/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కేసీఆర్‌లాంటి సీఎం కావాలంటున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ Yadagiri Goud
కేసీఆర్‌లాంటి సీఎం కావాలంటున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌

మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రలో కుల రాజకీయం చేస్తున్నరు. రెడ్డి, కాపు, కమ్మలు వేర్వేరుగా రాజకీయాలు చేస్తూ ప్రజలను పట్టించుకుంటలేరు. రేపు ఏపీలో ప్రజలను పట్టించుకునేది కూడా బీఆర్‌ఎస్‌ పార్టీనే. పోలవరం పూర్తి చేసేది.. విశాఖ ఉక్కును కాపాడేది కూడా కేసీఆరే. ఇంక ఎవరికీ ఆ దమ్ము లేదు. 2024లో ఆంధ్రలో కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుంది’’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లోని ప్రజలు కేసీఆర్‌లాంటి సీఎం కావాలని, తెలంగాణలో ఉన్నటువంటి పాలన కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో మే డే వేడుకలు నిర్వహించారు. పలు సంస్థలకు బెస్ట్‌ మెనేజ్‌మెంట్‌ అవార్డులను; పలువురు వ్యక్తులకు శ్రమ శక్తి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ‘‘విభజన తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు ఒకేసారి ఏర్పడ్డాయి.

తొమ్మిదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే.. ఆంధ్ర అవుట్‌ అయ్యింది. జాతీయ హోదా కల్పించి కేంద్రం నిధులిస్తున్నా.. పోలవరం పూర్తి కాలేదు. కానీ, రాష్ట్ర నిధులతోనే కేసీఆర్‌ సర్కారు ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును అనతికాలంలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఏపీలో పోలవరం పూర్తి చేసే దమ్ము కేసీఆర్‌కే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన 75 వేల మంది విద్యార్థులు తెలంగాణలో ఎంసెట్‌ పరీక్ష రాశారని, ఉన్నత విద్యలో ఇక్కడున్న మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలే ఇందుకు కారణమని చెప్పారు. కేసీఆర్‌ సినిమా యాక్టర్‌ కాదని, అయినా, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభలకు లక్షల మంది వస్తున్నారని, బ్రహ్మరథం పడుతున్నారని, అక్కడ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. దేశంలో తెలంగాణ గాలి నడుస్తోందని, కేసీఆర్‌కు మనమంతా మద్దతుగా నిలవాలని కార్మికులను కోరారు. ఇక్కడ అభివృద్ధి జరుగుతుండడంతో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన 25 లక్షలమంది ఉపాధి పొందుతున్నారన్నారు. అమెరికా పాతబడిందని, వచ్చే మూడున్నరేళ్లలో హైదరాబాద్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మారుతుందని చెప్పుకొచ్చారు.

ఉసురు తాకి పోతరు

రాష్ర్టానికి బీజేపీ నిధులు ఇవ్వడం లేదని, కాంగ్రెస్‌ దేశాన్ని సర్వనాశనం చేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ‘‘ఆ రెండు పార్టీలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ కోసం అహోరాత్రులు కష్టపడుతున్న రామచంద్రుల (కేసీఆర్‌, కేటీఆర్‌)ను దుర్భాషలాడుతున్నారు. పని చేసేటోళ్లను తిడితే ఆ ఉసురు తాకి గాలికి కొట్టుకుపోతారు’’ అంటూ శాపనార్థాలు పెట్టారు. మోదీ పిరమైన ప్రధాని అని, ఒక్కనికే ఆయన దోచిపెట్టడం దేవుడు చూస్తున్నాడని, పాపం పండుతుందని వ్యాఖ్యానించారు. ఇంకెన్నాళ్లు.. మరో ఏడాది ఉంటాడని, వచ్చే ఎన్నికల్లో ఆయనను ప్రజలు తరిమేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులు, వారి పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని, కరోనాతో ఆలస్యం జరిగిందని చెప్పారు. గతంలో తెలంగాణ ప్రజలు బతకడానికి దూర ప్రాంతాలకు పోయేవారని, ఇప్పుడు దేశానికి బతుకు దెరువుగా రాష్ట్రం మారిందని మరో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌ను చూసి న్యూయార్కా..? హైదరాబాదా...? అని ఆశ్చర్యపోయానని సినీనటుడు రజనీకాంత్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

తెలంగాణ సర్కారుకు మావోయిస్టుల లేఖ

 తెలంగాణ సర్కారుకు ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖ రాయడం కలకలం సృష్టించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు.

నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యంతో పాటు ఇతర పంటలను కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. రైతులు పంట నష్ట పరిహారం కోసం పోరాడాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

SB NEWS

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఈ నెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలోనే ఇంటర్ మూల్యంకనం ప్రక్రియ ముగిసినా అధికారులు రిజల్ట్స్ వెలువరించేందుకు తాత్సారం చేస్తున్నారు. గతంలో ఇంటర్ ఫలితాల్లో ఎదురైన చిక్కులు, అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకే ఈసారి ఫలితాల వెల్లడి ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. మార్చి 15న ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాశారు. కాగా ఏప్రిల్ 4వ తేదీన ముగిశాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో గత నెల 26వ తేదీనే ఫలితాలు వెల్లడించారు. కానీ తెలంగాణలో మాత్రం అధికారులు జాప్యం వహిస్తుండటం గమనార్హం.

తెలంగాణలో ఇంటర్ ఫలితాల జాప్యానికి కారణం టెక్నికల్ సమస్యలేనని పలువురు చెబుతున్నారు. గతంలో ఇలాంటి సాంకేతిక కారణాల వల్లనే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ ఉద్దేశ్యంతోనే ఆలస్యమైనా సరే రిజల్స్ట్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇప్పటికే అధికారులు రిజల్ట్స్‌కు సంబంధించిన ప్రాసెస్‌ను పూర్తిచేసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని అంతా ఒకే అనుకున్నాకే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధికారుల ప్రాసెసింగ్ సక్సెస్ అయ్యాక విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒకే చెప్పిన మరుక్షణమే రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఫలితాల వెల్లడిలో అధికారులు కాస్త తాత్సారం వహిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి తొలుత మూల్యంకనం ప్రక్రియ ఆన్ లైన్ పద్ధతిలో చేపట్టాలని భావించారు.

ఇందుకు సంబంధించిన ఇంటర్ బోర్డు టెండర్లకు సైతం అహ్వానించింది. కానీ బిడ్డింగ్‌కు ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇది కూడా రిజల్ట్స్‌ ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే ఈనెల 10వ తేదీలోపు ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్న అధికారులు అన్నీ ఒకే అనుకుంటే ఈనెల మొదటి శనివారంలోపే వెల్లడించాలని చూస్తున్నట్లు వినికిడి.

Minister Jogi Ramesh: పవన్‌, రజనీకాంత్‌పై జోగి రమేష్‌ సంచలన వ్యాఖ్యలు..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్‌ బీజేపీతో పెళ్లి టీడీపీతో కాపురం చేసే వ్యక్తి పవన్ అంటూ ఫైర్‌ అయ్యారు..

మేం ఎవ్వరితో పొత్తులు పెట్టుకోం అని స్పష్టం చేశారు.. పవన్ కి సత్తా ఉంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటూ సవాల్‌ చేశారు.. సన్నాసి అయితే జనసేనను టీడీపీలో కలిపేయాలి అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. అమాయకులు పవన్ ని సీఎం అంటున్నారు..

కానీ, చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌.. సీఎం అంటున్నాడన్న ఆయన.. టీడీపీకి పవన్‌ అమ్ముడుపోతాడు అని ఆరోపించారు.. అందరినీ చంద్రబాబుకి హోల్ సేల్‌గా అమ్మేస్తాడు అంటూ జనసేన శ్రేణులను హెచ్చరించిన ఆయన.. జనసేన అభిమానులు కూడా జగనన్న బాటలో నడవాలంటూ పిలుపునిచ్చారు..

ఇక, చంద్రబాబు వేదిక మీద ఉండగా హాజరయ్యాడంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు మానవత్వం లేదు అంటూ ఫైర్‌ అయ్యారు జోగి రమేష్‌.. రజనీకాంత్ కి సిగ్గుగా లేదా..? అని ప్రశ్నించిన ఆయన.. ఒక దొంగ చంద్రబాబు, ఇంకొక దొంగ రజనీకాంత్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

AP High Court: రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు.. పిటిషన్లపై హైకోర్టు విచారణ..

అమరావతి: ఆర్‌-5 జోన్‌లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయించిపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది..

రాజధాని పరిధిలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వానికి తొందర ఎందుకని పిటిషనర్లు ప్రశ్నించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం, పిటిషనర్లు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని పేర్కొంది.

