వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. 10 గంటలుగా ప్రయాణికుల అవస్థలు.
వరంగల్ జిల్లా, సెప్టెంబర్01 :ఉమ్మడి వరంగల్ జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి.
రాయపర్తి మండలం మొరిపిరాల శివారులో జాతీయ రహదారిపై చెట్టు విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వరంగల్ జిల్లా తోపనపల్లి వద్ద ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
వేములవాడ నుంచి మహబూబాబాద్ కు శనివారం రాత్రి బయల్దేరిన ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా వెంకటాపురం-తోపనపల్లి మధ్య నిలిచిపోయింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 10 గంటలుగా బస్సులోనే అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగడానికి మంచినీళ్లు కూడా లేక చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నా రని తెలిపారు. అధికారులు స్పందించి తమను సురక్షి తంగా గమ్య స్థానాలకు చేర్చాలని కోరుతున్నారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తుండటంతో సూర్యుడు కనిపించకుండా పోయాడు. ఎటూచూసిన దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి.
ఉదయం, మధ్యాహ్నం అనే తేడా లేకుండా మొత్తం చీకటి అలుముకుంది. మరోవైపు, ముసురుతో పాటు, చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. చలిగాలి వీస్తుండటంతో ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు...



కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,కాగజ్ నగర్,ఆగస్టు 31: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లాలోని కాగజ్ నగర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ కొరకు ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. నూతన ఓటరు నమోదు, సవరణలు, మార్పులు, తొలగింపు అంశాలపై భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా జాబితా రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం సంబంధిత కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రమంలో ఓటరు జాబితా రూపొందించడంలో భాగంగా ఆన్ లైన్ లో టి - పోల్ పోర్టల్ లో ప్రతిరోజు లాగిన్ అయ్యి వివరాలను పరిశీలించాలని తెలిపారు. రేపు సాయంత్రం లోగా ఓటర్ల మర్జింగ్ పనులు పూర్తి చేయాలని, సెప్టెంబర్ 6వ తేదీన ఓటరు జాబితా ముసాయిదా విడుదల చేయవలసి ఉన్నందున పనులను వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, అదనపు పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, తహసిల్దార్ కిరణ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,కాగజ్ నగర్,ఆగస్టు31, : నాగ్ పూర్ పట్టణంలోని బోగన్విలియా హోటల్ లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సన్నాహక సమావేశం భారతీయ జనతా పార్టీ విదర్భ శాఖ ఆధ్వర్యంలో శనివారం రోజున జరిగిందని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.ఈ సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబుతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎన్నికల భాద్యతలు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ హాజరయ్యారని చెప్పారు.వచ్చే నెల 5వ తేదీ నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెడతామని మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ బావంకులే తెలిపారని తెలిపారు.ఈ సమావేశంలో తెలంగాణ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి, మాజీ ఎంపీలు వెంకటేష్ నేత, బీబీ పాటిల్, సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, బేతి సుభాష్ రెడ్డి, సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు కాగజ్ నగర్ డిఎస్పి కరుణాకర్ తెలిపారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అడీషనల్ ఎస్పీ ప్రభాకర్ రెడ్డి ల ఆదేశాల మేరకు కాగజ్నగర్ పట్టణంలోని భట్పల్లి చౌరస్తా సమీపంలోని కాపువాడలో శనివారం ఉదయం 5 గంటల నుండి పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బస్తీలో మొత్తం ఒకేసారిగా 50 మంది పోలీసులు ఇంటింటికి తిరుగుతు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 100 మోటార్సైకిళ్లు, 3ఆటోలను సీజ్చేశారు.ఈ సందర్భంగా కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ మాట్లాడుతూ పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ కోసం సహకరించాలని సూచించారు. కొత్తగా కిరాయిలకు వచ్చే వారి వివరాలను సేకరించాలని కోరారు. అనుమానితులు ఎవరికీ ఇల్లు ఇవ్వరాదని కోరారు.బస్తీలో ఎవరైన అనుమానస్పదంగా సంచురిస్తుంటే పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు. పోలీసులకు సహకరించాలని కోరారు. బస్తీలో స్వచ్చందంగా సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకునేందుకు తగిన విధంగా దాతలు స్పందించాలని సూచించారు. ఫ్లై ఓవర్ కింద కొందరు యువకులు గంజాయి సేవిస్తున్నారని అట్టి వారు కనిపిస్తె సమాచారం ఇవ్వాలని అన్నారు.మట్కా ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మొబైల్ కు వచ్చే లింకులను క్లిక్ చేయకూడదన్నారు. లింకులను ఓపెన్ చేయ వలన సెల్ ఫోన్లోని సమాచారమంతా సైబర్ నేరగాళ్ళకు వెళుతుంది అని, సైబర్ నేరాలకు గురి అయినవారు డయల్ 1930 నెంబర్ కు సంప్రదించగలరని సూచించారు.ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలపాలని కోరారు. పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కార్డన్సెర్చ్లు చేపట్టనున్నట్లు ప్రకటించారు. వాహనాలకు ఎలాంటి పత్రాలు లేకపోయిన సీజ్ చేస్తామని, ప్రతీ వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ టౌన్ సీఐ తుత్తూరు శంకరయ్య, రూరల్ సీఐ సత్యనారాయణ, కౌటాల, వాంకిడి సీఐలతో పాటు కాగజ్నగర్ టౌన్ ఎస్ఐ లు ధీకొండ రమేష్, సుధాకర్ లు, కౌటాల, చింతలమానేపల్లి, రెబ్బెన ఈస్గాం ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక WGL-హసన్పర్తి-కాజీపేట 'F' క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సికింద్రాబాద్-సిర్పుర్ కాగజ్ నగర్ SEP 23 నుంచి OCT 7, కాజీపేట-సిర్పుర్టెన్ SEP 26 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. సిక్రింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ - సికింద్రాబాద్ SEP 23 నుంచి అక్టోబర్ 7 వరకు రద్దు చేశారు.
హైదరాబాద్,ఆగస్టు 30 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబరు 7వ తేదీ వరకు పెంచుతున్నట్లు ఇంటర్మీ డియట్ బోర్డు అధికారులు తెలిపారు.శుక్రవారం సాయంత్రం తెలిపింది. 2024- 25 విద్యా సంవత్స రానికిగాను ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, కో-ఆప రేటివ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, కాంపోజిట్ డిగ్రీ, వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఇదే చివరి అవకాశమని పేర్కొంది. ఈ గడువులోగా విద్యార్థు లకు ప్రవేశాలు కల్పించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. ఇంటర్మీడియట్ బోర్డు అనుబంధ అఫిలియేటెడ్, కళాశాలల్లోనే చేరాలని విద్యార్థులకు సూచించింది. అనుబంధ కళాశాలల జాబితా ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉందని తెలిపింది..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ప్రభుత్వ పాఠశాలలలో అన్ని సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాగజ్ నగర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతిగదులు, వంటశాల, భోజనశాల, వంట సామాగ్రి విలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు సమయానుసారంగా మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రం బీం అసిపాబాద్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 30 :కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని పట్నాపూర్ లో సద్గురు పూలాజీబాబా 100 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి జిల్లా ఎస్పీ డి వి శ్రీనివాస రావు , జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే తో కలిసి హాజరయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు , మహారాష్ట్ర లోని కిడ్మట్ ఎమ్మెల్యే భీంరావు తో పాటు జిల్లాలోని ఉన్నతాధికారులు, మహారాష్ట్ర తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ చేతుల మీదుగా ఫ్రీ మెడికల్ క్యాంపు ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మాట్లాడుతూ లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సద్గురు పూలాజీ బాబా అని అన్నారు. ఆయన బోధనలతో ఎంతోమంది వ్యసనాలను అసాంఘిక శక్తుల వైపు మళ్ల కుండా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంతమంది భక్తులను పొందడం బాబా గొప్పతనం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాబా సతీమణి దుర్భతాబాయి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఐటీడీఏ పీవో కుష్బూ , జిల్లా ఉన్నత అధికారులతో పాటు మహారాష్ట్ర తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కుమ్రం బీం అసిపాబాద్ జిల్లా ప్రతినిధి ఆగస్టు 30 : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు ఈస్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని విలేజ్ నెంబర్ 1 గ్రామం లో తణిఖీలు చేపట్టారు. గ్రామం లోని రాజకుమార్ సర్కార్ ఇంట్లో తనిఖీ చేపట్టగా అతని ఇంట్లో 55 గ్రాముల గంజాయి (విలువ 5000) లభించిందని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఈస్గోవ్ లోని విలేజ్ నో 1 లో నివాసం ఉండే రాజ్ కుమార్ సర్కర్ అనే వ్యక్తి కాగాజ్నగర్, చింతగూడ మరియు బుర్దగూడ లో నివాసం ఉండే విద్యార్థులు మరియు ఇతర యువకులకు గంజాయి నీ మహారాష్ట్ర నుండి తీసుకొని వచ్చి 5 గ్రాములు మరియు 10 గ్రాముల గంజాయి నీ చిన్న చిన్న ప్యాకెట్లు గా తయారు చేసి వారిని ఈస్గావ్ లోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి వారికి 500/- రూపాయలు ఒక్కా పాకెట్ చొప్పున విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి అన్న నమ్మదగిన సమాచారం తో టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ పక్క ప్రణాళికా తయారు చేసి రెండుటీంలను తయారు చేసి కాగజ్నగర్ కి చెందిన యువకులు గంజాయి తీసుకోవడానికి ఈస్గావ్ కి వచ్చే సమయానికి అక్కడ ఉండి గంజాయి చేతులు మారే సమయంలో ఒక్కసారిగా వారిని పట్టుకోవడం జరిగింది అని టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలియచేశారు. గంజాయిని అమ్ముతున్న మరియు కొంటున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అయినది. అదేవిధంగా జిల్లాలో ఎవరైనా అక్రమ కార్యకలపాలకు పాల్పడినట్టు గుర్తించినట్లయితే ,తమకు 8712670505 కి కాల్ చేసి సమాచారం అందివ్వాలని అదేవిధంగా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు. ఈ టాస్కులో టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, ఎస్సై వెంకటేష్ ,పీసీలు మధు,రమేష్ పాల్గొన్నారు.
Sep 01 2024, 12:15
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.9k