/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తీన్మార్ మల్లన్న Qన్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం హేయమైన చర్య Yadagiri Goud
తీన్మార్ మల్లన్న Qన్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం హేయమైన చర్య

•బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

తీన్మార్ మల్లన్నకు సంబంధించిన Qన్యూస్ ఛానల్ ఆఫీస్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం హేయమైన చర్య అని ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిసి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అన్నారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను నిరంతరం ఎప్పటికప్పుడు తన Qన్యూస్ చానల్ ద్వారా ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తున్న బడుగు బలహీనవర్గాలకు చెందిన జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పై కక్ష గట్టి

తనకు సంబంధించిన Qన్యూస్ ఛానల్ ఆఫీస్ పై గుర్తు తెలియని గుండాలు దాడి చేసి కంప్యూటర్లు, ఫర్నిచర్ ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేయడం అంటే ఇది పూర్తిగా జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడమే అన్నారు. ప్రభుత్వం తక్షణమే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, శేరి రవీందర్, సురేందర్, అనిల్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరో టీఎస్పీఎస్సీగా మారనున్న ఎంజి యూనివర్సిటీ

•బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

ఆదివారం బి.సి విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కూడా మరో టిఎస్పిఎస్సి గా మారకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నాము. ఎందుకంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఆరేళ్లుగా ఒకరే పరీక్ష అధికారిగా కొనసాగుతున్నారు పరీక్షల ఫలితాల్లో వెల్లడిలో ఎన్నోసార్లు అవకతవకలు జరిగాయి.

దాంతో వేల మంది విద్యార్థులు ఆందోళనల చెందారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇలాగనే కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరం తక్షణమే పరీక్షల విభాగంలో ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరో టీఎస్పీఎస్సీగా మారకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

పరీక్షల విభాగ అధికారి కొన్ని ప్రైవేట్ కళాశాల యజమానులతో ప్రతి సెమిస్టర్ కి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఆరోపిస్తున్నారు. అసలు రిజిస్టర్ కి అతనికి సంబంధించిన సబ్జెక్టు యూనివర్సిటీ పరిధిలో లేకపోయినా అతన్ని కావాలని వీసి తన సొంత స్వలాభం కోసం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వీసీ, రిజిస్టర్ మరియు ఓ.ఎస్.డి ముగ్గురు కలిసి యూనివర్సిటీ నిధులని తమ ఇష్టానుసారంగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. జల్సాలకు వినియోగించుకుంటున్నారు.

అంతేకాకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అనేక విభాగాలలో అవకతవకలకు పాల్పడుతున్నారు. వీటన్నిటి పైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని బి.సి విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో బి.సి విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, యువజన సంఘం జిల్లా నాయకుడు రావుల రాజేష్ గౌడ్, సుధాకర్, లక్ష్మణ్,పండ్ల హరికృష్ణ గౌడ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు......

ఈదురు గాలులు,అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి

...AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి

గత మూడు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులతో నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు- కూలీ సంఘం (AIKMS) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అకాల వర్షాల కారణంగా నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరి, మామిడి, మిర్చి, నిమ్మ,బత్తాయి, మొక్కజొన్న, బొప్పాయి తదితర తోటలు నేలమట్టం అయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు.ఇప్పటికే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక,తెచ్చిన అప్పులు తీర్చలేక మధ్య దళారులతో విసిగి వేసారి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

మార్కెట్లో కల్తీ పురుగుల మందులు,నాసిరకం విత్తనాలతో పంటలు పండక,పండిన పంటకు ధరలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ప్రకృతి(విపత్తు) వైపరిత్యాలతో మరింత నష్టపోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరానికి లక్ష రూపాయలు ఏక్సిగ్రెసియా చెల్లించాలని అన్నారు.

దేశానికి రైతే వెన్నెముక అంటున్నా పాలకులు రైతాంగాన్నీ తీవ్ర సంక్షోభంలో నెడుతున్నారని,వ్యవసాయ రంగానికి అన్నిరకాల సబ్సిడీపై ఎరువుల,విత్తనాలు,వ్యవసాయ పనిముట్లు అందించాలని,ఏక కాలంలో లక్ష రూపాయలను రుణమాఫీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంన్నారని దుయ్యబట్టారు.వెంటనే రైతాంగానికి చేయూత నివ్వాలని కొరారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఏక్సిగ్రెసియా వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది

సుప్రీంకోర్టు (Supreme Court)లో ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకు ఈడీ విజ్ఞప్తి చేసింది. ఈనెల 24న కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కేవియట్ పిటిషన్ దాఖలుతో కవిత తరపు వాదనలు, ఈడీ తరపు వాదనలు సుప్రీంకోర్టు విననుంది.

ఈడీ (ED) తనను విచారణకు పిలవడాన్ని సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా... 24న విచారిస్తామని కోర్టు తెలిపిన విషయం తెలిసిందే. మార్చి 16న ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. దీంతో ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించింది. అయితే కవిత పిటిషన్‌ను తాము ముందు చెప్పిన విధంగా 24నే విచారిస్తామని.. దాంట్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ (Petition) విచారణ జరిగేంత వరకూ ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ తోసిపుచ్చింది. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ ఏకంగా లేఖాస్త్రాన్ని సంధించారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ తాజా సమన్లలో ఎక్కడా పేర్కొనలేదని అందులో ప్రస్తావించారు. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లానని గుర్తు చేశారు. దర్యాప్తు న్యాయపరంగా, చట్టప్రకారం జరగడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ఈ నెల 24 ఈ నెల 24న తన కేసు విచారణకు స్వీకరించే దాకా వేచి చూడాలని, ఏమైనా సమాచారం కావాలంటే తన అధికారిక ప్రతినిధికి చెప్పాలని, లేకపోతే తనకు ఈ-మెయిల్‌ చేయవచ్చని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు.

సాధ్యమైనంత వరకు ఈడీ దర్యాప్తు తప్పించుకోవాలని కవిత ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులైన అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ఆడిటర్‌ బుచ్చిబాబులను ముఖాముఖి కూర్చోబెట్టి ఒకరు చెప్పిన సాక్ష్యాలను మరొకరితో ధ్రువీకరింపచేయాలని, అనంతరం అరుణ్‌ పిళ్లైని కవితతో ముఖాముఖి కూర్చోబెట్టి వాస్తవాలను అంగీకరింపచేయాలని ఈడీ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.

TSPSC: టీఎస్‎పీఎస్సీ బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం?

హైదరాబాద్: TSPSC బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ లీకేజ్‌పై(Paper leakage) ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) సీరియస్‎గా ఉన్నట్లు తెలుస్తోంది.

TSPSC చైర్మన్ జనార్ధన్‌రెడ్డిని(Janardhan Reddy) ప్రగతిభవన్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన హుటాహుటిన ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ (kcr) మంత్రులు హరీష్‌రావు(Harish Rao), కేటీఆర్ (KTR)తో భేటీ అయ్యే అవకాశం ఉంది..

కాగా, గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‎పీఎస్సీ)TSPSC ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1తోపాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

శుక్రవారం TSPSC (టీఎస్‎పీఎస్సీ) అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయంతో మొత్తం ఆరు పరీక్షలను రద్దు చేసినట్లయింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. వాతావరణ శాఖ సూచన

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని తెలిపింది..

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్‌ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..

Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. రెండు డీసీఎంలు దగ్ధం..

హైదరాబాద్‌: నగరంలో మరో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. రెండు డీసీఎంలతో పాటు గోదాంలో విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది..

పెద్దకాపర్తి లో ఆయుస్మాన్ భారత్ ఈ కేవైసి.

 చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో 77 వ బూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆయుస్మాన్ భారత్ ఈ కేవైసి కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు శేపురి రవీందర్ గారి సహకారంతో 77వ బూత్ అధ్యక్షులు తెలుసూరి నర్సింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వ మరియు ప్రవేట్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించాలనే ఉద్దేశ్యంతో ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్దిదారులకు అందించనున్నారని వారు తెలిపారు.

ఈనెల 31 వరకు గ్రామంలో బీజేపీ ఆద్వర్యంలో ఉచితంగా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు మోర దనుంజయ్య ,సీనియర్ నాయకులు పోట్లపల్లి సుభాష్ గౌడ్ ,  మైల సత్తయ్య , గుండెబోయిన నర్సింహ , మోర నరేష్ , కాటం సందీప్, హరీష్ , మహేష్ , లింగస్వామి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

స్వప్నలోక్‌ అగ్ని ప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని.. అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మహమూద్‌ అలీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు సూచించారు.

మరణించినవారికి ₹5 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

ఏం జరిగిందంటే..

సికింద్రాబాద్‌లోని రద్దీ ప్రాంతంలో ఉన్న స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి వేళ 7, 8 అంతస్థుల్లో తొలుత మంటలు చెలరేగాయి.

విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ పై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి.

సూర్యాపేట జిల్లా చివ్వేంల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతికి కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్ ని తక్షణమే విధుల నుంచి తొలగించి చట్టపరంగా హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ విద్యార్థి మృతికి ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమన్నారు. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రిన్సిపల్ అలసత్వం వహించడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. ప్రమాదం జరిగినప్పుడే అధికారులు, ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేపట్టడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

గాయపడిన విద్యార్థులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని, మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, సూర్యాపేట జిల్లా కేంద్రంలో 500 గజాల ఇంటిస్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్, సాయి, శ్రీకాంత్, సంపత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.