/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Hyderabad: నడిరోడ్డుపై దారుణం.. మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పు..! Yadagiri Goud
Hyderabad: నడిరోడ్డుపై దారుణం.. మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పు..!

రాజేంద్రనగర్‌: హైదరాబాద్‌ శివారు అత్తాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది.

ఓ మహిళపై దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.

నడిరోడ్డుపై ఈ ఘటన జరిగింది..

తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయిన మహిళను స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలిని అత్తాపూర్‌కి చెందిన శివానిగా గుర్తించారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

నీట్ పరీక్షకు ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

దేశవ్యాప్తంగా నీట్ ఏప్రిల్ 6 తో ముగిసిన దరఖాస్తుల గడువు అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం నీట్ దరఖాస్తులకు తుది గడువు పొడిగింపు జాతీయ స్థాయిలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల తుది గడువును మూడ్రోజులు పెంచారు. వాస్తవానికి నీట్ దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 6 తోనే ముగిసింది.

అయితే, పలు సమస్యల వల్ల సకాలంలో దరఖాస్తు చేయలేకపోయామని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకు నీట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది.

ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని వెల్లడించింది. అటు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ అప్లికేషన్లలో పొరపాట్లను సవరించుకునేందుకు ఎన్టీఏ తాజాగా కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకువచ్చింది.

నీట్... ఇలా...

దేశవ్యాప్తంగా మే 7 న నీట్ పరీక్ష...

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష

మొత్తం 13 భాషల్లో నీట్

తెలుగులోనూ నీట్ రాసే వెసులుబాటు

పెన్ను, పేపర్ విధానంలో పరీక్ష

ఎన్టీఏ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల సమాచారం

మొత్తం 499 నగరాలు, పట్టణాల్లో నీట్ పరీక్ష నిర్వహణ

ఎంబీబీఎస్ , డెంటల్ కోర్సు, ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, ఆయుష్‌లోని వెజిటేరి కోర్సులు,(ICAR) అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ కమ్యూనిటీ సైన్స్, పారామెడికల్ మరియు నర్సింగ్ కోర్సులకు B.Sc అల్లైడ్ కొర్స్, ఫోజీయోతెరఫి ఇంజనీరింగ్ కొర్స్ అడ్మిషన్లు జరుగుతున్నాయి.

సీపీ రంగనాథ్‍ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. బండి సంజయ్ హెచ్చరిక..!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లిని చూడకుండా చేశాడని గుర్తు చేశాడు. కేసీఆర్ కుటుంబ విలువలు తెలుసుకోవాలన్నారు.

తెలంగాణలో నిరుద్యోగం తప్పా ఇంకేమి లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై లాఠీ చార్జ్ చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నాడని విమర్శించారు. తనపై కావాలానే కేసు పెట్టారని చెప్పారు.

రాత్రి 12:30 గంటలకు ఉప్పల్ నుంచి మెట్రో రైలు..

తన ఫోన్ ను ఎవరు ఎత్తుకు పోయారని చెప్పారు. పోలీసులే తన మొబైల్ దొంగిలించారని ఆరోపించారు. ప్రశాంత్ వాట్సాప్ చేస్తే తాను సాయంత్రం 5 గంటలకు చూసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటలకే అయిపోయిందన్నారు.

అటు హనుమకొండ సీపీ రంగనాథ్ పై కూడా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. రంగనాథ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రంగనాథ్ విజయవాడ, ఖమ్మం, వరంగల్ లో ఏ దందాలు చేశాడో తెలుసన్నారు. వాటన్నింటిని బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు.

బానిసత్వ కుల వ్యవస్థ ను నిర్మూలించిన మహనీయునికి నివాళి

భారతదేశంలో బ్రిటిష్ వాడి ఆధిపత్యం రెండువందల యేళ్ల పాటు సాగింది. ఈ విశాల భారత దేశంలోని భూమిపుత్రులను బానిసలుగా మార్చి నిరంకుశ వలస పాలనను వారు కొనసాగించారు. ఈ దేశపు ప్రజలను పీడిస్తున్న మరో తరహా బానిసత్వం కుల వ్యవస్థ పేరుతో మొదలయింది. రెండువేల యేళ్ల క్రితం ప్రారంభమై నేటికీ అది కొనసాగుతున్నది. బ్రిటిష్ వాడు రుద్దిన బానిసత్వాన్ని రద్దు చేయడానికి షహీద్ భగత్ సింగ్, గాంధీ, నెహ్రూ.. అమరులెందరో ఉద్యమిస్తే.. మనువాద గులాంగిరీని రద్దు చేయడానికి ఆధునిక భారత చరిత్రలో తొట్టతొలిగా ఉద్యమించిన మహనీయుడు జ్యోతిబా ఫూలే. ఆ స్వాతంత్ర్య ఉద్యమనేత గాంధీ మహాత్ముడైతే.. ఈ స్వాతంత్ర్య ఉద్యమ నేత ఫూలే సైతం నిస్సందేహంగా మహాత్ముడే!

