/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Komatireddy: కొత్త పార్టీ పెడుతున్నారా?.. ఎంపీ కోమటిరెడ్డి క్లారిటీ Yadagiri Goud
Komatireddy: కొత్త పార్టీ పెడుతున్నారా?.. ఎంపీ కోమటిరెడ్డి క్లారిటీ

దిల్లీ: తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు..

కార్యకర్తలను అయోమయానికి గురిచేసేలా కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని తాను వీడే ప్రసక్తే లేదని చెప్పారు. దిల్లీలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

పలువురు కేంద్రమంత్రులను కలిసినప్పటికీ అది అభివృద్ధి కార్యక్రమాల కోసమేనని కోమటిరెడ్డి చెప్పారు చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం తగదన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశిస్తే మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీ.. దేనికి పోటీ చేయమంటే దానికి పోటీ చేస్తానని చెప్పారు. తనకు పార్టీ మారే ఉద్దేశముంటే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోయినపుడే మారే వాడినన్నారు. నిరాధార వార్తలతో కాంగ్రెస్‌ కార్యకర్తలను గందరగోళానికి గురిచేయొద్దని కోమటిరెడ్డి కోరారు.

రాజకీయ చదరంగంలో పదవ తరగతి విద్యార్థులను పావులుగా చేయకండి

•"ఆబాద్" పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్

10 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి చదివి తొలిసారిగా పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పదవ తరగతి విద్యార్థులను రాజకీయ చదరంగంలో పావులుగా ఉపయోగించుకోరాదని ఇది ఎంత మాత్రం సమంజసం కాదని దీనిని ఎవరు కూడా సమర్థించరని "ఆబాద్" పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ అన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి అని జరుగుతున్న తతంగం అంతా ఇంతా కాదు ఈ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం విద్యార్థులను, వారి కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తుంది. రాజకీయ ఆధిపత్యం కోసం కాకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలకు సంబంధించి ఏదైనా సమాచారం బయటకు వచ్చింది అంటే వెంటనే ఆ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు గాని లేదా పోలీసు అధికారులకు గాని సమాచారం అందించి అనర్థం జరుగకుండా ఆపాలని అంతే కాని సోషల్ మీడియాలో అవసరానికంటే ఎక్కువ ప్రచారం చేయడం వల్ల అటు తాత్కాలికంగా ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొన్నా అంతిమంగా దాని ప్రభావం విద్యార్థులకు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది ఇది మనం అందరం గుర్తించి పరీక్షల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేద్దాం.

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల పైనే ఉంటుంది. పరీక్షా కేంద్రాలలో పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లుగా వ్యవహరించే ఉపాధ్యాయులు నిబద్ధతతో వ్యవహరించాలని" ఆబాద్ పార్టీ" రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ పిలుపునిచ్చారు, ఒకరో ఇద్దరో తెలిసో, తెలియకో అమాయకంగా అనుకోకుండా అనైతిక పద్ధతులకు పాల్పడితే మొత్తం ఉపాధ్యాయులు ఆ నిందను మోయాల్సి వస్తుంది. కనుక ఎస్ ఎస్ సి పరీక్షల్లో ఏ విధమైన అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. తద్వారా మాత్రమే భావిభారత పౌరులుగా పదవ తరగతి విద్యార్థులను సైతం అందించినవారం అవుతామని "ఆబాద్" పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ కోరారు

జనగామలో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై దంపతులు..

•ఉదయం బాత్రూంలో ఉరేసుకున్న ఎస్సై భార్య

•కాసేపటికే గదిలోకి వెళ్లి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న ఎస్సై

జనగామ జిల్లాలో ఈరోజు ఉదయం ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ఎస్సై శ్రీనివాస్ భార్య ఉదయం ఉరి వేసుకుని చనిపోయింది. భార్య మరణంతో కన్నీరుమున్నీరైన ఎస్సై.. ఆ తర్వాత ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇరువురూ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఎస్సై శ్రీనివాస్, ఆయన భార్య స్వరూపల మధ్య గొడవ జరిగింది. గురువారం ఉదయం స్వరూప బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయింది. భార్య ఆత్మహత్యతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. భార్య మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు. 'ఎంత పనిచేశావు స్వరూపా' అంటూ శ్రీనివాస్ గుండెలవిసేలా రోదించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఏడుస్తున్న శ్రీనివాస్ ను బంధువులు, స్నేహితులు ఓదార్చుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. శ్రీనివాస్ నుదుట గాయం అయినట్లు కనిపిస్తోంది. అయితే, ఆ తర్వాత కాసేపటికి మరో గదిలోకి వెళ్లిన శ్రీనివాస్.. తన సర్వీస్ రివాల్వర్ తో నుదుటిపై కాల్చుకుని చనిపోయాడు. కాగా, గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, స్వరూప దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. కాగా, ఎస్సై దంపతుల ఆత్మహత్యలపై దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు..

