తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 18:03

రేవంత్ రెడ్డికి అభినందనలు చెప్తూ.. చంద్రబాబును టార్గెట్.. వైఎస్ షర్మిల ట్వీట్

తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షలలోపు రైతు రుణమాఫీ అమలు చేస్తోంది. ఇప్పటికే లక్ష లోపు రుణాల మాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ రైతులకు రుణమాఫీ చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. తెలంగాణలో రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అభినందనలు తెలిపారు.

ఇదే క్రమంలోనూ ఏపీలోని రైతులకు పంట రుణాల మాఫీ చేయాలని సీఎం చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు. కేంద్రం సహకారంతో రైతులకు రుణాల మాఫీ చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రైతు రుణమాఫీ చేసింది. రేవంత్ రెడ్డి సర్కారు రూ.2 లక్షల వరకూ ఉన్న పంట రుణాలను మాఫీ చేసింది. తొలి విడతలో లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తున్నారు. జులై నెలాఖరులోగా లక్షన్నర వరకూ ఉన్న పంట రుణాలను, ఆగస్ట్ 15 లోగా రెండు లక్షల రూపాయల వరకూ రుణాలను మాఫీ చేస్తారు. రూ. లక్ష రుణాల మాఫీ ప్రక్రియ గురువారం సాయంత్రం నుంచి మొదలైంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో పంట రుణాల మాఫీని ఆధారంగా చేసుకుని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. పంట రుణాల మాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే.. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

15 ఏళ్ళ క్రితం, ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ నిన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, సోనియా, రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా, ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ, కాంగ్రెస్ సర్కారు అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు.

రైతు కళ్ళల్లో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణం. ఇది రాహుల్ గాంధీ గారు ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజు. తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు" అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

ఇక ఇదే ట్వీట్‌లో ఏపీ సీఎం చంద్రబాబును షర్మిల టార్గెట్ చేశారు. ఏపీలోనూ రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తలసరి అప్పులో దేశంలోనే ఏపీ రైతులు మొదటి స్థానంలో ఉన్నారన్న వైఎస్ షర్మిల.. వారికి ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం సహకారం తీసుకుని ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 18:01

AP Govt: వైఎస్ జగన్‌ భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) భద్రతపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే జగన్ భద్రత తగ్గించారని.. క్యాంపు ఆఫీస్ వద్ద భద్రతా సిబ్బందిని సైతం ప్రభుత్వం తొలగించిందని లేనిపోని ఆరోపణలు చేశారు నేతలు. అంతేకాదు.. 

ఆఖరికి వైఎస్ జగన్‌కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చినట్లు, రిపేర్‌లో ఉన్న వాహనం ఇవ్వడంతో ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తాయని..

వినుకొండ వెళ్తుండగా పలుమార్లు మొరాయించిందని అటు సోషల్ మీడియాలో సైతం వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ఈ ఆరోపణలు, విమర్శలన్నింటిపైనా ప్రభుత్వం ఓ ప్రకటన రూపంలో స్పందించింది.

కండిషన్‌లో లేని వాహనాలు ఇచ్చారనే మాజీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ పార్టీ నేతల ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. భద్రత తగ్గించారనే ప్రచారాన్ని కూడా ప్రభుత్వం ఖండించింది. జగన్‌కు ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీసు శాఖ నిర్థారించినది.

వాహనం ఫిట్‌నెస్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవాల్లేవని.. ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేసింది. జగన్‌కు కేటాయించి వాహనం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని కండిషన్ చూసిన తరువాతనే వీఐపీకి కేటాయించామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

వైఎస్ జగన్‌కు సౌకర్యంగా లేదని కారు దిగారని.. దానికి వాహనం ఫిట్‌గా లేదని ప్రచారం చేయడం తగదని అధికారులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.జగన్ కారు దిగిన తరువాత అదే కాన్వాయ్‌లో ఆ వాహనం వెళ్లిందని, ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇక జగన్ వెంట వచ్చిన వాహనాలు నిలిపివేశారనే ప్రచారాన్ని కూడా అధికారులు కొట్టేశారు. ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని.. జగన్ వెళ్లే పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కాగా

వినుకొండ వెళ్తున్న జగన్ కాన్వాయ్‌లోని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసులు ఆపేసినట్లు వైసీపీ నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎల్లో బుక్ ప్రకారమే ప్రస్తుతం జగన్‌కు భద్రత ఇచ్చామని ఏపీ ప్రభుత్వం క్లియర్‌ కట్‌గా ఓ ప్రకటన రూపంలో క్లారిటీ ఇచ్చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 17:58

రొట్టెల పండుగలో పాల్గొనే భక్తులు.. అవొక ఆరు రొట్టెలు వదలండి..

నెల్లూరులో రొట్టెల పండుగను సందడిగా నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. దీనికి 20 లక్షల మంది వరకూ వస్తారని అంచనాగా ఉంది. ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.

రొట్టెల పండుగ వద్ద భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు నారాయణ, ఆనం, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ప్రశాంతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బారాషహీద్ దర్గా చరిత్ర చాలా గొప్పదని అన్నారు. భక్తులు నమ్మకం మరింత గొప్పదన్నారు. బారా షాహీ దర్గా అంటే తనకు కూడా నమ్మకమని పేర్కొన్నారు. ‘‘ రొట్టెలు పంచుకోవడం, కోర్కెలు తీరడం, ప్రార్ధనలు చేయడం భాగంగా రొట్టెల పండుగ గొప్పదని పేర్కొన్నారు.

కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ వచ్చి మరొకరికి ఇవ్వడం నమ్మకం’’ అని పేర్కొన్నారు. సర్వమత సమ్మేళనాన్ని ఇక్కడ చూడవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాకెట్ లాంచ్ చేయాలన్నా దేవుడిని ప్రార్ధించి చేస్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఎవరికి నమ్మకమైన దేవుడిని, వారు ప్రార్ధించాలని సీఎం పేర్కొన్నారు. కోర్కెలు కోరుకుని, మళ్లీ వచ్చే ఏడాది వచ్చి మొక్కులు తీర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. 20 లక్షల మంది భక్తులు రొట్టెలు పండుగకు వస్తున్నారన్నారు.

రూ.5 కోట్లు నిధులు కేటాయించామని.. రొట్టెల పండుగకి అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉందని... సంపద సృష్టిస్తామనే నమ్మకం ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని.. ఖజానా నిండాలని ఆరు రొట్టెలు వదలాలని చంద్రబాబు సూచించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 17:36

రేషన్ కార్డు లేనందునే నాకు రుణమాఫీ కాలేదు

రైతు పంట రుణమాఫీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుడిలా వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లు, రేషన్ కార్డు లేనందునే అధికారులు తనకు పంట రుణమాఫీ చేయలేదని జిల్లా కేంద్రం సమీపంలోని అలీపూర్ గ్రామ రైతు ఆవేదన చెందారు.

ఈ సందర్భంగా రుణమాఫీ పై 'దిశ' ఆయనను పలకరించగా, అలీపూర్‌లో తనకు 2 ఎకరాల 2 గుంటల భూమి ఉంది.

2022 నవంబర్‌లో రూ. లక్ష బ్యాంకులో అప్పు తీసుకోగా, అది నేటికి వడ్డీతో కలిపి రూ. లక్ష 85 వేలు అయ్యిందని అంజిలయ్య తెలిపారు.

రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కుటుంబ నిర్ధారణకు మాత్రమే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నామని,

భూమి పాస్ బుక్ ఆధారంగా ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి చెప్పినా, అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు రుణమాఫీ కాలేదని ఆయన ఆరోపించారు.

రుణమాఫీ మొదటి ,రెండో జాబితాలో కూడా తన పేరు లేదని, రేషన్ కార్డు లేని నాలాంటి ఎంతో మంది పేద రైతులకు రుణమాఫీ కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం నిబంధనలు లేకుండా అధికారులు ప్రతి రైతుకు పంట రుణమాఫీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 17:30

దారుణం - పల్నాడు కేరాఫ్ హైదరాబాద్

ఆంధ్రలో అధికారం చేతులు మారింది. అరాచకం జడలు విప్పింది. ఎన్నికలు ముగిసిన తరువాత హత్యా రాజకీయాలు, దాడులు, దహనాలు అన్నది పల్నాడు, రాయలసీమ జనాలకు కొత్త కాదు.

