/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నూతన సచివాలయంలో నేడు కేసీఆర్ సమీక్ష Yadagiri Goud
నూతన సచివాలయంలో నేడు కేసీఆర్ సమీక్ష

డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో సిఎం సమావేశమందిరంలో సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ సమీక్షా సమావేశంలో... కరివేన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణ్ పూర్ ,కొడంగల్, వికారాబాద్ కు వెళ్లే తాగునీటి కాల్వల గురించి చర్చించనున్నారు.

ఈ సమీక్షలో... జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు, సిఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మరియు ఆర్థికశాఖ కార్యదర్శి, ఇరిగేషన్ ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొననున్నారు.

SB NEWS

శ్రమ దోపిడీపై పెను గర్జన : మే డే

మేడే’ కార్మిక పోరాట దినం. 1886లో చికాగో కార్మికులు తమ విలువైన నెత్తురును పారించి 8గంటల పనిదినం హక్కును సాధించారు. 137 సంవత్సరాల క్రితం సాధించుకున్న ఈ 8 గంటల పనిదినం హక్కు నిత్యం ఉల్లంఘనలకు గురయ్యి నేడు పబ్లిక్, ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా అదనపు విలువను దోపిడీ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అన్ని సంస్థలు కార్మికుల శక్తిని విపరీతంగా దోచుకుంటున్నాయి.

ప్రస్తుతం కార్మికుడు దోపిడీ రూపాలను కార్మిక వర్గం గుర్తించకుండా ఎక్కువ పనిగంటలు తప్పనిసరి అని కార్మికుడే భావించేలా సామాజిక స్థితిని, ఉద్యోగ అభద్రతను కల్పిస్తున్నారు. కార్మికుడి శ్రమనే కాదు, ప్రాణాలు కూడా కోల్పోయేలా ఉద్యోగ పరిస్థితులను సృష్టిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం సాధించుకున్న హక్కును కోల్పోతున్నది.

19వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ఏర్పడి కార్మికుల అవసరం ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు కార్మికులతో రోజుకు 16 నుంచి 20 గంటలు పనిచేయించేవారు. పైగా పనిచేసే కర్మాగారాలలో సరైన సౌకర్యాలు కూడా కల్పించేవారు కాదు. దీంతో కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. శ్రమను మరవడానికి కాస్తా విశ్రాంతి తీసుకున్నా యాజమానులు కోపోద్రికులై ధిక్కార నేరం కింద జరిమానా విధించేవారు. ఈ దారుణ చర్యల నేపథ్యంలో కార్మికులలో తిరుగుబాటు మొదలై కార్మిక సంఘాల నిర్మాణం, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటు చేసుకొని పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని (ట్రేడ్ యూనియన్లను గుర్తించాలని) కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగినంత విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మికవర్గం విప్లవ శంఖం పూరించింది. ఈ పోరాటంలో ఎంతోమంది మరణించి తమ హక్కును సాధించుకున్నారు. వారి స్పూర్తికి గుర్తుగా జరుపుకోనేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే.

1923లో తొలిసారిగా భారత్‌లో ‘మేడే’ను పాటించారు.. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటంతో అప్పటి నుంచే కార్మికవర్గాల్లో చైతనం మొదలైంది. ప్రస్తుతం అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.

మేడే హక్కును అణిచివేస్తూ..

చికాగోలో కార్మికులు సాధించిన 8 గంటల పనిదినం ‘‘మేడే’’ హక్కు ప్రైవేటీకరణ, సరళీకరణ మూలంగా మొత్తంగా కార్మికవర్గానికి 8 గంటల పనిదినం దూరమయ్యే స్థితి ఏర్పడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలను అణచివేసిన సామ్రాజ్యవాద శక్తులు, ప్రజాస్వామ్యం అంటూ డాంబికాలు కొడుతున్న దళారి, బూర్జువా, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులుగా మారి ‘మేడే’ హక్కును అణచివేస్తున్నారు, రద్దు చేస్తున్నారు. ఎంతో త్యాగంతో పోరాడి 8 గంటల పనిదినం సాధిస్తే నేడు 12 గంటలుగా, 16 గంటలుగా పనిదినాలను పొడిగిస్తున్నారు. కార్మిక చట్టాలను బలహీనపర్చడానికి 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వం నుండి నేటి వరకు మన దేశ రాజకీయ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

నేడు అసంఘటిత రంగంలోని కార్మిక వర్గం పూర్తిగా బలైన స్థితి కొనసాగుతూ వస్తోంది. అసంఘటిత రంగంలో కార్మికుడు చనిపోతే, ఆ ప్రాణానికి వెలగట్టి మూడోకంటికి తెలియకుండా శవాన్ని బయటికి తరలించే మెకానిజాన్ని అన్ని ప్రైవేటురంగ పరిశ్రమలు కలిగి ఉన్నాయి. పరిశ్రమలోకి ఎవరూ లోపలికి అడుగుపెట్టనివ్వకపోవడంతో నిజాలు లోపలే బందీ అవుతున్నాయి. మన న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ బలవంతంగా యాజమాన్యం ఇస్తున్న నష్టపరిహారాన్ని బంధువులు తీసుకోవాలని భయపెట్టి వారు తీసుకునేలా చేసి, నిశ్శబ్ధంగా వలస కార్మికుల శవాలను రాష్ట్ర పరిధులు దాటించేస్తున్నారు.