రాజధాని ప్రాంతంలో నిర్మించిన 5వేల టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల మంజూరుకు అనుసరించిన విధివిధానాలను పూర్తి వివరాలతో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది..

Chikoti Praveen: థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

థాయిలాండ్‌లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్ అయ్యింది. థాయిలాండ్‌లోని పటాయలో 90 మంది భారతీయులను అరెస్ట్ చేశారు..

భారీగా నగదు, గేమింగ్ చిప్స్ స్వాధీనం చేసుకున్నారు. 20.92 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్.. 1.60 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు.

చీకొటి ప్రవీణ్ నేతృత్వంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. చీకొటి ప్రవీణ్, మాధవరెడ్డిని అక్కడి పటాయా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు..

Divorce: ఆర్నెళ్లు ఆగాల్సిన అవసరం లేదు.. ఆర్టికల్ 142 ప్రకారం వెంటనే విడాకులు: సుప్రీంకోర్టు

Divorce: ఆర్టికల్ 142 ప్రకారం తక్షణమే విడాకులు ఇవ్వవొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. విడాకుల కోసం ఆర్నెళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది..

అయిదుగురు సభ్యుల బెంచ్ ఓ కేసులో కీలక తీర్పును ఇచ్చింది..

న్యూఢిల్లీ: విడాకులపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. విడాకులు(Divorce) కోరుకునే జంట ఆర్నెళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. కలిసి జీవించలేని పరిస్థితులు ఉన్నప్పుడు.. ఆర్టికల్ 142 ప్రకారం తన అధికారాలను ఉపయోగించుకుని.. దంపతులకు విడాకులు ఇవ్వవొచ్చు అని సుప్రీం కోర్టు చెప్పింది.

దంపతులు ఇద్దరూ విడాకులకు అంగీకరిస్తే, హిందూ వివాహ చట్టం ప్రకారం ఆర్నెళ్లు ఆగాల్సిన అవసరం లేదని కోర్టు వెల్లడించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్ నాథ్‌, జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది..

నూతన సచివాలయంలో నేడు కేసీఆర్ సమీక్ష

డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో సిఎం సమావేశమందిరంలో సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ సమీక్షా సమావేశంలో... కరివేన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణ్ పూర్ ,కొడంగల్, వికారాబాద్ కు వెళ్లే తాగునీటి కాల్వల గురించి చర్చించనున్నారు.

ఈ సమీక్షలో... జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు, సిఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మరియు ఆర్థికశాఖ కార్యదర్శి, ఇరిగేషన్ ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొననున్నారు.

SB NEWS

శ్రమ దోపిడీపై పెను గర్జన : మే డే

మేడే’ కార్మిక పోరాట దినం. 1886లో చికాగో కార్మికులు తమ విలువైన నెత్తురును పారించి 8గంటల పనిదినం హక్కును సాధించారు. 137 సంవత్సరాల క్రితం సాధించుకున్న ఈ 8 గంటల పనిదినం హక్కు నిత్యం ఉల్లంఘనలకు గురయ్యి నేడు పబ్లిక్, ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా అదనపు విలువను దోపిడీ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అన్ని సంస్థలు కార్మికుల శక్తిని విపరీతంగా దోచుకుంటున్నాయి.

ప్రస్తుతం కార్మికుడు దోపిడీ రూపాలను కార్మిక వర్గం గుర్తించకుండా ఎక్కువ పనిగంటలు తప్పనిసరి అని కార్మికుడే భావించేలా సామాజిక స్థితిని, ఉద్యోగ అభద్రతను కల్పిస్తున్నారు. కార్మికుడి శ్రమనే కాదు, ప్రాణాలు కూడా కోల్పోయేలా ఉద్యోగ పరిస్థితులను సృష్టిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం సాధించుకున్న హక్కును కోల్పోతున్నది.

19వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ఏర్పడి కార్మికుల అవసరం ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు కార్మికులతో రోజుకు 16 నుంచి 20 గంటలు పనిచేయించేవారు. పైగా పనిచేసే కర్మాగారాలలో సరైన సౌకర్యాలు కూడా కల్పించేవారు కాదు. దీంతో కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. శ్రమను మరవడానికి కాస్తా విశ్రాంతి తీసుకున్నా యాజమానులు కోపోద్రికులై ధిక్కార నేరం కింద జరిమానా విధించేవారు. ఈ దారుణ చర్యల నేపథ్యంలో కార్మికులలో తిరుగుబాటు మొదలై కార్మిక సంఘాల నిర్మాణం, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటు చేసుకొని పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని (ట్రేడ్ యూనియన్లను గుర్తించాలని) కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది. ఈ పోరాటంలో ఎంతోమంది మరణించి తమ హక్కును సాధించుకున్నారు. వారి స్పూర్తికి గుర్తుగా జరుపుకోనేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే.

1923లో తొలిసారిగా భారత్‌లో ‘మేడే’ను పాటించారు.. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటంతో అప్పటి నుంచే కార్మికవర్గాల్లో చైతనం మొదలైంది. ప్రస్తుతం అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.

మేడే హక్కును అణిచివేస్తూ..

చికాగోలో కార్మికులు సాధించిన 8 గంటల పనిదినం ‘‘మేడే’’ హక్కు ప్రైవేటీకరణ, సరళీకరణ మూలంగా మొత్తంగా కార్మికవర్గానికి 8 గంటల పనిదినం దూరమయ్యే స్థితి ఏర్పడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలను అణచివేసిన సామ్రాజ్యవాద శక్తులు, ప్రజాస్వామ్యం అంటూ డాంబికాలు కొడుతున్న దళారి, బూర్జువా, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులుగా మారి ‘మేడే’ హక్కును అణచివేస్తున్నారు, రద్దు చేస్తున్నారు. ఎంతో త్యాగంతో పోరాడి 8 గంటల పనిదినం సాధిస్తే నేడు 12 గంటలుగా, 16 గంటలుగా పనిదినాలను పొడిగిస్తున్నారు. కార్మిక చట్టాలను బలహీనపర్చడానికి 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వం నుండి నేటి వరకు మన దేశ రాజకీయ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

నేడు అసంఘటిత రంగంలోని కార్మిక వర్గం పూర్తిగా బలైన స్థితి కొనసాగుతూ వస్తోంది. అసంఘటిత రంగంలో కార్మికుడు చనిపోతే, ఆ ప్రాణానికి వెలగట్టి మూడోకంటికి తెలియకుండా శవాన్ని బయటికి తరలించే మెకానిజాన్ని అన్ని ప్రైవేటురంగ పరిశ్రమలు కలిగి ఉన్నాయి. పరిశ్రమలోకి ఎవరూ లోపలికి అడుగుపెట్టనివ్వకపోవడంతో నిజాలు లోపలే బందీ అవుతున్నాయి. మన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ బలవంతంగా యాజమాన్యం ఇస్తున్న నష్టపరిహారాన్ని బంధువులు తీసుకోవాలని భయపెట్టి వారు తీసుకునేలా చేసి, నిశ్శబ్ధంగా వలస కార్మికుల శవాలను రాష్ట్ర పరిధులు దాటించేస్తున్నారు.

1947 ప్రాంతంలో అప్పుడు రాజకీయాలు కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేవి. అవి నేడు పూర్తిగా రాజకీయంగా మారి, రాజకీయమే ‘వ్యాపార సరుకు’గా మారిపోయిన స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో సామాజిక విలువలు, సామాజిక బాధ్యత, ప్రజల జీవించే హక్కు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాయి. కార్మిక చట్టాల సవరణలతో 8 గంటల పనిదినం ఉనికిలో లేకుండా పోతున్నది. పెరిగిన పనిగంటలకు కార్మికులు సిద్ధపడితేనే వారికి జీవనోపాధి హక్కు దొరుకుతుంది లేకపోతే, ఉద్యోగాలుండి తొలగించే అధికారాన్ని కూడా ఈ సవరణ ద్వారా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు పొందగలుగుతున్నారు. ఇక సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, పారిశ్రామిక వివాదాల చట్టం యొక్క స్థితి రేపు రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. కార్మికుల శ్రమను విపరీతంగా దోచుకునే అవకాశం ఇప్పటికే ఉన్నప్పటికి, ఈ కార్మిక చట్టాల సవరణల ప్రక్రియ ద్వారా పనిగంటల పొడిగింపు వంటి నిరంకుశ విధానాలకు చట్టబద్ధత చేకూరుతున్నది.

Kishan Reddy : ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దిల్లీ..

బీజేపీ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత కలిగింది. ఆదివారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో..

ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ హస్పిటల్లో చేర్పించారు..

కార్డియాక్ కేర్ యూనిట్ లో ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్నీ పర్యవేక్షించింది..

అయితే కడుపులో గ్యాస్ సమస్య వల్ల ఆయనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది.

అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

SB NEWS