తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 13:02

పెళ్లికి ఒప్పుకోని పెద్దలు, ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.

కామరెడ్డి జిల్లా దోమకొండ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు, బంధులవులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంబార్‌పేటకు చెందిన వీణ, కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోని హాయిగా జీవించాలని ఎన్నో కలలకన్నారు.

పెద్దల వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగ అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీణ తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ప్రాణం తీసుకోగా.. సాయి కుమార్ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు గ్రామాలకు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

బాలికలతో కేర్‌టేకర్‌ అనుచిత ప్రవర్తన

ఇక హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ బాలికల అనాథాశ్రమంలో ఉన్న విద్యార్థినులతో గత కొంతకాలంగా కేర్‌టేకర్‌ అనుచితంగా ప్రవర్తిస్తోంది. అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట బాలికల దుస్తులిప్పించి నగ్నంగా నిలబెడుతూ చిత్రహింసలకు గురిచేస్తోంది. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల చొరవతో ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. వివరాల్లోకి వెళితే.. అనాథల పిల్లల కోసం ఓ మహిళ కిస్మత్‌పూర్‌లో 15 సంవత్సరాల క్రితం ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 45 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థుల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న బాలికలు ఉన్నారు.

రెండేళ్ల క్రితం ఓ మహిళను పిల్లల బాగోగులు చూసేందుకు కేర్ టేకర్‌గా నియమించారు. ఆమె బాలికలను చిత్రహింసలకు గురి చేస్తోంది. తాను చెప్పిన మాట వినకపోతే దుస్తులు పూర్తిగా విప్పించి.. ఆశ్రమంలోనే పని చేస్తున్న ఇద్దరు పురుషుల ఎదుట నిగ్నంగా నిలబెడుతోందని బాలికలు వాపోయారు. సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు పెట్టి వాటిని చూడాలని బలవంతం చేస్తోందని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల సాయంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేర్‌టేకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 12:55

నేడు సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం

2013లో ఆప్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అతిషి అధిష్టించనున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియాకు ఆమె సలహాదారుగా వ్యవహరించారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల్లోని మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు అతిషి తీవ్రంగా కృషి చేశారు.

మరికొన్ని గంటల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు సైతం ఆమె కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఈ ఆరుగురి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అతిషితోపాటు ఆమె కేబినెట్‌‌లో గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరబ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్‌, ముఖేశ్ అహ్లావత్‌లతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా సాదా సీదాగా జరగనుందని సమాచారం.

అయితే మంత్రులుగా బాధ్యతలు చేపట్టే వీరికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతుంది. కేజ్రీవాల్ కేబినెట్‌లోని దాదాపు 14 కీలక శాఖలు అతిషినే పర్యవేక్షించే వారన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా శాఖలను ఆమె వద్దే ఉంచుకుంటారా? లేకుంటే.. వాటిని వీరికి కేటాయిస్తారా? అని చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తుంది.

2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అతిషి ఈ రోజు అధిష్టించనున్నారు. గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియాకు ఆమె సలహాదారుగా వ్యవహరించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల్లోని మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు అతిషి తీవ్రంగా కృషి చేసిన విషయం విధితమే.

మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇటీవల సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహాడ్ జైలు నుంచి విడుదలైన ఆయన... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే శాసన సభ పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతిషిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఆ నిర్ణయానికి ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

అనంతరం సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనాకు అందజేశారు. అలాగే శాసనసభ పక్షం తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఎల్జీకి కేజ్రీవాల్ వివరించారు. దీంతో ఢిల్లీ సీఎంగా ఈ రోజు అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్న అతి పిన్న వయస్కురాలు అతిషినే కావడం గమనార్హం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 12:43

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చెక్‌ అంద‌జేత‌

ఇటీవ‌ల భారీ వ‌ర‌ద‌లు ఏపీ, తెలంగాణ‌ను ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా విజ‌య‌వాడ న‌గ‌రం అస్త‌వ్య‌స్త‌మైంది. దాంతో చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ఈ క్ర‌మంలో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు త‌మ‌వంతు సాయంగా విరాళాలు అంద‌జేశారు. 

తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ షో క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది కూడా విరాళం ఇచ్చారు. రూ. 3ల‌క్ష‌ల విరాళం తాలూకు చెక్‌ను ఆయ‌న స్వ‌యంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అంద‌జేశారు. ఇక తాను ఇచ్చిన ఈ మూడు ల‌క్ష‌ల్లో వ‌ర‌ద పీడిత గ్రామ‌మైన ఏకే మ‌ల్ల‌వ‌రం (పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం) కు రూ. 1ల‌క్ష ఇవ్వాల‌ని, మిగ‌తా రెండు ల‌క్ష‌లు త‌న సొంత గ్రామం ప‌ల్లాప‌ల్లి గ్రామ పంచాయ‌తీకి ఇవ్వాల‌ని ఆది కోరారు. 

ఈ సంద‌ర్భంగా ఆది మాట్లాడుతూ.. వ‌ర‌ద‌ల కార‌ణంగా స‌ర్వం కోల్పోయిన బాధితుల‌కు రూ. 6కోట్ల విరాళం ఇచ్చి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ అందిరిలో స్ఫూర్తిని నింపార‌ని అన్నారు. ఆ స్ఫూర్తితోనే నేరుగా పంచాయ‌తీల‌కు విరాలం ఇవ్వొచ్చ‌ని తెలిసి త‌న వంతుగా రూ. 3ల‌క్ష‌లు ఇచ్చాన‌ని ఆది తెలిపారు. 

కాగా, వ‌ర‌ద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ప‌వ‌న్‌ రూ.6 కోట్లు విరాళం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌ల‌కు చెరో రూ.కోటి చొప్పున అంద‌జేశారు. అలాగే ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు ప్ర‌క‌టించారు. వీటిలో ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున ఇవ్వ‌నున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 12:37

విజయసాయి కుమార్తెకి చెందిన స్టార్ హోట‌ల్ నిర్మాణాలు కూల్చివేత..

విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్‌ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి త‌న‌ న‌క్ష‌త్ర హోట‌ల్ కోసం ఆక్రమిత స్థలంలో కాంపౌండ్ వాల్ ను నిర్మించారు.

దీంతో ఇక్క‌డ కూల్చివేతలు చేపట్టారు అధికారులు. సీఆర్‌జడ్‌ నిబంధనల ఉల్లంఘనలతో ఈ చర్యలు తీసుకున్నారు.

సర్వే నంబర్‌ 1516, 1517, 1519, 1523లో ఉన్న స్థలంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలున్నాయి. సుమారు 4ఎకరాల స్థలంలో ఈ అక్రమ కట్టడాలున్నట్లు ఆరోపణలున్నాయి.

దీనిపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఇటీవల హైకోర్టులో పిల్‌ వేశారు. ఈక్రమంలో కోర్టు ఉత్తర్వులతో 2 వారాల క్రితమే నిర్మాణాల తొలగింపు చేపట్టారు. పర్యావరణ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. మరోసారి తాజాగా శనివారం కూల్చివేతలు చేపట్టారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 09:59

నేడు, రేపు వర్షాలు..

ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మరో ఆవర్తనం పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది.

దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండ్రోజులు రాష్ట్రానికి యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. శనివారం జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, కామారెడ్డి, నారాయణపేట్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, ములుగు, ఖమ్మం జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 09:14

సీఐడీ విచారణపై భయమెందుకో!

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశిస్తుందేమోనన్న భయం మాజీ సీఎం జగన్‌ను వణికిస్తోందా

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశిస్తుందేమోనన్న భయం మాజీ సీఎం జగన్‌ను వణికిస్తోందా? సీఐడీ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉందని తెలియడంతోనే .. వైసీపీ ముఖ్యనేతల్లో భయం ఆవహించిందా..? తాజా పరిణామాలు అదే సూచిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తప్పేమైనా జరిగితే ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్మోహనరెడ్డి, టీడీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి సవాల్‌ విసరాలి. కానీ అందుకు విరుద్ధంగా శుక్రవారంనాడు జగన్‌, సుబ్బారెడ్డి వ్యవహరించారు. వారి మాటల్లో తొట్రుపాటు అడుగడుగునా కనిపించింది. మాజీ సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. లడ్డూ వ్యవహారంపై విచారణ జరగాలన్నారు. గంటా పదినిమిషాల పాటు మాట్లాడితే.. కేవలం ఒకేసారి విచారణ కోరారు. మిగిలిన సమయమంతా .. చంద్రబాబును బీజేపీ, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిట్టాలని కోరుకున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సవాల్‌ విసరడం తర్వాత.. మాటమాత్రంగానైనా అనలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తనపై విజిలెన్స్‌ విచారణ జరపకుండా స్టే విధించాలని వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత గానీ.. అది నియమించే కమిటీతో గానీ న్యాయ విచారణ జరిపించాలని సుబ్బారెడ్డి కోరారు. ఒకవైపు విజిలెన్స్‌ విచారణపై స్టే కోరుతూ.. మరోవైపు న్యాయవిచారణ అడగడంపై న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు 2014-19 నడుమ సీఎంగా ఉన్నప్పుడు జరిగినవాటిపై తన ఐదేళ్ల పాలనలో జగన్మోహన్‌రెడ్డి ఏనాడూ న్యాయ విచారణకు ఆదేశించలేదు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో గవర్నర్‌ ఆమోదం కూడా తీసుకోకుండా సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. జగన్‌ జమానాలో ఎవరైనా విమర్శిస్తూ సోషల్‌ మీడియా పోస్టులు పెట్టినా.. వాటిని లైక్‌ చేసినా.. భూఆక్రమణలున్నాయంటూ ఫిర్యాదులు వచ్చినా సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడం.. అర్థరాత్రి సమయంలో గోడలు దూకి మరీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగాయి. ఏనాడూ న్యాయ విచాణకు జగన్‌ ఆదేశించలేదు. ప్రతి చిన్న విషయానికీ సీఐడీని వాడేసుకున్న జగన్‌ అండ్‌ కో.. ఇప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన తిరుమల లడ్డూ విషయంలో సీఐడీ విచారణను ఎదుర్కొనేందుకు ఎందుకు భయపడుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జగన్‌ మాటలకూ.. సుబ్బారెడ్డి చేతలకూ పొంతన లేకపోవడంపై తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో చంద్రబాబును, టీడీపీ నేతలను పలు కేసుల్లో సీఐడీ జైలు పాలు చేసినప్పుడల్లా.. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు ప్రత్యక్షమయ్యేవారు. బెయిల్‌ కోరకుండా జైళ్లలోనే మగ్గి.. నిజాయితీ నిరూపించుకోవాలని సలహా ఇచ్చేవారు. కానీ ఇప్పుడాయన కనిపించడమే గగనమైపోయింది. కీలక అంశాలపై మీడియాతో మాట్లాడానికే ఒక్క వైసీపీ నేత కూడా ముందుకు రావడంలేదు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 20 2024, 19:34

జగన్ కు బిగ్ షాక్.. తిరుమల లడ్డు వివాదంపై కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు.

తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో కాకుండా.. ప్రపంచదేశాలలో కూడా చాలా వివాదస్పదంగా మారింది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.

అదే విధంగా గత సర్కారు పవిత్రమైన తిరుమలను పూర్తిగా అపవిత్రం చేసే విధంగా పనులు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. భక్తులు తిరుమల లడ్డు అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు.

తిరుమల లడ్డుకు కొన్నిఏళ్ల చరిత్ర కూడా ఉంది. అలాంటిది తిరుమల లడ్డులో.. పంది కొవ్వు, చేపనూనె.. వంటి ఇతర పదార్ధాలను ఉపయోగించినట్లు కూడా సంచలన విషయం దేశమంతా దుమారంగా మారింది. ఏకంగా ముఖ్యమంత్రి తిరుమలలోని లడ్డుగురించి వ్యాఖ్యలు చేయడమే కాకుండ.. ల్యాబ్ రిపోర్ట్ ను సైతం బహిరంగపరిచారు.

దీంతో ఇప్పుడిదీ చాలా వివదాస్పదంగా మారింది. శ్రీవారికి మనదేశంలోనేకాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది భక్తులు ఉన్నారు.ఈ క్రమంలో తాజాగా తిరుమల లడ్డులో ఉపయోగించే పదార్థాలలో.. పంది కొవ్వు, చేప నూనె ఉపయోగించారని వార్తలు తెలిసి..చాలా మంది భక్తులు తీవ్ర మనోవేదనకు లోనౌతున్నట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ లు సైతం వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా.. దీనిపై వైఎస్సార్సీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. చంద్రబాబు.. లడ్డు వ్యాఖ్యలపై వైసీపీ.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం.. వచ్చే బుధవారం పిటిషన్ ను విచారిస్తామని చెప్పింది. మరోవైపు లడ్డు వివాదంపై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ మండిపడ్డారు.

హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను భంగం కలిగేలా జగన్ ప్రవర్తించారన్నారు. రాజకీయ నేతలు, హిందు సంఘాలు, పలువురు మేధావులు, శ్రీవారి భక్తులందరూ నాటి జగన్ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రమంలో.. న్యాయవాది జిందాల్..

కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది.

ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా.. గత జగన్ మోహన్ రెడ్డి నీచానికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు.

వెంటనే దీనిపై టీటీడీ కూడా స్పందించాలని, జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్‌తో పాటు ఇందుకు కారకులైన వారిపై భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. అదే విధంగా.. జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 20 2024, 16:16

తిరుపతి ప్రసాదం వివాదం నడుమ, 'సనాతన ధర్మ రక్ష బోర్డు' ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్, హిందువులు ఏకం కావాలని విజ్ఞప్తి

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి దేవస్థానంలో లభించే లడ్డూలలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారంటూ వివాదం రేగుతోంది. తిరుపతి బాలాజీ ఆలయంలో లడ్డూల ప్రసాదంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్ష బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను పవన్ కళ్యాణ్ లేవనెత్తారు.

తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు మరియు గొడ్డు మాంసం కొవ్వు) కలపడం వల్ల మనమందరం ఇబ్బంది పడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఈడీ వివాదంపై అన్నారు. అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఈ కేసు దేవాలయాల అపవిత్రత, దాని భూ సమస్యలు మరియు ఇతర మతపరమైన ఆచారాలను హైలైట్ చేస్తుంది. భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షా బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో ప్రసిద్ధ తిరుపతి బాలాజీ ఆలయంలో ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఆరోపణలు చేశారు. గుజరాత్‌కు చెందిన లైవ్‌స్టాక్ ల్యాబొరేటరీ ద్వారా కల్తీ జరిగినట్లు నిర్ధారించినట్లు అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పేర్కొంది. లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేసేందుకు బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, పామాయిల్ వినియోగిస్తున్నారని టీడీపీ పేర్కొంది. దీని తర్వాత ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్ హాట్‌గా మారింది మరియు ఉన్నత స్థాయి విచారణ కోసం డిమాండ్ లేవనెత్తుతోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 20 2024, 16:12

కివి తినడం వల్ల డెంగ్యూ కాకుండా అనేక వ్యాధులకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి

కివి అనేది పోషకాలు అధికంగా ఉండే పండు, దీని వినియోగం అనేక వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. డెంగ్యూ కాకుండా, కివి వినియోగం క్రింది పరిస్థితులలో ప్రయోజనకరంగా ఉంటుంది:

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది: కివి విటమిన్ సి యొక్క మంచి మూలం, ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

గుండె ఆరోగ్యానికి: కివిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

రక్తపోటును నియంత్రించడంలో: కివి తీసుకోవడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చర్మ ఆరోగ్యం: విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా, కివి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

శ్వాసకోశ సమస్యలు: కివీని తీసుకోవడం వల్ల ఆస్తమా మరియు అలర్జీ వంటి సమస్యలలో కూడా ఉపశమనం పొందవచ్చు.

ఈ అన్ని ఆరోగ్య ప్రయోజనాలతో, కివీని క్రమం తప్పకుండా తీసుకోవడం సమతుల్య ఆహారంలో భాగం కావచ్చు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 20 2024, 16:09

నాలుగు రోజుల క్రితం పుట్టిన ఆడపిల్ల కడుపులో పిండం లాంటి ఆకారం కనిపించడం చూసి డాక్టర్ కూడా ఆశ్చర్యపోతున్నారు

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నవజాత శిశువు కడుపులో పిండం లాంటి ఆకారం కనిపిస్తుంది. అయితే దీన్ని పిండం అని పిలవడం పట్ల డాక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది టెరాటోమా ట్యూమర్ కావచ్చునని, అయితే వైద్య ప్రపంచం దీనిని అరుదైన కేసుగా అభివర్ణించింది. ప్రస్తుతం తల్లీ బిడ్డలిద్దరూ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వైద్య కళాశాలలో నవజాత శిశువుకు సీటీ స్కాన్‌, ఎక్స్‌రేలు చేస్తున్నారు.

కెస్లీకి చెందిన ఓ మహిళ ఐదు రోజుల క్రితం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాపకు జన్మనిచ్చింది. ఇంతకుముందు, ఆ మహిళ BMCకి వచ్చినప్పుడు, ఇక్కడి వైద్యులు పిండం కడుపులో పిండం లేదా కణితి వంటిది చూశారు. ఆ తర్వాత డెలివరీ కోసం ఎదురుచూశారు.

సాధారణ ప్రసవం తర్వాత మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వైద్యులు జిల్లా ఆస్పత్రికి పిలిపించారు. బుధవారం వైద్య కళాశాల రేడియాలజీ విభాగం వారు నవజాత శిశువును పరీక్షించారు. ఇందులో కూడా అతని కడుపులో పిండం, కణితి లాంటివి కనిపించాయని, దీనిపై విచారణ జరుపుతున్నారు.

పిల్లల కడుపులో టెరాటోమా ట్యూమర్ లేదా పిండంలో పిండం ఉండవచ్చునని వైద్యులు తెలిపారు. అతని కడుపులో వెన్నెముక లాంటి ఆకారం కూడా కనిపిస్తుంది.

ఈ పరిస్థితి శిశువు అభివృద్ధి సమయంలో తలెత్తుతుంది

బీఎంసీకి చెందిన రేడియాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ పుణ్య ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. కొన్నిసార్లు తల్లి కడుపులోని ఒక పిండం లోపల మరో పిండం ఏర్పడటం ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కాలంలో, పెద్ద పిండం అభివృద్ధి చెందుతుంది, కానీ దాని లోపల ఉన్న పిండం అభివృద్ధి చెందదు.

5 నుంచి 10 లక్షల మంది పిల్లల్లో ఒకరికి టెరాటోమా ట్యూమర్‌ ఉందని ఆయన చెప్పారు. భారత్‌లో ఇప్పటివరకు దాదాపు 10 కేసులు నమోదయ్యాయి.

కొన్ని సంవత్సరాల క్రితం, AIIMS భోపాల్‌లోని మోతిహారి మరియు డెహ్రాడూన్‌లో ఇటువంటి కేసులు కనిపించాయని, అటువంటి కేసు ఒక సంవత్సరం క్రితమే ఎయిమ్స్ భోపాల్‌లో వచ్చిందని డాక్టర్ ప్రమోద్ శర్మ చెప్పారు. ఇందులో బాలిక కడుపులో ఫిటిఫార్మ్ టెరాటోమా కనిపించడంతో ఆపరేషన్ చేసి విజయవంతంగా తొలగించారు.

పరిశోధన చేస్తున్న వైద్యుల బృందం

అటువంటి పరిస్థితిలో, పిల్లల కడుపులో కనిపించే పిండం లేదా కణితిని తొలగించడం సరైనదని డాక్టర్ సింగ్ చెప్పారు.

శస్త్రచికిత్స ద్వారా టెరాటోమాను సురక్షితంగా తొలగించేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తదుపరి ప్రణాళికను రూపొందిస్తున్నారు. నవజాత శిశువుకు కూడా ప్రమాదం ఉండవచ్చు.