/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz కాళేశ్వరం ప్రాజెక్టుపై NDSA కీలక సమావేశం.. Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 20 2024, 15:46

కాళేశ్వరం ప్రాజెక్టుపై NDSA కీలక సమావేశం..

కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ (NDSA) కీలక సమావేశం నిర్వహించింది. ఈ ఏడాది మే 5వ తేదీన ఒక నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్‌ఏ.. వర్షాకాలం, వరదలు రాకముందే జులై మొదటి వారంలోపే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నివేదికలో పేర్కొంది.

NDSA సూచనలతో.. జూన్ రెండో వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు CWPRS, CSMRS లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ రెండు సంస్థలు సాంకేతిక పరీక్షలకు ఉపక్రమించే సమయానికి వరద రావడంతో టెస్ట్‌లు ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది.

ఈ కమిషన్ త్వరగా నివేదిక ఇవ్వాలంటూ NDSAని కోరింది. ఆ నివేదిక ఆధారంగానే తాము తుది నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ప్రాజెక్టును కొనసాగించడమా! కొత్త నిర్మాణానికి వెళ్లాడమో సిఫార్సులు చేయాల్సి ఉందన్న కమిషన్ తెలిపింది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సమాచారం లేకపోవడంతో తాము నివేదిక ఇవ్వలేకపోతున్నట్లు కమిషన్‌కు తెలిపింది NDSA బృందం.

ఈ నేపథ్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని NDSAని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ మేరకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు NDSA చైర్మన్.

శనివారం మధ్యాహ్నం జరిగే ఈ భేటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 20 2024, 15:44

భ‌ద్రాచలం వ‌ద్ద క్ర‌మంగా పెరుగుతున్న గోదావ‌రి నీటిమ‌ట్టం

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగిపోర్లుతున్నాయి. ప‌లు ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండలా మారాయి. ఈ క్ర‌మంలో ఆయా ప్రాజెక్టుల ప‌రిధిలోని లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుపోతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 31.5 గా ఉంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అలర్ట్‌ చేశారు. మరోవైపు తాళిపేరు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 66,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఎగువ ప్రాంతాలైన తాళి పేరు ప్రాజెక్టు, పెరూరు వైపు నుంచి వరద నీరు రావడంతో నది నీటిమట్టం ఇంకా పెరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు జాలారులు నదివైపు వెళ్లొద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరికలు జారీ చేశారు.

శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద‌..

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టు 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1066.30 అడుగులుగా ఉంది. ఎస్సారెస్పీ నీటి నిల్వ సామర్థ్యం 80.5టీఎంసీలు అయితే వరద ప్రవహానికి ప్రస్తుతం 17.662 టీఎంసీలుగా ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 20 2024, 15:41

ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాన అజెండా అదే..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలో ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేంవత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు.. పలువురు కేంద్రమంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవుల పంపకం పూర్తవ్వడంతో.. మిగిలిన పదవులు ఎవరెవరికి కేటాయించాలి.. పదవులు దక్కని సీనియర్లను ఎలా గౌరవించాలనే విషయంపై కూడా అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు.

మరోవైపు వరంగల్‌లో ఏర్పాటుచేయబోయే భారీ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేయడంతో రాహుల్‌తో సభ పెట్టిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఈ విషయాన్ని హైకమాండ్‌కు రేవంత్ తెలియజేయనున్నారు.

రెండు రోజుల పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. విభజన హామీల అమలుతో పాటు.. కొత్త రుణాలు, ప్రాజెక్టుల మంజూరుపై వివిధ శాఖల మంత్రులతో సమావేశమవుతారు. రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశం ఉంది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. పెండింగ్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని కోరనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలవనున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలపై ఆయన చర్చించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తుండటంతో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించి.. ఎవరిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకోవాలనేదానిపై రేవంత్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు.. 

చేరికల అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఎంపికపై ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. గత ఢిల్లీ పర్యటనలోనే పీసీసీ చీఫ్ ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ.. పార్టీలో ఏకాభిప్రాయం రాకపోవడంతో పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదాపడింది. ఈసారి మాత్రం కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 20 2024, 13:02

తెలంగాణలో కొత్త పథకం: ఆ నేత పేరు: వారికి రూ. లక్ష ఆర్థికసాయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఓ కొత్త పథకాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. దీనికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది. నేడు శ్రీకారం చుట్టనుంది. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించబోతోన్నారు.

అదే- రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం. ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉద్దేశించిన పథకం ఇది. దీని కింద ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. నేడు ఈ పథాకన్ని రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించనున్నారు.

గతంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్ 1 పరీక్షలను రాయబోయే అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలను రాయబోయే అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఉచిత కోచింగ్‌తో పాటు ప్రతి నెలా 5,000 రూపాయల చొప్పున మొత్తాన్ని స్టైపెండ్‌గా అందించనుంది.

హైదరాబాద్‌లో సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నంబర్ 8, ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్‌లల్లో ఈ ఉచిత కోచింగ్ కొనసాగుతుంది.

75 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ స్టడీ కాలంలో అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. దీనికి దరఖాస్తు గడువు శుక్రవారం ముగిసింది.

అదే సమయంలో ప్రిలిమ్స్ అభ్యర్థుల కోసం కొత్తగా ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది.

దీనికి కావాల్సిన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 20 2024, 12:59

కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషన్.. ల్యాండ్ సేల్, పర్చేస్‌లో తహశీల్దార్ల కొత్త మెలిక

నాలుగేండ్లు పరిష్కారమైందని అనుకుంటున్న వారికి మరో ముప్పు పొంచి ఉన్నది. ‘రెండు, మూడేండ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగి.. అడిగినంత సమర్పించుకొని తమ సమస్యను పరిష్కరించుకున్నాం.. మేం సేఫ్!’ అని అనుకుంటున్నారు.

కానీ.. మరోసారి అధికారుల చుట్టూ తిరిగే రోజు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఎప్పుడైనా ల్యాండ్‌ను అమ్మేద్దామనుకున్నా, సక్సెక్షన్ చేద్దామనుకున్నా.. తహశీల్దార్లు ఆర్డర్ కాపీ చూపించండి అని అడుగుతుండటంతో ఖంగు తింటున్నారు.

ధరణి పోర్టల్‌లో డేటా కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్స్, పీవోబీ అన్ బ్లాకింగ్ వంటి అనేక సమస్యలకు 33 మాడ్యూళ్లు ఇచ్చారు. అందరినీ ఆన్‌లైన్‌లోనే రూ.1,000 చెల్లించి అప్లయ్ చేసుకోమన్నారు. ఇప్పటికే 19 లక్షల మందికిపైగా తమ రికార్డుల్లో పొరపాట్లు ఉన్నాయని అప్లయ్ చేశారు.

కొందరి దరఖాస్తులు ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేస్తే నాలుగు, ఐదుసార్లు కూడా అప్లయ్ చేసుకున్నారు. ప్రతిసారీ రూ.1,000 వంతున చెల్లించారు. తహశీల్దార్లను వేడుకుంటే.. కొందరికి ఇంత ఖర్చు పెట్టుకుంటే తప్పా పాజిటివ్ రిపోర్టులు రాయలేదు. ఆ రాసిన కాపీని చేతికి ఇవ్వాలని కోరితే తామే ఆర్డీవో, కలెక్టర్లకు పంపుతామన్నారు. ఏ అధికారి కూడా దరఖాస్తుదారుడికి వారేం రిపోర్ట్ పంపారన్న సమాచారం మాత్రం ఇవ్వలేదు. ఆఖరికి కలెక్టర్ అప్రూవ్ చేసినా, సీసీఎల్ఏ ఆమోదించినా, టీఎస్ టీఎస్ వాళ్లు ఓకే చేసినా ఎక్కడా దరఖాస్తుదారుడికి చిన్న కాగితం ముక్క కూడా ఇవ్వలేదు. రిజెక్ట్ చేసినా కారణాలు తెలపలేదు. ఇప్పుడేమో అమ్మడానికి వెళ్తే, ఏదైనా డీడ్స్ చేయడానికి వెళ్తే అదే తహశీల్దార్ కాపీ అడుగుతుండటం ఆందోళనకు గురిచేస్తున్నది.

