టాక్ మార్కెట్ సైతం భారీ నష్టాల్లోకి వెళ్లే అవకాశాలేమీ ఉండకపోవచ్చని నమ్ముతున్నట్లు చెప్పారు హిండెన్బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్ కారణంగా భారత స్టాక్ మార్కెట్లపై భారీ ప్రభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. మొదట్లో ప్రభావం కనిపించవచ్చు కానీ, మార్కెట్లో కొనుగోళ్లు ఉంటాయి. అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్పైనా పెద్ద ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు. మార్కెట్లు ప్రారంభమైన తర్వాత అదానీ స్టాక్స్ కాస్త ఒత్తిడికి గురికావచ్చు. కానీ, మళ్లీ రికవరీ అవుతాయి.' అని ఇండిట్రేడ్ క్యాపిటల్ ఛైర్మన్ బందోపాధ్యాయ్ పేర్కొన్నట్లు మింట్ వెల్లడించింది.
తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Siva Kumar) స్పందించారు.






Aug 12 2024, 15:07
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.1k