ఎలికట్టే గ్రామంలో ఘనంగా బీజేపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం

•బూత్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి సందీప్ ఆధ్వర్యంలో

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి సందీప్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ, ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిధిగా నల్లగొండ జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారు పాల్గొని పార్టీ జెండాకు కొబ్బరికాయలు కొట్టి జెండా ఆవిష్కరించి అరటి పళ్ళు పంచడం జరిగింది.

అనంతరం పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ బిజెపి పార్టీ మహా నాయకుల ఆత్మబలిదానాలతో వెలసిన పార్టీ ఇద్దరు వ్యక్తులతో మొదలుకొని నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వాలు నమోదైన పార్టీగా వెలిసింది బిజెపి కార్యకర్తలు సిద్ధాంతంతో ఒక్కొక్క సైనికుడై పోరాడుతున్నారని తెలిపారు. 

అదే విధంగా ఈరోజు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ రాక్షస పాలన అవినీతి పాలన దొర పాలన అంతమొందించాలంటే ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలన్నారు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులను మీడియాను ఇబ్బందులకు గురి చేస్తూ వారి గొంతు నొక్కేస్తూ వాస్తవాలు బయటికి రాకుండా బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారిని అరెస్టు చేసినందుకు బిఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తెలంగాణ ప్రజల కూడా బిఆర్ఎస్ పార్టీని రానున్న ఎన్నికల్లో కూకటి వేళ్ళతో పీకి పడేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గొలనుకొండ మదన్ మోహన్, దుబ్బాక నవీన్ రెడ్డి, చెరుకుపల్లి నాగరాజు, సోమనబోయిన విగ్నేష్, గుణగంటి రాఘవేంద్ర, ఉయ్యాల సుమంత్, కొండ రమేష్ లింగస్వామి రాజు పవన్ తదితరలు పాల్గొన్నారు.

Renu Desai: కొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు..: రేణూ దేశాయ్‌

హైదరాబాద్‌: 'బద్రి', 'జాని' లాంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారికి ఎంతో చేరువయ్యారు నటి రేణూ దేశాయ్‌ (Renu Desai)..

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ తన సినిమా విషయాలను, వ్యక్తిగత సమాచారాన్ని అభిమానుతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా రేణూ దేశాయ్‌ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరలవుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న వీడియో పెట్టిన ఆమె అందమైన నోట్‌ను రాశారు..

''కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వాళ్ల పరిచయం మండు వేసవిలో చల్ల గాలిలా మనసుకు ఊరటనిస్తుంది. వాళ్ల చూపులు నేరుగా మన హృదయంతో మాట్లాడతాయి. అది ఒక అందమైన భాష. మనం వాళ్లతో కొన్ని గంటల సమయం గడిపినప్పటికీ.. వాళ్ల ప్రభావం మనపై జీవితాంతం ఉంటుంది. అలాంటి పరిచయాల్లో కొన్ని మనల్ని బాధపెడతాయి కూడా. వాళ్లు మన జీవితానికి పరిపూర్ణతను ఇస్తారు. మన కన్నీళ్లను తుడిచి.. మన జీవితాల్లో వెలుగును నింపుతారు. మనల్ని నవ్విస్తుంటారు'' అని రేణూ దేశాయ్‌ తన పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అకీరాతో కలిసి ఆమె ప్రయాణిస్తోన్న వీడియో కూడా నెట్టింట సందడి చేసింది. ఇక కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణూ దేశాయ్ త్వరలోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల విరామం తర్వాత రవితేజ (Raviteja) హీరోగా తెరకెక్కుతోన్న 'టైగర్‌ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao)చిత్రంలో ఆమె నటిస్తున్నారు. హేమలతా లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో రేణు కనిపించనున్నారు.

Nellore: పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు.. ఎస్సైకి గాయాలు

కటగిరి: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో పోలీసు వాహనాన్ని ఎర్ర చందనం స్మగ్లర్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో డక్కిలి ఎస్సై నాగరాజుకు గాయాలయ్యాయి..

వివరాల్లోకి వెళితే.. రాపూరు అటవీ ప్రాంతం నుంచి స్మగ్లర్లు కారులో ఎర్రచందనం తరలిస్తున్నట్లు స్థానిక ఎస్సైకు సమాచారం అందింది. డక్కిలి మీదుగా తిరుపతి హైవే వైపు వెళ్తున్నట్లు తెలియడంతో డక్కిలి ఎస్సై నాగరాజుకు రాపూరు పోలీసులు సమాచారం ఇచ్చారు..

వెంటనే స్మగ్లర్లను వెంబడించేందుకు డక్కిలి పోలీసులు బయల్దేరి స్మగ్లర్లను అడ్డగించారు. దీంతో స్మగ్లర్లు పారిపోయేందుకు యత్నించగా.. పోలీసులు ఛేజింగ్‌తో వారిని పట్టుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో స్మగ్లర్లు తమ కారుతో పోలీసు వాహనంపైకి దూసుకెళ్లి ఢీకొట్టారు. అనంతరం దుండగులు తమ కారును అక్కడే వదిలేసి పారిపోయారు. స్మగ్లర్ల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో డక్కిలి ఎస్సైకు ముఖంపై గాయాలయ్యాయి. వెంకటగిరిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Pawan Kalyan: అందర్నీ కలిశాక అన్ని విషయాలు మాట్లాడతా: పవన్‌

దిల్లీ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం హస్తినకు చేరుకున్న పవన్‌.. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, మురళీధరన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే..

భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గానూ ఉన్న మురళీధరన్‌తో పవన్‌ మరోసారి భేటీ అయ్యారు. మంగళవారం మురళీధరన్‌ నివాసంలో ఈ సమావేశం జరిగింది.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై పవన్‌ చర్చిస్తున్నట్లు సమాచారం. జనసేనానితో పాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు పవన్‌ను కలవగా భాజపా ముఖ్యనేతలందరినీ కలిసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని ఆయన చెప్పారు. సాయంత్రం కేంద్రహోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ అయ్యే అవకాశముంది.

పదవ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ ఘటనపై విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలి....

•పి.డి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి పోలే పవన్

పదవ తరగతి పరీక్ష పేపర్లు మూడో తారీకు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మొదటి రోజే లీక్ కావడం,కేసీఆర్ అసమర్ధ ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనమని పీ.డి.ఎస్.యూ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్ తెలిపారు.

స్థానిక బి.సి హాస్టల్లో పేపర్ లీకేజీ ఘటనపై దోషులను శిక్షించాలని,దీనికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం రాజీనామా చేయాలని పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలే పవన్ పాల్గొని మాట్లాడుతూ ఎగ్జామ్ ప్రారంభమైన ఏడు నిమిషాలకే ప్రశ్న పత్రం లీకు కావడం అంటే అత్యంత సోచనీయమని అన్నారు. ఇప్పటికే చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక సంవత్సరాల తరబడి కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్ రాస్తే పేపర్ల లీకేజీ తో అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని, మరొకవైపు చదువుకుందాం అంటే పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయని, " చదువుకొన్నేడిదే.. చదువు లాగా" నేడు తెలంగాణ రాష్ట్రంలో తయారయిందని మండిపడ్డారు. అందులో భాగంగానే పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూస్తున్నాయని తెలిపారు .నిన్న తెలుగు పేపర్ లీకేజీ, నేడు హిందీ పేపర్ లీకేజీలు జరగడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీరని అన్యాయమే అని మండిపడ్డారు .ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 4 ,ఎంసెట్, ఇంకా అనేక రకాల పరీక్ష పేపర్ల నుండి నేడు టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ వరకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రధాన దోషులను శిక్షించకుండా కాలయాపన చేసిందని, అందులో భాగంగానే పేపర్ లీకేజీ ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని దుయ్యబట్టారు.

కేజీ నుండి పీజీ వరకు నా స్వప్నం,నా కళా అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ పదవి నుండి తప్పుకోవాలని, ఎస్.ఎస్.సి బోర్డు నిర్లక్ష్యానికి నిలువుటద్దం పేపర్ లీకేజీ ఘటనని ఎద్దేవా చేశారు. వెంటనే పేపర్ లీకేజీ కు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, పేద, బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో "ఉన్నత చదువులు ఉన్నోడికి అన్నట్లుగా" ప్రభుత్వ తీరు ఉన్నదని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం బ్రష్టు పట్టించిందని అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని తెలిపారు.పేపర్ లీకేజీ ఘటన పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో పిడిఎస్ యూ నాయకులు ఇందూరు మధు, జి వెంకటేష్ ,ఆర్ ప్రవీణ్, లెనిన్, రాజు, మాధవ్, సురేష్ ,నవీన్ ,ప్రభాకర్ తదిత తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

ఇండియాలో కొత్తగా 3038 కరోనా కేసులు, 9 మరణాలు..

•ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..

గడిచిన 24 గంటల్లో దేశంలో 3038 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,29,284 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2069 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 94. 87 శాతంగా ఉంది.ఇక దేశంలో 9 గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,901 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2069 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,77,204 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,11,814 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 1,64,740 మందికి కరోనా పరీక్షలు వేసింది ఆరోగ్య శాఖ..

శంషాబాద్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

•మొత్తం 137 మంది ప్రయాణికులు సురక్షితం

బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న ఇండియా ఫ్లైట్ (6E897) తెలంగాణలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, అందుకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశామని చెప్పారు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఇండిగో ఫ్లైట్ 6E897 ఉదయం 5.10 గంటలకు బయలుదేరింది, అయితే సాంకేతిక సమస్యల కారణంగా విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.

అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం ఏర్పడిందన్న సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఈ విమానం కొద్దిసేపటి క్రితం బయలుదేరింది.

అంతకుముందు ఏప్రిల్ 1న ఢిల్లీ నుంచి దుబాయ్‌కి బయలుదేరిన కార్గో విమానం పక్షిని ఢీకొట్టింది. దీని తర్వాత, హెచ్చరిక జారీ చేసిన తర్వాత, అతన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. పక్షి ఢీకొనడంతో విమానం విండ్‌షీల్డ్‌ పగిలిందని విచారణలో తేలింది. అయితే, కొంత సేపటి తర్వాత మళ్లీ విమానం బయలుదేరింది.