/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణలో కూరగాయల సాగుకు భారీ ప్రణాళికలు Yadagiri Goud
తెలంగాణలో కూరగాయల సాగుకు భారీ ప్రణాళికలు

తెలంగాణలో పెద్ద ఎత్తున కూరగాయల సాగు కోసం భారీ ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం

రంగారెడ్డిలో ఏటా 28 వేల ఎకరాల్లో 34 వేల మెట్రిక్ టన్నుల కూరగాయల పంటలు సాగవుతుండగా, వికారాబాద్ లో 20 వేల ఎకరాల్లో ఏటా 25 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. సంగారెడ్డిలో 12 వేల ఎకరాల్లో 13 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు సాగు చేస్తున్నారు.

ప్రతి రోజు హైదరాబాద్ నగరానికి వచ్చే కూరగాయలు ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి వంటి పరిసర ప్రాంతాల నుండి వస్తాయి. అయితే డిమాండ్ సప్లై లో 50 శాతం అంతరం ఉండటంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి, మరింతగా కూరగాయల సాగును పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్దం చేసింది.

రంగారెడ్డిలో ఏటా 28 వేల ఎకరాల్లో 34 వేల మెట్రిక్ టన్నుల కూరగాయల పంటలు సాగవుతుండగా, వికారాబాద్ లో 20 వేల ఎకరాల్లో ఏటా 25 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. సంగారెడ్డిలో 12 వేల ఎకరాల్లో 13 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు సాగు చేస్తున్నారు.

ఉద్యానవన శాఖ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డిలో 74,000 ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతుంది. అయితే హైదరాబాద్ అవసరాలు తీరాలంటే 1.51 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగుచేయాల్సి ఉంది.

కూరగాయల పంటల ఉత్పత్తిని పెంచేందుకు ఉద్యానవన శాఖ జీడిమెట్ల, ములుగు ప్రాంతాల్లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు చర్యలు తీసుకుంటోంది. అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంలో రైతులకు సహాయం చేస్తున్నది. రైతులకు 5,000 నుండి 10,000 నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తోంది.

రంగారెడ్డిలో యాచారం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో అత్యధికంగా కూరగాయలు సాగవుతున్నాయి. అలాగే ప్రస్తుతం రంగారెడ్డి సహా రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. అదేవిధంగా 30 వేల ఎకరాల్లో పూలు సాగు కావాల్సి ఉండగా 10 వేల ఎకరాల్లో సాగవుతోంది.

PM Modi: బండీపుర టైగర్‌ రిజర్వును సందర్శించిన మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలోని బండీపుర టైగర్‌ రిజర్వును సందర్శించారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడిస్తూ టైగర్‌ రిజర్వుకు చెందిన పలు ఫొటోలను ట్విటర్లో పంచుకొన్నారు..

''రమణీయమైన బండీపుర టైగర్‌ రిజర్వులో నేటి ఉదయం గడిపాను. భారత దేశ ప్రకృతి సౌందర్యాన్ని, వన్యప్రాణుల వైవిధ్యాన్ని ఆస్వాదించాను'' అని పేర్కొన్నారు. ఈ టైగర్‌ రిజర్వులో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ప్రధాని ఆస్వాదించారు. ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించిన మోదీ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.

తెప్పకాడు ఎలిఫెంట్‌ క్యాంప్‌ వద్ద ప్రధాని ఏనుగులకు చెరకుగడలను ఆహారంగా ఇచ్చారు. ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్న 'ఎలిఫెంట్ విష్పరర్స్‌' డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్‌, బెళ్లి దంపతులు, అందులో కనిపించిన ప్రతినిధులు, నిర్మాత దర్శకులు, మావటిలతో ముచ్చటించారు..

మైనార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఎండి నజీర్ నియామకం...

నల్గొండ పట్టణ కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా గారి ఆధ్వర్యంలో మైనారిటీ జిల్లా అధ్యక్షుడి గా మొహమ్మద్ నజీర్ గారికి నియామక పత్రం అందజేయడం జరిగింది..

