మిలాద్-ఉన్-నబి ఉత్సవాలు 19 కి వాయిదా..?
మిలాద్-ఉన్-నబి ఉత్సవాలు ఈనెల 19 కి వాయిదా?
హైదరాబాద్, ఆగస్టు 30: రాష్ట్రంలో వచ్చే నెల 16న జరగాల్సిన మిలాద్-ఉన్- నబి ప్రదర్శనలను 19వ తేదీన నిర్వహించుకు నేందుకు గానూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి పట్ల మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరిం చారు.
మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా నిర్వ హించాలని మిలాద్ కమిటీ ఇదివరకే నిర్ణయించింది.
ఆ మరుసటి రోజు 17 గణేష్ నిమజ్జనోత్సవాలు ఉన్న నేపథ్యంలో మిలాద్ ఉన్ నబి ఏర్పాట్లపై రాష్ట్ర గురువారం రాత్రి సచివాల యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమా వేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సెప్టెంబరు ఏడు నుంచి గణేష్ నవరా త్రోత్సవాలు, 17న గణేష్ నిమజ్జనం ఉన్న విషయంపై కమిటీ ప్రతినిధులతో చర్చించారు. మతపరమైన విభేదాలు తలెత్తకుండా చూసేందుకు, ఏ వర్గానికి కూడా ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు తేదీలో మార్పు అవసర మని ఆయన అభిప్రాయ పడ్డారు.
అన్ని అంశాలపై కూలం కశంగా చర్చించిన అనంతరం మిలాద్ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మిలాద్ ఉన్ నబీ ప్రదర్శన లను వాయిదా వేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి, మంత్రులు మిలాద్ కమిటీ సభ్యులకు సూచించారు.



హైదరాబాద్,ఆగస్టు 30:బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నా రు. తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది.

ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి: వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క
తెలంగాణ : ఏడిపించడం, హేళన చేయడం, ఇతర ఇబ్బందులకు గురిచేయడం లాంటివాటికి ఆరు నెలల జైలుశిక్ష పడుతుంది. శారీరకంగా వేధించినా, బలప్రయోగం చేసినా ఏడాది జైలుశిక్ష పడుతుంది. అడ్డుకున్నా, గాయపర్చినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తారు. అపహరణ, అత్యాచారం, తీవ్రంగా గాయపర్చడానికి అయిదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా వేస్తారు. ర్యాగింగ్ వేధింపులతో మృతి చెందినా, ఆత్మహత్యకు కారణమైనా జీవితకాలం జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
బంధువుల పరస్పర దాడుల్లో 8 మంది ఆసుపత్రిపాలు.
కి అప్పగించడం జరిగింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా , కాగజ్నగర్, ఆగస్టు29: కాగజ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ని వంజరికి వెళ్ళే దారిలో గల ఓ ప్లాట్లో(69/1/1) ఇటీవల అక్రమంగా నిర్మించిన దుకాణామును తొలగించాలని కోరుతూ గురువారం రోజున యజమానులు నగునూరి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు, గ్రామపంచాయతిలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అట్టి కలెక్టర్ ఆదేశాల మేరకు షాపు యజమానికి గ్రామపంచాయతి నుండి పలుమార్లు నోటీసుకు జారీ చేసినా సదరు యజమాని షాపును తొలగించకుండా యజమానులపై దురుసుగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయమై ఎక్స్ సర్వీస్మెన్/ హుమెన్ రైట్ ప్రొటక్షన్ సభ్యులు శివకుమార్ అట్టి అక్రమ నిర్మాణం వద్ద పత్రికా సమావేశం నిర్వహించారు. రేపటి వరకు షాపును తొలగించని పక్షంలో తామే అట్టి దుకాణంను తొలగిస్తామని అన్నారు. అట్టి దుకాణంలో బెల్ట్ షాప్ కూడా నిర్వహిస్తున్నారని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వదిలేయడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. సీఐ స్వయంగా తణిఖీ చేయగా మద్యం సీసాలు లభ్యం అయ్యాయని, అయినా వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం రూరల్ ఎస్ఐ మహేందర్ ను కలిసి తమకు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
Aug 31 2024, 00:22
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1