/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Hyderabad: నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు Yadagiri Goud
Hyderabad: నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: నకిలీ ఐపీఎస్ (Fake IPS) ఆఫీసర్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ ఐపీఎస్ పేరుతో చలామణి అవుతూ.. పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్నాడు..

ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో పదవులు సెటిల్‌మెంట్ల పేర్లతో మోసాలు చేస్తున్నాడు. సైబరాబాద్‌లో ఏకంగా కార్యాలయమే తెరిచి.. బాధితులను కార్యాలయానికి పిలిపించి సెటిల్‌మెంట్స్ చేస్తున్నాడు. బాధితులకు ఇంటరాగేషన్ పేరుతో చుక్కలు చూపెడుతున్నాడు.

ప్రత్యేక పోలీస్ అధికారి పేరుతో నకిలీ ఐపీఎస్ రామ్ వ్యవహారం నడుపుతున్నాడు. హైదరాబాద్ చెందిన మహిళను ట్రాప్ చేసిన విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

జాగ్వర్ కార్లను అతి తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డాడు. పోలీస్ విచారణ పేరుతో చాలామందిని చిత్రహింసలకు గురిచేశాడు. తుపాకులు, పోలీస్ వాహనాల, సైరన్లను వేసి బెంబేలు సృష్టించాడు.

సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు నకిలీ ఐపీఎస్ రామ్‌ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఎవరెవరి నుంచి ఎంత మొత్తం డబ్బులు వసూలు చేసింది.. తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు..

Amaravati: తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత.. మహిళలు, వృద్ధులను పోలీసులు లాగి పడేశారు!

గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరు దీక్షా శిబిరంలో గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపునిచ్చారు..

అయినప్పటికీ ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరులో తెదేపా ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. అప్పటికే దీక్షా శిబిరం వద్ద పోలీసులు వందల సంఖ్యలో మోహరించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ.. రైతులను పోలీసులు అరెస్టు చేశారు.

మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు వారిని లాగి పడేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా దీక్ష చేపడుతుంటే అడ్డంకులేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అరెస్టు చేసిన రైతులు, మహిళలను బలవంతంగా వాహనాలు ఎక్కించి తుళ్లూరు పీఎస్‌కు తరలించారు..

దీక్షా శిబిరంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రోజువారీ నిరసనలకు కూడా అనుమతి లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఎవరొచ్చినా సరే బలవంతంగా అరెస్టు చేస్తామని తేల్చి చెబుతున్నారు. మరోవైపు తుళ్లూరు మండలంలో తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు..

హైదరాబాద్, విశాఖలో భారీ గా ఐటి సోదాలు

హైదరాబాద్, విశాఖలలో నేడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో వచ్చేసి.. కోహినూర్ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.

ఆదాయ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ రోజు ఏక కాలంలో 20 బృందాలతో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో 20 కి పైగా ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తోంది. రియల్ ఎస్టేట్ , ఫార్మా , ఇన్ఫ్రా కంపెనీలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది.

విశాఖలో సైతం ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. పలు ఫార్మా కంపెనీలు, వాటి డైరక్టర్ల ఇళ్లలో సోదాలు ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో పదికి పైగా చోట్ల సోదాలు జరుగుతున్నాయి. విశాఖలో 15 ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి...

SB NEWS

SB NEWS!

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు బుధవారం స్వామివారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

మంగళవారం స్వామివారిని 75,875 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 35,439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నేడు 300 దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. జులై, ఆగస్ట్‌ కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది....

SB NEWS

SB NEWS

గ్రామాల్లో జోరుగా ఉపాధి హామీ పనులు

గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. రోజుకు దాదాపుగా 12 లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.

ఈ నేపథ్యంలో కూలీలు ఉపాధి పనుల వైపు మళ్లారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 3.40 కోట్ల పనిదినాలు కాగా, ఏప్రిల్‌లో 2.26 కోట్ల పనిదినాలు, ఈ నెలలో 1.14 కోట్ల పనిదినాలు జరిగాయి.

ప్రతి ఏటా ఎండాకాలంలోనే అత్యధికంగా ఉపాధి పనులు చేస్తుంటారు. అయితే, దేశంలోనే తెలంగాణలో ఎక్కువగా వరి, ఇతర పంటల సాగు కాగా, కూలీలకు వ్యవసాయ పనులే పుష్కలంగా లభించాయి.

రాష్ట్రంలో సగటున రోజుకు 12 లక్షల మంది ఉపాధి పనులకు వెళ్తున్నారు. ఒక్కో కూలీకి సగటున రూ.174 వరకు చెల్లిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో కూలీల కోసం ప్రస్తుతం 4.92 లక్షల పనులను గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధం చేసి ఉంచింది. వీటిలో 4.76లక్షల పనులు కొనసాగుతున్నాయి....

Kovvur: నేడు 'జగనన్న విద్యా దీవెన' నిధులు జమ..

ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది.

జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

అనంతరం, కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.

SB NEWS

SB MEWS

రైతున్నా కు కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్న చందంగా పరిస్థితి

ఉల్లి ధర రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. బహిరంగా మార్కెట్ లో రోజురోజుకూ ఉల్లి ధర పడిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితి కొట్టుమిట్టాడుతున్నారు.

లాభాలు లేకున్నా ఫర్వాలేదు, కానీస పెట్టుబడులు వస్తే చాలు ఆనే ఆలోచనలో ఉల్లి రైతులు ఉన్నారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి ధర రూ.800 నుంచి రూ.900 వరకు మాత్రమే పలుకుతుండడంతో రైతులు కన్నీరు మున్నీరుమున్నీరవుతున్నారు. పంట సాగుకు ఒక ఎకరానికి సుమారుగా రూ.30 వేలు ఖర్చవుతోంది.

కానీ, పంట చేతికి వచ్చేసరికి కనీసం కూలీల డబ్బులు కూడా రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం, బర్దిపూర్, కృష్ణాపూర్, మాచునూర్, పొట్టి పల్లి, ఎల్గోయి, చిలేపల్లి, వనంపల్లి, తదితర గ్రామాలలో వేసిన పంట చేతికి రావడంతో కనీస ధర లేకపోవడంతో ఉల్లి పంటను తీయకుండానే పొలాల్లోనే రైతులు వదిలేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కూలీలు సైతం ఉల్లిని నిరాకరిస్తున్నారు. డబ్బులే కావాలని అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు.

దీంతో దిక్కుతోచని స్థితిలో రైతన్న పరిస్థితి ఏర్పడింది. గతేడాది రూ.3 వేలకు పైగా ఉండడంతో ఈ ఏడాది కూడా అదే ధర వస్తుందని భావించి రైతులు జిల్లాలో పెద్దఎత్తున ఉల్లి సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో మార్కెట్‌కు తీసుకొస్తే కిరాయిలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ ను బట్టి క్వింటాకు రూ.800నుంచి రూ.1,000వరకు కొనుగోలు చేస్తూ.. వినియోగదారులకు కేజీ రూ.11 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంటకు ఒక్కసారిగా గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులకు ఏమి చేయని దీనస్థితిలో ఉన్నారు రైతులు.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామానికి చెందిన ఓ యువ రైతు తన రెండు ఎకరాల పొలంలో ఉల్లి పంటను పండించారు. పెట్టుబడి కాదు కదా కేవలం ఆయనకు గత రాత్రి మార్కెట్ కు తరలిస్తే రూ.7,718 మాత్రమే వచ్చాయి. ఉల్లి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కొందరు రైతులు ఏమో ఉల్లికి ధర లేకపోవడంతో కిరాయి ఇల్లు, తీసుకొని కిరాయి రూములు తీసుకొని ఉల్లిని నిల్వ చేస్తున్నారు. మరికొందరు రైతులు చేసేది ఏమీ లేక మార్కెట్ తరలిస్తున్నారు...

కరీంనగర్‌లో మారుతున్న పాలిట్రిక్స్‌.. ఈ సారి గంగుల కమాలకర్‌కు కష్టమే❓️

కరీంనగర్‌:

రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో చెప్పడం కష్టం. మార్పులు ఒకోసారి స్థానిక నేతలకు చుక్కలు చూపిస్తాయి. ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో షాక్‌కు గురవుతున్న ఆ నేత ఎవరు? షాక్లు సొంత పార్టీ నుంచి కాకుండా మిత్రపక్షంగా ఉన్న పార్టీ నుంచి అయితే పరిస్తితి ఎలా ఉంటుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో వస్తున్న మార్పులేంటని తెలుసుకుందాం.

కరీంనగర్ నగరానికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తూ.. మంత్రిగా కొనసాగుతున్న గంగుల కమలాకర్‌కు ఆయన చుట్టూ ఉన్నవారి నుంచే సమస్యలు మొదలయ్యాయా? ఆయన కోటరీయే ఇప్పుడాయన కొంప ముంచుతోందా అంటే అవును అనేలా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగల స్థితిలో మైనారిటీలు ఉన్నారు. గత రెండుసార్లు మైనారిటీల మద్దతుతోనే గంగుల కమలాకర్ గులాబీ పార్టీ తరపున విజయం సాధించారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదంటున్నారు స్థానిక మజ్లిస్ పార్టీ నాయకులు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ తీరుపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత కొంత కాలంగా సామాన్యులనే కాదు.. మిత్రపక్షంగా ఉన్న తమను పట్టించుకోవడంలేదని మజ్లిస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వార్

ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ మైనార్టీ లీడర్స్, ఎంఐఎం నేతలకు మధ్య సోషల్ మీడియా వార్ పెద్ద ఎత్తున నడిచింది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ కావాలనే చేయిస్తున్నారనే అనుమానాలూ ఎంఐఎం నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సమావేశం నిర్వహించుకున్న ఎంఐఎం నేతలు.. వెయ్యి కోట్ల రూపాయల విరాళాలు సేకరించైనా కరీంనగర్ లో గాలిపటం జెండా ఎగరేస్తామని చాలెంజ్ చశారు. కొందరు నేతలు పైసలు చల్లితే ఏదైనా జరుగుతుందని అనుకుంటున్నారని.. అంతకుమించిన సినిమా తాము చూపిస్తామనీ సవాల్ విసిరారు. ఇప్పటికే నగరంలోని 35 డివిజన్లలో ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ప్రభావిత శక్తిగా మారినట్లు వారు చెప్పుకొచ్చారు. ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణా హజ్ కమిటీ సభ్యుడైన సయ్యద్ గులాం హుస్సేన్ నోటే ఈ సంచలన వ్యాఖ్యలు వెలువడటంతో.. కరీంనగర్ లో పొలిటికల్ డైమెన్షన్స్ మారిపోతున్నాయన్న టాక్ నడుస్తోంది.

సవాల్‌ విసిరారు

అయితే కరీంనగర్ కేంద్రంగా జరిగిన ఈద్ మిలాప్ పార్టీలో మాట్లాడిన నేతలు.. గులాబీ బాస్ పైనా, మాజీ ఎంపీ వినోద్కుమార్ పైనా తమకున్న సాఫ్ట్ కార్నర్ ను బయటపెట్టారే తప్ప.. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు సానుకూలంగా ఒక్క మాటా మాట్లాడకపోగా.. సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. వినోద్ చొరవ వల్లే స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూనే.. ఎమ్మెల్యే నిధులతో తమ డివిజన్లను అభివృద్ధి చేయాల్సిందేనన్న డిమాండ్ వారి మాటల్లో వినిపించింది. అంతేకాదు, ఎంఐఎం అండదండలతో గెల్చి ఎమ్మెల్యేలు, మంత్రులై ఇవాళ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న వారికి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్పుతామని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో దమ్ముంటే ఎంఐఎం అండ లేకుండా గెలిచి చూపించాలనీ గంగులకు ఎంఐఎం నేతలు సవాల్ కూడా విసిరారు. కరీంనగర్ నగరంలోని ముస్లిం మైనార్టీలెక్కువగా ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి కొరవడిందని.. దర్గాలు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాల్స్ వంటివాటిని కనీసం పట్టించుకోవడంలేదంటూ స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి గంగుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం

కరీంనగర్లో ప్రస్తుత రాజకీయ వాతావరణం గమనిస్తుంటే....వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కరీంనగర్ నుంచి పోటీకి సిద్ధమవుతోందనే ప్రచారం సాగుతోంది. ఇలా ఉంటే..గంగులను ఎంపీ స్థానానికి పంపించి.. మాజీ ఎంపీ వినోద్ ను కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశాలూ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అయితే వినోద్ మాత్రం ఎంపీ స్థానానికే మొగ్గు చూపుతుండగా.. హుస్నాబాద్ నుంచి వినోద్ ను గెలిపించాలన్న కేటీఆర్ ప్రకటనతో ఇక కరీంనగర్ అసెంబ్లీ టిక్కెట్ రేసులో వినోద్ ఉంటాడా అన్నది డౌటే..? వినోద్ పోటీలో ఉంటే ఎంఐఎం నేతల ఆలోచనలో ఏదైనా మార్పు రావచ్చునేమో గాని..గంగుల కనుక మళ్ళీ పోటీ చేస్తే మాత్రం మజ్లిస్ బరిలో దిగడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అంతిమంగా బీఆర్ఎస్ అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం ఆధారపడి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది...

111 జీవో రద్దు తో జరగబోయేది ఏమిటి❓️

ఆదమరిస్తే పట్నం ఆగమవుతుంది. ప్రభుత్వం 111 జీవో రద్దు చేసి సర్కార్ పట్నానికి పాడె కడుతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు తాగు నీరందించే గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు మరో హుస్సేన్ సాగర్‌లా మారే ప్రమాదం ఉందని తెలంగాణ సమాఖ్య, హైదరాబాద్‌ జిందాబాద్‌, తెలంగాణ సోషల్‌ మీడియా ఫోరంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు, మరోసారి అలాంటి వరదల వల్ల నష్టపోకుండా ఉండేందుకు అప్పటి చీఫ్ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఈ రెండు జలాశయాలను నిర్మించారని తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ కరుణాకర్ దేశాయి అన్నారు.

గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్న ఈ రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ 65 మిలియన్ గ్యాలన్ల నీరు లభిస్తోంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛమైన వర్షపునీటితో నిండి ప్రజలకు అంతే స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నాయి. జలాశయాల వల్ల కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిధ్యానికి రక్షణ లభిస్తుంది.

అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. జీవో 111 ఎత్తేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. మృగవనం పార్కుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది.

భావితరాల కోసం జంట జలాశయాలను కాపాడుకోవలసిన అవసరముందంటూ తెచ్చిన జీవో 111ను పూర్తిగా తొలగించడం దుర్మార్గం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న సూపర్ ఆర్డర్ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. జంట జలాశయాలను రక్షించుకోవడానికి జంటనగరాల ప్రజలు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే 25న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని సెంట్ జాన్స్ చర్చ్ ఎదురుగా ఉన్న గురుస్వామి హాల్ లో “111జీవో రద్దుతో పట్నానికి పాడె” అంశం మీద భవిష్యత్తు కార్యాచరణ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరితో పాటు పలువురు పర్యావరణవేత్తలు, మేధావులు పాల్గొంటారన్నారు.

అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు.

మంగళవారం మంత్రి జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సంబంధిత శాఖ అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హెల్త్ డే రోజున మిగతా 24 జిల్లాలలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలిగామని తెలిపారు.

అదేవిధంగా మాత, శిశు మరణాలను అరికట్టడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. గర్భిణీల్లో రక్తహీనతను నివారిస్తూ, పుట్టబోయే శిశువులు ఆరోగ్యవంతంగా ఉండేలా ప్రభుత్వం ప్రస్తుతం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా సబ్ సెంటర్ల భవనాల నిర్మాణాల ప్రగతి గురించి మంత్రి జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీపీఆర్ శిక్షణ కార్యక్రమంపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

జిల్లాకు 2,630 న్యూట్రీషన్ కిట్లు : కలెక్టర్ శరత్

జిల్లాకు 2,630 న్యూట్రిషన్ కిట్స్ వచ్చాయని జిల్లా కలెక్టర్ శరత్ మంత్రికి తెలిపారు. న్యూట్రిషన్ కిట్స్ పంపిణీకి ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాకు 19 బస్తీ దవాఖానాలు మంజూరు కాగా, 18 బస్తీ దవాఖానాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మరొక బస్తీ దవాఖాన ప్రారంభానికి సిద్ధంగా ఉందని, త్వరలో దాదాని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రికి వివరించారు....