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా గారు మాట్లాడుతూ నల్గొండలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న నవయువకుడైనటువంటి సోషల్ యాక్టివిస్ట్ ఎం.డి నజీర్ యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ లో పనిచేయడానికి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. నజీర్ పై పూర్తి నమ్మకం ఉన్నదనీ, అతను మా ఆర్గనైజేషన్ తరుపున మైనార్టీ బాగు కోసం నిరంతరం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే జిల్లా జాయింట్ సెక్రెటరీ గా జావిద్ అలిని నియమించారని తెలియజేయడం జరిగింది. అనంతరం నజీర్ గారు మాట్లాడుతూ సంస్థ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తానని సంస్థనీ అభివృద్ధి పరుచుటకు ఎల్లవేళలా కృషి చేస్తానని, మైనారిటీల హక్కుల కోసం పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సద్దాం హుస్సేన్, జావిద్ అలీ, జి షాన్ తదితరులు పాల్గొన్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎం ఉమ్మడి సమావేశం..

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సీపీఐ, సీపీఎం ఉమ్మడి సమావేశం ప్రారంభమైంది.

సభా ప్రాంగణనికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం.

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పల్లా వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ చేరుకున్నారు. తెలంగాణలోని మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి రెండు కమ్యునిస్టు పార్టీల నేతలు భారీగా హాజరయ్యారు.

Pre wedding shoot : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ప్లాన్‌ చేస్తున్నారా.. అయితే ఓ లుక్కేయండి!

తెలుగు రాష్ట్రాల్లో.. మే నెలలో పెళ్లిళ్లకు (Marriages) అత్యధిక ముహుర్తాలున్నాయి. దాంతో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ (Pre wedding shoot) కోసం ఎక్కడికి వెళ్తే బాగుంటుందని కాబోయే వధూవరులు, వారి కుటుంబ సభ్యులు నెట్టింట్లో శోధిస్తున్నారు.

దేశంలోని సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వస్తుంది. అతి తక్కువ బడ్జెట్‌లో.. మనకు సమీపంలోనే పురాతన కోటలు, అందమైన అటవీ ప్రాంతాలు, ఆహ్లాదకర సముద్ర తీరాలున్నాయి. అక్కడకు వెళ్తే ఖర్చులు కలిసి వస్తాయి. పైగా మన తెలుగింటి వారసత్వం కూడా ఫొటో (Photo), వీడియో ఆల్బమ్‌లలో (Album) ఉట్టిపడుతుంది. ఆ ప్రదేశాలేవో పరిశీలించండి.

గోల్కొండ కోట

హైదరాబాద్‌ నగర శివారులో గోల్కొండ కోట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు చాలా అనువైన ప్రాంతం. ఎండ ఎక్కువగా లేని రోజున ఫొటో షూట్‌కు వెళ్తే అద్భుతమైన చిత్రాలు తీసుకోవచ్చు. నిజాం కాలంలోని రాతి కట్టడాలు బ్యాక్‌గ్రౌండ్‌కు ఒక రాయల్‌ లుక్‌ను తీసుకొస్తాయి. కోట ప్రవేశద్వారం.. మధ్యలో చూడచక్కని గ్రీనరీ కొత్త జంట స్టిల్స్‌కు సరికొత్త శోభనిస్తాయి. హైదరాబాద్‌ నగరం మొత్తం కన్పించేలా ఉన్న కొన్ని వ్యూ పాయింట్స్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.

