/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం.. Yadagiri Goud
పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..

హైదరాబాద్: పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆమె.. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు.

మరో మూడు బిల్లులకు మాత్రం ఆమోద ముద్ర వేశారు. ఇంకా రెండు బిల్లులను పెండింగ్‌లోనే ఉంచారు. 

కాగా.. పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఈ పంచాయితీని తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ పిటిషన్‌పై నేడే(సోమవారం) విచారణ జరగనుంది.

చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది..

Air India: సిబ్బందిపై ప్రయాణికుడి దాడి.. విమానం వెనక్కి..!

దిల్లీ: విమానాల్లో ప్రయాణికులు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఈ మధ్య తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఎయిరిండియా (Air India) విమానంలో ఓ ప్రయాణికుడు (unruly passenger) సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించాడు..

దీంతో అతడిని దించేయడం కోసం విమానం మళ్లీ వెనక్కి వచ్చింది. దిల్లీ నుంచి లండన్‌ (Delhi-London flight) బయల్దేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

సోమవారం ఉదయం దిల్లీ (Delhi Airport)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 225 మంది ప్రయాణికులతో ఓ ఎయిరిండియా విమానం (Air India Flight) లండన్‌ బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడ్డాడు. దీంతో పైలట్‌ విమానాన్ని వెనక్కి మళ్లించారు. మళ్లీ దిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేసి ఆ ప్రయాణికుడిని దించేశారు. ఘటన నేపథ్యంలో ఈ విమానం ఆలస్యమైంది..

ఘటనపై ఎయిరిండియా (Air India) స్పందించింది. ''దిల్లీ నుంచి లండన్‌ బయల్దేరిన ఏఐ 111 విమానం.. ప్రయాణికుడి అభ్యంతరకర ప్రవర్తన (Unruly Behaviour) కారణంగా కాసేపటికే వెనక్కి రావాల్సి వచ్చింది. మాటలతో, రాతపూర్వకంగా హెచ్చరించినా ఆ ప్రయాణికుడు వినిపించుకోలేదు సరికదా.. ఇద్దరు క్యాబిన్‌ సిబ్బందిని గాయపర్చాడు. దీంతో విమానాన్ని దిల్లీకి మళ్లించాలని పైలట్‌ నిర్ణయించారు. ల్యాండ్‌ అయిన తర్వాత అతడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం'' అని ఎయిరిండియా తన ప్రకటనలో వెల్లడించింది. విమానంలోని ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం, వారి మర్యాదను కాపాడటం తమకు అత్యంత ప్రాధాన్యమని ఎయిర్‌లైన్ తెలిపింది. ఈ ఘటనతో ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నట్లు పేర్కొంది. విమానాన్ని మధ్యాహ్నానికి రీషెడ్యూల్‌ చేసినట్లు

వెల్లడించింది.

ఇటీవల ప్రయాణికుడి మూత్ర విసర్జన ఘటనతో ఎయిరిండియా తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే. విమానంలో ప్రయాణికుల ప్రవర్తనపై పెద్ద చర్చే జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను ఎదుర్కొనేందుకు ఎయిరిండియా తమ సిబ్బందికి కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది..

Jupalli Krishna Rao: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం సంతోషంగా ఉంది..

హైదరాబాద్: బీఆర్ఎస్‌ పార్టీ (BRS Party) నుంచి తనను సస్పెండ్ (Suspend) చేసినందుకు చాలా ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు.

ఈ సందర్భంగా సోమవారం ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌ (Old MLA Quarters) దగ్గర మీడియాతో మాట్లాడుతూ పంజరంలో నుంచి బయటపడినట్లు ఉందన్నారు.

దొరలగడీ నుంచి బయటకు వచ్చానని, పార్టీ సభ్యత్వం చేస్తామంటే కూడా పుస్తకాలు ఇవ్వలేదన్నారు. తనను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పాలన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ బండారం బయటపడుతుందనే తనను సస్పెండ్ చేశారని జూపల్లి కృష్ణారావు అన్నారు..

నేటి నుండి 14 వరకు ఉస్మానియా అరుణతార,ఇండియన్ చేగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభలను జరపండి

•కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభల పోస్టర్స్ ఆవిష్కరణ.. PDSU

విప్లవ విద్యార్థి నాయకుడు,ఊస్మానియా అరుణతార,ఇండియన్ చేగువేరా,యువ మేధావి,ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ PDSU వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభల పోస్టర్ ను నల్లగొండ పట్టణంలోని గాందీ నగర్ ఎస్.సీ హాస్టల్ లో PDSU నేతలు ఆవిష్కరణ చేశారు..

ఈ సందర్భంగా,PDSU నల్లగొండ జిల్లా కార్యదర్శి పోలె పవన్,జిల్లా నాయకుడు ఇందూరు మధులు పాల్గొని మాట్లాడుతూ..,ఉస్మానియా అరుణతార,హైదరాబాద్ చేగువేరా జార్జిరెడ్డి 51వ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 10 నుండి 14 వరకు దేశవ్యాప్తంగా జరిగే జార్జి వర్ధంతి సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 70 వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో పేరుకుపోయిన మతఛాందస వాదాన్ని, దుర్మార్గపు ఆదిపత్యాన్ని, దునుమాడిన అగ్నికణం జార్జిరెడ్డి అని కొనియడారు."జీనా హైతో మరణ సీఖో-కదం కదం ఫర్ లడనా సీఖో నినాదం" తో విద్యార్థుల సమస్యల పై సమర శంఖం పూరించాడని అన్నారు.

జార్జిరెడ్డిని అంతమొందించిన మతోన్మాదం నేడు రాజ్యమేలుతూ

విద్యార్థుల, ప్రజల కనీస హక్కులను కాలరాస్తుందని, విద్య కాషాయీకరణ చేయడానికి, తద్వారా మేధావులను తయారు చేసే విద్యావిధానంలో మూఢత్వాన్ని నింపడానికి కుట్రపన్నుతున్నారని,అందులో భాగంగానే NEP-2020 ని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది అన్నారు.ఈ విధానాలకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థి లోకం ఈ కుట్రలను సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ పోతున్నారని, సామాన్యులు జీవించలేని స్థితి కి నెట్టబడ్డారని పేర్కొన్నారు.

విద్యార్థులను మూడత్వంలో ముంచి విద్య కాశాయికరిస్తే తప్పేంటని నగ్నంగా మాట్లాడన్నారని, భూత విద్య కోర్స్ ప్రవేశ పెట్టుతున్నారని అన్నారు.నేడు జార్జిరెడ్డి ని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే, ప్రభుత్వ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమేనని అన్నారు. విద్యార్థి, యువతరం జార్జిస్పూర్తితో కదం తొక్కాలని పిలుపునిచ్చారు,. జార్జి మరణించిన జార్జి ఆలోచనలు రాష్ట్ర,దేశ విద్యార్థి లోకానికి వెలుగు దారి చూపుతూ ఉంటాయని, విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో జార్జిరెడ్డి సదా బతికే ఉన్నాడని, జార్జి వారసత్వం తో మనమంతా ప్రగతిశీల భావాలతో పోరాడాలని వారు పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి 51 వ వర్ధంతి సభలను దేశ వ్యాప్తంగా జయప్రదం చెయ్యాలని కోరారు. ఏప్రిల్ 10 నుండి 14 వరకు జరిగే జార్జిరెడ్డి సభలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో PDSU నాయకులు ఎమ్.సిద్దు.బి.సతీష్,డి.వాసు,ఆర్.కిట్టు,ఏ.శ్రీకాంత్,ఎస్.రాజు,పరమేశ్వర్,ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

కోడి కత్తి కేసులో కీలక పరిణామం-మినహాయింపు కోరిన జగన్ ...

ఇవాళ జరిగే విచారణకు సీఎం జగన్ హాజరయ్యేలా చూడాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు గతంలో ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు ఇచ్చింది.

అయితే చివరి నిమిషంలో ఈ కేసు విచారణకు తాను హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ ఎన్ఐఏ కోర్టును కోరారు.

ఈ మేరకు ఆయన న్యాయవాదితో కోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో కోర్టు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. కోడి కత్తి కేసులో ఇప్పటివరకూ సీఎం జగన్ వాంగ్మూలం నమోదు చేయకపోవడంపై ఎన్ఐఏ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

BRS: భారాస నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్‌

హైదరాబాద్‌: భారాస నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది..

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

TS News.. : నాలుగు రోజులు మంటలే!

సాధారణం కన్నా 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతల పెరుగుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది..

ఈ నాలుగు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో పెరుగుదల ఉంటుందని, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

పలు జిల్లాలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది. సోమవారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, 11న ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ, 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది.

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,

సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ లను

ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇందుకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా రేపు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సిఎస్ శాంతి కుమారిని సీఎం గారు ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్నింటినీ ప్రారంభించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

భానుడి భగభగలు.. ఐదు రోజులు భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..

ఎండల తీవ్రత పెరుగుతున్నది. దాంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో వైపు రాగల ఐదురోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకురావొద్దని తెలిపింది. ఏప్రిల్‌- జూన్‌ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణ భారత దేశంలో ఎండలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ పేర్కొంది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది.

బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగే అవకాశం ఉందని, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు. అయితే, ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా భూతాపం పెరిగిపోతున్నది. దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో భారత్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. 1901 తర్వాత ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి వెల్లడించింది. పశ్చిమ ప్రాంతాల మీదుగా వీచిన గాలుల మూలంగా మార్చి నెలలో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైందని, . దీంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అదుపులోకి వచ్చాయని వివరించింది.

తెలంగాణలో కూరగాయల సాగుకు భారీ ప్రణాళికలు

తెలంగాణలో పెద్ద ఎత్తున కూరగాయల సాగు కోసం భారీ ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం

రంగారెడ్డిలో ఏటా 28 వేల ఎకరాల్లో 34 వేల మెట్రిక్ టన్నుల కూరగాయల పంటలు సాగవుతుండగా, వికారాబాద్ లో 20 వేల ఎకరాల్లో ఏటా 25 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. సంగారెడ్డిలో 12 వేల ఎకరాల్లో 13 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు సాగు చేస్తున్నారు.

ప్రతి రోజు హైదరాబాద్ నగరానికి వచ్చే కూరగాయలు ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి వంటి పరిసర ప్రాంతాల నుండి వస్తాయి. అయితే డిమాండ్ సప్లై లో 50 శాతం అంతరం ఉండటంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి, మరింతగా కూరగాయల సాగును పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్దం చేసింది.

రంగారెడ్డిలో ఏటా 28 వేల ఎకరాల్లో 34 వేల మెట్రిక్ టన్నుల కూరగాయల పంటలు సాగవుతుండగా, వికారాబాద్ లో 20 వేల ఎకరాల్లో ఏటా 25 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. సంగారెడ్డిలో 12 వేల ఎకరాల్లో 13 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు సాగు చేస్తున్నారు.

ఉద్యానవన శాఖ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డిలో 74,000 ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతుంది. అయితే హైదరాబాద్ అవసరాలు తీరాలంటే 1.51 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగుచేయాల్సి ఉంది.

కూరగాయల పంటల ఉత్పత్తిని పెంచేందుకు ఉద్యానవన శాఖ జీడిమెట్ల, ములుగు ప్రాంతాల్లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు చర్యలు తీసుకుంటోంది. అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంలో రైతులకు సహాయం చేస్తున్నది. రైతులకు 5,000 నుండి 10,000 నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తోంది.

రంగారెడ్డిలో యాచారం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో అత్యధికంగా కూరగాయలు సాగవుతున్నాయి. అలాగే ప్రస్తుతం రంగారెడ్డి సహా రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. అదేవిధంగా 30 వేల ఎకరాల్లో పూలు సాగు కావాల్సి ఉండగా 10 వేల ఎకరాల్లో సాగవుతోంది.