/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz AP News: ప్రభుత్వ పథకాలు పొందే వారి ఇళ్లకు జగన్ స్టిక్కర్లు.. వైసీపీ సరికొత్త కార్యక్రమం.. Yadagiri Goud
AP News: ప్రభుత్వ పథకాలు పొందే వారి ఇళ్లకు జగన్ స్టిక్కర్లు.. వైసీపీ సరికొత్త కార్యక్రమం..

ఈ నెల 11న వైసీపీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వ పథకాలు అందుతున్న ఇళ్ల వివరాలు సేకరించి ఆ ఇళ్లకు స్టిక్కర్లు వేయనున్నారు..

గృహసారధులు, వాలంటీర్ల సమన్వయంతో అలాంటి ఇళ్లను గుర్తించనున్నారు.

ఆ ఇంటికి మా నమ్మకం నువ్వే అనే ట్యాగ్‌లైన్‌తో జగన్ స్టిక్కర్ వేయబోతున్నారు. ఇంటి యజమాని అనుమతితోనే స్టిక్కర్ వేయాలని నిర్ణయించారు.

సీఎం జగన్‌ అధ్యక్షతన ఎస్‌ఐపీసీ భేటీ.. పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఆమోదం..

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశమైంది.తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని ఆదేశించారు. అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించుకున్న సమయంలోగా వాటి కార్యకలాపాలు ప్రారంభం కావాలని తెలిపారు.

మరిన్ని ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం

1. కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ఇంధన తయారీకి ముందుకు వచ్చిన అవిశా ఫుడ్స్‌ మరియు ఫ్యూయెల్స్‌ కంపెనీ ప్రతిపాదన.

►మొత్తంగా రూ.498.84 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి. రోజుకు 500 కిలో లీటర్ల సామర్ధ్యం

► ఈ ఏడాది జూన్ లో పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

2. కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్‌ విస్తరణ ప్రాజెక్టు.

► మొత్తంగా రూ. 3,400 కోట్ల పెట్టుబడులు

►ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు.

► 2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

౩. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు

►మొదటి విడతలో రూ.55వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి.

►మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి.

►ఫేజ్ వన్‌లో 30 వేలమందికి, ఫేజ్‌ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు.

► ఈ పార్క్ లో గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్అమ్మోనియా, గ్రీన్‌ మిథనాల్, హైడ్రోజన్‌ సంబంధిత ఉత్పత్తులు.

►మొదటి విడతను 2027 నాటికి, రెండో విడతను 20౩౩ నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

► ఇంధన రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు మార్చుకుని కొత్త తరహా ఇంధనాల ఉత్పత్తి లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ఎన్టీపీసీ..

4. శ్రీకాళహస్తి, పుంగనూరుల్లో ఎలక్ట్రో స్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌. ఫ్యాక్టరీలు.

►డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ

►శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్ల పెట్టుబడి, పుంగనూరులో రూ.171.96కోట్లు పెట్టుబడి.

► మొత్తంగా రూ. 1087 కోట్ల పెట్టుబడి.

►ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు.

► డిసెంబర్2023 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యం.

5. రామాయపట్నంలో అకార్డ్‌ గ్రూప్‌ ఫ్యాక్టరీ.

►రూ. 10వేల కోట్ల పెట్టుబడి.

►కాపర్‌ కాథోడ్, కాపర్‌ రాడ్, సల్ఫూరిక్‌ యాసిడ్‌, సెలీనియం మరియు ప్రత్యేక ఖనిజాల తయారీ.

►ప్రత్యక్షంగా 2500 మందికి ఉద్యోగాలు.

► మే 2023లో ప్రారంభమై, జూన్2025 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

► ప్రభుత్వం రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలను నిషేదించిన నేపథ్యంలో తమ కంపెనీ ప్రణాళికలను మార్చుకున్న జేఎస్‌డబ్యూ అల్యూమినియం లిమిటెడ్‌ ఫ్యాక్టరీ కోసం ప్రెవేట్‌ వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదన ఆమోదించిన ఎస్‌ఐపీబీ..

6. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు

►1000 మెగావాట్ల విండ్, మరియు 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లు

►ఏర్పాటు చేయనున్న ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌.

►నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్లపెట్టుబడి.

