తెలంగాణలో విజృంభిస్తున్న జ్వరాలు..!
తెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.తెలంగాణలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్ రావు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఒక్క సమీక్ష కూడా చేయలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా అందుబాటులో లేవని మండిపడ్డారు.రాష్ట్రంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్రావు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా బెడ్స్ దొరకని పరిస్థితి ఉందని, ఆ స్థాయిలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ముందుగా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని కోరుతున్నారు. విష జ్వరాలు, డెంగ్యూపై సమీక్షలు చేయకుండా ప్రభుత్వం, విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు హరీష్రావు.




కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : డా.బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సు లలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసిందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కళాశాల కో ఆర్డినేటర్ తుడూరు దత్తాత్రేయ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలియ చేసారు.ఇంటర్ పాస్ అయిన ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ప్రవేశం పొందడానికి చివరి తేదీ వచ్చే నెల 18 ఆగస్టు అని, 2016-17 నుండి 2023-24 వరకు అడ్మిషన్ తీసుకుని ట్యూషన్ ఫీజు కట్టని విద్యార్థులు కూడా పైన పేరుకొన్న తేదీ లోగా ఆన్ లైన్ లో చెల్లించాలని, ఇతర వివరాలకు సెల్ 9866398678, 9494314314 లేదా 7382929651 లను సంప్రదించాలని పేర్కొన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : డా.బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సు లలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసిందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కళాశాల కో ఆర్డినేటర్ తుడూరు దత్తాత్రేయ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలియ చేసారు.ఇంటర్ పాస్ అయిన ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ప్రవేశం పొందడానికి చివరి తేదీ వచ్చే నెల 18 ఆగస్టు అని, 2016-17 నుండి 2023-24 వరకు అడ్మిషన్ తీసుకుని ట్యూషన్ ఫీజు కట్టని విద్యార్థులు కూడా పైన పేరుకొన్న తేదీ లోగా ఆన్ లైన్ లో చెల్లించాలని, ఇతర వివరాలకు సెల్ 9866398678, 9494314314 లేదా 7382929651 లను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా జర్నలిస్ట్ జేఏసీ బాధ్యులు అబ్దుల్ రహమాన్, రవి నాయక్ జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే కు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడేను జర్నలిస్టులతో కలిసి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇతర జిల్లాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చారని ఆసిఫాబాద్ జిల్లాలో కూడా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను వారు విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో గతంలో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి జర్నలిస్టుల ప్రధానమైన ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం కొరకు అన్ని సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేసి జర్నలిస్టుల ఇండ్ల సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని జిల్లాలోని ప్రజాప్రతినిధులు కూడా జర్నలిస్టుల ప్రధానమైన ఇండ్ల సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు జేఏసీ నాయకులు ప్రకాష్ గౌడ్ , వేణుగోపాల్, తుకారం , నరేందర్, సంతోష్, కృష్ణంరాజు , స్వామి , అన్నారావు , అబ్దుల్ హన్నాన్ , అడప సతీష్ , సోజర్ , చందు, రాధాకృష్ణ చారి శ్రీధర్, రాజు, నితేష్ తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీంఆసిఫాబాద్ :సమయపాలన,క్రమశిక్షణ,నిరంతర సాధనతో విద్యార్థుల భవిష్యత్ పురోగమించవచ్చునని సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ అన్నారు. ఆదివారం రోజున కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కృష్ణవేణి పాఠశాల ఆధ్వర్యంలో పద్మశాలి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులు దిశ నిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా పరీక్షల సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలి,ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ద్వారా వారు చదువులోనే కాదు జీవితంలో కూడా ముందుకు వెళతారు అని విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికను ఎంతో అద్భుతమైన రీతిలో సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ తెలియచేశారు. విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడేలా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించాలి అని ఆలోచన చేసిన కృష్ణవేణీ యాజమాన్యాన్ని వారు కొనియాడారు.సమయపాలన, క్రమ శిక్షణ, నిరంతర సాధన ద్వారా విద్యార్థులు పురోగమించవచ్చని తెలిపారు.ప్రొడక్టివ్, సూపర్ ప్రొడక్టివ్ వైపు మన గమనం ఉండాలని, తప్పుడు మనుషులతో స్నేహం, తప్పుడు పనులు చేయరాదని చెప్పారు. మీ పేరు ముందున్న ఇంటి పేరుతో కాకుండా మీ పేరు తరువాత మీ ఘనత పెట్టుకునే వైపు పయనించాలని సూచించారు. దీక్షతో ప్రయత్నిస్తే ఫలితాలు (focus-effort-result) వస్తాయని, తాత్కాలిక ఆనందం కోసం కాకుండా మంచి భవిష్యత్ కోసం కష్టపడాలని విద్యార్థులను కోరారు. ఈ నేపథ్యంలో గురువులను గౌరవించాలని, వారు చెప్పిన దారిలో పయనించాలని చెప్పారు. మన జీవితం లో అమ్మ, నాన్న, గురువు, సైనికులు, మనకు అన్నం పెట్టే రైతులే నిజమైన కథానాయకులని, వారిని గౌరవించడం మన బాధ్యత అని అన్నారు. సమయానికి విలువ ఇవ్వాలని, లేనిచో గెలుపు పరుగులో ఓడిపోవడం తద్యమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దోమల సురవర్థన్, జియా - ఉల్ - హక్ ,దోమల వేద ప్రవీణ్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లి తండ్రులు ఇందులో పాల్గొన్నారు.
Aug 27 2024, 23:04
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.6k