అధికారిక లెక్కల ప్రకారం ఫిబ్రవరి నెలాఖరుకు 16,57,407 దరఖాస్తులు రాగా.. 8,78,282 పరిష్కరించారు. 5,37,984 దరఖాస్తులను తిరస్కరించారు. పెండింగులో 2,40,127 ఉండేవి. అయితే మార్చి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ పెట్టి 1,61,760 దరఖాస్తులను పరిష్కరించినట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా 1,15,308 కొత్తగా వచ్చాయి. అంటే 1,93,675 వరకు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. రిజెక్ట్ చేసిన వాళ్లు మళ్లీ అప్లయ్ చేస్తూనే ఉన్నారు. డ్యాష్ బోర్డు క్లియర్ పేరిట అకారణంగా తిరస్కరణకు గురైన అప్లికేషన్లు మళ్లీ వస్తాయి. అంటే ఇంకా లక్షల్లో ఉంటాయి. అయితే ఇప్పటి దాకా పరిష్కరించిన సుమారు 10 లక్షల దరఖాస్తులకు ఆర్డర్ కాపీలు ఎవరి దగ్గర తెచ్చుకోవాలో ఉన్నతాధికారులు చెప్పడం లేదు. లేదంటే ధరణి పోర్టల్‌లో సవరించిన రికార్డుల ప్రకారం కరెక్టుగా ఉంటే ఆర్డర్ కాపీ అడగకుండానే క్రయవిక్రయాలు చేయాలని తహశీల్దార్లు/డిప్యూటీ తహశీల్దార్లకు ఆదేశాలివ్వాలని బాధితులు కోరుతున్నారు

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో రెండెకరాల భూమిని ధరణి పోర్టల్ రాకముందే కొనుగోలు చేశారు. అన్ని పహాణీలు చూసి, లీగల్ ఓపినియన్ తీసుకొని సేల్ డీడ్ ద్వారా కొన్నారు. ఆ తర్వాత మ్యుటేషన్ అయ్యింది. కొత్త పాస్‌బుక్కులు కూడా వచ్చాయి. ధరణి రాగానే అది ప్రభుత్వ ల్యాండ్‌గా పీవోబీలో నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసి 18 నెలలపాటు తిరిగి చివరకు సమస్యను పరిష్కరించుకున్నారు. దాంతో ధరణి పోర్టల్‌లో క్లాసిఫికేషన్ పట్టాగా మారింది. ఇప్పుడు అదే భూమిని సేల్ చేయడానికి స్టాంప్ డ్యూటీ, ఇతర ఫీజులన్నీ కట్టి స్లాట్ బుక్ చేసుకున్నారు.

తీరా సమయానికి తహశీల్దార్ ఆఫీసుకు వెళ్తే ధరణి ఆపరేటర్ పాత రికార్డును తహశీల్దార్/డిప్యూటీ తహశీల్దార్ ముందు పెట్టడంతో తాను చేయనంటూ తెగేసి చెప్పారు. సమస్య పరిష్కారమైందని చెబితే తమకు ఆర్డర్ కాపీ చూపించాలని సేల్ డీడ్‌ను పక్కన పెట్టేశారు. రికార్డుల్లో తప్పుగా ఉంటే స్లాట్ బుక్ కాదు కదా అంటే కూడా వినలేదు. దాంతో ఉన్నతాధికారుల నుంచి ఫోన్ చేయిస్తే తప్ప సేల్ డీడ్ కాలేదు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 20 2024, 12:57

జగన్‌ ‘కారు’ కథలు!

మా నాయకుడికి కేటాయించిన కారు మాటికీ మాటికీ ఆగిపోతోంది’ అంటూ వైసీపీ రచ్చ చేసింది. చివరికి... కారు బాగానే ఉందని, వైసీపీయే ఎప్పట్లాగా తప్పుడు కోతలతో యాగీ చేసిందని రుజువైంది. అసలేం జరిగిందంటే... వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి వినుకొండ ఎమ్మెల్యే పెంచి పోషించిన ‘గ్యాంగ్‌’ వార్‌ కారణంగా రషీద్‌ అనే యువకుడు హత్యకు గురయ్యారు. దీనిని రాజకీయం చేసిన జగన్‌...

రషీద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శుక్రవారం వినుకొండ పర్యటనకు బయలుదేరారు. జగన్‌ భద్రత రీత్యా ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎ్‌సడబ్ల్యూ) బుల్లెట్‌ ప్రూఫ్‌ టాటా సఫారీ కారు ఏర్పాటు చేసింది

శుక్రవారం ఉదయం 10.05 గంటలకు తాడేపల్లి నుంచి ప్రయాణం మొదలుపెట్టిన జగన్‌ కేవలం ఐదు నిమిషాల్లోనే కిందికి దిగారు. వైసీపీ నాయకుడికి చెందిన ఫార్చూనర్‌లో కూర్చున్నారు. అంతే... వైసీపీ సోషల్‌ మీడియా రెచ్చిపోయింది. ‘‘జగన్‌కు కేటాయించిన కారు అడుగడుగునా ఆగిపోతోంది. మాజీ సీఎంకు భద్రత కల్పించేది ఇలాగేనా? ఇది పోలీసుల వైఫల్యమే’’ అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇక... జగన్‌ కూలి, నీలి మీడియా కూడా ఇదే పాట పాడాయి. నిజానికి... ప్రభుత్వం జగన్‌ పర్యటనకోసం కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ సఫారీ వాహనం ఎక్కడా ఆగలేదు. ఆయన కాన్వాయ్‌లోనే వినుకొండ దాకా రయ్య్‌మని దూసుకెళ్లింది.

జగన్‌ పర్యటన కోసం కేటాయించిన సఫారీ (ఏపీ 39 పి0014) పూర్తి కండీషన్‌లో ఉంది. ఎన్నికల్లో విజయం సాధించే వరకూ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు అందులోనే ప్రయాణించారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు... అక్కడి నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వరకు ఇందులోనే ప్రయాణించారు. ‘చంద్రబాబు వాడిన కారు నేను ఎక్కడమేమిటి’ అనుకున్నారో ఏమో! ఎక్కిన ఐదు నిమిషాల్లోనే జగన్‌ అందులో నుంచి దిగిపోయారు. రచ్చ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయగా మరిన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.

జగన్‌ పర్యటన కోసం టయోటా ఫార్చూనర్‌ లేదా ల్యాండ్‌ క్రూజర్‌ ప్రడో పంపాలని తాడేపల్లి నుంచి ఐఎ్‌సడబ్ల్యూకు ఫోన్‌ వెళ్లింది. అయితే... ఆ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ సఫారీని కేటాయించారు. అది కూడా విజయవాడలో సిద్ధంగా లేకపోవడంతో విజయనగరం నుంచి తెప్పించారు. గురువారం రాత్రి 11 గంటలకు అక్కడ బయలుదేరిన సఫారీ... ఉదయానికి తాడేపల్లి చేరుకుంది. పూర్తి కండిషన్‌లో... ఎక్కడా ఆగకుండా పరుగులు తీసింది. కానీ... జగన్‌ ఎక్కిన ఐదు నిమిషాల్లోనే అది బ్రేక్‌డౌన్‌ అయ్యిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేసింది. 

అదే వాహనం జగన్‌ కాన్వాయ్‌లో వినుకొండ వరకు ఎక్కడా ఆగకుండా దూసుకెళ్లిందంటూ ఐఎ్‌సడబ్ల్యూ వీడియో ఆధారాలు కూడా చూపించింది. ‘‘మొన్నటిదాకా ముఖ్యమంత్రి హోదాలో ల్యాండ్‌ క్రూజర్‌ ప్రడో కారులో ప్రయాణించిన జగన్‌కు...

బహుశా ఇప్పుడు ‘సఫారీ’ ప్రయాణం నచ్చలేదేమో! మాజీ అయిన తర్వాత కూడా అదే దర్పం ప్రదర్శించాలంటే ఎలా? సెక్యూరిటీ రివ్యూ కమిటీ-2024 నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్‌కు భద్రత కల్పిస్తున్నాం. సీఎంగా ఉండగా ప్రధాని తరహాలో ఆయన ఏర్పాటు చేసుకున్న స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌(ఎ్‌సఎ్‌సజీ)ను కొనసాగించేందుకు నిబంధనలు అంగీకరించవు’’ అని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 20 2024, 12:36

ఏపీలో తహసీల్దార్లకు గుడ్‌న్యూస్.. చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రం లో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం తహసీల్దార్లను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వ ఆదేశాలతో తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపించాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్లు త్వరలోనే వారి సొంత జిల్లాలకు రానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తహసీల్దార్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో తహసీల్దార్లను బదిలీ చేయగా.. వారిని మళ్లీ సొంత జిల్లాలకు బదిలీపై వెళ్లబోతున్నారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 650 మంది తహసీల్దార్లను మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీ చేయగా.. నిబంధనలు అనుసరించి ఇతర జిల్లాలకు పంపించారు.

