రైతు భరోసా కు నిధులు కేటాయించి విడుదల చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
NLG: 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు, రైతు భరోసా కు నిధులు కేటాయించి, రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం కర్నాటి సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ లో వ్యవసాయ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ కొత్త రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకు అధికారులను ఆదేశించాలన్నారు. రైతు భరోసాతో పాటు, రైతు బీమా, పంటల భీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు వ్యవసాయ భూముల సేద్యం పనులు ప్రారంభిస్తుండగా అవసరమైన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఏ విత్తనాలు ఎరువులను వాడాలో రైతులకు వ్యవసాయ అధికారులు తెలియజేయాలని కోరారు. ధరణిలో భూ సమస్యలపై రైతులు పెట్టుకున్న అర్జీలను కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు.
గుంతలు పడిన గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల మరమ్మతులు చేయాలని ఆయన అన్నారు. కొత్తగా ఎన్నికైన నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి,భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులుతీన్మార్ మల్లన్నకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
ఇటీవల కాలంలో మృతి చెందిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పెన్న అనంతరామ శర్మ, సీనియర్ నాయకులు నన్నూరి అంజిరెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, ఖమ్మం రాములు, వల్లూరు శ్రీశైలం, ఎండి రబ్బాని, అచ్చిన శ్రీనివాస్, నగేష్, లక్ష్మయ్య, చెన్నయ్య, సైదులు, వెంకన్న, మండల నాయకులు కర్నాటి తుకారం, పెద్దగాని నరసింహ, కృష్ణ, శ్రీరాములు, వెంకటేశం, పడస బోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

NLG: 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు, రైతు భరోసా కు నిధులు కేటాయించి, రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం కర్నాటి సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ లో వ్యవసాయ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ కొత్త రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకు అధికారులను ఆదేశించాలన్నారు. రైతు భరోసాతో పాటు, రైతు బీమా, పంటల భీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు వ్యవసాయ భూముల సేద్యం పనులు ప్రారంభిస్తుండగా అవసరమైన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఏ విత్తనాలు ఎరువులను వాడాలో రైతులకు వ్యవసాయ అధికారులు తెలియజేయాలని కోరారు. ధరణిలో భూ సమస్యలపై రైతులు పెట్టుకున్న అర్జీలను కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు.
గుంతలు పడిన గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల మరమ్మతులు చేయాలని ఆయన అన్నారు. కొత్తగా ఎన్నికైన నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి,భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులుతీన్మార్ మల్లన్నకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
ఇటీవల కాలంలో మృతి చెందిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పెన్న అనంతరామ శర్మ, సీనియర్ నాయకులు నన్నూరి అంజిరెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, ఖమ్మం రాములు, వల్లూరు శ్రీశైలం, ఎండి రబ్బాని, అచ్చిన శ్రీనివాస్, నగేష్, లక్ష్మయ్య, చెన్నయ్య, సైదులు, వెంకన్న, మండల నాయకులు కర్నాటి తుకారం, పెద్దగాని నరసింహ, కృష్ణ, శ్రీరాములు, వెంకటేశం, పడస బోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య మంగళవారం రాత్రి ఆకస్మిక మరణం చెందారు.
నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ జేబీఎస్ ఉన్నత పాఠశాల నూతన హెడ్మాస్టర్ పద్మ కుమారి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం మాధవ నగర్ వీధులలో, పాతబస్తీ పూల్ వరకు ర్యాలీగా నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించి స్థానిక ప్రజలన్ని ఎంతో ఆకట్టుకున్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరిపించాలని స్థానికులను కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం 2024 విద్యా సంవత్సరం ప్రారంభ కార్యక్రమాన్ని కూడా స్వాగత తోరణాలతో ఘనంగా నిర్వహించారు.
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య గత రాత్రి 12 గంటల సమయంలో ఆకస్మిక మరణం చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోస్టల్ సేవలందించిన ఆయన సేవలను పలువురు కొనియాడారు.

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోస్టల్ సేవలందించిన ఆయన సేవలను పలువురు కొనియాడారు.
మర్రిగూడ మండలంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం ఆకాశం అంతా మేఘావృతమై ఉదయం 11:30 గంటల సమయంలో భీభత్సమైన వర్షం కురవడం మొదలైంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ద్విచక్ర వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. మండలంలో కొన్నిచోట్ల కుంటలు తెగి వరద పొంగిపొర్లింది. వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్లిన రైతులు వర్షం కారణంగా పంట పొలాల నుండి తిరుగు ప్రయాణం అయ్యారు.
నల్లగొండ:
అధిక ఫీజులు ఎయిడెడ్ పాఠశాలలో ప్రభుత్వ జీతాలు పొందుతూ మళ్లీ విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యం తన ఇష్టానుసారంగా నడుపుతున్నారని అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. సీట్ల కేటాయింపులు ఇవ్వని పాఠశాలల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కొండేటి శ్రీను జిల్లా ఆఫీసు బేరర్స్ బొట్టు శివకుమార్, కోడి రెక్క మల్లన్న, పెరిక విజయ్ కుమార్, బొల్లు రవీందర్, ఉంటే పాక కృష్ణ, కోడి రెక్క రాధిక, పెరికే విజయకుమార్, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు బాబురావు, దంతాల నాగార్జున, పెరికే మల్లయ్య, దేవయ్య,అచ్చాలు, పెరికే మల్లయ్య, శివలింగం,తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణంలోని బతుకమ్మ చెరువు బాట సమీపంలో రైలుకు ఎదురు వెళ్లి యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన జరిగింది.
నల్గొండ పట్టణంలోని గవర్నమెంట్ జేబీఎస్ హైస్కూల్ సీనియర్ ఉపాధ్యాయులు ఎస్.నాగిరెడ్డి ఆధ్వర్యంలో బడిబాట కరపత్రాన్ని ఆవిష్కరించి, బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలో మరియు గుండ్లపల్లి రోడ్ లోని ఇందిరమ్మ అపార్ట్మెంట్ లలో బడిబాట లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో పలువురు టీచర్లు పాల్గొన్నారు. 
Jun 15 2024, 06:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.0k