డా.బిఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : డా.బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సు లలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసిందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కళాశాల కో ఆర్డినేటర్ తుడూరు దత్తాత్రేయ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలియ చేసారు.ఇంటర్ పాస్ అయిన ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ప్రవేశం పొందడానికి చివరి తేదీ వచ్చే నెల 18 ఆగస్టు అని, 2016-17 నుండి 2023-24 వరకు అడ్మిషన్ తీసుకుని ట్యూషన్ ఫీజు కట్టని విద్యార్థులు కూడా పైన పేరుకొన్న తేదీ లోగా ఆన్ లైన్ లో చెల్లించాలని, ఇతర వివరాలకు సెల్ 9866398678, 9494314314 లేదా 7382929651 లను సంప్రదించాలని పేర్కొన్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.

ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా జర్నలిస్ట్ జేఏసీ బాధ్యులు అబ్దుల్ రహమాన్, రవి నాయక్ జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే కు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడేను జర్నలిస్టులతో కలిసి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇతర జిల్లాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చారని ఆసిఫాబాద్ జిల్లాలో కూడా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను వారు విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో గతంలో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి జర్నలిస్టుల ప్రధానమైన ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం కొరకు అన్ని సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేసి జర్నలిస్టుల ఇండ్ల సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని జిల్లాలోని ప్రజాప్రతినిధులు కూడా జర్నలిస్టుల ప్రధానమైన ఇండ్ల సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు జేఏసీ నాయకులు ప్రకాష్ గౌడ్ , వేణుగోపాల్, తుకారం , నరేందర్, సంతోష్, కృష్ణంరాజు , స్వామి , అన్నారావు , అబ్దుల్ హన్నాన్ , అడప సతీష్ , సోజర్ , చందు, రాధాకృష్ణ చారి శ్రీధర్, రాజు, నితేష్ తదితరులు పాల్గొన్నారు.
సమయపాలన,క్రమశిక్షణ,నిరంతర సాధనతో విద్యార్థుల భవిష్యత్.




కుమ్రంభీంఆసిఫాబాద్ :సమయపాలన,క్రమశిక్షణ,నిరంతర సాధనతో విద్యార్థుల భవిష్యత్ పురోగమించవచ్చునని సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ అన్నారు. ఆదివారం రోజున కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కృష్ణవేణి పాఠశాల ఆధ్వర్యంలో పద్మశాలి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులు దిశ నిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా పరీక్షల సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలి,ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ద్వారా వారు చదువులోనే కాదు జీవితంలో కూడా ముందుకు వెళతారు అని విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికను ఎంతో అద్భుతమైన రీతిలో సైకాలజిస్ట్ సండ్ర సుధీర్   తెలియచేశారు. విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడేలా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించాలి అని ఆలోచన చేసిన కృష్ణవేణీ యాజమాన్యాన్ని వారు కొనియాడారు.సమయపాలన, క్రమ శిక్షణ, నిరంతర సాధన ద్వారా విద్యార్థులు పురోగమించవచ్చని తెలిపారు.ప్రొడక్టివ్, సూపర్ ప్రొడక్టివ్ వైపు మన గమనం ఉండాలని, తప్పుడు మనుషులతో స్నేహం, తప్పుడు పనులు చేయరాదని చెప్పారు.  మీ పేరు ముందున్న ఇంటి పేరుతో కాకుండా మీ పేరు తరువాత మీ ఘనత పెట్టుకునే వైపు పయనించాలని సూచించారు. దీక్షతో ప్రయత్నిస్తే ఫలితాలు (focus-effort-result) వస్తాయని, తాత్కాలిక ఆనందం కోసం కాకుండా మంచి భవిష్యత్ కోసం కష్టపడాలని విద్యార్థులను కోరారు. ఈ నేపథ్యంలో గురువులను గౌరవించాలని, వారు చెప్పిన దారిలో పయనించాలని  చెప్పారు.  మన జీవితం లో అమ్మ, నాన్న, గురువు, సైనికులు, మనకు అన్నం పెట్టే రైతులే నిజమైన కథానాయకులని, వారిని గౌరవించడం మన బాధ్యత అని అన్నారు. సమయానికి విలువ ఇవ్వాలని,  లేనిచో గెలుపు పరుగులో ఓడిపోవడం తద్యమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దోమల సురవర్థన్, జియా - ఉల్ - హక్ ,దోమల వేద  ప్రవీణ్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లి తండ్రులు ఇందులో పాల్గొన్నారు.

ఈనెల 10న ఎస్పీఎం కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం.

కుమ్రంభీం ఆసిఫాబాద్: ఈనెల 10న ఎస్పీఎం కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం,యూనియన్ గుర్తింపుకై వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందన్నారు.రిటైర్డ్ వార్డెన్, ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు అల్లి రాజయ్య అధ్యక్షతన ఆదివారం రోజున సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈనెల 10న శనివారం ఉదయం 11 గంటలకు బాలభారతి హై స్కూల్లో కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ యొక్క సమావేశంలో మిల్లులో గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించుటకు చేపట్టవలసిన కార్యక్రమం గురించి చర్చించటం జరుగుతుందని,కాబట్టి కార్మికులు,కార్మిక సంఘాల నాయకులు తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.2014 సెప్టెంబర్ లో అక్రమంగా మూసివేసిన ఎస్ పి ఎం,కార్మికుల అనేక ఆందోళన ఫలితంగా 2018 ఆగస్టు రెండున తెరుసుకున్నప్పటికీ ఆరు సంవత్సరాలు గడుస్తున్న మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం కార్మిక వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు.కార్మికులు అనేక సమస్యలతో బాధపడుతున్నట్టు వారి బాధలు కష్టాలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని,జెకె పేపర్ మిల్లు చెప్పిందే చట్టం చేసిందే శాసనం గా కార్మికులు శ్రమదోపిడికి గురియగుచున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మిల్లు ప్రారంభమై ఆరు సంవత్సరాలు కావస్తున్న కనీస సౌకర్యమైన క్యాంటీన్ లేకపోవడం దురదృష్టకరమని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రధమ చికిత్స చేసే సౌకర్యం కూడా లేకపోవడం అత్యంత దారుణమని ప్రజా సంఘాల నాయకులు అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జయదేవ్ ,ఉపాధ్యక్షులు ఎస్పీయం మాజీ జనరల్ సెక్రటరీ, గుల్ల పెళ్లి నాగేశ్వరరావు, ఐక్యవేదిక ఉపాధ్యక్షులు, రిటైర్డ్ హెడ్మాస్టర్ బి. నర్సయ్య, కార్మిక నాయకులు కలికోట రమణయ్య,  ఐక్యవేదిక జనరల్ సెక్రెటరీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, నాయకులు అడ్వకేట్ కిషోర్, బి.వేణు రాజ నరసయ్య పాల్గొన్నారు.

చిరు వ్యాపారులను ప్రోత్సహించి ఆర్థికంగా చేయూతనిద్దాం - జిల్లా కలెక్టర్.

కుమ్రంభీం ఆసిఫాబాద్: చిరు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా చేయూతనిద్దామని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని కోట్నాక భీమ్ రావు పిల్లల ఉద్యానవనంలో ప్రతి ఆదివారం పార్కును సందర్శించే వారికి అల్పాహారం, తినుబండారాల విక్రయ కేంద్రాన్ని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్త, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం పిల్లల ఉద్యానవనమునకు కుటుంబ సభ్యులతో సందర్శనకు వచ్చేవారు బయట నుండి తినుబండారాలు కొనుగోలు చేయకుండా పార్కులోని ఏర్పాటు చేసిన చిరు వ్యాపారులు విక్రయించే కేంద్రాల వద్ద కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని అన్నారు. తద్వారా చిరు వ్యాపారులను ప్రోత్సహించి ఉపాధి కల్పించినట్టు అవుతుందని తెలిపారు. విక్రయ కేంద్రాలలో చూడ, దయివడ, బెల్లం గులాబి పూలు, తోటకూర గారెలు, ఎగ్ లెస్ కేకులు, చకోడీలు, ఖారా, బిస్కెట్లు, చిరుధాన్యాలతో తయారుచేసిన తినుబండారాలు, చిప్స్, గప్చుప్ ఇతర తిను పదార్థాలు లభిస్తాయని, సందర్శకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ తహసిల్దార్ రమేష్, మున్సిపల్ సిబ్బంది, చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల స్నేహభావంతో వ్యవహరించాలి : జిల్లా అదనపు కలెక్టర్.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది స్నేహభావంతో వ్యవహరించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లాలోని సిర్పూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలని, విధుల పట్ల సమయపాలన పాటించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం సిర్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయులు, అధికారులతో 10వ తరగతి వార్షిక పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయులు కార్యచరణ ప్రకారంగా విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని, విద్యార్థులు అందరూ 10 జి పి ఎ సాధించేలా కృషి చేయాలని తెలిపారు. విద్యార్థుల ప్రగతి ఆధారంగా తక్కువ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. వార్షిక ఫలితాలలో జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందుంచే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వి ఎం ఓటరు అవగాహన కేంద్రం : జిల్లా కలెక్టర్.


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో ఈ. వి. ఎం. ఓటరు అవగాహన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జి.13 లో ఏర్పాటు చేసిన ఈ. వి. ఎం. ఓటరు అవగాహన కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు వేసే విధానాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఓటరు అవగాహన కేంద్రంలో ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది జితేందర్, మధు, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.
అటవీ శాఖ పేదల పొట్ట గొట్టే ఆలోచన విరమించుకోవాలి.
అటవీ శాఖ పేదల పొట్ట గొట్టే ఆలోచన విరమించుకోవాలి.
తునికాకు టెండర్లు వెంటనే పిలవాలి.


టిఎజి ఎస్ రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్.






కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా,జనవరి20, : తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టిఎజి ఎస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కాగజ్ నగర్ పట్టణం లోనీ బాల భారతి హై స్కూల్ లో తునికాకు కల్లేదార్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ తునికాకు సేకరణ వ్యవసాయం తర్వాత రెండో పంటగా అటవీ ప్రాంతంలో ఉందని,ఆకు సేకరణ ద్వారా ఆదివాసీలు ఇతర పేదలు ఉపాధి పొందుతారని కుమురం భీం జిల్లాలో సైతం 30 వేల మంది కూలీలు ఉపాధి పొందుతారని, కూలీలతోపాటు కళ్ళేదారులు గోడౌన్ కార్మికులు కాంట్రాక్టు కాంట్రాక్టర్లు కూడా ఆదాయం పొందుతారని, ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఆదాయం వస్తుందని కానీ జిల్లాలోని ఫారెస్ట్ అధికారులు పెద్ద పులులు సంచరిస్తున్నాయని పేరుతో ఈ సీజన్లో తునికాకు యూనిట్లను రద్దు చేయాలని ప్రభుత్వానికీ సిఫారసులు చేసిందనీ ఈ నిర్ణయం వల్ల పేదలు నష్టపోతారని, జిల్లాలో రెండు డివిజన్ల పరిధిలో మొత్తం 25 యూనిట్లు ఉండగా మైనింగ్, కవాల్ టైగర్ కారిడార్, కడంబ టైగర్ కారిడార్ పేరుతో ఇప్పటికే చాలా యూనిట్లను తగ్గించినటువంటి పరిస్థితి ఉందని, తగ్గిన యూనిట్ల పరిధిలో కూలీలు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. పులుల ఆవాసం 25 యూనిట్ల పరిధిలో లేదని దాని సాకు చూపి పేదల కడుపు కొడితే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలని, దీనిపై ఎమ్మెల్యేలు స్పందించాలని కోరారు. వెంటనే తునికాకు టెండర్లు పిలవాలని లేని పక్షంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తునికాకు కళ్ళేదారుల సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా చన్కపురి కాశినాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ కె నాయిమ్, కోశాధికారి గా సోయం తిరుపతి ఉపాధ్యక్షులుగా టేకం హనుమంతు, సహాయ కార్యదర్శిగా ఒండ్రే గణేష్, కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ గౌడ్, అజిజ్, బోరెం తిరుపతి, యాదగిరి నాందేవ్, పెందం రవి, ఎల్ములే దశరథ్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కొరెంగా మాలశ్రీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజo శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ముంజo ఆనంద్ కుమార్ , వివిధ మండలాల కల్లేదార్లు పాల్గొన్నారు.
సమావేశానికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,జనవరి20, : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024లో కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు ఓటరు జాబితా పరిశీలకులుగా నియమించబడిన ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి బి. భారతి లక్‌పతి నాయక్‌ ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్‌ బొర్కడే హేమంత్ సహదేవరావు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, బూత్‌ స్థాయి అధికారులు హాజరు అవుతారని, ఈ క్రమంలో జిల్లాకు చెందిన అధికారులు తమ ప్రగతి నివేదికలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు.
సమావేశానికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,జనవరి20, : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024లో కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు ఓటరు జాబితా పరిశీలకులుగా నియమించబడిన ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి బి. భారతి లక్‌పతి నాయక్‌ ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్‌ బొర్కడే హేమంత్ సహదేవరావు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, బూత్‌ స్థాయి అధికారులు హాజరు అవుతారని, ఈ క్రమంలో జిల్లాకు చెందిన అధికారులు తమ ప్రగతి నివేదికలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు.