తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 25 2024, 08:58

ఎవ్వరినీ వదిలేది లేదు.. చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి: మంత్రి పొన్నం

చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం హెచ్చరించారు. ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమణకు గురయ్యాయో ఆయా సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

గ్రేటర్ హైదరాదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపుతోంది. చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల్లోని చాలా అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. శనివారం (ఆగస్టు 24) మాదాపూర్‌లో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూడా కూల్చేశారు. దీంతో హైడ్రా అంటేనే అక్రమ నిర్మాణదారులు వణికుపోతున్నారు.

ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ నగరానికి ఇంఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువల ఆక్రమణలపై తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడాలని.. జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంత పెద్ద వాళ్లు ఉన్నా చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇది అని అన్నారు. మీ ప్రాంతంలో చెరువులు ఆక్రమణకు గురైతే ఎంత పెద్ద వారైనా.. ఏ పార్టీ వారైనా వదిలేది లేదని ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు.

ముఖ్యంగా హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో జంట నగరాల్లో హైదరాబాద్ ,రంగారెడ్డి ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రకృతిని, భవిష్యత్ తరానికి చెరువులను అందించటం కోసం ఈ ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. మీ ప్రాంతంలోని చెరువులను రక్షించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా, వ్యక్తిగతంగా, ఉద్దేశ్యపూర్వకంగా పోరాటం చేయటం లేదని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్యలో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో తీసుకున్న గొప్ప చర్య ఇది అని అన్నారు. ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురయ్యేయో అక్కడ సమాచారం ఇవ్వాలని మంత్రి ప్రజలకు సూచించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 25 2024, 08:36

హైడ్రా దూకుడు.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు...?

నగరంలో ఒక సంచలనం.. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా. ఇప్పటికే నగరంలోచాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మాదాపూర్‌లోని నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను సయితం కూల్చివేసింది. ఇక ఇప్పుడు హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

నగరంలో ఒక సంచలనం.. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా. ఇప్పటికే నగరంలోచాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మాదాపూర్‌లోని నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను సయితం కూల్చివేసింది. ఇక ఇప్పుడు హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఎవరు? ఏం జరగబోతోంది?. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఆక్రమణలు చేసిన ప్రముఖుల్లో టెన్షన్ పెంచుతోంది.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మాజీ మంత్రి మల్లారెడ్డిపై హైడ్రా అధికారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి మల్లారెడ్డి నిర్మించిన యూనివర్సిటీ, కాలేజీ, హాస్పిటల్‌పై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. మల్లారెడ్డి ఆక్రమించి నిర్మించిన చెరువులు, నాలాలను హైడ్రా అధికారులు పరిశీలించారు.

రేపో, మాపో మల్లారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చట్ జిల్లా, ఘట్‌కేశరి మండలం, వెంకటాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయం భవనాలను వెంకటాపూర్ నాదం చెరువులో నిర్మించారని నీటిపారుదలశాఖ ఏఈ ఐటీ కారిడర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 24 2024, 14:46

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఫైర్-కోర్టులోనే తేల్చుకుంటా..!

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమ కట్టడం పేరుతో ఇవాళ కూల్చివేయడాన్ని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు.

స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు. తమ ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. అదో ఓ పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదని నాగార్జున పేర్కొన్నారు. అది ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపైనా కోర్టు స్టే ఇచ్చిందన్నారు.

స్పష్టంగా చెప్పాలంటే ఈ కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని నాగార్జున తెలిపారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడినని తెలిపారు.

తాజా పరిణామాల వల్ల, తాము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందని, ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము కోర్టును ఆశ్రయిస్తామని, అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు నాగార్జున తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 24 2024, 14:38

సినీ హీరో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత

టాలీవుడ్‌ సినీ హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం అధికారులు శనివారం తెల్లవారుజాము నుండి కూల్చివేస్తున్నారు. కచ్చితమైన ఆధారాలతో అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్నారు.

తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. మరోవైపు ఎన్‌ కన్వెన్షన్‌ కు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు మూసి వేశారు.

ఎన్‌ కన్వెన్షన్‌ కు వెళ్లడానికి మీడియాకు అనుమతి లేదంటూ భారీ కేడ్లను ఏర్పాటు చేశారు.

కూల్చివేతలను చిత్రీకరించడానికి మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 17:53

వినేశ్‌.. పంట పండింది!

ఒలింపిక్‌ పతకం సాధించాలన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కల చెదిరి ఉండొచ్చు. కానీ, ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. దీంతో ఫొగట్‌ను తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమించుకోవడానికి పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అలాగే పారి్‌సలో పతకాలు సాధించిన మరికొందరు అథ్లెట్ల బ్రాండ్‌

ఒలింపిక్‌ పతకం సాధించాలన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కల చెదిరి ఉండొచ్చు. కానీ, ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. దీంతో ఫొగట్‌ను తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమించుకోవడానికి పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అలాగే పారి్‌సలో పతకాలు సాధించిన మరికొందరు అథ్లెట్ల బ్రాండ్‌ వ్యాల్యూ కూడా భారీగా పెరిగింది. ప్యాకేజింగ్‌ ఫుడ్‌, హెల్త్‌, న్యూట్రిషన్‌, జ్యుయెలరీ, బ్యాంకింగ్‌, ఎడ్యుకేషన్‌ ఇలా పలు రంగాలకు చెందిన కంపెనీలు అథ్లెట్లతో ఒప్పందాలు చేసుకోవడానికి పోటీపడుతున్నాయి.

పారిస్‌కు ముందు ఫొగట్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజు రూ. 25 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయలకు పెరిగిందని ఓ ఎగ్జిక్యూటివ్‌ చెప్పాడు. పతకం నెగ్గకపోయినా.. ఆమె చూపిన ధైర్యం, హుందాతనం అందరి హృదయాలను గెలుచుకొందన్నాడు. విశ్వక్రీడల్లో 50 కిలోల విభాగం ఫైనల్‌ ముందు 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందనే కారణంతో వినేశ్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. నైకీ, కంట్రీ డిలైట్‌తో ఫొగట్‌ ఒలింపిక్స్‌కు ముందే అగ్రిమెంట్‌ చేసుకొంది. ఇక, రజతం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించిన షూటర్‌ మను భాకర్‌కు కూడా భారీ డిమాండ్‌ నెలకొంది. చోప్రా బ్రాండ్‌ వాల్యూ 30 నుంచి 40 శాతం దాకా పెరిగి.. సుమారు రూ. 330 కోట్లకు చేరుకొందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

భారత్‌లో క్రికెటర్ల తర్వాత చోప్రాకే ఎక్కువ పాపులారిటీ అనడంలో సందేహం లేదు. నీరజ్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజు గతంలో రూ. 3 కోట్లు ఉంటే.. మెగా క్రీడల తర్వాత రూ. 4 నుంచి 4.5 కోట్లకు పెరిగిందట. మరోవైపు యూత్‌లో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకొన్న భాకర్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకొనేందుకు కంపెనీలు పెద్ద మొత్తంలో ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. గతంలో ప్రకటనల కోసం ఏడాదికి రూ. 25 లక్షలు మను తీసుకునేది. అయితే, అదిప్పుడు ఏకంగా ఆరు రెట్లు పెరిగి రూ. 1.5 కోట్లకు చేరిందని టాక్‌.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 17:49

సీఎం రేవంత్ నిజ స్వరూపం బయటపడింది

సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు. రుణమాఫీ మొత్తం కాలేదని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలను కాపాడాలని యాదాద్రి నర్సింహాస్వామిని వేడుకున్నానన్నారు. ఆగస్టు నెల వచ్చినా ఊర్లల్లో చెరువులు నింపడం లేదన్నారు.

రైతు భీమా, రైతు బంధు, చెరువులు నింపిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది..? రెండు లక్షల ఉద్యోగాలు ఏవి..? ప్రశ్నించారు. ‘‘పోలీసులను హెచ్చరిస్తున్న.. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు’’ అని అన్నారు. చీఫ్ సెక్రటరీ మెడలు వంచైనా సరే రుణమాఫి చేయిస్తామని స్పష్టం చేశారు. మోసం రేవంత్ రెడ్డి ది, పాపం కాంగ్రెస్ పార్టీది అంటూ హరీష్‌రావు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విషయంలో సీఎం, మంత్రులవి తలోమాట అన్నారు. ప్రభుత్వంలో సమన్వయం లేక గందరగోళం ఏర్పడిందన్నారు.