1947 ప్రాంతంలో అప్పుడు రాజకీయాలు కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేవి. అవి నేడు పూర్తిగా రాజకీయంగా మారి, రాజకీయమే ‘వ్యాపార సరుకు’గా మారిపోయిన స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో సామాజిక విలువలు, సామాజిక బాధ్యత, ప్రజల జీవించే హక్కు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాయి. కార్మిక చట్టాల సవరణలతో 8 గంటల పనిదినం ఉనికిలో లేకుండా పోతున్నది. పెరిగిన పనిగంటలకు కార్మికులు సిద్ధపడితేనే వారికి జీవనోపాధి హక్కు దొరుకుతుంది లేకపోతే, ఉద్యోగాలుండి తొలగించే అధికారాన్ని కూడా ఈ సవరణ ద్వారా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు పొందగలుగుతున్నారు. ఇక సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, పారిశ్రామిక వివాదాల చట్టం యొక్క స్థితి రేపు రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. కార్మికుల శ్రమను విపరీతంగా దోచుకునే అవకాశం ఇప్పటికే ఉన్నప్పటికి, ఈ కార్మిక చట్టాల సవరణల ప్రక్రియ ద్వారా పనిగంటల పొడిగింపు వంటి నిరంకుశ విధానాలకు చట్టబద్ధత చేకూరుతున్నది.

Kishan Reddy : ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దిల్లీ..

బీజేపీ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత కలిగింది. ఆదివారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో..

ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ హస్పిటల్లో చేర్పించారు..

కార్డియాక్ కేర్ యూనిట్ లో ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్నీ పర్యవేక్షించింది..

అయితే కడుపులో గ్యాస్ సమస్య వల్ల ఆయనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది.

అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

SB NEWS

తిరుమల వెంకన్న స్వామికి కొత్త బంగారు హారం

8 39 కోట్లతో తిరుపతి ఏడుకొండలను అలంకరించేందుకు 28.645 కిలోల బంగారు హారాన్ని కొత్తగా తయారు చేశారు.

SB NEWS

SB NEWS

SB NEWS

బాణసంచా వెలుగుల్లో కాంతులీనిన కొత్త సచివాలయం..

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది..

సచివాలయ ఆవరణలో బాణసంచా పేల్చి చేసిన సంబురాలు అబ్బురపరిచాయి..

రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతూలీనిన కొత్త సెక్రెటేరియేట్‌ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది..

*SB NEWS*

నారా లోకేష్ పాదయాత్రలో జనసేన

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చేరుకుంది..

ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పాదం కలిపారు. జనసేన, యువగళం జెండాలతో పాదయాత్రకు జనసేన నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసైనికులకు లోకేష్ అభివాదం చేశారు..

తాను ఎస్సీలను అవమానించినట్లు ఒక మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఎస్సీలను అవమానించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు..

నిరూపించలేకపోతే భారతీరెడ్డి తన పత్రిక, ఛానెల్ మూసేస్తారా? అని సవాల్ విసిరారు. తాను ఎస్సీలను అవమానించినట్లు చూపిన వీడియోలో చప్పట్లు కొడుతున్నారని, తాను అవమానిస్తే వారు చప్పట్లు కొడతారా? ఇంత చిన్న లాజిక్ ను భారతీరెడ్డి ఎలా మిస్ అయ్యారని లోకేష్ ప్రశ్నించారు..

Snakes Chameleon : మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు, ఊసరవెల్లి..

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగుల్లో 22 పాములు, ఒక ఊసరవెల్లి కలకలం రేపాయి. వీటిని చూసి కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు..

ఒక మహిళా మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఏకే 13 విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు..

మహిళపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆమె లగేజ్ ను తనిఖీ చేశారు. మహిళకు చెందిన బ్యాగుల్లో పలు జాతులకు చెందిన 22 పాములు, ఒక ఊసరవెల్లి కనిపించాయి. వీటిని చూసిన కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు..

పాములు పట్టే వారిని రప్పించి పాములను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అరెస్టు చేసి ఆమెపై కస్టమ్స్ చట్టంతోపాటు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..

అకాల వర్షాలకు నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి...

•వేముల గోపీనాథ్

జిల్లా వ్యాప్తంగా వరుసగా అకాల వర్షాలు కురుస్తుండడంతో ఐకెపి సెంటర్లలోకి వరద నీరు చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు వేముల గోపీనాథ్ అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆదివారం గోపీనాథ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐకెపి ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి అకాల వర్షాలకు నష్టపోయిన రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.

ధాన్యం కొనుగోలును ఆలస్యం చేయడం మూలంగా అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడిసి వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు అప్పు తెచ్చి పండించిన పంట చేతికందకపోవడంతో వనస్థాపానికి గురవుతున్నారని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

ప్రధాన రహదారుల వెంట గాలి దుమారానికి చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలిపోతున్నాయని అధికారులు స్పందించి అలాంటి చెట్లను తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపోయిన ధాన్యాన్ని అంచనా వేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.

Weather Update: రాబోయే రెండురోజులు.. ఏపీలో పిడుగులతో కూడిన భారీవర్షాలు..

•తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అల్లాడిపోతున్నాయి.

మండు వేసవిలో అకాల వర్షాలు, పిడుగులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. ఐఎండి అంచనా ప్రకారం తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ మరియు కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి డా. బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు.

దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

సోమవారం కోనసీమ,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఎల్లుండి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

TS: గుడ్‌న్యూస్‌.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ..

హైదరాబాద్: నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది..

కాంట్రాక్టు ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణ దస్త్రంపై సీఎం కేసీఆర్‌ తొలి సంతకం చేశారు.

SB NEWS