/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz డీజీపీతో సీఎం జగన్ కీలక భేటీ.. Yadagiri Goud
డీజీపీతో సీఎం జగన్ కీలక భేటీ..

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు..

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో వివేకా హత్య కేసు పరిణామాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది..

ఈ కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమీక్షలో చర్చ జరిగినట్లు సమాచారం..

IMD Heatwave Alert : ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు...ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరిక జారీ

ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్షియస్ కు చేరుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వడ గాలులు వీచవచ్చు...

ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా బుధవారం వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను శాస్త్రవేత్తలు జారీ చేశారు.రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు,రాయలసీమ ప్రాంతంలో మంగళవారం 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

National Highway : కశ్మీర్‌-కన్యాకుమారి.. పొడవైన జాతీయ రహదారి 'ఎన్‌హెచ్‌-44'!

ఎన్‌హెచ్‌-44 (National Highway 44).. దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి (Indias longest highway) ఇది. ఉత్తర-దక్షిణ భారతాన్ని కలిపే రహదారిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది..

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో (Jammu kashmir) మొదలై.. పంజాబ్‌ (Punjab), హరియాణా (Haryana), దేశ రాజధాని దిల్లీ (Delhi), ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh), రాజస్థాన్‌ (Rajasthan), మధ్యప్రదేశ్‌ (Madhya pradesh), మహారాష్ట్ర (Maharashtra), తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh), కర్ణాటక (Karnataka) మీదుగా ప్రయాణిస్తూ తమిళనాడు (Tamil nadu) రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ముగుస్తుంది.

ఈ జాతీయ రహదారి మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 492 కి.మీ, ఏపీలో 260 కి.మీ మేర ఎన్‌హెచ్‌-44 ఉంది. తొలుత ఇది ఒకే జాతీయ రహదారి కాదు. ఏడు జాతీయ రహదారులను (ఎన్‌హెచ్‌-1ఎ, ఎన్‌హెచ్‌-1, ఎన్‌హెచ్‌-2, ఎన్‌హెచ్‌-3, ఎన్‌హెచ్‌-75, ఎన్‌హెచ్‌-26, ఎన్‌హెచ్‌-7) విలీనం చేసి 'ఎన్‌హెచ్‌-44'ను ఏర్పాటు చేశారు. భారత మ్యాప్‌పై ఒక నిలువు గీత గీసిన తరహాలో ఈ జాతీయ రహదారి

కన్పిస్తుంది..

Nara Lokesh: వచ్చే ఎన్నికల్లో 'ఫ్యాన్‌'ను పీకిపారేయండి: లోకేశ్‌

ఆలూరు: వైకాపా పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని.. ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు..

74వరోజు 'యువగళం' పాదయాత్రలో భాగంగా ఆలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు.

నియోజకవర్గ పరిధిలోని దేవనకొండ శివార్లలోని శనగ చేలో దిగి రైతుల కూలీలతో లోకేశ్‌ మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీల గురించి రైతులు ప్రస్తావించగా.. వచ్చే ఎన్నికల్లో 'ఫ్యాన్‌'ను పీకిపారేయడమే దానికి పరిష్కారమన్నారు. కుంటిసాకులతో జగన్‌ ప్రభుత్వం తొలగించిన పింఛన్లను తెదేపా అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని.. రాబోయే చంద్రన్న ప్రభుత్వంలో అంతా మంచే జరుగుతుందని బాధితులకు లోకేశ్‌ భరోసానిచ్చారు..

Kejriwal: దేశం కోసం ప్రాణాలైనా ఇస్తా: కేజ్రీవాల్‌

దిల్లీ: కొత్త మద్యం విధానంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Kejriwal) అన్నారు. దీంట్లో దాచిపెట్టడానికి ఏమీ లేదని..