గండి కోట

గోల్కొండ కోట తరహా రాజసం వైయస్‌ఆర్‌ జిల్లా గండికోటలో కన్పిస్తుంది. కోటలోని జుమ్మా మసీదు, ఎర్ర కోనేరు, మాధవరాయస్వామి, రంగనాయకుల దేవాలయం వద్ద మైమరపించే చిత్రాలు తీసుకోవచ్చు. గండికోటకు సమీపంలోని కొట్టాలపల్లె వద్దనున్న గాలి మరలు కూడా ఫొటోషూట్‌కు అనువుగా ఉంటాయి. మైలవరం జలాశయం వద్ద సైతం వివిధ రకాల స్టిల్స్‌ తీసుకునే వెసులుబాటు ఉంటుంది..

వరంగల్‌ కోట

నాటి కాకతీయుల కోట నేటి ఖిలావరంగల్‌ కోటగా ప్రసిద్ధిగాంచింది. ఈ పురాతన కోటలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కన్పిస్తుంటుంది. 13వ శతాబ్దం నాటి కాకతీయ కళా తోరణాల వద్ద చూడచక్కని చిత్రాలు తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కనిపించే శిలాతోరణం ఇక్కడిదే. మెట్లబావులు సహా పుట్ట కోట, మట్టి కోట, రాతి కోట. నాలుగు దిక్కుల సింహ ద్వారాల వద్ద వైవిధ్యమైన చిత్రాలను క్లిక్‌ మనిపించొచ్చు..

రుషి కొండ బీచ్‌

విశాఖలోని అందమైన ప్రాంతాల్లో రుషి కొండ బీచ్‌ ఒకటి. కేరళ, గోవా తరహాలో ఇక్కడి తీరంలో కొన్ని చోట్ల కొబ్బరి చెట్లు కన్పిస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మత్స్యకారులు ఒడ్డున నిలిపి ఉంచిన బోట్ల వద్ద రకరకాల పోజులిస్తూ ఫొటోలు తీసుకోవచ్చు.

తలకోన అటవీ ప్రాంతం

తిరుపతి నుంచి భాకరాపేట మీదుగా సిద్ధేశ్వరాలయానికి వెళ్లి.. అక్కడి నుంచి 2 కి.మీ.లు అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తే తలకోన అందాలు సాక్షాత్కరిస్తాయి. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ కాబోయే వధూవరులు సరికొత్త స్టిల్స్‌ దిగొచ్చు. ఇక్కడి జలపాతం వద్ద తీసుకునే చిత్రాలు ఆల్బమ్‌కే హైలెట్‌గా నిలుస్తాయి. అరుదైన జీవ, వృక్ష జాతులకు ఆవాసమైన తలకోనలో బస చేయడానికి అటవీశాఖ అతిథి గృహాలు కూడా ఉన్నాయి.

ఉనికిని కోల్పోతున్న స్వతంత్ర సంస్థలు

సాధారణ పౌరులకు సమస్య ఎదురైనప్పుడు ఏ దిక్కూ లేని పరిస్థితుల్లో న్యాయం కోసం ఆశ్రయించే స్వతంత్ర సంస్థలు.. తమ ఉనికినే కోల్పోతున్నాయి. సామాన్యులకు ఎవరి నుంచి ఎటువంటి హాని జరిగినా, అపాయం పొంచి ఉన్నా తామున్నామని భరోసానివ్వాల్సిన కమిషన్లు.. నియామకాలకు నోచుకోక వెలవెలబోతున్నాయి. నెలలు, ఏళ్ల తరబడి ఆయా కమిషన్లను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడమే ఇందుకు కారణం. కమిషన్ల చైర్మన్‌, సభ్యుల పదవీకాలం ముగిసినా.. పునరుద్ధరణ చేపట్టకపోవడంతో అవి ఖాళీ కమిషన్లుగా ఉండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్న ఆరోపణలువస్తున్నాయి. సాధారణంగా పౌరుల హక్కులకు భంగం కలిగినా, అధికారులు, ప్రత్యర్థుల నుంచి అపాయం పొంచి ఉన్నా బాధితులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తుంటారు. కానీ, కొన్ని నెలలుగా హక్కుల కమిషన్‌.. చైర్మన్‌, సభ్యులు లేకుండా స్తబ్దంగా మిగిలిపోయింది. రాష్ట్ర సమాచార కమిషన్‌ గడువు గత ఫిబ్రవరిలో ముగిసినా.. పునరుద్ధరణపై ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీ అయి దాదాపు రెండేళ్లవుతున్నా.. ప్రభుత్వం ఇంతవరకూ నియామకానికి చర్యలు తీసుకోవడంలేదు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడి పదవీ విరమణ తర్వాత సీనియర్‌ సభ్యుడికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) చుక్కాని లేని నావగా మారింది. దాదాపు నాలుగు నెలలుగా హెచ్చార్సీ చైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉంది. చైర్మన్‌, సభ్యుల పదవీకాలం గత డిసెంబరులో ముగియడంతో.. అప్పటినుంచి హెచ్చార్సీ పనితీరు నెమ్మదించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర హెచ్చార్సీ మొదటి చైర్మన్‌గా జస్టిస్‌ చంద్రయ్యను 2019 డిసెంబరు 23 ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్ల పదవీకాలం 2022 డిసెంబరు 22తో ముగిసింది. కమిషన్‌ సభ్యులపదవీకాలం కూడా ముగిసింది. దీంతో అప్పటినుంచి అన్ని కుర్చీలూ ఖాళీగానే ఉన్నాయి. రెండు నెలలుగా దాఖలైన పిటిషన్లన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. పోలీస్‌ అధికారుల వేధింపులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఎదురవుతున్న ఇబ్బందులు.. ఇలా అనేక సమస్యలపై రాష్ట్రంలోని నలు మూలల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో బాధితులు న్యాయం కోసం హెచ్చార్సీని ఆశ్రయిస్తుంటారు. సగటున రోజుకు 30 పిటిషన్లు హెచ్చార్సీలో దాఖలవుతాయి. అవన్నీ ఇప్పుడు విచారణ లేకుండా మిగిలిపోయాయి. కాగా, హెచ్చార్సీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్యతోపాటు సభ్యుల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పటివరకు ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.

సమాచార కమిషన్‌ ఖాళీ..

సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రధాన కమిషనర్‌గా డాక్టర్‌ ఎస్‌.రాజా సదారాం, కమిషనర్‌గా బుద్దా మురళిని నియమించింది. ప్రధాన కమిషనర్‌ రాజా సదారాం పదవీకాలం 2022 ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి కమిషనర్‌ బుద్దా మురళికి ప్రధాన కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అనంతరం బుద్దా మురళి పదవీ కాలం గత సెప్టెంబరులో ముగిసింది. అప్పటి నుంచి ప్రధాన కమిషనర్‌, కమిషనర్‌ బాధ్యతలు ఎవరికీ అప్పగించకుండా ప్రభుత్వం ఖాళీగా ఉంచింది. ఈ ఏడాది ఫిబ్రవరితో కమిషన్‌ గడువు కూడా ముగిసింది. దీంతో పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా.. ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. పైగా, సమాచార కమిషన్‌ కొనసాగింపును నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కమిషన్‌కు శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం గతంలో గచ్చిబౌలిలో ఎకరం స్థలం కేటాయించడం గమనార్హం.

ఏళ్ల తరబడి ఖాళీగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌..

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీ అయి దాదాపు రెండేళ్లు అవుతున్నా.. ప్రభుత్వం ఇంతవరకూ నియామకానికి చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా రాష్ట్రంలోని గిరిజనులు, దళితులు తమ సమస్యలకు చెప్పుకొనేందుకు అవకాశమే లేకుండా పోయింది. కమిషన్‌ నియామకం విషయంలో హైకోర్టు కలుగజేసుకొని నోటీసులు జారీ చేసినా.. సర్కారు స్పందించలేదు. 2018 నాటి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పదవీకాలం 2021 ఫిబ్రవరికే పూర్తయినా ఇప్పటివరకు నూతన చైర్మన్‌ను, సభ్యులను నియమించలేదు. దీంతో తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రతిసారీ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, దళిత, గిరిజన వర్గాలపై 2022లో రాష్ట్రవ్యాప్తంగా 12,864 దాడులు జరిగినట్లు సమాచారం. 2018-2021 మధ్య పనిచేసిన ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ తన హయాంలో 14 వేల కేసులకుగాను దాదాపు 13వేల కేసులను పరిష్కరించడంతోపాటు బాధితులకు సుమారు 80కోట్ల పరిహారం అందించింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ లేకపోవడంతో జరిగిన దాడులన్నింటిలోనూ బాధితులకు న్యాయం జరగడంలేదు. తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించేవారు లేక దళిత, గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రంగంలోకి జాతీయ కమిషన్‌..

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీగా ఉండటంతో ఆయా సమస్యల పరిష్కారానికి కొన్నిసార్లు నేరుగా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషనే రంగంలోకి దిగుతోంది. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్‌ వినీత్‌, కలెక్టర్‌ అనుదీ్‌పలను రెండేళ్ల కిందటి కేసుకు సంబంధించి జాతీయ కమిషన్‌ విచారించడమే ఇందుకు నిదర్శనం. దీంతోపాటు దళిత మహిళ మరియమ్మ లాక్‌పడెత్‌ విషయంలోనూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషనే స్పందించింది. కాగా, ఇటీవల నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బాజకుంట గ్రామ సర్పంచ్‌.. వికలాంగ దళితుడిపై చెప్పుతో దాడి చేసిన ఘటనలో, 2019లో రాజన్న సిరిసిల్ల జిల్లా రామోజీపేటలో దళితవాడపై దాడి జరిగిన ఘటనలో ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. సంగారెడ్డి జిల్లా పొట్టిపల్లి గ్రామంలో సోషల్‌ మీడియా వ్యవహారంపై చెలరేగిన ఘర్షణ 15 మంది దళిత యువకులపై దాడి వరకు వెళ్లింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కోయపోచగూడెం గ్రామంలో పోడు భూముల విషయంలో చోటుచేసుకున్న వివాదంలో పోలీసులే గిరిజన మహిళల్ని ఈడ్చుకెళ్లారు. మహబూబాబాద్‌ జిల్లాలో మూడు గ్రామాల్లో బతుకమ్మ సాక్షిగా దళిత మహిళలపై అగ్రవర్ణ మహిళలు వివక్షకు పాల్పడ్డ అంశం సంచలనం సృష్టించింది. వీటితోపాటు రాష్ట్రంలో ఏదో ఒక చోట దళిత, గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆయా ఘటనల్లో బాధితులకు న్యాయం లభించడంలేదు.

తక్షణమే కమిషన్‌ను నియమించాలి:

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ లేకపోవడంతో దళిత, గిరిజనులు గోడు చెప్పుకొనేందుకు వేదిక లేకుండా అయిపోయింది. రాష్ట్రంలో ఇటీవలి కాలం లో దళితులు, గిరిజనులపై దాడులు పెరుగుతున్నాయి. వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం కమిషన్‌ను ఎందుకు నియమించడం లేదు? తక్షణమే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ను, సభ్యులను నియమించాలి.

మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో పర్యటించిన సూరన్న

మహారాష్ట్ర లో నేను చేస్తున్న ఉద్యమం ఫలిస్తుందా లేదా అని చిన్నగా నన్ను నేను పరీక్ష చేసుకున్న

వారు మాట్లాడినట్లు అనర్గళమైన రీతిలో మరాఠీ మాట్లాడకపోవచ్చు కానీ నా వంతు నేను మరాఠీ మాట్లాడడానికి ప్రయత్నం చేసాను మాట్లాడినాను.

