/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మాఫియా అతిక్, అష్రఫ్‌లను కాల్చిచంపారు Yadagiri Goud
మాఫియా అతిక్, అష్రఫ్‌లను కాల్చిచంపారు

లక్నో: అతీక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అర్షద్ కాల్చి చంపబడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో వైద్యం కోసం వెళుతుండగా ఇద్దరిపై కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన నిందితుడు లొంగిపోయాడు.

దాడి చేసిన వారి మెడలో ఐడి కార్డ్ కూడా ఉందని, ఈ కారణంగా ముగ్గురూ మీడియా వ్యక్తులుగా నటిస్తూ బహిరంగంగా వచ్చారని భయపడుతున్నారు. అష్రఫ్, అతిక్‌లను కాల్చిచంపిన అనంతరం దాడి చేసిన వ్యక్తులు చేతులు పైకెత్తి అక్కడికక్కడే లొంగిపోయారు.

అతిక్ అహ్మద్, అష్రఫ్‌లు మీడియాకు స్టేట్‌మెంట్లు ఇస్తుండగా ముందు నుంచి తలపై కాల్పులు జరిగాయి. హంతకులు మీడియా ప్రతినిధులతో నిలబడి జర్నలిస్టుల వేషంలో వచ్చారు. ఒక హంతకుడు పట్టుబడ్డాడు.

వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ

కడప : వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. విచారణలో భాగంగా ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున అధికారులు రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు..

అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని విచారించిన అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు భారీగా అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మొన్న ఉదయకుమార్ రెడ్డి, నేడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

ఇక సీబీఐ అధికారులు వరుస అరెస్టుల పర్వం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు 4సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ బృందం వెళ్లింది..

TS News: సీఎం కేసీఆర్‌కు షబ్బీర్ అలీ సవాల్

కామారెడ్డి: అంబేద్కర్ విగ్రహం నిర్మించడం కాదు, దమ్ముంటే దళితున్ని ముఖ్యమంత్రి చేయ్యాలని సీఎం కేసీఆర్‌ (CM KCR)కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) సవాల్ విసిరారు.TSPSC పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యం - నిరుద్యోగుల గోస - అఖిలపక్ష పార్టీల భరోసా పేరిట కామారెడ్డిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో తుపాకుల రాజ్యం మళ్లీ వస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో మళ్లీ నక్సలిజం పుట్టుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్లీ తుపాకులు పట్టుకొని నక్సల్స్ సమాజంలో తిరుగుతారని వ్యాఖ్యానించారు. పేపర్ల లీకేజీ వల్ల 30 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 9 సంవత్సరాలలో ఉద్యోగాలు లేవని, కేసీఆర్‌కు చెందిన 40 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలంగాణలో అమలు కావడం లేదని.. ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందన్నారు. తెలంగాణ సమాజాన్ని లిక్కర్ రాజ్యంగా మార్చేశాడని మండిపడ్డారు..

ఎయిర్‌పోర్టు అధికారులను ఎవరు ప్రభావితం చేశారు?: పేర్ని నాని

తాడేపల్లి: ఎల్లో మీడియాపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. ఏదో విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

కాగా, పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి బరితెగించి వార్తలు రాస్తున్నాయి. కక్షపూరితంగా సీఎం జగన్‌ను అపఖ్యాతిపాలు చేయాలని చూస్తున్నారు. సీఎం జగన్‌పై దాడి ఘటనలో తప్పుడు వార్తలు రాస్తున్నారు. హత్యాయత్నం జరిగిందని ఎన్‌ఐఏ, పోలీసులు కూడా ఒప్పుకున్నారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసింది మా పార్టీ వ్యక్తే అని హడావిడిగా దాడి జరిగిన గంట వ్యవధిలోనే అప్పట్లో డీజీపీ చెప్పేశారు. దాడి జరిగిన తర్వాత కనీసం పరామర్శించకుండా విమర్శలు చేశారు. దాడి ఘటనపై ఇష్టానుసారం తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఎన్టీఆర్‌పై దాడి జరిగితేనే ఈనాడుకు పెద్దవార్త. సీఎం జగన్‌ కావాలని చేయించుకుంటున్నారంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు..

చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు మహానేత వైఎస్‌ఆర్‌ ఖండించారు. పటిష్ట భద్రత ఉన్న ఎయిర్‌పోర్టులోపలికి కత్తి ఎలా వచ్చింది?. హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై వెల్లడించాలని అప్పట్లో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ వేశారు. ఘటనపై విచారణ జరపాలని కోరడం తప్పా?. విశాఖ పోలీసులను ఎవరు ప్రభావితం చేశారు?. ఎయిర్‌పోర్టు అధికారులను ఎవరు ప్రభావితం చేశారు?. నిందితుడి గురించి విచారించకుండానే స్టేట్‌మెంట్లు ఇచ్చారు అని తెలిపారు..

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఉపశమనం!

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లో నమోదైన ఓ పరువునష్టం కేసు (Defamation Case)లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఉపశమనం లభించింది.

విచారణ క్రమంలో ప్రత్యక్ష హాజరు నుంచి కోర్టు ఆయనకు శాశ్వత మినహాయింపు ఇచ్చింది. తన న్యాయవాది ద్వారా రాహుల్‌ ఈ మేరకు దాఖలు చేసిన

దరఖాస్తును పరిశీలించిన భివండీ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లక్ష్మీకాంత్ సీ వాడికర్‌.. శాశ్వత మినహాయింపునకు రాహుల్‌ అర్హుడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జూన్‌ 3న ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నమోదు చేస్తామని తెలిపారు.

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్‌ యత్నించాడు : సీబీఐ

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అనుచరుడు ఉదయ్‌కుమార్‌ రెడ్డి ప్రయత్నించాడని సీబీఐ వెల్లడించింది..

ఉదయ్‌ రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక అంశాలను సీబీఐ పొందుపరిచింది.

''వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారు. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్‌ ప్రయత్నించాడు. హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్‌ తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజంతా ఎంపీ అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. హత్య జరిగిందని తెలిసిన వెంటనే ఆధారాల చెరిపివేతకు వారిద్దరూ అవినాష్‌ ఇంట్లోనే ఎదురుచూశారు.

అవినాష్‌కు శివప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చాడు. హత్య జరిగిన స్థలంలో అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్‌ రెడ్డితో కలిసి ఉదయ్‌ ఆధారాలు చెరిపివేశారనేందుకు సాక్ష్యాలున్నాయి. ఆ రోజు అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, భాస్కర్‌రెడ్డి,శివశంకర్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా గుర్తించాం. వారు అవినాష్ ఇంటి నుంచి వివేకా ఇంటికి వెళ్లినట్లు గుర్తించాం. విచారణకు ఉదయ్‌ సహకరించడం లేదు. పారిపోతాడనే ఉద్దేశంతోనే ముందస్తుగా అరెస్టు చేశాం. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది '' అని సీబీఐ పేర్కొంది.

కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ ఏర్పాటు చేస్తుంది : కెసిఆర్

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉంది.అయితే ఇప్ప‌టి నుంచి రాజ‌కీయ రంగం సిద్ధ‌మ‌వుతున్న తీరు యావ‌త్ దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ వేడిని పెంచింది. ఈసారి లోక్‌సభ ఎన్నికలు బీజేపీ వర్సెస్ మహాకూటమి మధ్యే జరుగుతాయని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూల ఐక్యత ప్రయత్నాల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పెద్ద ఎత్తున ప్రకటన చేశారు. కేసీఆర్‌ను నమ్మితే కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఆయన పార్టీ భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేస్తుంది.

వెలుగుకు ఒక్క నిప్పురవ్వ చాలు - కేసీఆర్

అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో దేశంలోనే అత్యంత ఎత్తైన (125 అడుగుల) బాబా సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తూ 2024 లోక్ తర్వాత కేంద్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. సభ ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తోందని, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కూడా ఇదే విధమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చే ప్రభుత్వం మనది, మనది మరియు మనది మాత్రమే అని ఆయన అన్నారు. దీన్ని మన శత్రువులు కొందరు జీర్ణించుకోలేరు. కానీ కాంతి కోసం ఒక స్పార్క్ సరిపోతుంది.

బీఆర్‌ఎస్ వచ్చాక దేశం మొత్తం మీద దళిత బంధు పథకం అమలవుతుంది – కేసీఆర్

తమ పార్టీ అధికారంలోకి వస్తే దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. 2021 సంవత్సరంలో ప్రారంభించిన 'దళిత బంధు యోజన'లో, షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు వ్యాపారం ప్రారంభించడానికి 10 లక్షల రూపాయలను 100 శాతం గ్రాంట్‌గా అందించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకం కింద ఇచ్చిన గ్రాంట్లు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.

ప్రతిపక్షాల ఐక్యతకు పెద్ద అడ్డంకి

రెండు రోజుల క్రితం ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ల సమావేశం జరిగినప్పుడు కేసీఆర్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ సమావేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయాలని తీర్మానం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన ఈ ప్రకటన విపక్షాల ఐక్యతకు పెద్ద అడ్డంకిగా కనిపిస్తోంది.

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

పిల్లలకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

నేడు (శనివారం) వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి.

టోకెన్ లేని భక్తుల స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది.

శుక్రవారం 66,310 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Bus Accident: లోయలో పడిన బస్సు.. 13 మంది మృతి, 25 మందికి పైగా గాయాలు

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా..25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.

పూణేలోని పింపుల్ గురవ్ నుంచి గోరెగావ్‌కు బస్సు వెళ్తుండగా పూణె-రాయ్‌గఢ్ సరిహద్దులో తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు.. 16న విచారణకు రావాలంటూ..

మద్యం కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సమన్లు పంపినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు..