తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 24 2024, 10:17

జగన్‌‌కు బిగ్ షాక్.. అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం

వైసీపీ అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలంటూ సీబీఐ కోర్టును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

ఈనెల 3న ఇచ్చిన ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణను కొనసాగించాలని, విచారణ స్థాయిపై నివేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణను త్వరగా పూర్తిచేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని హరిరామజోగయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం, సీబీఐ కోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో దాఖలైన డిశ్ఛార్జి పిటిషన్‌లపై రోజువారీ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ తీరు గతం కంటే మెరుగుపడ్డప్పటికీ సంతృప్తికరంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది.

దర్యాప్తు తీరుపై వివరాలతో నివేదిక ఇవ్వాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. గత ఆదేశాలను అమలు చేయాలని మరోసారి స్పష్టంచేస్తూ విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

అరబిందో, హెటిరోలకు భూకేటాయింపులకు సంబంధించి నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

సాయిరెడ్డి తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపించగా తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేయడం జరిగింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 24 2024, 09:37

సింగరేణి కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు 30లక్షల బీమా

సింగరేణిలో పనిచేస్తూ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్‌ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ పేర్కొన్నారు.

సింగరేణిలో పనిచేస్తూ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో వేతన ఖాతా కలిగిన ప్రతి కాంట్రాక్ట్‌ ఉద్యోగికి రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తించనుందని ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ పేర్కొన్నారు.

మంగళవారం సింగరేణి భవన్‌లో బలరామ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులై మెయిన్స్‌ రాయనున్న అభ్యర్థులకు రూ.లక్ష సహాయం అందించే ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ పథకానికి దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది.

ఆగస్టు 6న సాయంత్రం 5గంటల దాకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 23 2024, 20:47

1021 కోట్లు ఔట్….26 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

నాలుగో వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి మూవీ(Kalki 2898 AD Movie) వర్కింగ్ డే లో కొంచం అనుకున్న దాని కన్నా ఎక్కువగానే డ్రాప్ అయినా కూడా ఇప్పటికీ షేర్ ని అయితే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26వ రోజున ఆల్ మోస్ట్ 75% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఇప్పటికీ షేర్స్ రావడం మాత్రం గొప్ప విషయం అనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26వ రోజున మొత్తం మీద 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ తో హిందీ నుండే మంచి హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటంతో ఓవరాల్ గా

సినిమా 26వ రోజున 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని 2.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు టోటల్ గా సినిమా

ఇక సినిమా మొత్తం మీద 26 రోజుల్లో 1021 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేయగా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 149.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బహిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది.

ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 23 2024, 20:19

అంబానీ అందుకున్న బహుమతుల చిట్టా

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక పూర్తయినప్పటికీ దానికి సంబంధించిన ‘ఖరీదైన విశేషాలు’ మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లూ పెళ్లికి హాజరైన సెలబ్రిటీలకు ముకేష్ అంబానీ అందించిన బహుమతులు గురించి మాత్రమే తెలుసుకున్నాం.

చాలామంది సెలబ్రిటీలకు ఆయన 2 కోట్ల రూపాయల విలువైన వాచీలను బహుమతులుగా ఇచ్చారు. మరి పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలు, అనంత్ అంబానీకి ఎలాంటి బహుమతులిచ్చారు. ఇప్పుడీ విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

వీటిలో ముఖ్యమైనది షారూక్ ఖాన్ అందించిన గిఫ్ట్. అనంత్ అంబానీకి కళ్లుచెదిరే గిఫ్ట్ అందించాడట షారూక్. అనంత్ కోసం ఫ్రాన్స్ లో 40 కోట్ల రూపాయల విల్లాను కొనుగోలు చేసి, ఆ తాళాల్ని అతడికి అందించాడట షారూక్. పెళ్లికి వచ్చిన అతిథుల్లో అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చింది షారూక్ మాత్రమే అని టాక్.

ఇక బచ్చన్ కుటుంబం, అనంత్ అంబానీకి 30 కోట్ల రూపాయల విలువైన ఆభరణాల డబ్బాను అందించిందంట. ఇందులో బంగారం, వజ్రాలతో చేసిన ఎన్నో రకాల ఆభరణాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కూడా దాదాపు 30 కోట్ల రూపాయల ఖరీదైన వాచీని అనంత్ కు బహుకరించాడు. ప్రపంచంలో ఈ వాచీలు కేవలం 30 మాత్రమే ఉన్నాయట. అందులో ఒకటి అనంత్ చెంతకు చేరింది.