యావత్మాల్ జిల్లాలో 'వని' అనే పట్టణంలో బుద్ధ విహార్ లో వెళ్లి కాసేపు యువకులతో చర్చించడం జరిగింది

అంబేద్కర్ గారు కల్పించిన గొప్ప ఓటుహక్కును అమ్ముకొని మనం ఎన్ని జయంతిలు వర్ధంతిలు చేసిన ప్రయోజనము లేదని చెప్పడం జరిగింది.

పొలిట్రిక్స్ పుస్తకాన్ని మరాఠీ భాషలో తర్జుమా చేసి వీలైతే మహారాష్ట్ర లో అక్షరాస్యత లోపించిన గ్రామాల్లో ఈ పుస్తకాన్ని పట్టుకొని వాస్తవాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది.

ఈ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో మీరు అందరూ భాగస్వామ్యం వహించాలని మనసారా వేడుకుంటున్నాను.

నా ఉద్యమంలో స్వార్థం లేదు కాబట్టే నేను అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాను.

ఒకవేళ స్వార్థం ఉంటే నాకు ఓటు హక్కు ఉన్న జిల్లాలోనే ఉద్యమం చేసేవాడిని.

మహారాష్ట్ర లో చేస్తే నాకేం వస్తుంది ? ఇక్కడేమైనా నాకు ఓటు హక్కు ఉందా ? లేదు కదా.

మనస్ఫూర్తిగా ఉద్యమాన్ని ముందుకు నడిపించడం కొరకు మీరు సహకరించగలరు.

8790031672

సూరన్న

పొలిట్రిక్స్ పుస్తక రచయిత

పలు రైళ్లు రద్దు..

ఈ నెల 9, 10 తేదీల్లో

ధన్‌బాద్‌-అలెప్పుజ-ధన్‌బాద్‌(13351-13352) బొకారో ఎక్స్‌ప్రెస్‌,

హావ్‌డా-జగదల్‌పూర్‌-హావ్‌డా(18005-18006),

10న పురిలియా-విల్లుపురం(22605), తాంబరం-సిల్గాట్‌ టౌన్‌-తాంబరం(15629-15630),

8న బరౌలి-కోయంబత్తూర్‌(03357),

12న కోయంబత్తూర్‌-బరౌలి(03358),

10న విశాఖ-రాయ్‌పుర్‌-విశాఖ(08527-08528)

రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు.

Amaravati: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాళ్లు.. అమరావతిలో ఉత్కంఠ

144 సెక్షన్‌ అమలు..

చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరిక..

బందోబస్తుకు సిద్ధమైన పోలీసులు..

అమరావతి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో అమరావతిలో ఉత్కంఠ నెలకొంది..

ఇరుపక్షాలు అవినీతిపై చర్చించి, ఆదివారం అమరేశ్వరాలయంలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో వైకాపా, తెదేపా నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు..

నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామంలో బలగం చిత్రం ప్రదర్శన..

•క్రీస్తు శేషులు. అలుగుబెల్లి హనుమంత్ రెడ్డి. రామ నర్సమ్మ గార్ల జ్ఞాపకార్థం

శనివారం రోజున బలగం చిత్రాన్ని గ్రామంలో (కరుణం వారి వాకిలి) నందు ప్రదర్శించడం జరిగింది... ఈ సందర్భంగా వారి కుమారులు మాట్లాడుతూ బంధాలకు బంధుత్వాలకు ప్రతీకగా నిలిచిన ఈ బలగం సినిమాని గ్రామ ప్రజలకు ఒక మంచి ఉద్దేశంతో ప్రదర్శింప చేశామని అన్నారు.

ఈ చిత్రాన్ని తిలకించిన గ్రామ పెద్దలకు యువకులకు మహిళలకు విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. అదేవిధంగా గ్రామ ప్రజలు బలగం సినిమా గ్రామంలో ప్రదర్శించినందుకు అలుగుబెళ్లి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో.హనుమంత రెడ్డి గారి కుమారులైన అలుగుబెల్లి ప్రభాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి. సురేందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు..