/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఎన్నికలు సమీపిస్తున్నా మారని బైడెన్‌ తీరు.. బ్యాలెట్‌ బాక్సులకు బదులు.. బ్యాటిల్‌ బాక్సులంటూ..! Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 15 2024, 15:59

ఎన్నికలు సమీపిస్తున్నా మారని బైడెన్‌ తీరు.. బ్యాలెట్‌ బాక్సులకు బదులు.. బ్యాటిల్‌ బాక్సులంటూ..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది..!

ప్రెసిడెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడి ప్రవర్తనతో డెమోక్రాటిక్‌ పార్టీలో తీవ్ర ఆందోళ వ్యక్తమవుతోంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది..!

ప్రెసిడెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడి ప్రవర్తనతో డెమోక్రాటిక్‌ పార్టీలో తీవ్ర ఆందోళ వ్యక్తమవుతోంది.

ఎన్నికల వేళ బైడెన్‌ తడబడుతుండటం డెమోక్రాట్లకు ఇబ్బందికరంగా మారుతోంది.

ఇప్పటికే మతిమరుపు, తడబాట్లతో తీవ్ర విమర్శలపాలైన బైడెన్‌.. తాజాగా మరోసారి అదేపొరపాటు చేసి మీడియాకు చిక్కారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 15 2024, 15:56

Nita Ambani: మీడియాకు క్షమాపణ చెప్పిన నీతా అంబానీ

భారతదేశ శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

జులై 12 వివాహ వేడుక జరిగింది. పెళ్లి తర్వాత శుభ్ ఆశీర్వాద్, నిన్న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు నీతా అంబానీ కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతేకాదు, తమ వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని మీడియాను కోరారు. పెళ్లి సందర్భంగా చిన్నిచిన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు. మీరంతా రేపు మా అతిథులుగా రావాలని కోరారు. మీకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందని చెప్పారు. 

మరోవైపు నీతా అంబానీ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని చూసి గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతులేని సంపద ఉన్నప్పటికీ...

ఆమెకు కొంచెం కూడా గర్వం లేదని కొనియాడుతున్నారు. ఇంకోవైపు, నిన్న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ మరోసారి బాలీవుడ్ స్టార్లతో మెరిసిపోయింది.

షారుక్ ఖాన్ వంటి కొందరు స్టార్లకు రూ. 2 కోట్ల విలువైన వాచ్ లను అనంత్ అంబానీ బహూకరించినట్టు సమాచారం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 15 2024, 09:54

పింఛన్ల రికవరీలపై కాంగ్గ్రెస్‌ సర్కార్‌ వెనకడుగు!

అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది.

దీనిపై స్పష్టమైన మార్గరద్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీచేయడం కానీ, రికవరీ చర్యలు చేపట్టడం కానీ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులను ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.

అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. దీనిపై స్పష్టమైన మార్గరద్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీచేయడం కానీ,

రికవరీ చర్యలు చేపట్టడం కానీ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులను ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.

సంక్షేమ పథకాల ద్వారా అనర్హులు లబ్ధిపొందుతున్న అంశంపై ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎటువంటి రికవరీ చర్యలు చేపట్టరాదని స్పష్టంచేశారు.

వివిధ సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధ్దిపొందుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు మరింత మెరుగైన పద్ధతుల్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు సంప్రదింపులు చేపట్టినట్టు తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 15 2024, 09:49

PM Modi : ట్రంప్‌ త్వరగా కోలుకోవాలి

ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌.. ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ

ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌..

ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు.

‘‘నా మిత్రుడైన ట్రంప్‌పై హత్యాయత్నం తీవ్ర వేదన కలిగించింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

ఆయన త్వరగా కోలుకోవాలి’’ అని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని రాహుల్‌గాంధీ, ఖర్గే ఆకాంక్షించారు.

ట్రంప్‌పై హత్యాయత్నం అమెరికన్‌ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం అని భారతీయ అమెరికన్లు పేర్కొన్నారు. భారతీయ అమెరికన్ల నాయకుడు డాక్టర్‌ భరత్‌ బరయ్‌ మాట్లాడుతూ...

ఈ ఘటన చాలా విచారకరమన్నారు. బైడెన్‌కు బలమైన మద్దతుదారు అయిన అజయ్‌ భుటోరియా మాట్లాడుతూ... ఈ హత్యాయత్నంపై అన్ని కోణాల్లో విచారించాలన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 15 2024, 09:47

సర్వం స్వాహా!

సహజ వనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.

