తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 19:43

ఫ్యాషన్ షో జరుగుతోందా? లాయర్ వస్త్రధారణపై సీజేఐ ఆగ్రహం

సుప్రీం కోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా లాయర్ వస్త్రధారణపై సీజేఐ మండిపడ్డారు.

అయితే, కోర్టుకు హాజరయ్యే లాయర్లు తప్పనిసరిగా ధరించాల్సిన నెక్‌బ్యాండ్‌ ఆ న్యాయవాది ధరించలేదు. దీంతో, సీజేఐ న్యాయవాదిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మీ మెడ చుట్టూ ఉండే బ్యాండ్ ఎక్కడ ఉంది? ఇక్కడేమైనా ఫ్యాషన్ షో జరుగుతోందా?” అని ప్రశ్నించారు.

ఈమెయిల్ పంపాలని ఆదేశించారు. హడావిడిగా వచ్చానని న్యాయవాది చెప్పినప్పుడు మరింత కఠినంగా సీజేఐ సమాధానమిచ్చారు.

క్షమించండి, మీరు సరైన వస్త్రధారణలో లేకుంటే కేసు వినేది లేదు" అని స్పష్టం చేశారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Bar Council)నిబంధనల ప్రకారం కోర్టుకు హాజరయ్యే న్యాయవాదులకు డ్రెస్ కోడ్‌ తప్పనిసరి. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టులు, ట్రైబ్యునల్స్ లేదా అథారిటీలలో హాజరయ్యే న్యాయవాదాలు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 19:40

సేమ్ ఓదార్పు !

ఎవరైనా విషాదంలో మునిగిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి ఊరేగింపుగా వెళ్తారా ?. కేరింతలు.. జయజయధ్వానాలు చేయించుకుంటూ బలప్రదర్శన చేసుకుంటూ వెళ్తారా

చనిపోయిన వ్యక్తి కుటుంబం బాధల్లో ఉంటే రాజకీయంగా బలప్రదర్శనకు.. శవ రాజకీయానికి వాడుకంటారా అసలు అలాంటి ఆలోచన కూడా ఎవరికీ రాదు. కానీ అది జగన్ కు పెటేంట్ స్టైల్ ఓదార్పు. వైఎస్ చనిపోయినప్పుడు అదే చేశారు. ఇప్పుడు వినుకొండలో రషీద్ అనే వ్యక్తి చనిపోయినా అదే చేశారు.

ఉదయం ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి అదే పని. నేరుగా వినుకొండ వెళ్లకుండా.. చిలుకలూరిపేట..నర్సరావుపేట అంటూ చుట్టూ తిరిగి.. ప్రతి పాయింట్ లోనూ నేతలతో జన సమీకరణ చేయించుకుని ఎన్నికల సమయంలోలా ..

అభివాదాలు చేసుకుంటూ పోయారు. ఆయన మొహంలో చిరునవ్వు ఎక్కడా తగ్గలేదు. ఆయన తీరు చూసి హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నట్లుగా లేదని శవ రాజకీయం చేయడానికి అవసరమైన సరంజామా దొరికినట్లు ఆనందంగా ఉందన్నట్లుగా ఉందని ఎవరికైనా అనిపిస్తుంది.

అతి స్లోగా వెళ్లి సాయంత్రం ఐదు గంటల సమయంలో వినుకొండ చేరుకున్నారు. దానికీ ఆయన పోలీసుల్నే నిందించారు. వాహనం మంచిది ఇవ్వలేదని.. కాన్వాయ్ ను అడ్డుకున్నారని రకరకాల ఆరోపణలు చేశారు.

డిసెంబర్‌లో తాను ప్రారంభించాలనుకుంటున్న ఓదార్పు యాత్రకు శాంపిల్ గా… ఈ యాత్రను టెస్ట్ రన్ చేసినట్లుగా ఉందన్న సెటైర్లు వైసీపీలోనే వినిపించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 19:15

విలాస భవనాలు తెగ కొనేస్తున్నారు..!

దేశంలో రూ.4 కోట్లకు పైబడి న విలువ గల విలాసవంతమైన భవనాలకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ 27 శాతం పెరిగింది. ఈ ఆరు నెలల కాలంలో 8,500 లగ్జరీ ఇళ్లు అమ్ముడుపోయాయని సీబీఆర్‌ఈ తాజా నివేదికలో తెలిపింది.

గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడుపోయిన లగ్జరీ ఇళ్ల సంఖ్య 6,700 గా ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, హైదరాబాద్‌ నగరాలు లగ్జరీ ఇళ్లకు ప్రముఖ మార్కెట్లుగా మారాయి.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 3,300 యూనిట్లు, ముంబైలో 2,500 యూనిట్లు, హైదరాబాద్‌లో 1,300 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే హైదరాబాద్‌ మార్కెట్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 44 శాతం పెరిగాయి.

విశాఖ, విజయవాడల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు: దేశంలోని 30 అగ్రగామి మార్కెట్లలో నివాస గృహాలకు డిమాండ్‌ భారీగా పెరిగిన కారణంగా ఇళ్ల ధరలు గత నాలుగేళ్ల కాలంలో 94 శాతం పెరిగాయని రియల్‌ ఎస్టేట్‌ డేటా అనలిటిక్‌ కంపెనీ ప్రాప్‌ ఈక్విటీ తెలిపింది.

2019-20తో పోల్చితే 2023-24 నాటికి ప్రాజెక్టు సగటు ప్రారంభ ధరను పరిగణనలోకి తీసుకుని ప్రాప్‌ ఈక్విటీ ఈ నివేదిక తయారుచేసింది.

ఈ టాప్‌ 30 మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు ఉన్నాయి. ఆ నివేదిక ప్రకారం 24 ద్వితీయ శ్రేణి మార్కెట్లలో ఇళ్ల ధరల్లో రెండంకెల వృద్ధి చోటు చేసుకుంది.

వీటిలో కూడా టాప్‌ 10 మార్కెట్లలో ధరల వృద్ధి 54 శాతం నుంచి 94 శాతం మధ్యన ఉంది. విశాఖలో ఇళ్ల ధర 11 శాతం మేరకు పెరిగింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 19:13

రైలుబండి.. కొత్త స్టాపులండి

డిమాండ్‌ కలిగిన స్టేషన్లలో రైళ్లకు హాల్ట్‌ కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు కొత్తగా మరో 30 స్టేషన్లలో ఆగనున్నాయి.

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో అనేక స్టేషన్లలో రైళ్లు ఆగనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 69 రైళ్లకు సరికొత్తగా హాల్ట్‌ ఇవ్వగా, ఇందులో విజయవాడ మీదుగా రాకపోకలు సాగించేవి 40కి పైగా ఉన్నాయి. అయితే, దీనిని ప్రయోగాత్మకంగానే అమలు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొంతకాలం తర్వాత పునరాలోచన చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దశలవారీగా ఆయా రైళ్లలో నూతన హాల్ట్‌ను ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ (రైలు నెంబరు 12771), హెచ్‌.నిజాముద్దీన్‌-తిరుపతి (రైలు నెంబరు 12708)కు బెల్లంపల్లిలో హాల్టింగ్‌ ఇచ్చారు. ఎర్నాకుళం-పాట్నా (రైలు నెంబరు 22699)కు ఖమ్మం స్టేషన్‌లో స్టాపింగ్‌ ఇచ్చారు. తిరుపతి-సికింద్రాబాద్‌ (రైలు నెంబరు 12763), విశాఖపట్నం-మహ బూబ్‌నగర్‌ (రైలు నెంబరు 12861)కు మధిర స్టేషన్‌లో స్టాపింగ్‌ ఇచ్చారు. హెచ్‌.నిజాముద్దీన్‌ (రైలు నెంబరు 12708), ఎర్నాకుళం-పాట్నా (రైలు నెంబరు 22699)కు మంచిర్యాల స్టేషన్‌లో హాల్ట్‌ ఇచ్చారు. 

