NLG: క్రీడలు ద్వారా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు: ASP రాములు నాయక్
నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 13 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో భాగంగా ఈ ఆదివారం నిర్వహించిన మ్యాచ్ లో మాన్ ఫోర్ట్ ఫుట్బాల్ క్లబ్, చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరా హోరి మ్యాచ్ జరగగా 2-1 స్కోర్ తో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది.
ఈ సందర్భంగా MCC-9 మరియు అరోరా స్కూల్ కరస్పాండెన్స్ పాముల అశోక్, గొర్రె వెంకటరెడ్డి క్రీడాకారులకు అరటిపండ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను పంపిణీ చేసి ప్రోత్సహించడం జరిగింది.
తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు CSL ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఈ ఆదివారం ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రాములునాయక్ రావడం, క్రీడాకారులతో ఎన్నో విషయాలపై చర్చించడం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ జిల్లా ASP రాములు నాయక్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడ ఆడడం ద్వారా శారీరకంగా దారుఢ్యంగా ఉండటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని తెలిపారు.
నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు చాలా అమోఘమని, పాఠశాల దశ నుండే విద్యార్థులలో క్రీడల వైపు దృష్టి మళ్లించడానికి నిరంతరం కృషి చేస్తూ ఎంతోమంది జాతీయ స్థాయి ఫుట్బాల్ మరియు కబడ్డీ క్రీడాకారులను గత 13 సంవత్సరాల నుండి నల్గొండ జిల్లా నుండి తయారు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం CSL లీగ్ ఫుట్బాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఫుట్బాల్ క్రీడాకారులు MD ఫైజాన్ , అప్పల మనిరామ్ లను మెడల్స్ బహుకరించి అభినందించారు.
సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు
మమ్మద్ హభీబుద్దీన్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుండి నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నామని కోచ్ చెప్పే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఫుట్బాల్ క్రీడలు మెలుకువలు పెంపొందించుకుంటున్నాని జాతీయ స్థాయిలో రాణించడానికి నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపారు.
మరొక సీనియర్ క్రీడాకారుడు ఖాజా అన్వర్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ లో చేరడం వలన ఫిజికల్ డెవలప్ కావడం వల్ల ఫుట్బాల్ క్రీడల్లో కూడా రాణిస్తున్నానని తెలిపాడు.
ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, కత్తుల హరి, అప్పల లింగయ్య, జాకటి బాలరాజు, తాజుద్దీన్ రాచూరి వెంకటసాయి, కొక్కు యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 13 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో భాగంగా ఈ ఆదివారం నిర్వహించిన మ్యాచ్ లో మాన్ ఫోర్ట్ ఫుట్బాల్ క్లబ్, చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరా హోరి మ్యాచ్ జరగగా 2-1 స్కోర్ తో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది.
ఈ సందర్భంగా MCC-9 మరియు అరోరా స్కూల్ కరస్పాండెన్స్ పాముల అశోక్, గొర్రె వెంకటరెడ్డి క్రీడాకారులకు అరటిపండ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను పంపిణీ చేసి ప్రోత్సహించడం జరిగింది.
తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు CSL ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఈ ఆదివారం ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రాములునాయక్ రావడం, క్రీడాకారులతో ఎన్నో విషయాలపై చర్చించడం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ జిల్లా ASP రాములు నాయక్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడ ఆడడం ద్వారా శారీరకంగా దారుఢ్యంగా ఉండటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని తెలిపారు.

మర్రిగూడ: కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి సందర్భంగా, మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో, సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NLG
జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన త్యాగదనుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు.
ఆదివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచి పెట్టిన చరిత్ర సుందరయ్య దని, తన సొంత భూమిని కూడా పేద ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర సుందరయ్యది అని ఆయన కొనియాడారు.
భూస్వాములకు, పెత్తందారులకు, దోపిడి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆనాడు చట్టసభల్లో ప్రజల తరఫున తన వాణిని వినిపించారని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చి మళ్లీ ఉద్యమ నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు, విస్తృత పరిచేందుకు అంకితమైనారని ఆయన అన్నారు.
భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పుచ్చలపల్లి సుందరయ్య చిన్న వయసులోనే సంఘసంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్నారని ఆయన అన్నారు. సిపిఎం ఏర్పడినప్పుడు తొలి ప్రధాన కార్యదర్శిగాబాధ్యతలు చేపట్టారు. ప్రధాన కమ్యూనిస్టు పార్టీగా తీర్చిదిద్దడానికి పునాదులు వేశారు.
తెలంగాణ సాయుధ పోరాటంకొనసాగిస్తూ, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కృషి గణనీయమైది. వారి ఆశయ సాధన కోసంప్రతి ఒక్కరు కృషి చేయాలని.. భారతదేశంలోదోపిడి, అసమానతలు లేని సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.
ప్రధాని మోదీ.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ముంబైలోని చైతన్య భూమికి వెళ్లి పుష్పాలు సమర్పించి నమస్కరించారు.
తాను ఆ ప్రదేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎప్పటికీ అలాగే ఉంటాయని పేర్కొన్నారు.
SB NEWS
*తెలంగాణ ప్రభుత్వంలోని వికలాంగులందరికీ శుభవార్త*
*స్లాట్ లేనిచో రిజర్వులో ఉంటుంది.*
*స్లాట్ బుక్ కాగానే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు డిపార్ట్మెంట్ ద్వారా SMS పంపడం జరుగుతుంది.*
ఈనెల 27 న జరగనున్న నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఓటర్ లిస్ట్ లను అధికారులు అధికారిక వెబ్సైట్లో లో పొందుపరిచారు. ఈ ఎన్నిక కోసం నల్లగొండ జిల్లాలో పలుచోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఐతే మర్రిగూడ మండలంలో 1384 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 917 మంది ఉండగా మహిళలు 467 మంది ఉన్నారు.
ఈ ఎన్నిక కోసం మర్రిగూడ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నల్గొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం ఆన్లైన్ దోస్త్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నవి.
ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థినీ విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసమై ఆన్లైన్ ద్వారా దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, కళాశాలలో మొత్తం 1560 సీట్లు అందుబాటులో ఉన్నాయని, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో 240 సీట్లు, బీకాంలో 420 సీట్లు, బి బి ఏ లో 60 సీట్లు, బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 360 సీట్లు, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో 420 సీట్లు , బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, దోస్త్ కన్వీనర్ వెంపటి శ్రీనివాసులు తెలిపారు.
ఈ సంవత్సరం కొత్తగా బీకాం ఫైనాన్స్ కోర్స్ మరియు బి ఏ (ఈ హెచ్ పి) స్పెషల్ కోర్స్ అందుబాటులో ఉన్నాయని , ఫస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్ దోస్త్ వెబ్సైట్ https://dost.cgg.gov.in/ ద్వారా ఈనెల 29వ తారీకు లోగా నమోదు చేసుకొని, ఈనెల 20వ తారీకు నుంచి 30వ తారీకు వరకు దోస్త్ ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు.
SB NEWS NATIONAL MEDIA
ఈనెల 27 న జరగనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ పట్టబద్రుల ఉప ఎన్నికకు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు.
May 21 2024, 13:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.4k