సీబీఐ ముందు నిజాయతీగా అన్నీ వాస్తవాలే చెబుతానని తెలిపారు. మద్యం విధాన కుంభకోణంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని శుక్రవారం సీబీఐ (CBI) ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ భాజపాపై నిప్పులు చెరిగారు. అంతకుముందు విడుదల చేసిన ఓ వీడియో సందేశంలోనూ కేంద్రంలోని అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. వారు చాలా శక్తిమంతమైనవారని.. ఎవరినైనా జైలుకు పంపగలరని కేజ్రీవాల్‌ (Kejriwal) ఆరోపించారు. తనను అరెస్టు చేయాలని భాజపా నేతలు బలంగా డిమాండ్‌ చేస్తున్నారన్నారు. బహుశా సీబీఐ (CBI)ని ఆ పార్టీ అలా ఆదేశించి ఉంటుందని వ్యాఖ్యానించారు. పార్టీ అలా ఆదేశిస్తే సీబీఐ తనను ఎందుకు అరెస్టు చేయకుండా ఉంటుందని అన్నారు. భాజపా నేతలకు అధికారం వల్ల వచ్చిన అహంకారం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. వారికి అనుకూలంగా లేని మీడియా, న్యాయమూర్తులు.. ఇలా ఎవరిపైనైనా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారి మాట వినకపోతే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారన్నారు..

Fire Accident: హైదరాబాద్‌లో ఘోరం.. చిన్నారి సహా దంపతుల సజీవ దహనం..

హైదరాబాద్‌: నగరంలోని కుషాయిగూడలో ఘోరం జరిగింది. అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. టింబర్‌ డిపోలో వేకువజామున 3 గంటలకు అగ్నిప్రమాదం జరగడంతో మంటలు పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి.

దీంతో అందులో నివాసముంటున్న దంపతులు సహా వారి చిన్నకుమారుడు మృతిచెందారు.

మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్‌ (35), సుమ(28), జోషిత్‌(5)గా గుర్తించారు. మరో చిన్నారి ఆచూకీ తెలియలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు..

అన్ని సర్కార్‌ బడుల్లో రాగి జావ

•వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

హైదరాబాద్‌: అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రాగి జావ అందజేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం 1-10 తరగతుల విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. దాదాపు 22 లక్షల మంది పిల్లలు ప్రయోజనం పొందనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాగి జావ అని ఒకసారి, పల్లీ పట్టి అని మరోసారి, మొలకలు, బెల్లం అని ఇంకోసారి 2018-19 నుంచి ప్రతిపాదనలు పంపడం...

కేంద్ర విద్యాశాఖ 60% వ్యయాన్ని భరిస్తామని హామీ ఇవ్వడం...చివరకది అమలు కాకపోవడం షరా మామూలుగా మారింది. పిల్లల్లో రక్తహీనత నివారణకు వాటిని అందించాలనుకున్నా విద్యాశాఖ అధికారుల చొరవ లేని కారణంగా ఏటా అటకెక్కుతోంది. దీనిపై విమర్శలు వస్తుండటంతో ఈసారి దాన్ని పట్టాలెక్కించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో అందించాలంటే రూ.35 కోట్లు వ్యయం అవుతుందని అంచనావేశారు. అందులో సగం ట్రస్ట్‌, మిగిలిన సగాన్ని ప్రభుత్వం భరిస్తుందని అధికారులు తెలిపారు.

ట్రస్ట్‌ అమలు తీరును చూసి...