అయితే ఏపీలో ఎన్నికల నియమావళి జూన్‌ 6వ తేదీతో ముగియడంతో.. తహసీల్దార్లను గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి పంపాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇటీవల ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత కలెక్టర్‌ వారికి మండలాలను కేటాయించనున్నారు. జిల్లాలకు వచ్చే రెవెన్యూ అధికారులను ఆయా మండలాల్లో అదే కేడర్‌‌కు పంపించనున్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, వివిధ భూసేకరణ విభాగాల్లో వీరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

మరోవైపు ఏపీలో వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయం శాఖ డైరెక్టర్‌ ఎన్‌ ఢిల్లీరావు కీలక ప్రకటన చేశారు. రైతులు అధిక దిగుబడులిచ్చే వంగడాలను ఎంపిక చేసుకుంటారని.. కాబట్టి డిమాండ్‌ మేరకు వాటిని అందుబాటులో ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. ఢిల్లీరావు మంగళగిరిలోని వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సేంద్రీయసాగు విధానాలపై సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లాల్లో అధికారులకు సూచన చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రం లో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం తహసీల్దార్లను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వ ఆదేశాలతో తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపించాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్లు త్వరలోనే వారి సొంత జిల్లాలకు రానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తహసీల్దార్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో తహసీల్దార్లను బదిలీ చేయగా.. వారిని మళ్లీ సొంత జిల్లాలకు బదిలీపై వెళ్లబోతున్నారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 650 మంది తహసీల్దార్లను మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీ చేయగా.. నిబంధనలు అనుసరించి ఇతర జిల్లాలకు పంపించారు.

అయితే ఏపీలో ఎన్నికల నియమావళి జూన్‌ 6వ తేదీతో ముగియడంతో.. తహసీల్దార్లను గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి పంపాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇటీవల ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత కలెక్టర్‌ వారికి మండలాలను కేటాయించనున్నారు. జిల్లాలకు వచ్చే రెవెన్యూ అధికారులను ఆయా మండలాల్లో అదే కేడర్‌‌కు పంపించనున్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, వివిధ భూసేకరణ విభాగాల్లో వీరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

మరోవైపు ఏపీలో వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయం శాఖ డైరెక్టర్‌ ఎన్‌ ఢిల్లీరావు కీలక ప్రకటన చేశారు. రైతులు అధిక దిగుబడులిచ్చే వంగడాలను ఎంపిక చేసుకుంటారని.. కాబట్టి డిమాండ్‌ మేరకు వాటిని అందుబాటులో ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. ఢిల్లీరావు మంగళగిరిలోని వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సేంద్రీయసాగు విధానాలపై సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లాల్లో అధికారులకు సూచన చేశారు.

మరోవైపు ఏపీలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాదే జాతీయ వైద్య కమిషన్‌ అనుమతి నిరాకరించిన ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ప్రిన్సిపల్స్. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్‌ లేఖలు రాశారు. పాడేరు, ఆదోని, నంద్యాల, మదనపల్లె, పులివెందుల కాలేజీల్లో 2024-25కి సంబంధించిన ప్రవేశాలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం గతంలో ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. ఈ కాలేజీలను తనిఖీ చేసిన ఎన్‌ఎంసీ టీమ్.. ఇక్కడ ఫ్యాకల్టీ సరిపడా లేరని, తరగతుల నిర్వహణకు తగ్గట్లు నిర్మాణాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రవేశాలకు ఎన్‌ఎంసీ అనుమతి నిరాకరించింది. తనిఖీల్లో గుర్తించిన లోపాలను త్వరలో పరిష్కరిస్తామని.. సరైన వసతులు సమకూరుస్తామని హామీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఎన్‌ఎంసీకి మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్‌కు విజ్ఞప్తి చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 20 2024, 12:31

అక్కడ గేట్లు ఎత్తివేత- శ్రీశైలానికి వరద

కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల కృష్ణానది జలకళను సంతరించుకుంది. వరదనీటితో పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఫలితంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గరిష్ఠస్థాయి నీటిమట్టాన్ని అందుకుంది.

మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీని ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణానదికి వరద పోటుకు గురయ్యాయి.

భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కృష్ణా ఉపనదులు ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగ, భద్ర సైతం పొంగిపొర్లుతున్నాయి.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ, బెళగావి, హవేరి, విజయపురా, బాగల్‌కోటె, కలబురగి, బళ్లారి.. వంటి జిల్లాల్లో అతి భారీగా వర్షాలు కురుస్తోన్నాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చేవే. అటు మహారాష్ట్రలోనూ కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి.