బెంగళూరు-దానాపూర్‌ (రైలు నెంబరు 12295), ఎర్నాకుళం-పాట్నా (రైలు నెంబరు 22699)కు రామగుండంలో స్టాపింగ్‌ ఇచ్చారు. పూరి-తిరుపతి (రైలు నెంబరు 17479), తిరుపతి-కాకినాడ టౌన్‌ (రైలు నెంబరు 17249), బిలాస్‌పూర్‌-తిరుపతి (రైలు నెంబరు 17481)కు చినగంజాం స్టేషన్‌లో హాల్ట్‌ ఇచ్చారు. గుంటూరు-రాయగడ (రైలు నెంబరు 17243)కు భీమడోలు స్టేషన్‌లో హాల్ట్‌ ఇచ్చారు. గుంటూరు-నరసాపూర్‌ (రైలు నెంబరు 17281)కు పుట్లచెరువు స్టేషన్‌లో హాల్ట్‌ ఇచ్చారు. కాత్రా-కన్యాకుమారి (రైలు నెంబరు 16318)కు గూడూరు జంక్షన్‌లో, విజయవాడ-కాకినాడ పోర్టు (రైలు నెంబరు 17257)కు పసివేదల స్టేషన్‌ లో, విజయవాడ-మచిలీపట్నం (రైలు నెంబరు 07866)కు ఉప్పులూరు స్టేషన్‌లో హాల్ట్‌ ఇచ్చారు.

భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ (రైలు నెంబరు 17015)ను నడికుడి స్టేషన్‌లో, భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ (రైలు నెంబరు 17015)కు పిడుగురాళ్ల, సత్తెనపల్లి స్టేషన్లలో స్టాపింగ్‌ కల్పించారు. నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ (రైలు నెంబరు 17232)కు కూడా సత్తెనపల్లి స్టేషన్‌తో పాటు నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో హాల్ట్‌ కల్పిం చారు. ధర్మవరం-రేపల్లె (రైలు నెంబరు 17216)కు గిద్దలూరు స్టేషన్‌లో, లింగంపల్లి- నర్సాపూర్‌ (రైలు నెంబరు 17256), చెంగల్‌పట్టు-కాకినాడ (రైలు నెంబరు 17643)కు మంగళగిరి స్టేషన్‌లో హాల్ట్‌ కల్పించారు.

ధర్మవరం-మచిలీపట్నం (రైలు నెంబరు 17216)ను మార్కాపురం రోడ్డు స్టేషన్‌లో, భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ (రైలు నెంబరు 17015)కు మిర్యాలగూడ స్టేషన్‌లో, నర్సాపూర్‌-లింగంపల్లి (రైలు నెంబరు 17255)కు నల్గొండ స్టేషన్‌లో, చెంగల్‌పట్టు-కాకినాడ (రైలు నెంబరు 17643)ను న్యూ గుంటూరు స్టేషన్‌లో హాల్ట్‌ ఇచ్చారు.

యశ్వంత్‌పూర్‌-మచిలీపట్నం (రైలు నెంబరు 17212)కు కంబం స్టేషన్‌లో హాల్ట్‌ ఇచ్చారు. నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ (రైలు నెంబరు 17232)కు మిర్యాలగూడ, నల్గొండలో హాల్ట్‌ ఇచ్చారు. నాగర్‌సోల్‌-చెన్నై (రైలు నెంబరు 16004)కు మహబూబ్‌ నగర్‌లో, సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ (రైలు నెంబరు 17271), రాయ్‌పూర్‌-సికింద్రాబాద్‌ (రైలు నెంబరు 17272)కు పెద్దపల్లిలో స్టాపింగ్‌ ఇచ్చారు. చెన్నై సెంట్రల్‌-నిజాముద్దీన్‌ (రైలు నెంబరు 12611), నిజాముద్దీన్‌-చెన్నై సెంట్రల్‌ (రైలు నెంబరు 12612)కు వరంగల్‌లో, అహ్మదాబాద్‌-చె న్నై సెంట్రల్‌ (12655)కు పెద్దపల్లిలో హాల్ట్‌ కల్పించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 19:10

జలాశయాల నుంచి నీరు విడుదల

జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీకరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయంలోకి గురువారం వరదనీరు పోటెత్తింది. జలాశయం నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.40 మీటర్లు వరకు నీరు చేరిందని ఇరిగేషన్‌ ఏఈ సీహెచ్‌.భాస్కరరావు తెలిపారు

జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీకరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయంలోకి గురువారం వరదనీరు పోటెత్తింది. జలాశయం నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.40 మీటర్లు వరకు నీరు చేరిందని ఇరిగేషన్‌ ఏఈ సీహెచ్‌.భాస్కరరావు తెలిపారు. గంటకు 72,111 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతుండగా జలాశయం గేట్లు తెరచి 10,239 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలినట్టు తెలిపారు. ఎర్ర కాలువ దిగువ ఉన్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్ల, తాడేపల్లి గూడెం, నిడదవోలు మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జల వనరుల శాఖాధికారులు సూచించారు.