రుణమాఫీపై పార్లమెంట్ ఎన్నికల్లో దేవుడి మీద ఒట్టేసి ప్రమాణాలు చేసిన సీఎం మాట తప్పారని మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ అందేవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే 40% రుణమాఫీ అందుతుందన్నారు. తాము రైతుబంధు పథకంలో 72వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. రుణమాఫీ విషయంలో తాము కాంగ్రెస్ నాయకులలాగా హామీలు ఇవ్వలేదన్నారు. ఇంకా 22లక్షల మంది రైతులకు రుణమాఫీ అందేవరకు వానాకాలం రైతు భరోసా పంటలు కోతకు వచ్చినప్పుడు ఇస్తారా అంటూ ప్రభుత్వాన్ని హరీష్‌రావు ప్రశ్నించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 17:45

కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకు సీబీఐ సంచలన రిపోర్ట్‌

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరుకావాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్యుల సంఘాలు తెలిపాయి.

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరుకావాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్యుల సంఘాలు తెలిపాయి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి వేధిస్తున్నారని ట్రైనీ డాక్టర్లు సుప్రీంకోర్టుకు వెల్లడించారు. మొదట విధులకు హాజరుకావాలని సీజేఐ సూచించారు. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌లో రెసిడెంట్ డాక్టర్లను కూడా చేర్చాలని ట్రైనీ డాక్టర్లు పేర్కొన్నారు. రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను ఎన్‌టీఎఫ్ వింటుందని సీజేఐ భరోసా ఇచ్చారు. కమిటీలో భాగస్వాములుగా ఉండడానికి, కమిటీ ఎదుట వాదన చెప్పడానికి తేడా ఉంటుందని న్యాయవాదులు వెల్లడించారు. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ సంచలన రిపోర్ట్‌ను వెలువరించింది.

రేప్, మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది. తల్లిదండ్రులను సైతం తప్పుదారి పట్టించారని తెలిపింది. శవ దహనం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని వెల్లడించింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ స్టేటస్‌కో రిపోర్టును కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందించారు. సీజేఐ డివై చంద్ర చూడ్ ధర్మాసనం సీబీఐ రిపోర్టును పరిశీలించింది. లోకల్ పోలీసుల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సీబీఐ సేకరించిన ఆధారాలను కోర్టుకు సొలిసిటర్ జనరల్ అందించారు.

సీబీఐ అందజేసిన సీల్డ్ కవర్ స్టేటస్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించింది. ఘటన జరిగిన 5వ రోజు దర్యాప్తు రిపోర్టు తమ చేతికి అందిందని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అప్పటికే చాలా వరకూ మార్చేశారని వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కటీ వీడియోగ్రఫీ జరిగిందని బెంగాల్ ప్రభుత్వం తరుఫున కపిల్ సిబల్ తెలిపారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. సీనియర్ డాక్టర్లు, సహచరులు ఒత్తిడి చేయడంతోనే వీడియోగ్రఫీ చేశారన్నారు. అంటే అక్కడ కవర్-అప్ ఏదో జరుగుతుందని వారంతా భావించారని సొలిసిటర్ జనరల్ వెల్లడించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 15:32

రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ పోరుబాట.. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ..

రైతు రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ (BRS) పోరు బాటపట్టింది. రేవంత్‌ సర్కార్‌ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది

రైతు రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ (BRS) పోరు బాటపట్టింది. రేవంత్‌ సర్కార్‌ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది.

రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు కదంతొక్కారు. అన్ని మండల కేంద్రాల్లో రైతుల కలిసి పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ.. నిరసన కొనసాగిస్తున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 15:26

అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు.

అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని.. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు.. అనకాపల్లి జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడారు. అయితే ఒకే ప్రాంతంలో తరచూ ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నాయని.. భద్రతపై పరిశ్రమలు, కార్మిక శాఖలు, అగ్నిమాపక విభాగంతోపాటు సంబంధిత విభాగాలన్నీ సమన్వయ సమావేశం నిర్వహించి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని డిప్యూటీ సీఎం

మరోవైపు అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు గాయపడినవారు కోలుకునే వరకూ ఆర్థికసాయం అందించాలన్నారు. ఘటనాస్థలాన్ని శుక్రవారం జగన్‌ పరిశీలిస్తారని వైఎస్సార్‌సీపీ తెలిపింది. అలాగే పార్టీ నేతలు, కార్యకర్తలు బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేసే సిబ్బంది 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోగా.. 17మంది ప్రాణాలు కోల్పోయారు.. సుమారు 60 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వివిధ ఆస్పత్రులకు తరలించగా.. అక్కడ వైద్యం కొనసాగుతోంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అచ్యుతాపురం వెళుతున్నారు.

మరోవైపు ఫార్మా కంపెనీలో ప్రమాదంపై కేసు నమోదు చేశారు పోలీసులు. BNS 106(1), 125(b),125(a) సెక్షన్ కింద కేసులు ఫైల్ చేశారు. ఎసెన్షియా ఫార్మా ప్రయివేటు లిమిటెడ్ యాజమాన్యం పై కేసు నమోదు చేయగా.. నిర్లక్ష్యంతొ మరణానికి కారణం , ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం వంటి అంశాలపై సెక్షన్లు ఉన్నాయి. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడినవారికి ఆస్పత్రుల్లో వైద్యం కొనసాగుతోంది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు మరికాసేపట్లో అనకాపల్లి జిల్లాకు వెళ్లబోతున్నారు. అక్కడ మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు.. గాయపడిన వారిని పరామర్శించనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 22 2024, 12:50

చెరువులు వెలవెల.... చేపల పంపిణీ ఎలా..?

నల్గొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల మత్స్య పారిశ్రామిక రంగం కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి...

జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల మత్స్య పారిశ్రామిక రంగం కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు ముగుస్తున్నప్పటికీ చెరువులు నిండకపోవడంతో మత్స్య రంగంపై ఆధారపడ్డ కార్మికులు ఆందోళన గురవుతున్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటివరకు భారీ వర్షాలకు ఇచ్చిన దాఖలాలు లేవు. లోటు వర్షపాతం నమోదు కావడంతో చెరువుల్లో నీరు చేరలేదు. ఇప్పటికే జలకళ ఉండాల్సిన చెరువులు వెలవెల పోతున్నాయి. చేపల పంపిణీ సందిగ్ధంలో పడింది.. ఇలా ఉంటే ఇప్పటికే టెండర్ పూర్తయి చేపల సరఫరా చేసే కార్యక్రమం దాదాపు పూర్తి కావాల్సి ఉండే..... కానీ ఉమ్మడి జిల్లాలో టెండర్ వేశారు కానీ వాటిని ఓపెన్ చేయలేదు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి ఏటా చేప పిల్లలు పంపిణీ చేసే చెరువులు సుమారు 2484 ఉన్నాయి. అందులో దాదాపు 12 కోట్లకు పైగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసేందుకు మూడు జిల్లాల యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 700 చెరువులు, నల్గొండ జిల్లాలో 1163 చెరువులు, 621 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో రెండు రకాల చేప పిల్లలను సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది అందులో 80-100 ఎంఎం, 35 నుంచి 40 ఎంఎం ఉన్నాయి... ప్రతి ఏటా కూడా ఈ సైజు చేప పిల్లలే పంపిణీ చేస్తుంటారు

చెరువులలో సరఫరా చేయడానికి ప్రతి ఏటా కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం ఆయా జిల్లాల స్థాయిలో టెండర్లు ఆహ్వానిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా మూడు జిల్లాలో జూలై నుంచి టెండర్లు పిలిచారు. వారం రోజుల క్రితం వరకు టెండర్ దాఖలు దశ ముగిసింది. దరఖాస్తులను ఓపెన్ చేయలేకపోవడం ఒకటే మిగిలింది. అయితే నల్గొండ జిల్లాలో సుమారు 6 కోట్ల చేప పిల్లలు సరఫరా చేయడానికి కేవలం నలుగురు కాంట్రాక్టర్లు, సూర్యాపేటలో 3.41కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయడానికి ఐదుగురు కాంట్రాక్టర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగ్గురు మాత్రమే టెండర్ దాఖలు చేశారు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. జూన్ జూలై మాసాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ వర్షం జాడే కనిపించకుండా పోయింది.ఆగస్టులోనే భారీ వర్షాలు ఉన్నాయని భావించారు కానీ అది జరగలేదు. ఉమ్మడి జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా నాగార్జున సాగర్,మూసీకి జలకళ వచ్చింది. మిగతా ప్రాంతాల్లో ఉన్న చెరువులు నీటి జాడ కనిపించలేదు. ప్రస్తుతం చెరువులో ఉన్న మీరు కూడా సాగునీటి కోసం వాడితే ఆ మాత్రం నీరు కూడా మిగలదు. గతంలో చేపల కాంట్రాక్ట్ కోసం పోటీపడ్డ కాంట్రాక్టర్లు ఈసారి చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం గతంలో చేసిన కాంట్రాక్టుకు బిల్లులు రాకపోవడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేప పిల్లల సరఫరాకు చెల్లించి ధర గిట్టుబాటు కావడం లేదని కారణమని సమాచారం..ఏది ఏమైనా ఈసారి ఉచిత చేపల పంపిణీ అంతంత మాత్రమే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.