అలియా భట్, రణబీర్ దంపతులు 9 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును అందించగా.. దీపిక-రణ్వీర్ దంపతులు 20 కోట్ల రూపాయల విలువైన కస్టమైజ్డ్ రోల్స్ రాయిస్ కారును బహుకరించారు.

అక్షయ్ కుమార్ 60లక్షల రూపాయల విలువ చేసే 2 పెన్నుల్ని అందించగా.. కియరా అద్వానీ 25 లక్షల రూపాయల విలువైన హ్యాండ్ మేడ్ శాలువను బహుకరించిందట.

ఇక అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 11.5 కోట్ల విలువైన ఇంపోర్టెడ్ కారును బహుమతిగా అందించాడట. సౌత్ నుంచి వెళ్లిన రామ్ చరణ్, సూర్య, రానా, మహేష్ బాబు లాంటి వాళ్లు ఎలాంటి బహుమతులు అందించారనేది ఇంకా బయటకురాలేదు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 23 2024, 20:04

నీట్ పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు

నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని నిర్ధారించింది. బీహార్ లోని హజారీబాగ్, పాట్నాలోనూ పేపర్ లీకైందని తెలిపింది.

150 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ తో లబ్ధి పొందారని సీజేఐ బెంచ్ వెల్లడించింది. 

అయితే, దేశమంతా నీట్ పేపర్ లీకైనట్టు ఆధారాలు లేవని, అందువల్ల నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

నీట్ ఎంట్రన్స్ రద్దు చేయాలన్న వాదనలో అర్థం లేదని, నీట్ పరీక్ష రద్దు చేస్తే 24 లక్షల మందిపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది.

లీక్ తో లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. నీట్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని అభిప్రాయపడింది.

కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, నీట్ యూజీ ప్రవేశాల కౌన్సిలింగ్ కు మార్గం సుగమం అయింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 23 2024, 20:00

ఉద్యోగులు, యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం వరాల జల్లు

Union Budget: 2024 -25 సంబంధించి తొలి కేంద్ర బడ్జెట్‌ను నేడు (జూలై 23) పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు.

ఇందులో భాగంగా ఉద్యోగులు, యువతపై వరాల జల్లు కురిపించారు.

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కేంద్ర బడ్జెట్‌ని నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు.

7వ సారి ఆమె బడ్జెట్‌ను ఆవిష్కరిస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడో సారి ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నాని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఈ బడ్జెట్ లో ఉద్యోగులు, యువతపై కేంద్రం వరాలు కురిపించారు. నాలుగు కోట్ల యువతకు ఉపాదే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు.

కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్ఓ పథకం అమలు చేస్తామని, 20 లక్షల మంది యువత కోసం సరికొత్త కార్యక్రమం ఏర్పాటు చేసి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు.

ఈ మేరకు 1000 ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడు స్కీమ్స్ ద్వారా ఉద్యోగ కల్పన చేయబోతున్నట్లు చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 23 2024, 19:23

బీహార్ కు మొండి చేయి ఏపీకి ఇండికేషన్ !

దేశంలో ఏదో ఒక రాష్ట్రం ప్రత్యేక హోదా కోరుతూనే ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే కేంద్రం తిరస్కరిస్తూనే ఉంటుంది. మోడీ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన బీహార్ లోని జేడీయూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరింది. కానీ కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇప్పుడున్న నిబంధనలు బీహార్ కు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ కు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ (రామ్ విలాస్ పాశ్వాన్) పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ మోడీ సర్కారు ప్రత్యేక హోదా ఇచ్చేలా లేదు. బీహార్ లో 2000 సంవత్సరం నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది.

కానీ కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు గానీ, ఎన్డీయే సర్కారు గానీ ఈ డిమాండ్ నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి ఆ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపసంహరించుకోవాలని బీహార్ లోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జేడీయూలోని కొందరు నాయకులు కూడా ఇదే మాట అంటున్నారు.

ఇక బీహార్ కు ప్రత్యేక హోదాను రిజెక్ట్ చెయ్యడమంటే ఏపీకి కూడా ఈ హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఇండికేషన్ ఇచ్చిందన్న మాట. 2014 లో ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఆ కూటమి మళ్ళీ అధికారంలోకి రాలేదు.

ఎన్డీయే కూటమి అంటే ప్రధానంగా బీజేపీ ఏపీలో టీడీపీ మద్దతు కూడగట్టుకొని అధికారంలోకి రావడం కోసం ప్రత్యేక హోదా తాము ఇస్తామని ఆశ పెట్టింది. కానీ అధికారంలోకి రాగానే మొండి చేయి చూపింది. అప్పట్లో చంద్రబాబు ప్యాకేజీ కోసం రాజీ పడి హోదాను పక్కన పెట్టేశారు. ఈ వైఖరిని వైఎస్ జగన్ క్యాష్ చేసుకున్నారు. తనకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని అన్నారు.

ఇందుకోసం పాతిక మంది ఎంపీలను గెలిపించాలని వేడుకున్నారు. 2019 లో జగన్ పార్టీ సూపర్ డూపర్ గా గెలిచి అధికారం చేపట్టింది. ఎంపీలు కూడా భారీగా గెలిచారు. కానీ …ఎన్డీయేకు తమ పార్టీ మద్దతు అవసరం లేదు కాబట్టి ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేకపోతున్నామని జగన్ చెప్పారు. ఇక ఏపీ ప్రజలు కూడా గమ్మున ఉండిపోయారు.

అనేక కారణాలతో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ మోడీ సర్కారుకు మద్దతుగా నిలిచింది. అయితే జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ చంద్రబాబు హోదా గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు బీహార్ కు రిజెక్ట్ చేశాక ఇక అడిగే అవకాశమే లేదు.

టీడీపీ మద్దతుదారైన ఓ పత్రిక పదేళ్ల తరువాత హోదా కోసం డిమాండ్ చేయడం అనవసరమని రాసుకొచ్చింది. దాని బదులు కేంద్రం నుంచి ఇతరత్రా సహాయాలు పొంది రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని బాబుకు సలహా ఇచ్చింది. బాబు ఆలోచన కూడా ఇదే. మరి హోదా రిజెక్ట్ నేపథ్యంలో జేడీయూ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 23 2024, 19:17

రైతు బిడ్డ విజయం.. ఇస్రోకే నో చెప్పి.. 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

ఇస్రోలో జాబ్‌కు నో చెప్పి.. మరి ఎంఎన్‌సీలో ఏడాదికి ఏకంగా అరకోటి జీతంతో ఉద్యోగం సాధించింది ఓ యువతి. ఆ వివరాలు..

సాధారణంగా చదువుకునే యువతీ యువకులు కలలు కనేది బాగా చదువుకుని.. మంచి ప్యాకేజీ ఉన్న ఉద్యోగం లేదంటే ప్రభుత్వ కొలువు సాధించడం. అయితే అందరూ ఆ ప్రయత్నంలో విజయం సాధించలేరు. ఎవరైతే పట్టుదలగా ప్రయత్నిస్తారో వారు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.

ఇక వారే చాలా మందికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు. ఇక ఇలాంటి అరుదైన ఘనత సాధించే వారిలో యువతులు ఉండటం మరింత గర్వకారణంగా భావిస్తారు. తాజాగా మీకు అలాంటి అరుదైన ఘనత సాధించిన ఓ యువతిని పరిచయం చేయబోతున్నాం.

రైతు కుటుంబంలో పుట్టింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టం చూసిన ఆ యువతి.. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. ఏకంగా ఇస్రోలో వచ్చిన జాబ్‌ ఆఫర్‌ను కూడా వదులుకుంది. ఆ తర్వాత ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించింది. ఆ వివరాలు..

ఇస్రోలో జాబ్‌కు నో చెప్పి మరీ.. ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజ్‌తో ఉద్యోగం సాధించింది. ఆ యువతి సాధించిన విజయాన్ని చూసి తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. ఆ వివరాలు.. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన ఆశ్రిత అనే యువతి తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వారికి చదువు గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ బిడ్డను మాత్రం కోరుకున్న చదువు చదివించాలని భావించారు. ఇక ఆశ్రిత కూడా చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించింది. ఆ తర్వాత ఊరికి సమీపంలోని జ్యోతిష్మతి కాలేజీలో బీటెక్‌లో చేరింది

అక్కడే అందరికి భిన్నంగా ఆలోచించింది ఆశ్రిత. బీటెక్‌ చేసిన వారు, మరీ ముఖ్యంగా అమ్మాయిలు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌పై ఆసక్తి చూపుతారు. కానీ ఆశ్రిత మాత్రం అందుకు భిన్నంగా హార్డ్‌వేర్‌ ఫీల్డ్‌ను ఎంచుకుంది.

సాఫ్ట్‌వేర్‌ను వద్దనుకుని.. ఐఐఐటీల్లో ఎంటెక్‌ చేయాలని భావించింది. గేట్‌ కోచింగ్‌ తీసుకోవాలని అనుకుంది. దానిలో భాగంగా కరీంనగర్‌లో ఉచిత కోచింగ్‌ ఇస్తోన్న ఓ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యింది. తొలి ప్రయత్నంలో మంచి ర్యాంక్‌ రాకపోవడంతో.. మరోసారి రాసింది. అలా 2022లో గేట్‌లో 36వ ర్యాంకు తెచ్చుకుంది. 2024లో ఎంటెక్‌ పూర్తయ్యింది. కాలేజ్‌ ప్లేస్‌మెంట్‌లో ఎన్విడియా కంపెనీ నుంచి ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజీతో కొలువు సాధించింది.

గేట్‌లో 36వ ర్యాంక్‌ రావడంతో.. ప్రతిష్టాత్మక ప్రభుత్వ కంపెనీలైన ఇస్రో, డీఆర్‌డీఓ, బార్క్‌లలో జాబ్‌ అవకాశాలు తలుపు తట్టాయి. అయినా వద్దనుకుంది. ఇక తాజాగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజీతో కొలువు సాధించి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా మంచి అవకాశాలు అందుకోవచ్చని నిరూపించింది ఆశ్రిత. ఆమె సాధించిన విజయం చూసి ఆశ్రిత తల్లిదండ్రులు గర్వపడుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 23 2024, 18:55

నిండుకుండలా తుంగభద్ర డ్యాం..

తుంగభద్ర(Tungabhadra)కు వరదపోటు ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం జలాశయానికి చెందిన 15,16,17 క్రస్ట్‌గేట్ల గుండా 4వేల కూసెక్కుల నీటిని నదికి వదిలారు.

తుంగభద్ర(Tungabhadra)కు వరదపోటు ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం జలాశయానికి చెందిన 15,16,17 క్రస్ట్‌గేట్ల గుండా 4వేల కూసెక్కుల నీటిని నదికి వదిలారు.

మూడురోజుల క్రితమే నదికి ఏ క్షణంలోనైనా వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు అధికారులు ప్రకటించి తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అధికారులకు అవసమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

2021 సంవత్సరంలో జలాశయం నుంచి నదికి నీరు విడుదల చేయగా, 2022 సంవత్సరంలో తుంగభద్ర డ్యామ్‌(Tungabhadra Dam) పూర్తి స్థాయిలో నిండక పోవడంతో నీరు వదలలేదు.

2023లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏడాది అనుకున్న సమయం కన్నా ముందుకుగానే డ్యామ్‌ నిండడంతో పాటు వరద పోటు ఎక్కువగా ఉన్న కారణంగా మూడు క్రస్ట్‌గేట్ల గుండా దిగువకు నీటిని వదిలారు.

జలాశయానికి 33 క్రస్ట్‌గేట్లు(Crustgates) ఉండగా, నీటి చేరిక ఆధారంగా మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు. జలాశయం ఎత్తు 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1628.45 అడుగుల వరకు నీరు చేరిందని, ప్రస్తుతం డ్యామ్‌లో 87.056 టీఎంసీల నీరు నిల్వ ఉండగా లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చిచేరుతోంది.

జలాశయం నుంచి వివిధ కాలువలకు 7,744 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరం ఇదే సయమానికి డ్యామ్‌లో 52.610 టిఎంసిల నీరు నిలువ ఉండగా, ఇన్‌ప్లో 46,605 క్యూసెక్కులు ఉన్నట్లు డ్యామ్‌ అధికారులు తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 23 2024, 14:28

అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్‌పై కేటీఆర్ అసంతృప్తి

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కేటాయించిన ఛాంబర్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశాల సందర్భంగా ఇన్నర్ లాబీలోని ఎల్‌వోపీ కార్యాలయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే. ఔటర్ లాబీలో ఎల్‌వోపీకి ఛాంబర్ ఏర్పాటు చేశారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (BRS Chief KCR) కేటాయించిన ఛాంబర్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశాల సందర్భంగా ఇన్నర్ లాబీలోని ఎల్‌వోపీ కార్యాలయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే. ఔటర్ లాబీలో ఎల్‌వోపీకి ఛాంబర్ ఏర్పాటు చేశారు. రెండు రూమ్‌లు కలిపి ఒకే రూంగా అసెంబ్లీ సిబ్బంది మార్చేశారు.

అయితే రూం మధ్యలో టాయిలెట్ పెట్టి వాడుకోవడానికి అనుకూలంగా లేకుండా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ అంశాన్ని బీఏసీలో లేవనెత్తాలని మాజీ మంత్రి హరీష్‌రావుకు (Former Harish Rao) కేటీఆర్ సూచించారు. స్పీకర్‌ను కలిసి అభ్యంతరం వ్యక్తం చేయాలని కేటీఆర్ నిర్ణయించారు.

కాగా... అసెంబ్లీకి చేరుకునే ముందు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు.

అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అలాగే ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరుకానున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించారు.

కేవలం ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే బీజేపీ నేతలు కూడా గన్‌పార్క్‌ వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

బీజేపీ ఎమ్మెల్యేలు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నశించాలని, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలని బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.