జల్లేరు జలాశయం నుంచి 1,500 క్యూసెక్కులు..

బుట్టాయగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయంలోకి వరద ఉధృతి పెరగడంతో గేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ఇరిగేషన్‌ డీఈ ఆనంద్‌, ఏఈలు సురేష్‌, తులసీ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలోకి 3 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, జలాశయం పూర్తి నీటిమట్టం 217.80 ఎంటీఎస్‌ కాగా ప్రస్తుతం 215 ఎంటీఎస్‌లకు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

తమ్మిలేరు రిజర్వాయర్‌కు వరద నీరు

చింతలపూడి సమీపంలోని నాగిరెడ్డిగూడెం వద్ద ఉన్న తమ్మిలేరు రిజ ర్వాయర్‌కు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 336.33 అడుగులు ఉంది. ఎగువ నుంచి 858 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఎగువ తెలంగాణలో వర్షాలు పడుతున్నందున శివపురం వద్ద వంతెనకు ఆనుకుని వాగులో వరద నీరు వస్తోంది. తమ్మిలేరు రిజర్వాయర్‌, గోనెలవాగు రెండుబేసిన్‌లు ఉన్న బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వచ్చిన వరద నీరు తమ్మిలేరు రిజర్వాయర్‌లో చేరి అక్కడి నుంచి గోనెలవాగులోకి చేరు తుంది. రెండు బేసిన్‌లు నిండిన తరువాత 348 అడుగులు దాటితే వరద నీరు దిగువకు విడుదల చేస్తామని ప్రాజెక్టు ఏఈ పరమానందం తెలిపారు.

బుట్టాయగూడెం : అల్పపీడనం కారణంగా ఏజెన్సీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణఽశాఖ హెచ్చరికలు జారీచేయడంతో ఈనెల 19న ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించామని కేఆర్‌ పురం ఐటీడీఏ పీవో ఎం.సూర్యతేజ తెలిపారు. గురువారం ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో పీవో పర్యటించి ముందు జాగ్రత్తలను వివరించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 18:06

Microsoft: మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య... స్పందించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

మైక్రోసాఫ్ట్ సేవల్లో సేవలు నిలిచిపోవడానికి గల కారణాల్ని గుర్తించారని, వీటి పరిష్కారానికి అప్‌డేట్స్ విడుదలయ్యాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్‌లో శుక్రవారం సాంకేతిక సమస్య తలెత్తింది.

కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది. దీంతో ఆయా సిస్టంలు షట్ డౌన్ కావడం లేదా రీస్టార్ట్ కావడం జరిగింది. విండోస్ సరిగ్గా లోడ్ కాలేదు... రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండని మెసేజ్ చూపించింది. ఈ ఎర్రర్‌తో ప్రపంచవ్యాప్తంగా పలు సేవలపై ప్రభావం పడింది.

మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యపై కేంద్రమంత్రి స్పందించారు. ఇందుకు సంబంధించి ఎంఈఐటీవై (మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నిరంతరం మైక్రోసాఫ్ట్‌తో టచ్‌లో ఉందన్నారు.

ఈ సాంకేతిక సమస్యకు కారణాలు గుర్తించినట్లు తెలిపారు. నేషనల ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నెట్ వర్క్‌పై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. ఈ సమస్యకు సంబంధించి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సాంకేతిక సలహాలను జారీ చేస్తుందన్నారు.

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీపై మైక్రోసాఫ్ట్ అంతరాయం ప్రభావం లేదని ఎన్ఎస్ఈ ప్రకటించింది. వివిధ దేశాల స్టాక్ ఎక్స్చేంజీలపై ప్రభావం నేపథ్యంలో ఎన్ఎస్ఈ స్పందించింది. తమపై ఎలాంటి ప్రభావం లేదని బీఎస్ఈ కూడా ప్రకటించింది.

కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించి... ఆ తర్వాత సిస్టంలు షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అయ్యాయి. విండోస్ సరిగ్గా లోడ్ కాలేదు... రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండని మెసేజ్ చూపించింది. ఈ ఎర్రర్‌తో ప్రపంచవ్యాప్తంగా పలు సేవలపై ప్రభావం పడింది. క్రౌడ్ స్ట్రయిక్ అప్ డేట్ కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు మేక్రోసాఫ్ట్ ధ్రవీకరించింది.

క్రౌడ్ స్ట్రయిక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా విండోస్ సిస్టమ్స్‌లో నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు ఆ సర్వీసు అప్ డేట్ కారణమని క్రౌడ్ స్ట్రయిక్ వెల్లడించింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇంజినీర్లు పని చేస్తున్నట్లు తెలిపింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 18:03

రేవంత్ రెడ్డికి అభినందనలు చెప్తూ.. చంద్రబాబును టార్గెట్.. వైఎస్ షర్మిల ట్వీట్

తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షలలోపు రైతు రుణమాఫీ అమలు చేస్తోంది. ఇప్పటికే లక్ష లోపు రుణాల మాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ రైతులకు రుణమాఫీ చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. తెలంగాణలో రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అభినందనలు తెలిపారు.

ఇదే క్రమంలోనూ ఏపీలోని రైతులకు పంట రుణాల మాఫీ చేయాలని సీఎం చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు. కేంద్రం సహకారంతో రైతులకు రుణాల మాఫీ చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రైతు రుణమాఫీ చేసింది. రేవంత్ రెడ్డి సర్కారు రూ.2 లక్షల వరకూ ఉన్న పంట రుణాలను మాఫీ చేసింది. తొలి విడతలో లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తున్నారు. జులై నెలాఖరులోగా లక్షన్నర వరకూ ఉన్న పంట రుణాలను, ఆగస్ట్ 15 లోగా రెండు లక్షల రూపాయల వరకూ రుణాలను మాఫీ చేస్తారు. రూ. లక్ష రుణాల మాఫీ ప్రక్రియ గురువారం సాయంత్రం నుంచి మొదలైంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో పంట రుణాల మాఫీని ఆధారంగా చేసుకుని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. పంట రుణాల మాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే.. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

15 ఏళ్ళ క్రితం, ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ నిన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, సోనియా, రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా, ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ, కాంగ్రెస్ సర్కారు అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు.

రైతు కళ్ళల్లో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణం. ఇది రాహుల్ గాంధీ గారు ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజు. తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు" అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

ఇక ఇదే ట్వీట్‌లో ఏపీ సీఎం చంద్రబాబును షర్మిల టార్గెట్ చేశారు. ఏపీలోనూ రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తలసరి అప్పులో దేశంలోనే ఏపీ రైతులు మొదటి స్థానంలో ఉన్నారన్న వైఎస్ షర్మిల.. వారికి ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం సహకారం తీసుకుని ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 18:01

AP Govt: వైఎస్ జగన్‌ భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) భద్రతపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే జగన్ భద్రత తగ్గించారని.. క్యాంపు ఆఫీస్ వద్ద భద్రతా సిబ్బందిని సైతం ప్రభుత్వం తొలగించిందని లేనిపోని ఆరోపణలు చేశారు నేతలు. అంతేకాదు.. 

ఆఖరికి వైఎస్ జగన్‌కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చినట్లు, రిపేర్‌లో ఉన్న వాహనం ఇవ్వడంతో ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తాయని..

వినుకొండ వెళ్తుండగా పలుమార్లు మొరాయించిందని అటు సోషల్ మీడియాలో సైతం వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ఈ ఆరోపణలు, విమర్శలన్నింటిపైనా ప్రభుత్వం ఓ ప్రకటన రూపంలో స్పందించింది.

కండిషన్‌లో లేని వాహనాలు ఇచ్చారనే మాజీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ పార్టీ నేతల ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. భద్రత తగ్గించారనే ప్రచారాన్ని కూడా ప్రభుత్వం ఖండించింది. జగన్‌కు ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీసు శాఖ నిర్థారించినది.

వాహనం ఫిట్‌నెస్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవాల్లేవని.. ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేసింది. జగన్‌కు కేటాయించి వాహనం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని కండిషన్ చూసిన తరువాతనే వీఐపీకి కేటాయించామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

వైఎస్ జగన్‌కు సౌకర్యంగా లేదని కారు దిగారని.. దానికి వాహనం ఫిట్‌గా లేదని ప్రచారం చేయడం తగదని అధికారులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.జగన్ కారు దిగిన తరువాత అదే కాన్వాయ్‌లో ఆ వాహనం వెళ్లిందని, ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇక జగన్ వెంట వచ్చిన వాహనాలు నిలిపివేశారనే ప్రచారాన్ని కూడా అధికారులు కొట్టేశారు. ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని.. జగన్ వెళ్లే పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కాగా

వినుకొండ వెళ్తున్న జగన్ కాన్వాయ్‌లోని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసులు ఆపేసినట్లు వైసీపీ నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎల్లో బుక్ ప్రకారమే ప్రస్తుతం జగన్‌కు భద్రత ఇచ్చామని ఏపీ ప్రభుత్వం క్లియర్‌ కట్‌గా ఓ ప్రకటన రూపంలో క్లారిటీ ఇచ్చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 17:58

రొట్టెల పండుగలో పాల్గొనే భక్తులు.. అవొక ఆరు రొట్టెలు వదలండి..

నెల్లూరులో రొట్టెల పండుగను సందడిగా నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. దీనికి 20 లక్షల మంది వరకూ వస్తారని అంచనాగా ఉంది. ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.

రొట్టెల పండుగ వద్ద భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు నారాయణ, ఆనం, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ప్రశాంతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బారాషహీద్ దర్గా చరిత్ర చాలా గొప్పదని అన్నారు. భక్తులు నమ్మకం మరింత గొప్పదన్నారు. బారా షాహీ దర్గా అంటే తనకు కూడా నమ్మకమని పేర్కొన్నారు. ‘‘ రొట్టెలు పంచుకోవడం, కోర్కెలు తీరడం, ప్రార్ధనలు చేయడం భాగంగా రొట్టెల పండుగ గొప్పదని పేర్కొన్నారు.

కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ వచ్చి మరొకరికి ఇవ్వడం నమ్మకం’’ అని పేర్కొన్నారు. సర్వమత సమ్మేళనాన్ని ఇక్కడ చూడవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాకెట్ లాంచ్ చేయాలన్నా దేవుడిని ప్రార్ధించి చేస్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఎవరికి నమ్మకమైన దేవుడిని, వారు ప్రార్ధించాలని సీఎం పేర్కొన్నారు. కోర్కెలు కోరుకుని, మళ్లీ వచ్చే ఏడాది వచ్చి మొక్కులు తీర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. 20 లక్షల మంది భక్తులు రొట్టెలు పండుగకు వస్తున్నారన్నారు.

రూ.5 కోట్లు నిధులు కేటాయించామని.. రొట్టెల పండుగకి అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉందని... సంపద సృష్టిస్తామనే నమ్మకం ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని.. ఖజానా నిండాలని ఆరు రొట్టెలు వదలాలని చంద్రబాబు సూచించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 17:36

రేషన్ కార్డు లేనందునే నాకు రుణమాఫీ కాలేదు

రైతు పంట రుణమాఫీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుడిలా వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లు, రేషన్ కార్డు లేనందునే అధికారులు తనకు పంట రుణమాఫీ చేయలేదని జిల్లా కేంద్రం సమీపంలోని అలీపూర్ గ్రామ రైతు ఆవేదన చెందారు.

ఈ సందర్భంగా రుణమాఫీ పై 'దిశ' ఆయనను పలకరించగా, అలీపూర్‌లో తనకు 2 ఎకరాల 2 గుంటల భూమి ఉంది.

2022 నవంబర్‌లో రూ. లక్ష బ్యాంకులో అప్పు తీసుకోగా, అది నేటికి వడ్డీతో కలిపి రూ. లక్ష 85 వేలు అయ్యిందని అంజిలయ్య తెలిపారు.

రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కుటుంబ నిర్ధారణకు మాత్రమే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నామని,

భూమి పాస్ బుక్ ఆధారంగా ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి చెప్పినా, అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు రుణమాఫీ కాలేదని ఆయన ఆరోపించారు.

రుణమాఫీ మొదటి ,రెండో జాబితాలో కూడా తన పేరు లేదని, రేషన్ కార్డు లేని నాలాంటి ఎంతో మంది పేద రైతులకు రుణమాఫీ కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం నిబంధనలు లేకుండా అధికారులు ప్రతి రైతుకు పంట రుణమాఫీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.