సహజ వనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు సమర్పించేందుకు గనుల శాఖ నివేదికను తయారు చేసింది. అందులో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. ‘జగన్‌ ఏలుబడిలో గనుల తవ్వకాలు, అమ్మకాల్లో అంతులేని దోపిడీ జరిగింది. ఖనిజాల తవ్వకాలకు ఇచ్చే పర్మిట్లు, రవాణా, ఇతర వ్యవహారాల్లో అంతుచిక్కని అనేకానేక అక్రమాలున్నాయి. కేవలం ఐదారు అంశాలను ప్రాథమికంగా పరిశీలన చేస్తేనే గత ఐదేళ్ల కాలంలో 19 వేల కోట్లపైనే అక్రమాలు జరిగాయి. ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి గనుల శాఖలో జరిగిన అక్రమాలు, ఘోరాలపై సమగ్ర విచారణ జరగాలి’ అని గనుల శాఖ నివేదించనుంది.

చంద్రబాబు వద్ద జరిగే సమావేశంలో... జగన్‌ హయాం నాటి అక్రమాలను నిగ్గుతేల్చడానికి సమగ్ర విచారణ చేయించాలని గనుల శాఖ ప్రధాన డిమాండ్‌గా ఉంచనుంది. సీఐడీ విచరణా లేక విజిలెన్స్‌తోనా అన్నది ప్రభుత్వ నిర్ణయానికే వదిలేయనున్నది. విచారణ మాత్రం జరిగి తీరాలని, అప్పుడే అసలైన అక్రమాలు, ఘోరాలు బయటికి వస్తాయని ఆ శాఖ సీఎంను కోరనుంది. గనుల శాఖ తయారు చేసిన నివేదికలో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. 2019-24 మధ్యకాలంలో జగన్‌ పాలనలో సమర్థులు, నైపుణ్యం ఉన్నవారిని కాకుండా అస్మదీయులను తీసుకొచ్చి గనుల శాఖ డైరెక్టర్‌ గా నియమించడం మొదలు, అనేక అక్రమాలు, అవినీతి బాగోతాలు గనుల శాఖలో జరిగిపోయాయి

ఫలితంగా 19,137 కోట్ల అక్రమాలు జరిగాయని గనుల శాఖ చెబుతోంది. అసమర్థ పరిపాలన వల్ల ఐదేళ్లలో 9,750 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ శాఖ చెబుతోంది. 2016 నుంచి అమల్లో ఉన్న ఉచిత పాలసీని రద్దు చేయడం, అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల సర్కారుకు 6,940 కోట్ల నష్టం జరిగిందని పేర్కొంది.

తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక అమలైనప్పుడు రీచ్‌లో టన్ను ఇసుక 75 రూపాయలు ఉంటే... జగన్‌ సర్కారు తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీలో దాన్ని రూ.475 చేశారని, ఆచరణలో టన్నుకు వెయ్యి రూపాయలపైనే వసూలు చేశారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

గత ఐదేళ్లలో ఇసుక, ఇతర ఖనిజాల తవ్వకాల్లో పెద్దఎత్తున పర్యావరణ విధ్వంసం జరిగిందని గనుల శాఖ సీఎంకు నివేదించనుంది. ఇసుక తవ్వకాల్లో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని నివేదికలో పేర్కొంది.

చ ట్టవిరుద్ధమైన తవ్వకాలు నిలిపివేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని జాతీయ హరి త ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ), హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరించాయని నిర్ధారించింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 15 2024, 09:42

గ్రామ దేవతలుగా నయనతార త్రిషల పోటీ

మాములుగా ఒకే తరహా పాత్రలతో హీరోలు పోటీ పడటం చాలాసార్లు చూశాం. కానీ హీరోయిన్ల మధ్య ఇలాంటివి తక్కువగా జరుగుతాయి. అలాంటిదే ఇది. 2020లో నయనతార టైటిల్ పోషించిన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు.

ఆర్జె బాలాజీ దర్శకత్వం వహించగా అప్పుడున్న కరోనా పరిస్థితుల వల్ల డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయ్యింది. దొంగ స్వామిగా అజయ్ ఘోష్ విలనీ బాగా పండింది. డిజిటల్ రిలీజ్ అయినప్పటికీ మంచి స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్ తీయాలని అప్పటి నుంచి నిర్మాణ సంస్థ, దర్శకుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కుదరలేదు.

