నేతన్నల మేలు కోసం రుణమాఫీ, నేతన్నల హర్షం. ముఖ్యమంత్రి, మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం


కాగజ్ నగర్,సెప్టెంబర్11 : రాష్ట్రం లోని నేతన్నల మేలు కోసం రుణ మాఫీ ప్రకటించడం, ఇండియన్ ఇన్స్టట్యూట్ ఆఫ్ హ్యండ్లుమ్స్ కు పద్మశాలి బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం గొప్ప విషయమని, దీనికి చొరవ చూపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పద్మశాలి లు రుణపడి ఉంటానని పద్మశాలి సేవా సంఘం రాష్ట్ర నాయకులు నల్లా కనకయ్య అన్నారు. రుణమాఫీ తో పాటు చేనేత కార్మికుల అభ్యున్నతికి నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా బుధవారం రోజున కాగజ్ నగర్ మండలం లోని కోసిని బెజ్జుర్ చేనేత సహకార సంఘం అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలాభిషేకం చేశారు. వారు చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు, పద్మశాలీలు పాల్గొన్నారు.
టైరు పేలి బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ కారు
అదిలాబాద్ జిల్లా: సెప్టెంబర్09 కారు ముందు టైర్లు పేలి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడిపోయింది ఈ సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి అదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడింది. ఈ సంఘటన లో ఆరుగు రికి తీవ్రంగా గాయాలయ్యా యని పోలీసులు తెలిపారు ఇక వెంటనే అక్కడికి చేరు కున్న పోలీసులు.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది...

అదిలాబాద్ జిల్లా: సెప్టెంబర్09 కారు ముందు టైర్లు పేలి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడిపోయింది ఈ సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి అదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ

టైరు పేలి బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ కారు
టైరు పేలి బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ కారు
టైరు పేలి బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ కారు
అదిలాబాద్ జిల్లా: సెప్టెంబర్09 కారు ముందు టైర్లు పేలి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడిపోయింది ఈ సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి అదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడింది. ఈ సంఘటన లో ఆరుగు రికి తీవ్రంగా గాయాలయ్యా యని పోలీసులు తెలిపారు ఇక వెంటనే అక్కడికి చేరు కున్న పోలీసులు.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది...

అదిలాబాద్ జిల్లా: సెప్టెంబర్09 కారు ముందు టైర్లు పేలి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడిపోయింది ఈ సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి అదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ

టైరు పేలి బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ కారు
టైరు పేలి బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ కారు
అదిలాబాద్ జిల్లా: సెప్టెంబర్09 కారు ముందు టైర్లు పేలి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడిపోయింది ఈ సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి అదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడింది. ఈ సంఘటన లో ఆరుగు రికి తీవ్రంగా గాయాలయ్యా యని పోలీసులు తెలిపారు ఇక వెంటనే అక్కడికి చేరు కున్న పోలీసులు.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది...

అదిలాబాద్ జిల్లా: సెప్టెంబర్09 కారు ముందు టైర్లు పేలి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడిపోయింది ఈ సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి అదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ

మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ.


ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శనివారం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సామల తిరుపతి, కనుకుట్ల వెంకటేష్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కాలుష్య నివారణ లో భాగంగా మండల ప్రజలకు ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా మట్టి వినాయక విగ్రహాలకు పూజలు చేసి కాలుష్య నివారణకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం యువజన అధ్యక్షులు సామల రవికాంత్, సంఘం సభ్యులు కనుకుట్ల శ్రీనివాస్ ,పర్ష రమేష్ ,జోర్రీ గల శ్రీనివాస్ ,పడాల సదాశివ్, బొద్దున విజయ్, దోమల అనిల్ ,కుషణ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సౌకర్యార్థం 144 సెక్షన్ సడలింపు : జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే


సెప్టెంబర్ 7, 2024: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో జరిగిన ఘటన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు విధించిన 144 సి.ఆర్.పి.సి. సెక్షన్ అమలులో ప్రజల సౌకర్యార్థం సడలింపు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగల నేపథ్యంలో నిత్యవసరాల కొరకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు సడలింపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఘటన నేపథ్యంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను జైనూర్, కెరమెరి, సిర్పూర్ (యు), లింగాపూర్, వాంకిడి, తిర్యాణి మండలాలు మినహా జిల్లాలోఅందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకొని మత సామరస్యంతో శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.

జైనూర్ ఘటనపై అందరూ సంయమనం పాటించాలి : అదనపు డి జి


ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లాలోని జైనూర్ మండలంలో జరిగిన ఘటనపై అందరూ సంయమనం పాటించాలని అదనపు డి. జి. (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ అన్నారు. గురువారం ఐ.జి. చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల ఎస్.పి. లు అశోక్ కుమార్, అఖిల్ మహాజన్, గౌస్ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, బాలానగర్ డి. సి. పి. సురేష్ కుమార్ లతో కలిసి జిల్లాలోని జైనూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో, ఉట్నూర్ లోని కొమురంభీం కాంప్లెక్స్ లో ఆదివాసి పెద్ద మనుషులతో వేరువేరుగా జైనూర్ ఘటనపై సంయమనం పాటించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డి. జి. (లా అండ్ ఆర్డర్) మాట్లాడుతూ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసి మహిళపై దాడి జరగడం బాధాకరమని, ఆదివాసి యువత, ప్రజలు, ముస్లిం సోదరులు ఈ ఘటనపై సమయమనం పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు. బాధిత మహిళలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, వైద్య చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, కుటుంబ సభ్యులు సహకరించాలని తెలిపారు. ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టంపై పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు కాగజ్ నగర్ డి. ఎస్. పి. కరుణాకర్ ను ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని, జరిగిన నష్టంపై పారదర్శకమైన నివేదిక అందించాలని, తద్వారా బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటన సంబంధిత విషయంపై పెద్దమనుషుల సూచనలు, సలహాలు స్వీకరించి ప్రజా ఉపయోగకర చర్యలు తీసుకుంటామని, ఆదివాసీలు, ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని తెలిపారు. 

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాధిత మహిళపై లైంగిక వేధింపులు, హత్యాయత్నానికి పాల్పడిన సందర్భంలో తుడుం దెబ్బతో సహా ఆదివాసీ సంస్థలు బంద్ పిలుపునివ్వగా బంద్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు 2 వర్గాలతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఒక్కసారిగా పరిస్థితి 2 వర్గాల మధ్య ఘర్షణగా మారి ఆదివాసీలు ఇతర వర్గాల ఆస్తులపై దాడి చేయడంతో ఇతర వర్గాల నుండి ప్రతీకార చర్యగా దహనం, రాళ్లు రువ్వడం, ఆస్తుల నష్టం మొదలైన వాటికి దారితీసిందని, ఈ నేపథ్యంలో జిల్లా ఎస్. పి. తన బృందంతో మొదట స్పందించి, పొరుగున ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలు, టి.జి.ఎస్‌.పి. ప్లాటూన్‌ల నుండి అదనపు బలగాలతో తన శాయశక్తులా ప్రయత్నించారని, పొరుగు జిల్లాల ఎస్.పి.లు/డి.సి.పి.లు కూడా పరిస్థితిని అదుపు చేయడంలో తమ సహకారం అందించారని తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మొత్తం 1000 మందికి పైగా పోలీసులను మోహరించారని, ఆర్.ఎ.ఎఫ్. మోహరింపబడుతోందని, రాష్ట్ర డి.జి.పి., ఎ. డి. జి. (లా & ఆర్డర్), నార్త్ జోన్ ఐ.జి. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, నిషేధిత కర్ఫ్యూ ఆదేశాలు 144 సి.ఆర్. పి.సి. / 163 బి.ఎన్.ఎస్.ఎస్. జిల్లా యంత్రాంగం జారీ చేసిందని, నిషేధాజ్ఞలను ఉల్లంఘించవద్దని తెలిపారు. పుకార్లు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌పై నిషేధాన్ని అమలు చేయడం జరుగుతుందని, ప్రభావిత ప్రాంతంలో నిషేధాజ్ఞల ప్రకటనతో పాటు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారని, ఆత్మవిశ్వాసం నింపేందుకు పికెట్లు పెడుతున్నారని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దహనం, హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ప్రారంభించి నేరస్తులను గుర్తించి చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హింస సమయంలో జరిగిన ఆస్తి నష్టం అంచనా వేయబడుతుందని, తదుపరి అవసరమైన చర్య కోసం ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని, హత్యాయత్నంతో లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే నిందితులను జైనూర్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినందున అందరూ సంయమనం పాటించాలని కోరారు. గాంధీ ఆసుపత్రిలో బాధితురాలికి వైద్య చికిత్స కొనసాగుతోందని, అన్ని చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, బాధితురాలికి ఇప్పటికే 1 లక్ష రూపాయల పరిహారం అందించడం జరిగిందని తెలిపారు. వదంతులను నమ్మవద్దని, ఎలాంటి నిజం లేకుండా రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్ట్‌లను ప్రసారం చేస్తే శిక్షార్హమైన చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి కోసం ప్రజలు డయల్ 100ని సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు, ఆదివాసి సంఘాల ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.