జ్యోతిరావు గోవిందరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించాడు. నాటి పీష్వా రాజుల దగ్గర జ్యోతిరావు కుటుంబం పూలమాలలు కట్టి అమ్మే వృత్తిని కొనసాగించిన కారణంగా ఫూలే అనే పేరు వచ్చింది. వెనుకబడిన 'మాలి' కులానికి చెందిన ఆయన కుల కట్టుబాట్ల కారణంగా చిన్ననాటి నుంచే అవమానాలను ఎదుర్కొన్నాడు. యుక్త వయస్సులో ఒక బ్రాహ్మణ మిత్రుని పెళ్లికి హాజరైన జ్యోతిరావును పెళ్లికొడుకు బంధువులు కులం పేరుతో అవమానించి పెళ్లి ఊరేగింపు నుంచి గెంటివేశారు. ఆ అవమానంతో రగిలిపోయిన ఫూలే కులాధిపత్యాన్ని నిర్మూలించడానికి అవిశ్రాంత పోరాటం కొనసాగించాలని ప్రతినబూనాడు. శూద్రులు, అతిశూద్రులపై అగ్రవర్ణాల వారు కొనసాగిస్తున్న దురాగతాలను నిరోధించడానికి ఫూలే 1873 సెప్టెంబరు 24న 'సత్య శోధక్ సమాజ్' ను స్థాపించాడు. మెజారిటీగా ఉన్న నిమ్న వర్గాల ప్రజలను కుల దోపిడీ నుంచి విముక్తి చేయడంతోపాటు రైతులు, కూలీలను తమ హక్కుల కోసం సంఘటితపరిచేందుకు ఈ సంస్థ ద్వారా ఫూలే విశేషంగా కృషి చేశాడు.

ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని కృత్రిమ కుల వ్యవస్థను సృష్టించి, దేశంలోని మెజారిటీ వర్గాలను ఆర్థికంగా సామాజికంగా అణచివేసిన స్వార్థపర వర్గాల దోపిడీని జీవితాంతం వ్యతిరేకించి పోరాడిన మహానుభావుడు ఫూలే. ఆయన నడిపిన పోరాటాల స్ఫూర్తిని నేటి తరానికి అందించే ఒక మహత్తర సాధనంగా ఆయన రచన "గులాంగిరీ" నేటికీ నిలిచి ఉన్నది. ఈ దేశపు వెనుకబాటుతనానికి ప్రధాన కారణమైన కుల వ్యవస్థ నికృష్ట స్వభావం గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం "గులాంగిరీ". కాలాన్ని ఎదిరించి ఘనీభవించిన ఫూలే మూర్తి.. ఆయన రాసిన గులాంగిరీ పుస్తకంలో మనకు ప్రత్యక్షమౌతుంది. నేటి కాలంలో మనం చేపట్టాల్సిన సామాజిక న్యాయ పోరాటాలను ఎలా కొనసాగించాలో, దగ్గర కూచోబెట్టుకుని మనకు నేర్పుతుంది.

సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే భాషలో.. ఉద్యమ సహచరుడు దోండిబా మరియు ఫూలేల మధ్యన సంభాషణల రూపంలో గులాంగిరీ పుస్తకం కొనసాగుతుంది. ఈ దోండిబా ఎవరో కాదు.. ఫూలే ను హత్య చేయించడానికి పూణే బ్రాహ్మణులు సుపారి ఇచ్చి కుదుర్చుచున్న కిరాయి హంతకుడు! ఓ అర్థరాత్రి వేళ దోండిబా ఫూలేను చంపడానికి ఆయన ఇంట్లో దూరాడు. అలికిడికి నిద్ర లేచిన ఫూలే దోండిబాను నిలదీసాడు. నిన్ను చంపడానికి బ్రాహ్మణులు డబ్బులు ఇచ్చారని దోండిబా తెలుపగా.. నా చావుతో నీ ఆకలి తీరుతుందనుకుంటే.. అలానే కానియ్యి అని ఫూలే సమాధానమిచ్చాడు. "మీ నిమ్నవర్గాల పిల్లలకు మేము చదువులు చెప్పడమే.. బ్రాహ్మణుల కోపానికి కారణమయిందని తెలుసుకో.." అని ఫూలే తెలపడంతో దోండిబా తన తప్పును గ్రహించి.. హత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. క్రమక్రమంగా ఫూలే ఉద్యమ సహచరుడయ్యాడు.

