పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో

అమరావతిలో జరగనున్న డ్రోన్ షో విజ‌య‌వంతం చేయాల‌ని డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్‌ ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉద‌యం సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజ‌రు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమ‌గ్నమయ్యారు.

ఏపీ ప్రభుత్వం (AP Govt.,) డ్రోన్ స‌మ్మిట్‌కు (Drone Summit) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మంగళ, బుధవారాలు పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తుంది. విజ‌య‌వాడ ప్రజ‌లంద‌రూ తిల‌కించ‌డానికి న‌గ‌ర‌మంతా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బెజవాడలో ఐదు ప్రాంతాల్లో భారీ డిజిట‌ల్ తెర‌లు ఏర్పాటు చేస్తోంది. బెంజిస‌ర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు, వార‌ధి, బ‌స్టాండ్‌, ప్రకాశం బ్యారేజీల వ‌ద్ద భారీ తెర‌లు ఏర్పాటు చేస్తోంది. డ్రోన్ షో విజ‌య‌వంతం చేయాల‌ని డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్‌ (Dinesh Kumar) ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉద‌యం సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 ప్రారంభం కానుంది. ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) హాజ‌రు కానున్నారు. ఏర్పాట్లలో 300 మంది సిబ్బంది, అధికారులు నిమ‌గ్నమయ్యారు. 10 మంది డిప్యూటీ క‌లెక్టర్లకు ప్రత్యేక బాధ్యత‌లు అప్పగించారు. ఏర్పాట్లను డ్రోన్ కార్పొరేష‌న్ అధికారులు నిరంత‌రం ప‌ర్యవేక్షిస్తున్నారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌- 2024’ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, విజయవాడ పోలీస్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేశారు. సదస్సు జరిగే ప్రాంతాన్ని వివిధ శాఖల కార్యదర్శులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఐఅండ్‌ఐ కార్యదర్శి సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న డ్రోన్ల సమ్మిట్‌కు వివిధ శాఖల నుంచి 10 మంది ప్రత్యేక నోడల్‌ అధికారుల నియామకానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఎండీ దినేష్‌ కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమ్మిట్‌ ఏర్పాట్లను వివరించారు.

డ్రోన్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు.

22న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ్‌ పార్కు వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, 5 వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ షోతో పాటు లేజర్‌ షో తదితర కార్యక్రమాలు ఉంటాయి.

సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది వక్తలు, ప్రతినిధులు పాల్గొంటారు. వెయ్యి మంది వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నిపుణులు వస్తారు.

డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్‌, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, ఆరోగ్యం తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగంపై 9 చర్చా సెషన్లు ఉంటాయి.

డ్రోన్ల సాంకేతికత వినియోగంపై కీలకమైన నాలుగు ప్రజెంటేషన్లు, ప్రత్యేక ఇంటరాక్టివ్‌ సెషన్‌ ఉంటాయి.

వేదిక వద్ద దేశవ్యాప్తంగా డ్రోన్‌ తయారీదారుల ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శనశాలల ఏర్పాటు.

2030 నాటికి భారత్‌ను గ్లోబల్‌ డ్రోన్‌ హబ్‌గా రూపొందించడం, డ్రోన్‌ నిబంధనలపై బృంద చర్చలు.

ప్రజాభద్రత, విపత్తుల నిర్వహణ, డ్రోన్‌ సాంకేతికత అప్లికేషన్ల వినియోగం, పర్యాటక, వినోద రంగాల్లో డ్రోన్ల ఆవిష్కరణలు తదితర అంశాలపైనా చర్చలు ఉంటాయి.

వ్యవసాయం, ఆరోగ్యం, లాజిస్టిక్‌ రంగాల్లో డ్రోన్ల వినియోగం, డిజిటల్‌ భూరికార్డుల రూపకల్పనలో డ్రోన్ల వినియోగంపై బృంద చర్చలు జరుగుతాయి.

రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది: కేటీఆర్‌

అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఒక్కటి కూడా అమలుచేయకపోగా, ఉన్నవాటిని కూడా ఎగ్గొట్టడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్ట ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు.

అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఒక్కటి కూడా అమలుచేయకపోగా, ఉన్నవాటిని ఎగ్గొట్టడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్ట ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు.

ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఊదరగొట్టి, ఉన్న రూ.10 వేలను కూడా ఊడగొట్టారని ఫైరయ్యారు. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే అన్నదాత వెన్ను విరవడమేనని చెప్పారు. కాంగ్రెస్‌ రైతు ద్రోహి అని, ఆ పార్టీ చరిత్ర నిండా అనేక రుజువులు ఉన్నాయని తెలిపారు.

ఇప్పుడు పంట పెట్టుబడి మరొకటని చెప్పారు. ఎన్నికల సమయంలో రైతుబంధు కావాలా.. రాబందు కావాలా.. అంటూ బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా ఎక్స్‌ వేదిగా ప్రశ్నించారు. రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలిందని చెప్పారు.

వడివడిగా మెట్రో రెండో దశ

మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది.

మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సెకండ్‌ ఫేజ్‌లో తొలుత ప్రతిపాదించిన 5 కారిడార్ల నిర్మాణానికి కావాల్సిన రూ.24,237 కోట్లలో 48% నిధులను అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెట్రో రెండో దశ పనులపై ప్రత్యేక దృష్టిసారించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోని మార్గాలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

నాగోల్‌–ఆర్‌జీఏఐ (ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌) 36.6 కి.మీ, రాయదుర్గ్‌–కోకాపేట్‌ నియోపోలీస్‌ 11.6 కి.మీ, ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట (ఓల్డ్‌సిటీ కారిడార్‌) 7.5 కి.మీ, మియాపూర్‌–పటాన్‌చెరు 13.4 కి.మీ, ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌ 7.1 కి.మీ, ఎయిర్‌పోర్టు–ఫోర్త్‌సిటీ (స్కిల్‌ యూనివర్సిటీ) 40 కిలోమీటర్ల పనులను రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డీటైయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను సిద్ధం చేశారు. రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం పొందిన వెంటనే అనుమతుల కోసం కేంద్రానికి పంపనున్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు.

రెండో దశలో ప్రతిపాదించిన మొత్తం 6 కారిడార్లలో.. తొలుత నాగోల్‌–ఆర్‌జీఏఐ, రాయదుర్గ్‌–కోకాపేట్‌ నియోపోలీస్‌, ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట, మియాపూర్‌– పటాన్‌చెరు, ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌ మార్గాల పనులను ప్రారంభించనున్నారు. ఎయిర్‌పోర్టు–ఫోర్త్‌సిటీ (స్కిల్‌ యూనివర్సిటీ) 40 కిలోమీటర్ల పనులను సెకండ్‌ ఫేజ్‌ డీపీఆర్‌లో పెడుతున్నప్పటికీ.. ఈ పనులను కాస్త ఆలస్యంగా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే 5 కారిడార్లకు సంబంధించిన రూ.24,237 కోట్ల నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 18%, రాష్ట్ర ప్రభుత్వం 30 % ఖర్చు భరించనుంది. మరో 4 శాతం ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) ద్వారా, 48 శాతం అంతర్జాతీయ బ్యాంకుల నుంచి సేకరించాలని భావిస్తున్నారు. కాగా, మొదటి దశలోని 69.2 కిలోమీటర్ల పనులను ఎల్‌అండ్‌టీ పూర్తిగా పీపీపీ మోడల్‌లో చేపట్టింది.

ఈ మేరకు అప్పటి ప్రభుత్వం నిర్వహణ ఖర్చులకుగాను ఎల్‌అండ్‌టీకి రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కింద నగరంలోని వివిధ ప్రాంతాల్లో 267 ఎకరాలు కేటాయించింది. తొలుత 35 ఏళ్లపాటు లీజు అగ్రిమెంట్‌ కుదుర్చుకోగా.. నిర్మాణ వ్యయం ఎక్కువైన తరుణంలో తర్వాత మరో 25 ఏళ్ల పాటు పొడిగించింది. అంటే మొత్తం 60 ఏళ్లపాటు ప్రభుత్వ స్థలాలను వినియోగించుకుని మెట్రో రైలు నిర్వహణను చేపట్టాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే రెండో దశలో పీపీపీ వాటా కేవలం 4% మాత్రమే ఉండడంతో అంతర్జాతీయ బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనున్న 48% వాటాకు సమానంగా మరో 48 శాతం బ్యాంకుల ద్వారా సేకరించాల్సి వస్తోంది. దీంతో 1.5 లేదా 2% తక్కువ వడ్డీతో రుణాలు అందించే బ్యాంకుల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఇప్పటికే జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) బ్యాంకు ప్రతినిధులతో ప్రభుత్వ పెద్దలు సమావేశమైన నేపథ్యంలో దానినుంచే ఎక్కువ మొత్తంలో సేకరించే అవకాశాలున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు.

అర్బన్‌ మొబిలిటీకి సంబంధించిన పనుల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. గత ప్రభుత్వం నగర రవాణాలో అత్యంత కీలకమైన మెట్రో రెండో దశ విస్తరణ పనులను పట్టాలెక్కించే విషయంలో ఆసక్తి చూపించలేదనే ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేని కారణంగా రెండో దశలో కనీసం కిలోమీటరు పనులు కూడా జరగలేదని అప్పట్లో విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర సర్కారు సహకారంతో ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. మెట్రో నిర్మాణానికి కావాల్సిన అనుమతులతో పాటు అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో రుణాలు సేకరించేందుకు సాయం కోరేందుకు సిద్ధమైంది. ప్రధానంగా జైకా లాంటి ఇంటర్నేషనల్‌ బ్యాంకులను ఒప్పించేందుకు సహకారం అందించాలని కోరుతోంది. కాగా, 5 కారిడార్ల పనులను ప్రారంభించిన తర్వాత ఫోర్త్‌సిటీ కారిడార్‌ను నెమ్మదిగా పట్టాలెక్కించనున్నారు.

గ్రూప్-1 అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సిద్దంకాగా.. మరోవైపు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాపేపట్లో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈకేసును విచారించనుంది. ఈక్రమంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పును ఇస్తుందనే ఉత్కంఠ..

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ పూర్తి ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటుచేసింది. అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.

2011 తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. దీంతో ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటు చేసింది.

టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ టీవీలను పర్యవేక్షించనుంది. పరీక్షల నిర్వహణలో ప్రతి షిఫ్ట్‌లో కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలను అధికారులు జారీచేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

హైడ్రా మరో సంచలన నిర్ణయం.. ఆ నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం

వర్షం పడితే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని అధికారులు గుర్తించారు.

వర్షం పడితే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని అధికారులు గుర్తించారు.

శనివారం లక్డీకాపూల్‌, రాజ్‌భవన్‌ తదితర ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పి.విశ్వప్రసాద్‌ పర్యటించారు. ఓ డ్రైన్‌ పూర్తిగా పూడుకుపోయి ఉండగా.. మరో డ్రైన్‌లో చెత్తాచెదారం పేరుకుపోయింది. చాన్నాళ్ల క్రితం నుంచి ఈ పరిస్థితి ఉందనే అంచనాకు వచ్చారు. నగర వ్యాప్తంగా వరద నీటి ప్రవాహ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక తయారు చేయాలని నిర్ణయించారు

గ్రేటర్‌లో 1,302 కిలోమీటర్ల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉండగా.. మేజర్‌ నాలాలు 370 కి.మీ, మైనర్‌ డ్రైన్‌లు 912 కి.మీలకు పైగా ఉన్నాయి. వీటిల్లో వ్యర్థాలనుత తొలగించేందుకు ఏటా రూ.50 కోట్ల నుంచి రూ.55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో డ్రైన్‌ల దుస్థితి నేపథ్యంలో పూడికతీత జరుగుతోందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల డ్రైన్‌లు పూర్తిగా పాడైనా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇతర ప్రాంతాల్లోనూ మైనర్‌ డ్రైన్‌లు ఎలా ఉన్నాయన్నది పరిశీలించేందుకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇప్పటి వరకు పూడికతీత పేరిట ఎంత ఖర్చు చేశారు..? ఎంత మేర వ్యర్థాలు తొలగించారు..? అన్నదీ పరిశీలించే అవకాశముంది. కాగా, గతంలో పూడిక తీయకుండానే తీసినట్టు చూపి బిల్లులు చెల్లించినట్టు గుర్తించారు. ఈ విషయంలో పలువురు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై కేసులు నమోదైనప్పటికీ అధికారుల తీరు మారకపోవడం గమనార్హం.

రోడ్ల మరమ్మతులకు నిధులు!

రహదారుల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ, ప్రధానమైన రహదారులన్నీ పంచాయతీరాజ్‌, రహదారులు భవనాల శాఖల పరిధిలో ఉన్నాయి.

రహదారుల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ, ప్రధానమైన రహదారులన్నీ పంచాయతీరాజ్‌, రహదారులు భవనాల శాఖల పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రెండు శాఖల ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతులకు నిధులు ఏ మేరకు అవసరం అన్నదానిపై అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రహదారులు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయని, వాటి రిపేర్లకు నిధులను మంజూరు చేయాలంటూ పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల మంత్రులకు లేఖల రూపంలో విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మరమ్మతులకు అవసరమైన నిధులను అంచనా వేసి, పనులు ప్రారంభించే దిశగా ఇరు శాఖలు చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,320 కి.మీ.ల మేర 641 చోట్ల రహదారులకు మరమ్మతులు చేయాల్సి ఉందని, రూ.1,375 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నిధులను నియోజకవ ర్గాలవారీగా పలు దఫాలుగా మంజూరు చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఆయా పనులకు టెండర్లను ఆహ్వానించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆర్‌ అండ్‌ బీ శాఖ కూడా నియోజకవర్గాల వారీగా రోడ్ల మరమ్మతులకు ప్రాథమికంగా ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంచనాలను సిద్ధం చేసింది.

దాని ప్రకారం రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి రూ.30-40 కోట్ల చొప్పున 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు రూ.3,570-4,760 కోట్ల నిధులు అవసరమవుతాయని తేల్చినట్టు సమాచారం. ఆర్‌ అండ్‌ బీ పరిఽధిలో రహదారులకు చేపట్టాల్సిన మరమ్మతులు, కొత్త రోడ్ల ప్రతిపాదనలకు సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉందన్న జాబితాలను సిద్ధం చేస్తున్నారు. తొలుత అత్యవసరమైన రోడ్లకు నిధులను మంజూరు చేయాలని, అనంతరం మిగిలిన నియోజకవర్గాల్లోని రోడ్ల రిపేర్లకు నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. నిధుల సర్దుబాటు పూర్తికాగానే పనుల కోసం టెండర్లను ఆహ్వానించనున్నారు.

గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు కొంతకాలం ముందు రాష్ట్రవ్యాప్తంగా రూ.2,888.34 కోట్లతో రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలకు మరమ్మతులు చేయాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించి నిధులను కూడా ఆర్‌ అండ్‌ బీకి మంజూరు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో ఆ పనులు జరగలేదు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న రోడ్ల మరమ్మతుల పనులు ప్రస్తుత ప్రభుత్వానికి భారంగా మారాయని ఆర్‌ అండ్‌ బీలో చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కలిపి ఆర్‌ అండ్‌ బీ పరిధిలో దాదాపు 2,555 కి.మీ.ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో కొన్నింటికి మరమ్మతులు చేపట్టగా కొన్ని నియోజకవర్గాల్లో పనులు నిర్వహించలేదు. ఆ నియోజకవర్గాలను గుర్తించి, వాటికి నిధులను మంజూరు చేయటంపై కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు సుమారు రూ.2,500 కోట్ల నిధులు అవసరమవుతాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదికలో పేర్కొంది. ఆ మేరకు కేంద్రం సహాయాన్ని కూడా కోరే అవకాశం ఉంది.

నేటి నుంచి గ్రూప్-1 పరీక్షలు... నిబంధనలు గుర్తుంచుకోండి

ఈరోజు ప్రారంభమయ్యే గ్రూప్-1 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తోంది. పరీక్షలు వాయిదా వేయాలనే ఆందోళన నేపథ్యంలో... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద ఆయా కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండకూడదు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్ సహా ఆరుగురు పోలీసులు ఉంటారు. అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. నేటి నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

అభ్యర్థులను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశాక పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.

- హాల్ టికెట్‌లో పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

- ఇన్విజిలేటర్లు కచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.

- అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ రంగు బాల్ పాయింట్ పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలి.

- బొమ్మలు పెన్సిల్ లేదా పెన్నుతో వేయాలి. జెల్, స్కెచ్ పెన్స్ ఉపయోగించవద్దు.

- పరీక్షలు పూర్తయ్యే వరకు ఒకే హాల్ టికెట్‌ను ఉపయోగించాలి. హాల్ టికెట్‌పై పేర్కొన్న స్థలంలో రోజూ అభ్యర్థితో పాటు ఇన్విజలేటర్ సంతకం చేయాలి.

- జవాబులు రాసేందుకు బుక్ లెట్ ఇస్తారు. అడిషనల్స్ ఇవ్వరు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలోనే సమాధానాలు రాయాలి. - వేర్వేరు భాషల్లో రాస్తే ఆ జవాబు పత్రాలను టీజీపీఎస్సీ అనర్హమైనవిగా గుర్తిస్తుంది.

- పరీక్ష రాయడానికి సహాయకులు అవసరమైన దివ్యాంగ అభ్యర్థుల హాల్ టిక్కెట్లపై 'స్క్రైబ్' విషయాన్ని పేర్కొంటారు. దివ్యాంగుల కోసం 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరు సదరం ధ్రువపత్రం తీసుకు రావాల్సి ఉంటుంది.

తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. 4 రోజుల పాటు జిల్లాల్లో వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలోనూ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లో సాయంత్రం తర్వాత వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. రానున్న 24 గంటల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఛాన్స్ ఉందని ప్రకటించారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి రేపటికి వాయుగుండంగా మారుతుందన్నారు. 23న తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని వెల్లడించారు. వాయవ్య దిశగా పయనించి 24న ఒడిశా-బెంగాల్ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 25 వరకు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

నేడు నిఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

రేపు కూడా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు సైతం అధికారులు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. వర్షంతో పాటుగా గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు చెప్పారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, మన్యం, విశాఖపట్నం, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.

సాములోరికి స్టార్‌ హోటల్‌

స్వాములు అంటే సర్వసంగ పరిత్యాగులు. ఆడంబరాలు, విలాసాలకు దూరంగా ఉంటారు. ఆశ్రమాలు ఏర్పాటుచేసుకొని ఆధ్యాత్మిక బోధనలతో ధర్మప్రచారం నిర్వహిస్తుంటారు.

స్వాములు అంటే సర్వసంగ పరిత్యాగులు. ఆడంబరాలు, విలాసాలకు దూరంగా ఉంటారు. ఆశ్రమాలు ఏర్పాటుచేసుకొని ఆధ్యాత్మిక బోధనలతో ధర్మప్రచారం నిర్వహిస్తుంటారు. అయితే, స్వాములందు ఈ స్వామి వేరయా అన్నట్లు శారదాపీఠం సాములోరు అవతరించారు. తొలుత వేద విద్య కోసం అంటూ గత ప్రభుత్వాన్ని భూమిని కోరారు. ఆ తర్వాత ఆ భూమిని మార్పించుకొని నచ్చిన భూమిని తీసుకున్నారు. అయితే, ఆయన అక్కడితో ఆగలేదు... ఆధ్యాత్మికం పేరిట భారీగా సొమ్ములు సంపాదించుకునేందుకు, బోర్డింగ్‌ హౌస్‌ల పేరిట సముద్రతీరం కనిపించేలా భారీ స్టార్‌ హోటల్‌ నిర్మించుకునేందుకు ఆయన సకల అనుమతులు పొందారు. తీసుకునే అనుమతి రికార్డుల్లో ఒకటి ఉంటుంది. ఆచరణలో దాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్తారు. ఇది ఆయన ఆచరణే. ఇలా సాములోరికి అడ్డగోలు మేలుచేయడానికి వీల్లేదని, ప్రజల ఆస్తులను సాములోరికి సమర్పించకూడదన్న కనీస స్పృహ నాటి రెవెన్యూ అధికారులకు లేకుండా పోయింది. నాటి ముఖ్యమంత్రి జగన్‌కు సాములోరు గురువు సమానులు కాబట్టి వారికి సందేహాలు వచ్చే చాన్స్‌ కూడా లేదు. అందుకే సాములోరు కోరినవన్నీ ఆనాడు అధికారులు చకచకా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ మరో నెల రోజుల్లో రావచ్చన్న సంకేతాలుండటంతో రెవెన్యూశాఖ పోటీపడి సాములోరి సేవలో ఆనాడు తరించిపోయింది. ఇందుకు ప్రత్యక్ష నిద ర్శనం ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన రెవెన్యూశాఖ ఇచ్చిన జీఓ 47.

శారదాపీఠం శ్రీ శంకరచార్యుల బోధనలకు అనుగుణంగా సనాతన ధర్మ సూత్రాలు ప్రచారం చేస్తుందని, సంస్కృత పాఠశాలను ఏర్పాటుచేసి, ప్రజల్లో వేద విద్య, వేద సంస్కృతిని పెంపొందిస్తామని కారణాలు చెప్పి పీఠం ప్రభుత్వం నుంచి 2021లో 225 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని విశాఖ జిల్లా భీమిలీ మండలం కొత్తవలసలో పొందింది. ఇక భూ కేటాయింపులో రెవెన్యూశాఖ ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడింది. వాటిని ఇదివరకే ‘ఆం రఽధజ్యోతి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇప్పుడు, కొత్త విషయం ఏమంటే, తమకు కేటాయించిన భూమిలో ముందు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతోపాటు ఆదాయార్జన పనులు కూడా చేపడుతామని, కాబట్టి, అందుకు అనుమతి ఇవ్వాలని పీఠం 2023, నవంబరు 20న విశాఖ కలెక్టర్‌ను కోరింది. ఈ విషయాన్ని కలెక్టర్‌ సీరియస్‌గా తీసుకోలేదు. నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన అధికారి విశాఖ కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకురాగా, పీఠం రాసిన లే ఖపై తన రిమార్క్‌లు ప్రస్తావిస్తూ ఈ ఏడాది జనవరి 19న రెవెన్యూశాఖకు నివేదిక పంపారు. అంతే, 24 గంటల వ్యవధిలో శారదాపీఠం పంపించిన లేఖను ఆంధ్రప్రదేశ్‌ భూ నిర్వహణా వ్యవస్థ (ఏపీ ల్యాండ్‌మేనేజ్‌మెంట్‌ అథారిటీ-ఏపీఎమ్‌ఏ)లో ఆమోదించి, రెవెన్యూశాఖకు పంపించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 6వ తేదీన రెవెన్యూశాఖ సాములోరి విన్నపాలను ఆచరణలోకి తీసుకొస్తూ జీవో జారీచేసింది.

బోర్డింగ్‌ హౌస్‌ పేరిట సాములోరు కొత్తవలసలో తనకిచ్చిన భూమిలో స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు సకల సన్నాహాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు గుర్తించాయి. ఇటీవల ఈ ప్రాంతాన్ని ఓ సీనియర్‌ అధికారి సందర్శించారు. అక్కడ బోర్డింగ్‌ హౌస్‌ పేరిట భారీ స్టార్‌హోటల్‌ నిర్మాణానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు గుర్తించారు. నేరుగా హోటల్‌ అంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి ఎనిమిది అంతస్తుల బోర్డింగ్‌ హౌస్‌ నిర్మాణానికి రెడీ అవుతున్నట్లుగా గుర్తించారు. బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి కూడా అనుమతి పొందారు. దీనికి బోర్డింగ్‌ హౌస్‌ అని పేరుపెట్టారు. ఈ విషయం తెలిసి ఓ రెవెన్యూ అధికారి పీఠం ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. మీరు స్టార్‌హోటల్‌ కట్టకూడదు. అది తప్పు అని వారించినట్లు తెలిసింది. ‘‘ఆదాయార్జనకు భూమిని వినియోగించుకోవచ్చని (జగన్‌) ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాంటప్పుడు ఆదాయం తెచ్చిపెట్టే ఏ మార్గాన్ని అయినా మేం అనుసరించవచ్చు కదా. ఇందులో ఉల్లంఘన ఏముంది?. మీరే అనుమతి ఇచ్చి, మీరే వద్దంటారా? ఇదెక్కడి న్యాయం?’’ అని పీఠానికి చెందిన ఓ వ్యక్తి... ఆ అధికారికి చెప్పినట్లు తెలిసింది. దీంతో అప్పటి కప్పుడు పీఠానికి ఇచ్చిన అనుమతుల ఉత్తర్వుల ఫైలు, వాటి కి సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను తెప్పించి పరిశీలన చేశారు. ఇందులోనూ పెద్దగోల్‌మాలే నడిచినట్లు తెలిసింది.

ఆదాయార్జనకు అనుమతి ఇవ్వాలని తొలుత శారదాపీఠం ప్రతినిధులు నాటి సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్‌ను కలిసి విన్నవించారు. ఇందుకు ఆయన తిరస్కరించారు. అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఆ తర్వాత ఎల్‌ఎమ్‌ఏలోనూ దీన్ని అజెండాగా చేర్చాల్సిన అవసరం లేదని తేల్చారని తెలిసింది. ఇదంతా ఈ ఏడాది జనవరి తొలివారంలో జరిగింది. అయితే, సాయిప్రసాద్‌ జనవరి రెండోవారంలో సెలవుపెట్టారు. దాన్ని అదేనెల 25 వరకు పొడిగించుకున్నారు. అప్పుడు ఓ జూనియర్‌ అధికారికి ఇన్‌చార్జి సీసీఎల్‌ఏ పదవిని కట్టబెట్టారు. సరిగ్గా ఇదే సమయం అనుకున్న పెద్దలు ఆ ఇన్‌చార్జి సీసీఎల్‌ఏ ద్వారా మంత్రాంగం నడిపించారు. జనవరి 19న కలెక్టర్‌తో లేఖ తెప్పించుకొని, 20వ తేదీన ఆదాయార్జనకు అనుమతి ఇవ్వాలన్న పీఠం డిమాండ్‌కు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వానికి ఫైలు పంపించారు. ఇది జరిగిన ఐదు రోజుల తర్వాత సాయిప్రసాద్‌ సెలవు ముగించుకొని వచ్చి ఉద్యోగంలో చేరారని తెలిసింది. ఇదంతా ఇప్పుడు బయటపడటంతో రెవెన్యూ అధికారులు విస్తుపోతున్నారు. ఇది ఫక్తు ప్రైవేటు వ్యాపారమేనని ముక్కున వేలేసుకుంటున్నారు!

తెలంగాణ ఐఏఎస్ అధికారికి ఏపీలో తొలి పోస్టింగ్-ఎక్కడో తెలుసా ?

గతంలో ఏపీ-తెలంగాణ విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన నలుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణకు వెళ్లిపోయారు. పాలనా పరమైన కారణాలతో ఇన్నాళ్లూ తెలంగాణలో ఉండిపోయిన ఆ నలుగురు ఐఏఎస్ లను తాజాగా కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఏపీకి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. దీన్ని వారు క్యాట్ తో పాటు తెలంగాణ హైకోర్టులోనూ సవాల్ చేసినా ఊరట దక్కలేదు. దీంతో నలుగురు ఐఏఎస్ లు కాటా అమ్రపాలి, ప్రశాంతి, వాణీ ప్రసాద్, వాకాటి కరుణలు ఏపీలో రిపోర్ట్ చేశారు.

అయితే ఇలా ఏపీలో రిపోర్ట్ చేసిన ఈ నలుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు.

కానీ ఇవాళ అందులో ఒకరైన ఎం ప్రశాంతికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమెను అటవీ, పర్యావరణశాఖలో అదనపు కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె రేపు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

మరోవైపు మిగిలిన ముగ్గురు ఐఏఎస్ లకు ఏపీ ప్రభుత్వం ఎక్కడ పోస్టింగ్ లు ఇవ్వబోతోందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇందులో కాటా ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ లను తెలంగాణ ప్రభుత్వం డిప్యూటేషన్ మీద వెనక్కి రప్పించనుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో వీరికి ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అలాగే మరో తెలంగాణ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం రేపు, ఎల్లుండిలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.