గత అయిదేళ్ల హడావుడి చూసిన తరువాత ఈసారి సీన్ మరింత దారుణంగా వుంటుంది అని అందరూ ముందుగానే అనుకున్నారు. భయపడ్డారు. పైగా లోకేష్ ముందుగానే రెడ్ బుక్ అంటూ హెచ్చరించుకుంటూ వచ్చారు. మొత్తానికి అధికారం చేతులు మారింది. అదే జరిగింది. జరుగుతోంది. ఇంకా జరుగుతుందేమో అన్న భయమో పల్నాడులో ప్రబలింది

పల్నాడులో వైకాపాను తట్టుకోవడానికి చంద్రబాబు చాలా బలమైన నాయకుడిని రంగంలోకి దింపారు. అప్పటి నుంచి గొడవలు రగులుతూనే వున్నాయి. సదరు నాయకుడి దారుణాల గురించి కథనాలు ఎన్నో వున్నాయి. అధికారం చేతిలోకి రాగానే పల్నాడులో ఆ నాయకుడి అనుచరగణం గ్రామాల్లో సాగిస్తున్న అరాచకాలు ఏవీ మీడియాకు ఎక్కడం లేదు.

నిన్నగాక మొన్న జరిగిన మర్డర్ మాత్రమే కాదు, అసలు గ్రామాల్లో వుండకూడదు అని హుకుం జారీ చేసిన సంఘటనలు వున్నాయి. విత్తనాలు జల్లి, పంట సాగుచేయకూడదు అనే ఆదేశాలు. దీంతో భయం భయంగా, బిక్కు బిక్కు మంటూ వేరే చోట్ల కాలం గడుపుతూ వస్తున్నారు నెలరోజులుగా.

ఇప్పుడు ఈ దారుణమైన మర్డర్ చూసిన తరువాత ఇక గ్రామాలు వదిలిన వారు, పొలిమేరలు కూడా వదిలేసారు. హైదరాబాద్ కు చేరిపోయారు. ఇక ఇప్పుడు చాలా మంది రైతు కూలీలు, చిన్న రైతులు హైదరాబాద్ లో పని వాళ్లుగా మారిపోతున్నారు. పరాయి పంచల్లో బతుకుతున్నారు. దాదాపు 1500 మంది ఇలా ఒక్క పల్నాడు నుంచే హైదరాబాద్ కు వలస వచ్చారని ఓ అంచనా.

ఎంతటి దారుణమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ నీతులు చెబుతారు. ఇప్పుడు ఎక్కడ వున్నారు. చంద్రబాబు సుద్దులు చెబుతారు. ఏం జరుగుతోందో చూస్తున్నారా? లోకేష్ ఇది మీ రెడ్ బుక్ పర్యవసానం అంటే సమాధానం ఏమి వస్తుంది.

తెలుగుదేశం అనుకుల మీడియా ఇది వ్యక్తిగత కక్షలు అని చెప్పవచ్చు. మీ హయాంలో వాడు పోయాడు.. వీడు పోయాడు.. అప్పుడు మీకు నొప్పి తెలియలేదు. ఇప్పుడు తెలిసి వస్తోందో అని సోషల్ మీడియా ఎదురుదాడికి దిగవచ్చు. కానీ జగన్ ప్రభుత్వం బాగా లేదని చెప్పి కదా తేదేపాను గెలిపించమని అడిగారు, మరి తామూ అదే చేస్తామని అంటే దానికి ఇక సమాధానం ఏం వుంటుంది. అయిదేళ్ల తరువాత ఓ బాధితులు సమాధానం చెబుతారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 17:29

IMD: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. కమ్ముకొస్తున్న మబ్బులు

తెలుగు రాష్ట్రాలను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్న(Heavy Rains) వేళ ఐఎండీ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 4 జిల్లాల్లో, శనివారం ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాలను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్న(Heavy Rains) వేళ ఐఎండీ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 4 జిల్లాల్లో, శనివారం ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది.

జులై 19న ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ పరిసర జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కుమురంభీం, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంది.

కొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ.లకు పైగా వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది.

పలు ప్రాంతాల్లో గంటకు 50కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. గురువారం ఒక్క రోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 11.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 17:27

పూజా ఖేద్కర్‌పై కేసు.. ఐఏఎస్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు యూపీఎస్సీ చర్యలు

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై (Puja Khedkar) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం కేసు నమోదు చేసింది.

అలాగే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు సంబంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు, భవిష్యత్తు పరీక్షల నుంచి కూడా ఆమెను డిబార్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు షోకాజ్ నోటీసును పూజా ఖేద్కర్‌కు జారీ చేసింది.

కాగా, ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ దుష్ప్రవర్తన, ఆమెపై వచ్చిన ఆరోపణలపై వివరణాత్మక, సమగ్ర దర్యాప్తు నిర్వహించినట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆమె తన పేరు, తండ్రి, తల్లి పేరు, ఫొటో, సంతకం, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, చిరునామాను మార్చడం, నకిలీ గుర్తింపు వంటివి మోసపూరితంగా పొందినట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలో పూజా ఖేద్కర్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌తో సహా పలు చర్యలను చేపట్టినట్లు వెల్లడించింది.

రాజ్యాంగ నిబద్ధత, ఉన్నతమైన విశ్వాసం, విశ్వసనీయతకు నిస్సందేహంగా కట్టుబడి ఉన్నట్లు వివరించింది.

 

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 15:31

హైదరాబాద్‌ విడిచివెళ్లం!

దీర్ఘకాలంగా హైదరాబాద్‌లో తిష్టవేసిన ప్రభుత్వ వైద్యులు జిల్లాలకు వెళ్లకుండా ఉండేందుకు మార్గాలను వెతుకుతున్నారు. తాము వెళ్లిపోతే మెడికల్‌ కళాశాలలకే నష్టమంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది.

దీర్ఘకాలంగా హైదరాబాద్‌లో తిష్టవేసిన ప్రభుత్వ వైద్యులు జిల్లాలకు వెళ్లకుండా ఉండేందుకు మార్గాలను వెతుకుతున్నారు. తాము వెళ్లిపోతే మెడికల్‌ కళాశాలలకే నష్టమంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది.

లాంగ్‌ స్టాండింగ్‌ పేరుతో మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తే.. కొత్తగా ఎవరూ రాకపోతే ఎంబీబీఎస్‌, పీజీ సీట్లు తగ్గిపోతాయి.

ఎక్కడో మారుమూల జిల్లాలో మెడికల్‌ కాలేజీ అనుమతి కోసం హైదరాబాద్‌లో సీట్లను తగ్గించుకుంటారా’ అంటూ ఉన్నతాధికారులనే దబాయిస్తున్నట్టు తెలిసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 15:28

వైఎస్ జగన్ వినుకొండ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో బుధవారం రాత్రి ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా హత్యకు గురైన షేక్‌ రషీద్‌ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు.

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో బుధవారం రాత్రి ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా హత్యకు గురైన షేక్‌ రషీద్‌ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. హతుడు షేక్ రషీద్, హంతకుడు షేక్ జిలానీ ఇద్దరూ గతంలో మిత్రులే. ఇద్దరూ గతంలో ఖాన్‌ ముఠాలో సభ్యులే. అయినప్పటికీ ‘చావు రాజకీయం’ కోసం మాజీ సీఎం జగన్ ఇవాళ (శుక్రవారం) వినుకొండ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలకమైన ప్రకటన చేశారు.

వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పష్టం చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్ మోహ్మన్ రెడ్డి వచ్చి రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించవచ్చునని క్లారిటీ ఇచ్చారు. కానీ జన సమీకరణతో ప్రదర్శనలు చేయవద్దని, ప్రస్తుతం వినుకొండ పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అనవసరంగా ఎవ్వరూ రోడ్లు పైకి రావద్దని ఆయన పిలుపునిచ్చారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం వినుకొండకు వెళ్తున్నారు. వైసీపీలో గ్యాంగ్‌ వార్‌ కారణంగా మరణించిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. జరిగింది దారుణం.. ఘోరం! కానీ ఈ హత్యను టీడీపీపైకి నెట్టేసి పరామర్శకు బయలుదేరడమే జగన్‌ మార్కు రాజకీయంగా కనిపిస్తోంది.

ఐదేళ్ల తన పాలనలో పల్నాడులో వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలు సాగించినా పట్టించుకోకుండా, హత్యలు జరిగినా స్పందించని జగన్‌...ఇప్పుడు వినుకొండకు బయలుదేరడమే పెద్ద విచిత్రమని జనాలు చెప్పుకుంటున్నారు.

బుధవారం రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై రషీద్‌ అనే యువకుడు దారుణ హత్యోదంతం తెలిసిన విషయమే. షేక్‌ జిలానీ ఈ హత్యకు పాల్పడ్డాడు. అయితే వీళ్లిద్దరూ ఒకప్పుడు మిత్రులే. ఇద్దరూ వైసీపీలో క్రియాశీలంగా వ్యవహరించారు.

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహంతో వినుకొండలో రౌడీగా ఎదిగిన పీఎస్‌ ఖాన్‌ గ్యాంగ్‌లో రషీద్‌, జిలానీ పనిచేశారు. అయితే వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఏటా తొలి ఏకాదశి రోజున వినుకొండలో కొండ తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. 

గత ఏడాది తిరునాళ్ల సందర్భంగా గ్యాంగ్‌ లీడర్‌ ఖాన్‌ ఓ లాడ్జిలో పార్టీ ఏర్పాటు చేశాడు. జిలానీ ఆ రోజు బీర్‌ బాటిళ్లతో దాడి చేయడంతో ఒక యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో పీఎస్‌ ఖాన్‌ రషీద్‌కు మద్దతుగా నిలిచాడు.

రషీద్‌, ఖాన్‌ గ్యాంగ్‌లో మరి కొందరు కలిసి గత సంవత్సరం జూలైలో జిలానీ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. జిలానీ ఇంట్లో లేకపోవడంతో అతడి అన్న జిమ్‌ జానీపై దాడి చేసి గాయపరిచారు. తాజాగా ఈ హత్య జరిగింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 19 2024, 15:26

Supreme Court: కఠిన చట్టాల పేరుతో బెయిలివ్వకుండా ఆపలేరు: సుప్రీం

నేర శిక్షాస్మృతిలోని కఠిన చట్ట నిబంధనలు నిందితులకు బెయిలివ్వకుండా రాజ్యాంగబద్ధ కోర్టులను ఆపలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 21వ రాజ్యాంగ నిబంధన ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ విస్తృృతమైనవీ, పవిత్రమైనవని తేల్చి చెప్పింది.

నేర శిక్షాస్మృతిలోని కఠిన చట్ట నిబంధనలు నిందితులకు బెయిలివ్వకుండా రాజ్యాంగబద్ధ కోర్టులను ఆపలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 21వ రాజ్యాంగ నిబంధన ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ విస్తృృతమైనవీ, పవిత్రమైనవని తేల్చి చెప్పింది.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా) కింద అరెస్టయిన నేపాలీ పౌరుడు షేక్‌ జావేద్‌ ఇక్బాల్‌కు బెయిలు మంజూరు చేస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఎంత కఠినమైన శిక్షాస్మృతి చట్ట నిబంధన అయినా దాని అర్థాన్ని తీసుకొనే సమయం లో రాజ్యాంగ న్యాయస్థానం(హైకోర్టు, సుప్రీంకోర్టు) రాజ్యాంగ విలువలకు, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండాలని చెప్పింది. ఆ రెండింటిలోనూ వ్యక్తి స్వేచ్ఛ అంతర్లీనంగా ఉంటుందని వివరించింది.

ఈ నేపాలీ వ్యక్తి కేసులో రాజ్యాంగ న్యాయస్థానం బెయిలు ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు కానీ ఫలానా చట్టం కింద బెయిలు ఇవ్వడం కుదరదని చెప్పడం తప్పే అవుతుందని స్పష్టం చేసింది. ఇక్బాల్‌ నేపాల్లో భారతదేశపు నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లు అంగీకరించాడని పోలీసులు ప్రకటించారు.

అతని మీద 489(బి), 489(సి) కింద నకిలీ నోట్లు ఉంచుకున్నాడని, నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నాడని కేసు పెట్టారు. దానికి తీవ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని జోడించారు. ఇక్బాల్‌ తొమ్మిదేళ్లుగా కస్టడీలో ఉన్నాడని, ఈకేసు ఇప్పట్లో తేలే వాతావరణం కనబడటం లేదని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఇక్బాల్‌ తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడని, నేపాలీ పౌరుడు అయినందున దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విన్నవించారు. నత్తనడకన నడుస్తున్న ఈ కేసు ఎప్పట్లోగా తేలుతుందో స్పష్టత లేదని కోర్టు అభిప్రాయపడింది. పాస్‌పోర్టు, పౌరసత్వ పత్రాలను తీసుకొని అతన్ని విడుదల చేయాలని ఆదేశించింది.

ఇప్పటికే స్వాధీ నం చేసుకుంటే ట్రయల్‌ కోర్టుకు అప్పగించాలని పేర్కొంది. ట్రయల్‌ కోర్టు విచారణకు క్రమం తప్పకుండా హాజరు కావాలని నిందితుడికి చెప్పింది. విచారణ పూర్తయ్యే దాకా పక్షం రోజులకు ఒకసారి పోలీసు స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాలని ట్రయల్‌ కోర్టు నిబంధన పెట్టొచ్చని సూచించింది.