తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 17 2024, 20:47

రుణమాఫీ జరగలేదని రోడ్డెక్కిన రైతన్నలు.. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

కాంగ్రెస్(Congress) సర్కార్ చేసిన రూ.2 లక్షల రుణమాఫీ తమకు కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతులు శనివారం నిరసనలు తెలిపారు. రుణమాఫీ జరగలేదని రోడ్లపై ముళ్ల కంచెలు వేసి నిరసనకు దిగారు.

కాంగ్రెస్(Congress) సర్కార్ చేసిన రూ.2 లక్షల రుణమాఫీ తమకు కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతులు శనివారం నిరసనలు తెలిపారు. రుణమాఫీ జరగలేదని రోడ్లపై ముళ్ల కంచెలు వేసి నిరసనకు దిగారు. ఆదిలాబాద్ - జైనథ్ మండల కేంద్రంలో రుణమాఫీ(Loan Waiver) జరగలేదని, రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. వారికి బీఆర్ఎస్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్(Anil Yadav) మద్దతుగా నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రైతులపట్ల కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని అనిల్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో జాతీయ రహదారిపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

కాగా.. రుణమాఫీ జరగలేదని ఖమ్మంలో కూడా నిరసనలు కొనసాగాయి. తమకు కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని పలువురు రైతులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసనలకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు రుణాలు మాఫీ కాలేదని.. వారంతా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 100 శాతం రుణాలు మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో పలువురు రైతులకు రుణాలు మాఫీ కాకపోయినా.. వారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ రూ. 2 లక్షల రుణమాఫీ పేరుతో అబద్ధపు రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. "ఎల్లుండి నుంచి క్షేత్ర స్థాయికి వెళ్తాం. గ్రామ స్థాయి నుంచి రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరిస్తాం. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజక వర్గాల మీద ప్రత్యేక దృష్టి పెడతాం. వివరాలన్నీ వ్యవసాయ శాఖ అధికారులకు, కలెక్టర్లకు అందజేస్తాం. ఆ తర్వాత సచివాలయంలో అధికారులకు ఇస్తాం. అయినా న్యాయం జరగకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం మాత్రమే రుణ మాఫీ జరిగింది. ఇంకా 60శాతం మంది రైతులకు కాలేదు. వారంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు" అని కేటీఆర్ పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 17 2024, 14:10

ఒక్కరోజులోనే రూ.82 వేల కోట్లు సంపాదించిన 23 మంది వ్యాపారవేత్తలు

భారత స్టాక్ మార్కెట్లు (stock markets) శుక్రవారం రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలపై పెట్టుబడులు చేసిన మదుపర్లకు ఒక్కరోజే 7.5 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఇక ఆయా కంపెనీల షేర్లను కల్గి ఉన్న ఓనర్ల మరింత సంపద మరింత పెరిగి అపర కుబేరులుగా మారిపోయారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత స్టాక్ మార్కెట్లు (stock markets) శుక్రవారం రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి. దీంతో దేశంలోని పలు కంపెనీల షేర్లు మరింత పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలపై పెట్టుబడులు చేసిన మదుపర్లకు ఒక్కరోజే 7.5 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఇక ఆయా కంపెనీల షేర్లను కల్గి ఉన్న ఓనర్ల మరింత సంపద మరింత పెరిగి అపర కుబేరులుగా మారిపోయారు. వారిలో దేశంలోని 25 మంది బిలియనీర్లలో 23 మంది నికర విలువలో 9.84 బిలియన్ డాలర్లు అంటే రూ.8,25,33,73,80,000 కోట్లకు పైగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా అందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది

భారతీయ బిలియనీర్లలో ప్రధానంగా గౌతమ్ అదానీ నికర విలువలో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత ముఖేష్ అంబానీ సంపద పెరిగింది. వీరిద్దరి నికర విలువలో ఏకంగా 3.22 బిలియన్ డాలర్లు అంటే 27 వేల కోట్ల రూపాయలకు పైగా పుంజుకుంది. ఇది మొత్తం పెరుగుదలలో మూడో వంతు కావడం విశేషం.

ముఖేష్ అంబానీ సంపద $1.37 బిలియన్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర విలువ $111 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో అంబానీ 11వ స్థానంలో ఉన్నారు.

గౌతమ్ అదానీ సంపదలో 1.85 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఆ తర్వాత ఆయన మొత్తం నికర విలువ 104 బిలియన్ డాలర్లుగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో అదానీ 14వ స్థానంలో ఉన్నారు.

షాపూర్ మిస్త్రీ నికర విలువ $978 మిలియన్లు పెరిగింది. ఆ తర్వాత ఆయన మొత్తం నికర విలువ $41.6 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో షాపూర్ 36వ స్థానంలో కలరు.

శివ నాడార్ నికర విలువలో 828 మిలియన్ డాలర్ల పెరుగుదల కనిపించింది. తర్వాత మొత్తం నికర విలువ 38.5 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 39వ స్థానంలో ఉన్నారు.

సావిత్రి జిందాల్ నికర విలువ 524 మిలియన్ డాలర్లు పెరుగగా, ఆమె మొత్తం నికర విలువ 32.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 50వ స్థానంలో ఉన్నారు.

అజీమ్ ప్రేమ్‌జీ నికర విలువ 906 మిలియన్ డాలర్లు పెరిగింది. ఆ తర్వాత మొత్తం నికర విలువ 28.7 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 61వ స్థానంలో కలరు.

దిలీప్ షాంఘ్వీ నికర విలువ 79.1 మిలియన్ డాలర్లు పెరుగగా, మొత్తం నికర విలువ 28.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 63వ స్థానంలో ఉన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 17 2024, 14:00

అయినా తగ్గేదే లేదు.. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటాం: కేటీఆర్‌

ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, నిలదిస్తే బెదిరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా తగ్గేదే లేదని నిగ్గదీసి అడుగుతామని, నిజాలే చెబుతామని స్పష్టం చేశారు.

ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, నిలదిస్తే బెదిరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా తగ్గేదే లేదని నిగ్గదీసి అడుగుతామని, నిజాలే చెబుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటామన్నారు. రైతు రుణాలు రూ.49,500 కోట్లు ఉన్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) తెలిపిందని, రాష్ట్రం మంత్రివర్గ భేటీలో రూ.31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం రూ.26 కోట్లేనన్నారు. మూడు విడుతల్లో ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమేనని విమర్శించారు. అయినా రుణం తీరలే.. రైతు బతుకు మారలేదని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 17 2024, 13:50

హత్యాచార ఘటనపై వైద్యుల నిరసన.. దేశ వ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు

Doctors strike | కోల్‌కతా (Kolkata)లోని ఆర్‌జీ కార్‌ దవాఖానలో (R G Kar Medical College) ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య (rape - murder) ఘటనను నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు.

కోల్‌కతా (Kolkata)లోని ఆర్‌జీ కార్‌ దవాఖానలో (R G Kar Medical College) ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య (rape – murder) ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఘటనను నిరసిస్తూ గత ఎనిమిది రోజులుగా వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన (Doctors strike ) చేపడుతున్నారు. విధులను బహిష్కరించి బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనను నిరసిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (Indian Medical Association) పిలుపు మేరకు ఇవాళ 24 గంటల పాటు వైద్యులు సమ్మెకు దిగారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 17 2024, 13:45

సాహసమే ఊపిరిగా..

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) 19వ గేటుకు స్టాప్‌లాగ్‌ బిగించేందుకు ఇంజనీయర్లు, కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా సాహసం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్టాప్‌లాగ్‌ బిగించేందుకు అనేక అడ్డంకులు ఎదురయినా ఫస్ట్‌ ఎలిమెంట్‌ను స్పిల్‌వే మీదకు భద్రంగా చేర్చారు.

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) 19వ గేటుకు స్టాప్‌లాగ్‌ బిగించేందుకు ఇంజనీయర్లు, కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా సాహసం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్టాప్‌లాగ్‌ బిగించేందుకు అనేక అడ్డంకులు ఎదురయినా ఫస్ట్‌ ఎలిమెంట్‌ను స్పిల్‌వే మీదకు భద్రంగా చేర్చారు. ఓ పక్క డ్యాం గేట్లద్వారా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తగా తయారు చేసిన స్టాప్‌లాగ్‌(Stoplog) బిగించేందుకు గోడకు ఉండే ఒక లాక్‌ అడ్డు వచ్చింది. దాన్ని తొలగిస్తే గేట్లు గోడలు దెబ్బతినిపోతాయి. ఇందుకు ఇంజనీయర్లు కొత్త ఆలోచన చేశారు.

స్టాప్‌లాగ్‌ను పైనుండి గేటు గాడిలో అమర్చాలని నిర్ణయించుకున్నారు. గేటుకు ఉండే కౌంటర్‌ వెయిట్‌ను కిందకు దించేశారు. పైన ఉండే హోస్టుప్లాట్‌ఫారం తొలగించారు. ఈరెండు తొలగించేందుకు రాత్రి వరకూ సమయం పట్టింది. ఇక రాత్రి స్టాప్‌లాగ్‌ను దించేందుకు పనులను ప్రారంబించారు. ఒక వైపు తేలిక పాటి జల్లులు కురుస్తున్నాయి. అయినా ఇంజనీయర్లు(Engineers) ఏమాత్రం పట్టు సడలించుకోకుండా పనులు చేశారు.

హోస్టుప్లాట్‌ ఫారం బరువు 32 టన్నులు ఉండగా, కౌంటర్‌ వెయిట్‌ గేటు తూకం 40 టన్నులు ఉంది. ఈ రెండూ కిందకు దించేశారు. నూతనంగా తయారు చేసిన స్టాప్‌లాగ్‌ ఒక్కక్కటి 12 నుండి 13 టన్నులు బరువు ఉంటుంది. శుక్రవారం రాత్రి ఎంత సమయం అయినా స్టాప్‌లాక్‌ బిగించాలనే పట్టుదలతో ఇంజనీయర్లు కృషిచేశారు. ఎట్టకేలకు రాత్రి పదిగంటలకు విజయం సాధించారు. ఫస్ట్‌ ఎలిమెంట్‌ను దాని స్థానంలోకి చేర్చారు.

ఇంకా నాలుగు భాగాలను గేట్‌ స్థానంలో బిగించాల్సి ఉంది. ఆ దిశగా పనులు సాగుతున్నాయి. సీడబ్ల్యుసీ అధికారులు, ఏపీ, కర్ణాటక మంత్రులు, ముఖ్యమంత్రులు జరుగుతున్న పనుల గురించి ఆరాతీస్తున్నారు. పనులు చేసే సమయంలో ఊహించని ప్రమాదం సంభవిస్తే చికిత్స చేయడం కోసం వైద్యులు, అంబులెన్సులను అక్కడే మొహరించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 16 2024, 12:22

ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన అలీఖాన్‌, కోదండరామ్

తెలంగాణలో కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో యథాతథ స్థితి స్టేటస్కో కొనసాగించా లని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. 

అప్పటి గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల పరంగా ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు గవర్నర్ చేసిన ప్రకటనను వారు సవాలు చేశారు. 

దీంతో ప్రొఫెసర్ కోదండ రామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారా నికి బ్రేక్ పడటంతో ఈరోజు ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్‌, కోదండరామ్‌ ప్రమాణస్వీకారం చేశారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 14 2024, 15:35

గురుకుల విద్యార్థిని'కి అండగా.. సీఎం రేవంత్ రెడ్డి

గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన కొయ్యాడ కార్తీక అనే విద్యార్థినికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు.

గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన కొయ్యాడ కార్తీక అనే విద్యార్థినికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. కాగా ములుగు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కార్తీక, ఆగస్టు 9 న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి పడిపోయింది. దాంతో విద్యార్థిని నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత వెంటనే గురుకుల సిబ్బంది కార్తీకను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ కు తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం(ఆగస్టు 13) నాడు కార్తీక కు ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుతం ఐసీయూలో కార్తీక కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే కార్తీకకు కావాల్సిన వైద్యం ఖర్చులను ప్రభుత్వమే భరించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. సీఎంవో ఓఎస్డీ శ్రీనివాసులు నిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడి కార్తీక కోలుకునేంతవరకు వైద్యం అందించాలని చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 14 2024, 15:33

కంటోన్మెంట్‌లో కొత్త నిబంధనలు !

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో భూగర్భజలాల పరిరక్షణ, సద్వినియోగంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోనున్నది. ఈ మేరకు రూపొందించిన నిబంధనలను ఆమోదిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఎస్‌ఆర్‌ఓ 126(ఈ) పేరిట గెజిట్‌ విడుదల చేసింది.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో భూగర్భజలాల పరిరక్షణ, సద్వినియోగంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోనున్నది. ఈ మేరకు రూపొందించిన నిబంధనలను ఆమోదిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఎస్‌ఆర్‌ఓ 126(ఈ) పేరిట గెజిట్‌ విడుదల చేసింది. ఫలితంగా కంటోన్మెంట్‌లో భూగర్భ జలాల వినియోగంపై రెగ్యులర్‌గా ఆడిట్‌ చేయనున్నారు. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని బోర్‌వెల్స్‌కు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు (డిగ్గింగ్‌ అండ్‌ యూజ్‌ ఆఫ్‌ బోర్‌వెల్స్‌ రెగ్యులేషన్స్‌ 2024) నిబంధనలు రూపొందించారు.

దీనిపై అభ్యంతరాలను తెలపాల్సిందిగా గత ఫిబ్రవరి 23న కంటోన్మెంట్‌ బోర్డు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి 5వ తేదీ వరకు అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నూతన నిబంధనలను రూపొందించింది. తాజాగా వీటిని ఆమోదిస్తూ కేంద్రప్రభుత్వం సోమవారం గెజిట్‌ విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం కంటోన్మెంట్‌ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న బోర్‌వెల్స్‌పై సమగ్ర సర్వే చేయనున్నారు. వినియోగంలో ఉన్న బోర్‌వెల్స్‌ సంఖ్య, వాటిని ఎప్పుడు వేశారు, ఎంత లోతులో వేశారు.. తదితర సమాచారాన్ని సేకరిస్తారు.

భూగర్భ జలాల లభ్యతపై కేంద్ర జలశక్తి, రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సర్వే చేస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి సరఫరా, నీటి లభ్యతపై కూడా సమగ్ర అధ్యయనం చేస్తారు. గృహ అవసరాలకు, ఆర్మీ, పోలీసు, వ్యవసాయ, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు వినియోగించే బోర్‌వెల్స్‌(Borewells)ను క్రమబద్ధీకరణ నుంచి మినహాయిస్తారు. మిగతా బోర్‌వెల్స్‌ను నెల రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవలసి ఉంటుంది. నూతనంగా వేసే బోర్‌వెల్స్‌ను కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వాణిజ్య అవసరాలకు, పరిశ్రమలకు రోజుకు 50 లీటర్ల కంటే ఎక్కువ నీటిని తోడితే ప్రతి కిలోలీటర్‌కూ 10 రూపాయల చొప్పున చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది

కాలనీల్లో బోర్‌వెల్స్‌ వేయాలంటే మూడు వేల రూపాయలు, బస్తీల్లో వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. భూగర్భజలాలను కంటోన్మెంట్‌ బోర్డు అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటారు. బోర్‌వెల్స్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. కాగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 21:28

గ్రేటర్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ ‘హైడ్రా’

గ్రేటర్‌లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. మంగళవారం నాడు జీహెచ్ఎంసీలో చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.

గ్రేటర్‌లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. మంగళవారం నాడు జీహెచ్ఎంసీలో చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు

ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సోమవారం కమిషనర్ రంగనాథ్‌ను కలసి ఉప్పల్ నల్ల చెరువులో జరుగుతున్న కబ్జాల గురించి వివరించిన విషయం తెలిసిందే. దీంతో రంగనాథ్ మంగళవారం ఉప్పల్లోని ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న, పరమేశ్వర్ రెడ్డి వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి నల్లచెరువును పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలను, ఆక్రమణలు పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. చెరువులను, నాలాలను, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్‌ హుడా లేఔట్‌ ఘటన నేఫథ్యంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని దానం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని పేర్కొన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఔట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. హైడ్రా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్ గురుబ్రహ్మ నగర్‌లో పేదల గుడిసెలు కూల్చివేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పార్క్ స్థలం అని చెప్పి ఈవీడీఎం వాళ్లు పెద్ద ప్రహరీ గోడ కడుతున్నారని.. బస్తీ వాసులకు దారి లేకుండా ప్రహరీ గోడ ఎలా కడతారు? అని ప్రశ్నించారు. గోడ కట్టొద్దన్నందుకే ఈవీడీఎం అధికారులు తనపై కేసు పెట్టారని దానం తెలిపారు. హైదరాబాద్‌ను హైడ్రా అధికారులకేమీ రాసివ్వలేదని.. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనపై 190 కేసులు ఉన్నాయని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 21:22

రూ. 1015కే విమాన ప్రయాణం.. మరో 15 శాతం డిస్కౌంట్.. ఇండిగో బంపరాఫర్.. గొప్ప ఛాన్స్!

జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే సగటు మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తులో రేట్లు ఉంటాయని వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే.. ప్రముఖ దేశీయ ఎయిర్‌లైన్స్ ఇండిగో బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. రూ. 1015 కనీస ధరతోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ వివరాలు చూద్దాం.

మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేశారా? రేట్లు ఎక్కువగా ఉన్నాయని వెనుకడుగు వేస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. దిగ్గజ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా విమానం ఎక్కాలని ఉండి.. రేట్లు ఎక్కువగా ఉన్నాయని విరమించుకునే లాంటి వారి కోసం కొన్ని ప్రత్యేక రోజుల్లో విమానయాన సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇప్పుడు ఇలానే ఇండిపెండెన్స్ డే (స్వాతంత్ర్య దినోత్సవం) పురస్కరించుకొని.. ఇండిగో ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. ఇది 2024, ఆగస్ట్ 13 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటుందని ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ X లో పోస్ట్ చేసింది. ఇక ఈ ఆఫర్లో ఫ్లైట్ టికెట్లు కనీసం రూ. 1015 నుంచే ప్రారంభం అవుతాయని.. ఇంకా ఎంపిక చేసిన 6E యాడ్- ఆన్స్‌పై 15 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ప్రకటించింది.

ఈ సేల్ వివరాల్ని ఇప్పుడు చూద్దాం. ఇందులో భాగంగా రూ. 1015 తో ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ ప్రారంభం అవుతుండగా.. యాడ్ ఆన్స్ అంటే సీట్ ప్రిఫరెన్స్, అధిక బ్యాగేజీ వంటివి బుక్ చేసుకుంటే మరో 15 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఇండిగో వెబ్, యాప్ బుకింగ్స్‌పై ఆఫర్ అమలవుతుంది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్.. ఈ ఫ్రీడమ్ సేల్‌కు సంబంధించిన టర్మ్స్ అండ్ కండీషన్స్ విడుదల చేసింది.

ఆగస్ట్ 13- 15 నుంచి వరకు సేల్ అందుబాటులో ఉండగా.. 2024, ఆగస్ట్ 22 నుంచి 2025, మార్చి 31 వరకు విమాన ప్రయాణాల కోసం డిస్కౌంట్లోనే టికెట్స్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రూ. 1015 అనేది వన్- వే దేశీయ ప్రయాణాల కోసం. ఇక ఇంటర్నేషనల్ రూట్లలో కనీస ఫ్లైట్ టికెట్ ధర రూ. 3715 తో ప్రారంభం అవుతుంది.

ఇక విమానం బయల్దేరే వారం రోజుల ముందు నుంచి మాత్రమే ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆగస్ట్ 22 కంటే ముందు ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో ఉండవు. ఈ ధరలకు అదనంగా ఇతర టాక్సులు, ఛార్జీలు వంటివి ఉండొచ్చు. వన్- వే, రౌండ్ ట్రిప్ బుకింగ్స్‌కు మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. మల్టీ సిటీ బుకింగ్స్‌కు ఇది లేదు.