కట్ చేస్తే ఇప్పుడు అమ్మోరు తల్లి 2ని అదే ప్రొడక్షన్ హౌస్ అదే నయనతారతో తీసేందుకు రెడీ అవుతోంది. విచిత్రం ఏంటంటే దర్శకుడు మారుతున్నాడు. పేరు వెల్లడి చేయలేదు. అటుపక్క ఆర్జె బాలాజీ మాసాని అమ్మన్ అని కొత్త పేరు పెట్టుకుని వేరే సబ్జెక్టుతో త్రిషతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

రెండూ ఒకేసారి పోటాపోటీగా నిర్మాణం జరిగబోతున్నాయి. నయన్, త్రిషలు ప్రస్తుతం మాములు డిమాండ్ లో లేరన్న సంగతి విదితమే. రెమ్యునరేషన్లు భారీగా తీసుకుంటున్నారు. అలాంటిది ఇద్దరూ అమ్మోరు తల్లులుగా కనిపించడం అభిమానులకు కనువిందే.

ఇవి ఇతర భాషల్లో వస్తాయి కాబట్టి మన ఆడియన్స్ లోనూ ఆసక్తి ఉంటుంది. వద్దన్నా ఎలాగూ పోలికలు వస్తాయి. ఎవరు బాగా చేశారు ఎవరి సినిమా బాగుందనే కోణంలో రకరకాల విశ్లేషణలు జరుగుతాయి. మరి ఈ వెరైటీ క్లాష్ ఎవరు నెగ్గుతారో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి.

నయనతార ప్రస్తుతం అయిదారు సినిమాలతో బిజీగా ఉంది. త్రిష ఇటు చిరంజీవి విశ్వంభరతో పాటు అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ చిత్రాల్లో సమాంతరంగా నటిస్తోంది.

ఇలా కాదు కానీ వీళ్ళు ఒకే మూవీలో అమ్మోరులుగా విశ్వరూపం చూపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరిక. కానీ అది సాధ్యం కాదు లెండి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 15 2024, 09:27

Joe Biden: హత్యా రాజకీయాలను అమెరికా సహించదు.. ట్రంప్ ఘటనపై బైడెన్ ఉద్ఘాటన

రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలను అమెరికా ఎన్నిటికీ సహించదని ఉద్ఘాటించారు.

రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

హత్యా రాజకీయాలను అమెరికా ఎన్నిటికీ సహించదని ఉద్ఘాటించారు. ఆయన ఆదివారం ఓవల్ కార్యాలయంలో జాతినుద్దేశించి ప్రసంగించారు.

2020లో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఓవల్ ఆఫీస్‌లో బైడెన్ మాట్లాడటం ఇది మూడోసారి. ఓవల్ కార్యాలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రసంగాల కోసం ఉద్దేశించింది. కాగా ఈ కార్యాలయం నుంచి అమెరికా అధ్యక్షులు చాలా అరుదుగా ప్రసంగిస్తుంటారు. గతంలో మాజీ అధ్యక్షులు ట్రంప్ రెండు సార్లు, ఒబామా మూడు సార్లు ప్రసంగించారు.

బైడెన్ మాట్లాడుతూ.. "హత్యా రాజకీయాలను సహించం. రాజకీయంగా ఒక్కొక్కరికి ఇష్టాఇష్టాలు ఉండటం సహజం. కానీ ఎప్పుడూ హింసకు దిగొద్దు. హింసకు పాల్పడిన వారిని అమెరికా ఎన్నటికీ క్షమించదు. మనం శత్రువులం కాదు. పొరుగువారం.. ఒకరికొరం స్నేహితులం, సహోద్యోగులం, అమెరికా పౌరులం. మనమంతా ఐక్యంగా నిలబడాలి" అని బైడెన్ పేర్కొన్నారు.

ట్రంప్‌పైకి థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ (20) అనే యువకుడు తుపాకీ గురిపెట్టినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. రైఫిల్‌తో మాథ్యూ తలను భద్రతాబలగాలు ఛిద్రం చేశాయి.సీక్రెట్‌ ఏజెంట్లు, సెక్యూరిటీ సిబ్బంది ట్రంప్‌ వద్దకు వచ్చి అతనికి వలయంగా నిలబడ్డారు.

ట్రంప్‌ను ఆయన బుల్లెట్‌ప్రూఫ్‌ ఎస్‌యూవీ వద్దకు తీసుకెళ్తుండగా ఆయన తన కుడిచేతి పిడికిలిని పైకెత్తి చూపుతూ ‘‘పోరాడతా (ఫైట్‌)’’ అని నినదించారు. తర్వాత ట్రంప్‌ను చికిత్స నిమిత్తం బట్లర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని రిపబ్లిక్‌ పార్టీ ప్రతినిధులు తెలిపారు. కాగా దుండగుడి కాల్పుల్లో ర్యాలీలో పాల్గొన్న ఓ వ్యక్తి మరణించాడని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 15 2024, 09:25

ఆర్టీసీ బస్ ఛార్జీలు భారీగా పెంపు: సీఎం సంతకమే ఆలస్యం

KSRTC: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కేఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను భారీగా పెంచడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. నేడో రేపో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది.

సరిగ్గా నెల రోజుల కిందటే సిద్దరామయ్య ప్రభుత్వం ఇంధన రేట్లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వసూలు చేస్తోన్న సేల్స్ ట్యాక్స్‌ను భారీగా వడ్డించింది. లీటర్‌పై 18.44 శాతం అమ్మకం పన్నును 29.84 శాతానికి పెంచింది.

11 శాతం మేర అమ్మకం పన్నును పెంచినట్టయింది. దీనికి కొనసాగింపుగా కేఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను కూడా పెంచడానికి రంగం సిద్ధం చేసింది.

ఈ విషయాన్ని కేఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఎస్ ఆర్ శ్రీనివాస్ తెలిపారు. బస్ ఛార్జీలను పెంచకపోతే సంస్థను నడిపించడం కష్టమని తేల్చి చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టతరమౌతుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్- మే- జూన్ నెలల్లో 295 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూశామని అన్నారు.

బస్ ఛార్జీలను పెంచాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి డీజిల్ రేటు భారీగా పెరగడమే ప్రధాన కారణం. 2019లో లీటర్ ఒక్కింటికి 60 రూపాయలు ఉన్న డీజిల్ ధర ఇప్పుడు 89 రూపాయలకు చేరిందని గుర్తు చేశారు. బస్సుల కొనుగోలు, ఇతర విడిపరికరాల ధరలు సైతం భారీగా పెరిగాయని, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. 2020 తరువాత ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను పెంచలేదని, ఈ ఏడాది వాటిని సవరించాల్సి ఉందని వివరించారు.

వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ఇప్పుడున్న ఛార్జీలకు అదనంగా 15 నుంచి 20 శాతం మేరకు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజేశామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సైతం రూపొందించామని శ్రీనివాస్ తెలిపారు.

ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను యధాతథంగా ఆమోదిస్తుందని చెప్పారు. టికెట్ల పెంపు మహిళలకు కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఛార్జీల భారం శక్తి పథకం కింద కవర్ అవుతుందని, ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మహిళలకు ఉద్దేశించిన ఉచిత ప్రయాణంలో ఎలాంటి మార్పూ ఉండబోదని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 19:32

Ponnam Prabhakar: బస్సులను పెంచుతున్నాం... 1,000 బస్సులను కొనుగోలు చేశాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంతాలకు బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా 1,000 బస్సులను కొనుగోలు చేశామని, మరో 1,500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు.

నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ-హైదరాబాద్ నాన్‌స్టాప్ ఏసీ, 3 డీలక్స్ బస్సులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... దసరా లోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్‌ప్రెస్, 30 లగ్జరీ బస్సులను ఇస్తామన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని గుర్తు చేశారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.

మిగిలిన రూ.200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తామని తెలిపారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. త్వరలో నల్గొండ జిల్లాకు మరిన్ని బస్సులు తెస్తామన్నారు. కొత్త బస్సుల్లో నల్గొండకు 100 కేటాయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 19:29

ఫీజురీయింబర్స్‌మెంట్స్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్: రేవంత్ రెడ్డి

తొలిసారి పీజు రీయింబర్స్‌మెంట్స్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ కళాశాలలకు సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ పరిధిలో కళాశాలల నిర్వాహకులకు ప్రభుత్వ విధానం తెలియాలన్నారు. ప్రభుత్వ విధానాలు అందరికీ తెలిసేలా ప్రస్తుత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం చాలా కీలకమన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్సుమెంట్స్ బకాయిలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కళాశాలలు నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా ఉండకూడదని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి చెందుతున్న దేశానికి సివిల్ ఇంజినీరింగ్ అత్యంత అవసరం అన్నారు. కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కచ్చితంగా నిర్వహించాలన్నారు. ఈ కోర్సులు లేకుంటే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించారు

గత ముఖ్యమంత్రుల నిర్ణయాల కారణంగా మనం ఫార్మా, ఐటీ రంగాల్లో ముందున్నామని ప్రశంసించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోర్సులు ఉండాలన్నారు.

ఫార్మా, ఐటీ తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోందన్నారు. రాష్ట్రంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సులను కూడా ప్రవేశపెట్టాలన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు.

త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి అటానమస్ హోదా ఇస్తామన్నారు. పక్క రాష్ట్రాలతో పోటీపడే విధంగా కాకుండా ప్రపంచంతో పోటీ పడేవిధంగా మనం తయారు కావాలని సూచించారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.