ఫలితంగా కృష్ణానది ఉరకలేస్తోంది. కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఆలమట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. దీనితో రెండు రోజుల కిందటే వాటి గేట్లను ఎత్తివేశారు కర్ణాటక జలవనరుల అధికారులు. లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

దీని ప్రభావం తెలంగాణపై పడింది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. జూరాల ఇన్‌ఫ్లో 65,000 క్యూసెక్కులుగా రికార్డయింది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటి మట్టం 318.51 అడుగులు.. ప్రస్తుతం 317 అడుగుల నీటిమట్టం అందుకుంది. ఈ కొద్దిరోజుల్లోనే ఆరు టీఎంసీలకు పైగా వరదనీరు జూరాలకు వచ్చి చేరింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 20 2024, 12:08

తాడిపత్రిలో అడుగుపెట్టిన పెద్దారెడ్డి.. హై టెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ తెల్లవారుజామున తాడిపత్రికి చేరుకున్నారు.

పెద్దారెడ్డిని అనంతపురం జిల్లా నుంచి బహిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతామని జేసీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, పెద్దారెడ్డి రాకతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో, ష్యూరిటీలు సమర్పించేందుకు ఆయన అనంతపురం నుంచి తాడిపత్రికి వచ్చారు.

నేరుగా తాడిపత్రిలోని పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పెద్దారెడ్డి... ష్యూరిటీలు సమర్పించి, సంతకం చేసి వెళ్లిపోయారు. ష్యూరిటీలు సమర్పించిన తర్వాత...

పెద్దారెడ్డిని ఎక్కువ సేపు తాడిపత్రిలో ఉంచకుండా పోలీసులు అనంతపురంకు తరలించారు. పెద్దారెడ్డి కూడా అడ్డు చెప్పకుండా తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు.

దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రెండు నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం గమనార్హం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 20 2024, 12:06

మైక్రోసాఫ్ట్‌ ఎర్రర్‌పై స్పందించిన సీఈవో సత్యనాదెళ్ల

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వర్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉంది. సర్వర్లలో లోపం కారణంగా ప్రపంచమే ఆగిపోయేలా చేసింది.

బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ఇండిగో, అకాసా ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్‌తో సహా అనేక విమానయాన సంస్థలు తమ విమానాలను గ్రౌండ్ చేయవలసి వచ్చింది...

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వర్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉంది. సర్వర్లలో లోపం కారణంగా ప్రపంచమే ఆగిపోయేలా చేసింది. బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది.

దీని కారణంగా ఇండిగో, అకాసా ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్‌తో సహా అనేక విమానయాన సంస్థలు తమ విమానాలను గ్రౌండ్ చేయవలసి వచ్చింది. విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీల పనితీరుపైనా ప్రభావం పడింది. చాలా మంది విండోస్ వినియోగదారులు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎర్రర్‌ను చూస్తున్నారు.

సర్వర్లలో అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో పలు కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. టికెట్ బుకింగ్ నుండి చెక్-ఇన్ వరకు సమస్యలు ఉన్నాయి. భారతదేశంలోని అనేక విమానాశ్రయాలు కూడా సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే సమస్య పరిష్కారం అయినా ఇంకా పూర్తి స్థాయిలో విండోస్‌ సిస్టమ్స్‌లో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ సమస్య తొలగలేదు. దేశవ్యాప్తంగా 200కిపైగా విమానాల రద్దు అయ్యాయి. ఇండిగో 192 విమానాలను రద్దు చేసింది. అలాగే అమెరికా, ఆస్ట్రేలియాలో ఇంకా ఇబ్బందులు తొలగలేదు. అమెరికా, డల్లాస్‌, చికాగోలో విమానాలు 18 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులు తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారు. ఔటేజ్‌ సమస్యతో 77 శతం విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

ఇదిలా ఉండగా, దీనిపై మైక్రోసాఫ్ట్‌ CEO సత్యనాదెళ్ల స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సిస్టమ్స్‌పై ప్రభావం కనిపించిందని, ఈ సమస్య పరిష్కారం కోసం క్రౌడ్‌ స్ట్రైక్‌తో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇది అతిపెద్ద సంక్షోభమని వ్యాఖ్యానించారు.

త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. శని, ఆదివారాలు కావడంతో సర్వర్లపై తక్కువ ఒత్తిడి ఉందని, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వినియోగదారులకు క్లౌడ్‌ స్ట్రెక్‌ సీఈవో క్షమాపణలు చెప్పారు. ఔటేజ్‌ సమస్యేనని, సైబర్‌ అటాక్‌ కాదని ప్రకటించారు. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి కొత్త చిక్కులు వస్తున్నాయి. జరిగిన నష్టాలపై పలు కంపెనీలు దావా వేయనున్నట్లు తెలుస్తోంది.