► 2వేలమందికి ఉద్యోగాలు.

► దశల వారీగా పూర్తిస్ధాయిలో మార్చి 2027 నాటికి పూర్తిచేయాలని లక్ష్యం.

7. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్.

►100 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌ .

►మొదటి విడతలో 10 మెగావాట్లతో డేటా సెంటర్‌, మూడేళ్ళలో పూర్తికి కంపెనీ సన్నాహాలు.

► మొత్తంగా రూ.7,210 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 14,825 మందికి, పరోక్షంగా 5,625 మందికి, మొత్తంగా 20,450 మందికి ఉద్యోగాలు.

►ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న 200 మెగావాట్ల డేటా పార్క్ కి ఇది అదనం.

8. రాష్ట్రంలో పెట్టబుడులకు ముందుకు వచ్చిన వింగ్‌టెక్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

►రూ. 1489.23కోట్ల పెట్టుబడి. తిరుపతిలో పరిశ్రమ.

►15 వేలమందికి ఉద్యోగాలు.

►టెలీ కమ్యూనికేషన్ఇంటిగ్రేషన్, సెమికండక్టర్, ఆప్టికల్‌ మాడ్యూల్స్‌ ను తయారుచేస్తున్న కంపెనీ.

9. భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటు.

►దీనికి ఎస్ఐపీబీ ఆమోదం.

►అత్యంత ఆధునిక సదుపాయాలతో ఐటీ పార్కు ఏర్పాటు కావాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ఆమేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం ఆదేశం.

Revanth Reddy: అన్నం ముద్దలు కలిపి రేవంత్ రెడ్డికి పెట్టిన మహిళలు

ములుగు: జనవరిలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు.పేదలందరికీ ఇల్లు ఇస్తాం .. ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్కరికి 5 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా వెంకటాపురం మండలం కేశవాపూర్‌లో వరి, మిర్చి తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలు, రైతులను కలిసి వారి సమస్యలు రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పంట గిట్టుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు.

అలాగే కూలీలతో కలిసి కాసేపు రేవంత్ మిర్చి తెంపారు. రైతు కూలీలు తెచ్చుకున్న సద్ది లోంచి రేవంత్‌, సీతక్కకు, మల్లు రవిలకు అన్నం ముద్దలు కలిపి పెట్టారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం చేసేందుకు సాధ్యమౌతుందని వారిని సూచించారు. కాంగ్రెస్ ను గెలిపించేందుకు మీరంతా పని చేయాలని మహిళా కూలీలతో రేవంత్ రెడ్డి చెప్పారు. కాగా ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాయాల్లో నిన్న రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు.

Chandrababu: తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి చంద్రబాబు లేఖ.. ప్రస్తావించిన విషయాలు ఇవే..

చిత్తూరు: తమిళనాడు చీఫ్ సెక్రెటరీకి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. కుప్పం నుంచి తమిళనాడు (Tamilanadu) కు గ్రానైట్ అక్రమ రవాణా జరగుతుందని లేఖలో ఆయన ప్రస్తావించారు..

కుప్పం సరిహద్దులోని నడుమూరు నుంచి కృష్ణగిరికి కొత్తూరు ద్వారా వేపనపల్లికి గ్రానైట్ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.

మోట్లచేను నుంచి వేలూరుకు గ్రానైట్ తరలిస్తున్నారని లేఖ ద్వారా చంద్రబాబు వెల్లడించారు. గ్రానైట్ అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు..

Andhra News: ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.4,42,442 కోట్లు: కేంద్రం..

దిల్లీ: పార్లమెంటు సాక్షిగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి బయటపెట్టింది. 2019తో పోలిస్తే ఏపీ అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయని కేంద్రం వెల్లడించిది..

ఈ మేరకు రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

''2019లో రాష్ట్ర అప్పులు ₹2,64,451 కోట్లు ఉండగా.. 2020లో ₹3,07,671 కోట్లు, 2021లో ₹3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తర్వాత ₹3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు ₹4,42,442 కోట్లుగా ఉంది. ఏటా సుమారు ₹45వేల కోట్లు అప్పులు చేస్తోంది'' అని పంకజ్ చౌదరి వెల్లడించారు.

సీఎం జగన్‌ అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు సమావేశం..

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశమైంది.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Pawan Kalyan: సీఎం జగన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పవన్..

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక శుభాకాంక్షలు (Special Greetings) చెప్పారు..

ఈ మేరకు సెటైరికల్‌గా ట్వీట్ (Tweet) చేశారు. అప్పులతో 'ఆంధ్ర (Andhra)' పేరు మారుమోగిస్తున్నందుకు... సీఎం జగన్‌కు 'నా ప్రత్యేక శుభకాంక్షలు .. keep it up' అంటూ వ్యంగంగా అభినందనలు తెలిపారు. ''మీ వ్యక్తిగత సంపదను పెంచుకోవడం మర్చిపోవద్దు.. రాష్ట్ర సంపద, ప్రగతి 'కుక్కల'కి వెళ్లనివ్వండి.. కానీ మీ వ్యక్తిగత సంపద, ఆస్తులు.. ఎప్పటికీ అవే స్పూర్తి.. సీఎం అప్పు రత్నా'' అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై కొంత కాలంగా విమర్శల వేడి పెంచారు. సోషల్ మీడియా (Social Media), ట్వీట్ల (Tweets) ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గత తొమ్మిది నెలల కాలంలో చేసిన అప్పు అంటూ పవన్ తన ట్వీట్‌లో జగన్ ప్రభుత్వంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా సీఎం జగన్ ఎక్కడా ఏ సభలోనైనా ప్రసంగించినప్పుడు పవన్‌ పేరును ప్రస్తావించకుండా చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ విమర్ళలు చేస్తారు. అలాగే పవన్ సోషల మీడియా వేదికగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తారు. అందులో భాగంగానే ఇవాళ పై విధంగా ట్వీట్ చేశారు. అయితే పవన్ ట్వీట్‌పై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

నారాయణ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ కళాశాలను వెంటనే సీజ్ చేయాలి

•లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం

•PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు: మల్లెల ప్రసాద్

నారాయణ విద్యాసంస్థల వేధింపులకు మరో విద్యార్థినీ బలాన్మరనానికి పాల్పడడం జరిగింది. అనంతపురం జిల్లా సమీపంలో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఆ కళాశాలపై నుంచి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది,

దీనిపై ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గం లో పి డి ఎస్ యు విద్యార్థి సంఘo ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పిడిఎస్యు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్, మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలలో ప్రతి ఏడాది ఫీజుల ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది, దీనిపై అనేక సంఘాల పలుమార్లు విద్యాధికారులను హెచ్చరించిన

నారాయణ విద్యాసంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం వల్ల రాత్రి కూడా అదేవిధంగా నారాయణ కళాశాలల పై నుంచి దూకి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది, ఇలాంటి ఇంకొకసారి పునరావృతం కాకుండా వెంటనే దీనికి కారకులైనటువంటి నారాయణ విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ కళాశాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు: మల్లెల ప్రసాద్. కనేకల్ మండలం అధ్యక్షుడు: శ్యాం ప్రసాద్ సుమంత్ పాల్గొన్నారు.

కళాశాలలో నెలకొన్న మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్

PDSU ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అధ్యక్షులు : శ్యామ్ ప్రసాద్

కణేకల్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థి, విద్యార్థినులకు టాయిలెట్లు, బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు సరి అయినా తరగతి గదులు లేక చాల ఇబ్బంది కరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది, అంతే కాకుండా కణేకల్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కాంపౌండ్ కూడా లేని పరిస్థితి ఉంది.

కొన్ని తరగతి గదులు ఉన్నా కూడా వాటికి పెయింటింగ్ కొట్టించలేని దుస్థితి ఏర్పడింది. కళాశాల ఆవరణలో గ్రౌండ్ లేని దుస్థితి ఏర్పడిoది, వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ప్రొద్దు కళాశాలలో నెలకొన్న మౌలిక వసతులను కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఇంద్రకీలాద్రిపై 15మందితో ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.15 మంది సభ్యులతో కూడిన దుర్గగుడి ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు..

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే..

గత ఐదు రోజుల క్రితం.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడి ఈవోకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు కనకదుర్గ ఆలయ ఈవో భ్రమరాంబ ఈ నెల 8న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది..