పిఏసిఎస్ చైర్మన్ పందుల యాదయ్య గౌడ్ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ సమావేశం
మర్రిగూడ మండల కేంద్రంలో పిఏసిఎస్ చైర్మన్ పందుల యాదయ్య గౌడ్ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు బంధు పథకం పైన రైతుల సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీఏ ఎల్లయ్య హాజరైనారు. ఈ సందర్భంగా రైతుల సలహాలు-సూచనల నివేదికను ప్రభుత్వానికి పంపుటకు మినిట్స్ రిపోర్ట్ ను సహకార అధికారులు సేకరించారు.
ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు మహేశ్వరం మారెమ్మ, పగడాల లింగయ్య, మొగుదల ముత్యాలు, మండారీ అచయ్య, ఆంబోతు బొడ్య, బాయికడి ఏడు కొండలు, మామిడి యాదయ్య, ఉప్పునూతల మల్లయ్య, గుంటోజు రామా చారి, చామకూర తేజశ్రీ, సహకార అధికారులు అసిస్టెంట్ రిజిష్టర్ రామనర్సయ్య, వ్యవసాయ అధికారులు ఏఓ హేమలత, ఏఈఓ లు విజయ్ కుమార్, పావని, శ్రీలత, సుజాత, సంఘ సీఈఓ రావిరాల శ్రీనివాస్, సంఘ సిబ్బంది కోట మల్లికార్జున్, రావిరాల శివ సాయి, కట్కూరి సందీప్, మదగోని పరమేష్, మరియు సంఘ సభ్యులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
![]()

మర్రిగూడ మండల కేంద్రంలో పిఏసిఎస్ చైర్మన్ పందుల యాదయ్య గౌడ్ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు బంధు పథకం పైన రైతుల సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీఏ ఎల్లయ్య హాజరైనారు. ఈ సందర్భంగా రైతుల సలహాలు-సూచనల నివేదికను ప్రభుత్వానికి పంపుటకు మినిట్స్ రిపోర్ట్ ను సహకార అధికారులు సేకరించారు.
ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు మహేశ్వరం మారెమ్మ, పగడాల లింగయ్య, మొగుదల ముత్యాలు, మండారీ అచయ్య, ఆంబోతు బొడ్య, బాయికడి ఏడు కొండలు, మామిడి యాదయ్య, ఉప్పునూతల మల్లయ్య, గుంటోజు రామా చారి, చామకూర తేజశ్రీ, సహకార అధికారులు అసిస్టెంట్ రిజిష్టర్ రామనర్సయ్య, వ్యవసాయ అధికారులు ఏఓ హేమలత, ఏఈఓ లు విజయ్ కుమార్, పావని, శ్రీలత, సుజాత, సంఘ సీఈఓ రావిరాల శ్రీనివాస్, సంఘ సిబ్బంది కోట మల్లికార్జున్, రావిరాల శివ సాయి, కట్కూరి సందీప్, మదగోని పరమేష్, మరియు సంఘ సభ్యులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

న్యూఢిల్లీ : దేశంలో జులై 1 నుండి మూడు కొత్త న్యాయ చట్టాలు అమలులోకి రానున్నాయి. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్,(ఐపీసీ) స్థానంలో
ఇప్పటికే అనేక దశలుగా పోలీస్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. కంప్యూటర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయవిచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
*కొత్త చట్టాల ప్రకారం*
3. అరెస్ట్ సందర్భాలలో బాధితుడు సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందడానికి వీలవుతుంది.
ఈరోజు ఖమ్మం పట్టణంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో నల్గొండ మండలం రసూల్ పూర్ గ్రామానికి చెందిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చింతపల్లి బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
గతం లో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో పనిచేసి, తర్వాత బిఆర్ఎస్ లో పార్టీ లో చేరి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి చేరుకున్నారు. సొంత గూటికి చేరిన సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ , రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి జాకో ప్రతాప్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొర్లపాటి చిరంజీవి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కామళ్ళ సంపత్, కాంగ్రెస్ నాయకులు తీగల నవీన్, సోయల్, మాల మహానాడు చింతకాని మండల గౌరవ అధ్యక్షలు పట్టేటి గోపయ్య సీనియర్ మాలమాల నాయకులు మాలమహానాడు చింతకాని మండల అధ్యక్షులు గామాల రవికుమార్,వనం చిన్నప్ప, మాల మహానాడు సీనియర్ నాయకులు గొర్రె ముచ్చు రత్నాకర్ మండల ఉపాధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు వారికి ఘన సన్మానాన్ని నిర్వహించారు.
ఈ క్రమంలో కోలాట నృత్యాలతో సన్మాన గ్రహీత దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రీయ నృత్యాలతో కార్యక్రమాన్ని ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇవాళ మర్రిగూడ మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. శివన్నగూడ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్టు పరిధిలో ముంపు గ్రామాలలో ఇల్లు కోల్పోయిన వారికి సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి త్వరితగతిన ఇండ్ల స్థలాలను కేటాయించనున్నట్లు, ఇంకా ఎవరికైనా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపోతే అందజేయనున్నట్లు తెలిపారు. మర్రిగూడ మండలంలో లేదా చింతపల్లి సమీపంలో ఇండ్ల స్థలాలను కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మండల సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షుడు పాక నగేష్ యాదవ్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. 
NLG: పీఏ పల్లి మండలంలోని గ్రామాలలో నిరుపేదలకు సూర్య హాస్పిటల్ సిబ్బంది ద్వారా ఉచిత మందులు, రక్త పరీక్షలు ఈసీజీ ద్వారా ప్రజలకు ఉచితంగవైద్య సేవలందించి పేద ప్రజల ఆప్తుడైన డాక్టర్ పాల్వాయి వెంకట్ రెడ్డి కి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య భవన్లో బహుజన సాహిత్య అకాడమీ 4వ బహుజన రైటర్స్ వెస్టర్ను ఇండియా కాన్ఫరెన్స్ అవార్డుల ప్రధానోత్సవ సదస్సు లో సంస్థ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా వైద్య రత్న జాతీయ అవార్డులను నిన్న అందజేశారు.
ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ తెలంగాణ ఉద్యమకారులు కవి గాయకులు దరువు ఎల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ.. బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ఒక స్టేట్లో ఇండియా కాన్ఫరెన్స్ అవార్డుల ప్రధానోత్సవ సదస్సులు నిర్వహించి ప్రజాసేవ చేసినటువంటి డెలిగేట్స్ ను మా సంస్థ గౌరవించి వారిని వారు చేసిన సేవను బట్టి అవార్డులను అందజేస్తామన్నారు.
బహు జన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం సంఘ సేవకులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు మరియు స్వచ్ఛందంగా ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలియజేశారు. తెలంగాణలోని 33 జిల్లాల నుండి 200 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కు హాజరై అవార్డులు తీసుకున్నట్లు తెలియజేశారు. అవార్డు అందుకున్న డాక్టర్ పాల్వాయి వెంక రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరమని అలాగే ఇంకా గ్రామాలలో ఉచిత వైద్యం అందించడానికి నాకు ఇంకా బాధ్యత పెరిగిందని పేదలకు ఎల్లవేళలా వైద్య సేవలందిస్తానని వారు తెలియజేశారు. నాకు వైద్య రత్న జాతీయ అవార్డుకు సెలక్షన్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర కమిటీ మెంబర్ సామాజిక వేత్త, దళిత రత్న బుర్రి వెంకన్న కు కృతజ్ఞతలు అని తెలిపారు.
నల్గొండ జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శరత్ చంద్ర పవార్ ను, మంగళవారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు గిరిజన సాంప్రదాయ కండువాను జిల్లా ఎస్పీకి బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేలావత్ నగేష్ నాయక్, లోకా నాయక్ తదితరులు పాల్గొన్నారు. 
నార్కట్ పల్లి మండలం, ఔరవాని గ్రామానికి చెందిన ముప్పిడి రవి గత కొంత కాలంగా, పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్ సృస్తికర్త అయినటువంటి డాక్టర్ కృష్ణంరాజు తో పనిచేస్తూ రాష్ట్రంలో పలు జిల్లాలలో రక్తం అవసరం ఉన్నవారికి కొన్ని వందల మందికి రక్తధాతలని పంపించి అవసరం తీర్చి, సోషల్ వర్కర్ గా గుర్తింపు పొంది అనేక రకాల సేవ కార్యక్రమాలలో పాల్గొని ముందుండి నడిపిస్తూ సేవ చేస్తున్నారు. వారు చేసే సేవలకు ఐకానిక్ పీస్ అవార్డ్ కౌన్సిల్ ( IPAC ) వారు విడుదల చేసిన డాక్టరేట్ డిగ్రీ కి నామినేషన్ లో ఎంపికైయ్యారు.
ఈ అవార్డు ను ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ చే సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా ఢిల్లీ లో గౌరవ డాక్టరెట్ ని అందుకున్నారు.
బీసీ విద్యార్థి సంఘం మరియు బిసి రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఎలాంటి అనుమతులు లేకుండా నల్గొండ జిల్లా కేంద్రంలో దేవరకొండ రోడ్ లో ఎస్పిఆర్ హైస్కూల్ పేరు మీద పాఠశాలను చలాయిస్తున్నారని, దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవనీ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న పాఠశాల యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకొని, విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని విద్యాశాఖ అధికారిని కోరుతున్నట్లు తెలిపారు.
ఇష్టానుసారంగా ప్రవేట్ పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్థుల నుండి లక్షల రూపాయలను దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ చోరువచూపి ఇలాంటివి ఎక్కడున్నా తక్షణమే సీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
Jul 01 2024, 19:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.4k