అన్నపూర్ణ ట్రస్ట్‌ 2022-23 విద్యా సంవత్సరంలో ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో 6.50 లక్షల మందికి జాగి జావను ఉచితంగా అందించింది. ట్రస్ట్‌ ప్రతినిధులు రాగి మాల్ట్‌ పొడిని ఎంఈవో కార్యాలయాలకు పంపిస్తారు. దాన్ని విద్యాశాఖ అధికారులు అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తారు. పొడిలోనే బెల్లం కూడా కలిపి ఉంటుంది. దాన్ని వేడి నీళ్లలో వేస్తే చాలు. నీటిని వేడి చేయడం, రాగి మాల్ట్‌ పొడిని మిక్స్‌ చేయడం...దాన్ని విద్యార్థులకు అందించే బాధ్యత మధ్యాహ్న భోజనపథకం కార్మికులు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో దాన్ని అందిస్తున్నారు. కనీసం సగం మంది ఉదయం అల్పాహారం తీసుకోకుండానే బడికి వస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏమీ తినకుండా ఉంటున్నారు. ఆ లోపాన్ని కూడా రాగి జావ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అన్నపూర్ణ ట్రస్ట్‌ ద్వారానే అమలుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో పకడ్బందీగా ఓటర్ల జాబితా

•జూన్‌ 1కల్లా ఈవీఎంల తొలి విడత తనిఖీ చేయాలి

•సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు

హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పనులకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఏడాది డిసెంబరులోగా ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ప్రాథమిక దశ స్థితిగతులను, సన్నద్ధతను తెలుసుకునేందుకు ముగ్గురు అధికారుల బృందాన్ని హైదరాబాద్‌ పంపింది.

ఈ బృందం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించింది. ఎన్నికల క్రతువులో భాగస్వాములయ్యే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు దశల వారీగా శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ నితీష్‌వ్యాస్‌ స్పష్టం చేశారు. ‘తొలిదశలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహించాలి. ఆ తర్వాత అన్ని స్థాయుల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ఈఆర్పీనెట్‌ 2.0 పనితీరునూ సమీక్షించాలి. ఓటర్ల జాబితాను పకడ్బందీగా నిర్వహించాలి. చేర్పులు, తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించాలి.

ఓటు ప్రాధాన్యంపై ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలి. అధిక శాతం మంది ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలి. ఈవీఎంల తొలిదశ తనిఖీ ప్రక్రియను జూన్‌ ఒకటో తేదీ నాటికి పూర్తి చేయాలి’ అని ఆయన సూచించారు. తనిఖీ ప్రక్రియను పూర్తి చేసిన తరవాత ఈవీఎంలను ఆయా జిల్లాలకు తరలిస్తామని ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అధికారుల బృందానికి వివరించారు. సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్‌ కుమార్‌, అండర్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్‌, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు రవికిరణ్‌, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.

మాఫియా అతిక్, అష్రఫ్‌లను కాల్చిచంపారు

లక్నో: అతీక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అర్షద్ కాల్చి చంపబడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో వైద్యం కోసం వెళుతుండగా ఇద్దరిపై కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన నిందితుడు లొంగిపోయాడు.

దాడి చేసిన వారి మెడలో ఐడి కార్డ్ కూడా ఉందని, ఈ కారణంగా ముగ్గురూ మీడియా వ్యక్తులుగా నటిస్తూ బహిరంగంగా వచ్చారని భయపడుతున్నారు. అష్రఫ్, అతిక్‌లను కాల్చిచంపిన అనంతరం దాడి చేసిన వ్యక్తులు చేతులు పైకెత్తి అక్కడికక్కడే లొంగిపోయారు.

అతిక్ అహ్మద్, అష్రఫ్‌లు మీడియాకు స్టేట్‌మెంట్లు ఇస్తుండగా ముందు నుంచి తలపై కాల్పులు జరిగాయి. హంతకులు మీడియా ప్రతినిధులతో నిలబడి జర్నలిస్టుల వేషంలో వచ్చారు. ఒక హంతకుడు పట్టుబడ్డాడు.

వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ

కడప : వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. విచారణలో భాగంగా ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున అధికారులు రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు..

అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని విచారించిన అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు భారీగా అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మొన్న ఉదయకుమార్ రెడ్డి, నేడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

ఇక సీబీఐ అధికారులు వరుస అరెస్టుల పర్వం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు 4సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ బృందం వెళ్లింది..