బ్రాహ్మణుల ఆధిపత్యానికి దారులు వేసిన పురాణాల బండారాన్ని ఫూలే తన గులాంగిరీ పుస్తకంలో అందరికీ అర్ధమయ్యే రీతిలో విశదీకరిస్తాడు. బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుండి జన్మించారనే కథనం పై వ్యాఖ్యానిస్తూ.. మగ వ్యక్తి ముఖం నుండి వారు పుట్టడమే నిజమైతే.. ఎవరి స్తన్యం తాగి పెరిగినట్టు? అని ఫూలే ప్రశ్నిస్తాడు. ఫూలే ప్రయోగించిన తార్కిక వాదనలతో బ్రాహ్మణులు సృష్టించిన కృత్రిమ కథనాలు దూది పింజల్లా తేలిపోతాయి.

దురదృష్టవశాత్తూ ఆ మహాత్ముడికి దక్కాల్సిన గుర్తింపు, గౌరవం నేటికీ దక్కడం లేదు. తెలంగాణాకు ఫూలేకు సంబంధమేమిటి.. తెలంగాణలోని బీసీ గురుకులాల పేరులో నుంచి మహాత్మ జ్యోతిరావు ఫూలే పేరును తొలగించాలని.. ఆ మధ్య ఒక బీసీ నేత డిమాండు చేసారు. ఇక అగ్రవర్ణాల వారైతే.. ఫూలేను చులకన చేస్తూ, ఆయనొక బ్రాహ్మణ వ్యతిరేకి అంటూ కొట్టిపారేస్తున్నారు. ఫూలే జీవితం గురించి తెలిసిన వారెవరైనా.. ఆయన బ్రాహ్మణులనే కాదు, ఏ వర్గం వారినీ ద్వేషించలేదని అర్థం చేసుకుంటారు. ఆ రోజుల్లో.. ఒక బ్రాహ్మణ వితంతువు గర్భవతి కాగా ఆనాటి సమాజం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు ఒడిగట్టిన వేళ.. ఫూలే దంపతులు ఆమెకు తమ ఇంటిలో ఆశ్రయం కల్పించారు. ఆమెకు కలుగబోయే బిడ్డను తామే పోషిస్తామని భరోసా ఇచ్చి, ఆమెకు పుట్టిన బిడ్డను పూలే దంపతులు దత్తత తీసుకొని తమ బిడ్డగా స్వీకరించి పెంచి పెద్ద చేసారు. ఆ బిడ్డ పేరే యశ్వంతరావు ఫూలే! ఒక శూద్ర మాలి కుటుంబానికి వారసుడయిన ఒక బ్రాహ్మణ బిడ్డ! "నిఖిలలోకమెట్లు నిర్ణయించిన గాని.. తరుగులేని విశ్వనరుడ నేను!" అంటూ మొన్న మొన్న జాషువా కవి అన్న మాటలను.. ఆనాడే తన జీవితాచరణ ద్వారా నిరూపించిన మహాత్ముడు ఫూలే! ఆయన జీవితము, సత్య శోధక సమాజ ఉద్యమము ఆయన రచనలూ.. నేటి కాలంలో మన దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరైన పరిష్కారాన్ని చూపుతాయి.

మాక్‌డ్రిల్‌తో అప్రమత్తమైన భారత్‌.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో గత మూడు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం..

24 గంటల వ్యవధిలో 5,676 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో పంజాబ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ లో ముగ్గురు చొప్పున, కేరళలో ఇద్దరు, గుజరాత్‌, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,000కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 37,093 యాక్టివ్‌ కేసులు ఉండగా, కేరళలో 13,745, మహారాష్ట్రలో 4,667, ఢిల్లీ- 2,338, తమిళనాడు- 2,099, గుజరాత్‌- 1,932, హరియాణా - 1,928, కర్ణాటక - 1,673, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 1,282 కేసులు ఉన్నాయి. ఇక మిగిలిన ఇతర రాష్ట్రాల్లో వెయ్యికి లోపే కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది..

TDP Vs YCP: ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. బాపట్లలో ఆసక్తికర రాజకీయం..

బాపట్ల: అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. దళితులు, మైనార్టీల అభివృద్ధిపై చర్చకు రావాలంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు (Former minister Nakka Anandbabu) విసిరిన చాలెంజ్‌ను మంత్రి మేరుగ నాగార్జున (Minister meruga Nagarjuna) స్వీకరించారు.

వేమూరులో అభివృద్ధిపై, సంక్షేమంపై చర్చకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. ఒక్కడే వచ్చిన సరే, చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కొడుకును తెచ్చుకున్న సరే అని... తాను మాత్రం ఒక్కడినే వస్తానని అన్నారు. ఛాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి మేరుగ స్పష్టం చేశారు.

దళితులు, మైనారిటీ సంక్షేమం - దాడులపై చర్చిద్దామని మంత్రికి నక్కా ఆనందబాబు (TDP Leader) సవాల్ విసిరారు. దమ్ముంటే మంత్రి మేరుగ నాగార్జున (AP Minister) చర్చకు రావాలన్నారు. మంత్రి మేరుగ చేసిన దాడులు, దోపిడీ, మోసాలు నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. ఇద్దరం సాంఘిక సంక్షేమశాఖకు మంత్రులుగా చేశామని, ఎవరెవరు ఏమేం చేశామో చర్చిద్దామా అంటూ టీడీపీ సవాల్ విసిరారు..

కాగా టీడీపీ (TDP) అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇసుక, మట్టి అడ్డగోలుగా దోచేశాడంటూ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసని, నియోజకవర్గంలో జగన్‌ అన్న కాలనీల్లో ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. మట్టి తవ్వకాలకు పంచాయతీ తీర్మానాలు, కలెక్టర్ అనుమతులు ఉన్నాయని చెప్పారు. నక్కా ఆనందబాబు అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు..

IPL 2023 Records: ఐపీఎల్‌ 2023లో సూపర్ స్టార్లుగా మారిన ప్లేయర్లు వీళ్లే.. ఈ సీజన్ ఆణిముత్యాలు

•ఐపీఎల్ ఎందరో ప్లేయర్లకు జీవితాన్ని ఇచ్చింది. ఒక్క ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే సూపర్ స్టార్లుగా మార్చింది. ప్రతి సీజన్‌లో ఒకరిద్దరు...

రింకూ సింగ్

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ సృష్టించిన విధ్వంసం ఐపీఎల్ చరిత్రలో ఎన్నటికీ మరువలేనిది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరమైన దశలో.. వరుసగా 5 సిక్సర్లు కొట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. రింకూ సింగ్ ఇలానే ఆడితే ఫినిషర్‌గా టీమిండియా తలుపు తట్టే అవకాశం ఉంది.

సుయాష్ శర్మ

కోల్‌కతా నైట్ రైడర్స్ లెగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. 19 ఏళ్ల సుయాష్‌.. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఒక్క ఫస్ట్ క్లాస్ గేమ్ కూడా ఆడకుండానే తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో సూపర్‌గా బౌలింగ్ చేశాడు.

సాయి సుదర్శన్

గుజరాత్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన మరో ఆణిముత్యం. 21 ఏళ్లలోనే తన బ్యాట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. సుదర్శన్ ఇప్పటికే 3 మ్యాచ్‌లలో 137 పరుగులు చేశాడు.

తిలక్ వర్మ

ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్‌ తిలక్ వర్మ ఐపీఎల్ 2023ను అద్భుతంగా ప్రారంభించాడు. మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అజేయంగా 84 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. 20 ఏళ్ల తిలక్ వర్మ హైదరాబాద్ తరపున 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ముంబై ఇండియన్స్‌కు కీలక బ్యాట్స్‌మెన్‌గా మారిపోయాడు.

యశస్వి జైస్వాల్

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ అవతలి ఎండ్‌లో ఉన్నా.. వేగంగా పరుగులు చేస్తూ బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. జైస్వాల్ 3 మ్యాచ్‌లలో 2 అర్ధశతకాలు బాది.. 164.47 స్ట్రైక్ రేట్‌తో 125 రన్స్ చేశాడు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దక్కించుకుంటాం : సీఎం కేసీఆర్

భారత రాష్ట్ర సమితి పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇరుగు పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు చూస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో సంగతి ఎలా ఉన్నా కానీ తెలుగు రాష్ట్రము, పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మరింత గట్టిగ ఫోకస్ చేయాలనీ పార్టీ నిర్ణయించింది.

ఈ మేరకు ప్రముఖ కాపు నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. రావెల కిషోర్ బాబు, మరికొందరు నాయకులను చేర్చుకుని ముందుకుపోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ ఏ కారణం.. ఎలాంటి వేదిక.. ఒక బలమైన అంశాన్ని పట్టుకుని కదా ఆంధ్రాలో వేళ్లూనుకోవాలి.. దానికి ఇప్పటికి ఓ అవకాశం దొరికింది.

కేంద్రం ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని నిర్ణయించింది. దాన్ని అలాగే ఉంచండి, అని రాష్ట్రప్రభుత్వం పలుమార్లు కోరినా కేంద్రం వినడం లేదు. అమ్మేద్దాం.. ఎలా ఉన్నాసరే వదిలించు కుంటామని కేంద్రం చెబుతోంది. ఈమేరకు అంతర్జాతీయ బిడ్లు ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. అయితే సరిగ్గా ఈ అంశం కేసీఆర్‌కు అవకాశంగా దక్కిందని అంటున్నారు. కేంద్రం అమ్మేయాలనుకుంటున్నా ఉక్కు విశాఖ ఉక్కును తాము సైతం బీడ్లు వేస్తామని వేలం లో ఉక్కు కంపెనీ దక్కించుకుంటామని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఈమధ్య కేటీఆర్ సైతం ఉక్కును అమ్మేయొద్దని ప్రైవేటికరణ చేయొద్దని కేంద్రాన్ని కోరారు. సింగరేణి సంస్థ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టేందుకు కేసీఆర్ చూస్తున్నారు...

Cell Phone Down Day: ఉద్యోగుల ఉద్యమం.. రేపు సెల్‌ఫోన్‌ డౌన్‌..

Cell Phone Down Day: తమ డిమాండ్ల సాధన కోసం మలిదశ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. అందులో భాగంగా రేపు సెల్ ఫోన్‌ డౌన్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు..

ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ఏపీజేఏసీ రాష్ట్రకమిటి ఇచ్చిన మలిదశ ఉద్యమ కార్యచరణలో భాగంగా.. ఈనెల 11న మంగళవారం ఒక్కరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ ఫోన్ వినియోగించకుండా ఉద్యోగులలో ఉన్న ఆవేదనను, నిరసనను ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ సెల్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు..

అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

సిరిసిల్లా జిల్లాలో మంత్రి కేటీఆర్‌ ఈరోజు పర్యటించారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్‌ అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్మూనిటీ భవన్‌, రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురి నుంచి వినపత్రాలు స్వీకరించిన మంత్రి కేటీఆర్‌, యువకులతో కలిసి సెల్ఫీలు దిగారు.

లక్ష్మీపూర్‌లో పల్లె దవాఖానను ప్రారంభించిన తర్వాత పాపయ్యపల్లె చేరుకుంటారు. రూ.26 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. గోపాల్‌రావుపల్లె, మండెపల్లిలో అంబేద్కర్‌ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తంగళ్లపల్లిలోని పీహెచ్‌సీలో ఫిజియోథెరపీ సేవలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు గండిలచ్చపేటకు చేరుకుంటారు. గ్రామంలో అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిరావుఫూలే విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తర్వాత కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించనున్నారు.

దళితబంధు పథకం కింద మంజూరైన పౌల్ట్రీఫాంను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుంటారు. మండలంలోని దుమాల గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత చిట్టివాగుపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అనంతరం రూ.10 లక్షలతో నిర్మించిన గౌడ సంఘ భవనం, రూ.10 లక్షలతో మహిళా సంఘ భవనం, చిట్టివాగుపై రూ.4 కోట్లతో నిర్మించిన వంతెన ప్రారంభిస్తారు.

యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లన్న పట్నాలకు హాజరు కానున్నారు. అక్కడి నుంచి 3.30 గంటలకు బుగ్గరాజేశ్వర తండా చేరుకొని రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.9.60లతో నిర్మించిన గిరిజన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాచర్ల గుండారంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 5 గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాలలో అంబేద్కర్‌ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.