VijayaKumar

Jul 10 2024, 19:37

భాష సంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ,నీలం థియేటర్ గోపరాజుపల్లి సంయుక్త ఆధ్వర్యంలో నీలం నాటకం పోస్టర్ ఆవిష్కరణ


భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, మరియు నీలం థియేటర్, గోపరాజుపల్లి, సంయుక్త ఆధ్వర్యంలో నీలం నాటకం పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ డా" మామిడి కృష్ణ సార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మిమిక్రీ శ్రీనివాస్ , సినీ నటుడు ప్రదీప్ (అంతేగా... అంతేగా ) అజయ్ మంకెనపల్లి అన్న, సింగపంగ ప్రభాకర్, అబ్దుల్ కలీం ఆజాద్, బిర్రు కిరణ్ కుమార్, జితేందర్, జరిగింది,మరియు నీలం నాటకం రచయిత మరియు దర్శకుడు,నీలం నరేష్ జూలై 15 మధ్యాహ్నం రెండు గంటలకు నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో, నాంపల్లి, లో నాటకం ప్రదర్శించడం జరుగుతుందని ఈ నాటకానికి ప్రతి ఒక్కరు వచ్చి చూసి ఆనందించాలని నీలం థియేటర్ ప్రెసిడెంట్ నరేష్ మాట్లాడడం జరిగింది.

VijayaKumar

Jul 09 2024, 20:18

నాతాళ్ళగూడెం గ్రామంలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాతాళ్లగూడెం గ్రామానికి చెందిన ఉద్దగిరి ఎల్లయ్య తండ్రి బాలయ్య వయసు 60, అనే రైతు తన తమ్ముడు సైదులు తో కలిసి తేదీ 8 -07- 2024 సోమవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పాముకాటు గురయ్యాడు .ఈ విషయాన్ని తన తమ్మునికి తెలుపగా తమ్ముడు ఇంటికి ,108 కి సమాచారం అందించాడు. 108 వాహనంలో చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 11:30 నిమిషాలకు మృతి చెందాడు .సోదరుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.

VijayaKumar

Jul 09 2024, 18:15

భువనగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో దోమల నియంత్రణకు మున్సిపల్ అధికారుల ప్రత్యేక చర్యలు

భువనగిరి మున్సిపల్ 8 వ వార్డ్ రామ్ నగర్ సీత నగర్ జాంఖాన్నగూడెం నందగుట్ట పరిదిలో దోమల నియంత్రణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భువనగిరి పరిధిలో ఎలక్ట్రిక్ స్ప్రే మిషన్ల ద్వారా అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ అన్ని గృహలకు డోర్ టూ డోర్ దోమలు మందులు పిచికారి కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ….ఇంటి లోపల గోడలపై పిచికారీ చేసే దోమల మందు సింజెంట వారి ఐకాన్ (Syngenta – ICON) క్రిమి సంహారక మందు వల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగవని, ఈ మందు ద్వారా ఇంట్లోకి దోమలు రాకుండా నివారించ వచ్చని, మందు పిచికారి చేసిన ప్రదేశాలలో నీటితో కడగటం వంటివి చేయడం ద్వారా మందు ప్రభావం తగ్గుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత దోమల నివారణకు దోహదపడుతుందని అన్నారు. ప్రజలు గృహాలలో ఉన్న నీటి నిల్వలను అంటే పూల కుండీలు నీటి పాత్రలు, చెట్ల ఆకులు, కిటికీల సన్‌షేడ్‌లు, టైర్లు, ఇతర డంప్ చేయబడిన కంటైనర్లు & మెటీరియల్స్, స్తబ్దుగా ఉన్న డ్రైన్ పాయింట్లు, కూలర్లులలో నిల్వ ఉన్న నీళ్లు తీసివేయడంతో పాటు నిత్యం శుభ్రంగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్ రజిత, జవాన్ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 09 2024, 17:30

వెలువర్తి - అరూరు గ్రామాల మధ్యన గుంతలమైన బీటి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలి : సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెల్వర్తి గ్రామం నుండి అరూర్ వరకు గుంతలమైన నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు మంగళవారం రోజున సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా వెల్వర్తి గ్రామంలో సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ వెల్వర్తి గ్రామం నుండి అరూరు వరకు నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసే అనేకమంది ప్రయాణికులకు రైతులకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుందని అనేకమంది ఈ గుంతల్లో పడి గాయాల ఫాలఅవుతున్నారని వెంటనే రోడ్లు భవనాల శాఖ అధికారులు స్థానిక బోనగిరి ఎమ్మెల్యే స్పందించాలని కోరారు వెలువర్తి మొగిలి పాక గ్రామాలకు చెందిన అనేకమంది ప్రజలు అరూరు వేములకొండ గ్రామాల్లో బ్యాంకు పనుల నిమిత్తం మరియు ఇతర పనుల కోసం నిత్యం ప్రయాణం చేస్తుంటారని వారందరూ ఈ గుంతలమైన రోడ్డు వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో ఉన్న అధికారులు స్పందించకపోవడం వల్ల ఈ రోడ్డుకు ఈ పరిస్థితి వచ్చిందని వెంటనే ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు అదేవిధంగా వెలువర్తి గ్రామం నుండి వలిగొండకు ప్రయాణం చేసే వలిగొండ వెల్వర్తి గ్రామాల మధ్యన వర్షాకాలం వచ్చిన సందర్భంలో ఇబ్బందులకు గురిచేసి కల్వర్టులను బ్రిడ్జిలుగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రామంలో ఇండ్లు లేని పేదలందరికీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లను మంజూరు చేయాలని వెల్వర్తి-కేర్చిపల్లి గ్రామాల మధ్యన ఉన్న బీటీ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం మండల కమిటీ సభ్యులు కల్కూరి ముత్యాలు,శాఖ కార్యదర్శి కల్కూరి వాసు,కూచుమల్ల కిష్టయ్య,గ్రామ రైతులు ఎడవెల్లి పాపయ్య, నరసింహ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Jul 09 2024, 17:23

సహృదయ వృద్ధాశ్రమంలో ఘనంగా రాములు గౌడ్ జన్మదిన వేడుకలు


యాదాద్రి భువనగిరి జిల్లా మంగళవారం బత్తిని రాములు గౌడ్ (స్వామి)గారి పుట్టినరోజు సందర్భంగా" వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో నివసిస్తున్న 51 మంది అనాధ వృద్ధులకు మరియు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రాములు గౌడ్ గారి కుటుంబ సభ్యులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశ్రమంలోనీ వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బత్తిని వినోద, బత్తిని వాసవి శ్రీధర్ గౌడ్, భక్తులు ఆకుల శ్రీను, పెరుమెల్లి తిరుమలేష్, కోల వెంకటేష్ గౌడ్, పాక జహంగీర్, బత్తిని వెంకటేష్, ఉపేందర్, సంతోష్, వెలిమినేడు వెంకటేష్ , డీజే రవి కిరణ్ , సంస్థ వ్యవస్తాపకుడు బుషపాక శివకుమార్,ఆశ్రమ
నిర్వాహకులు సంతోష్ , లక్ష్మణ్ లుపాల్గొన్నారు.

VijayaKumar

Jul 09 2024, 13:14

పల్లెర్ల నుండి వేములకొండ స్టేజి వరకు బిటి రోడ్డు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలి: సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం

పల్లెర్ల నుండి వేములకొండ స్టేజ్ వరకు ధ్వంసమైన బీటీ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని , స్టేజి నుండి ఆత్మకూరు వరకు డబల్ రోడ్డు వేయాలని సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. జిల్లా కమిటీ పిలుపుమేరకు పోరుబాట కార్యక్రమంలో భాగంగా పల్లెల గ్రామంలో మంగళవారం పల్లెర్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో గుంతలు పడి ప్రజలకు ఇబ్బంది అవుతున్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని నూతన రోడ్డును వేయాలని నిరసన వివిధ గ్రామాలకు సంబంధించిన అనేకమంది ప్రయాణికులు కార్మికులు విద్యార్థులు వృత్తిదారులు రైతులు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉన్నదని రోడ్డు మొత్తం ధ్వంసమై వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ అధికారులు పలుమార్లు రోడ్డు విషయంలో వారి దృష్టికి తీసుకుపోయిన గత నాలుగైదు సంవత్సరాలుగా పట్టించుకోవడంలేదని గత ఎమ్మెల్యే గారు కూడా రోడ్డు విషయంలో పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోడ్డు ప్రజలందరికీ వివిధ గ్రామాల ప్రజలకు ప్రధాన రోడ్డుగా మారిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించగలరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు మండల కమిటీ సభ్యులు రచ్చ గోవర్ధన్, గ్రామ కార్యదర్శి గుండబోయిన స్వామి, మండల కమిటీ సభ్యులు నాయని కృష్ణారెడ్డి, నాయినిరామ్ రెడ్డి, యాదిరెడ్డి, రోషి రెడ్డి, ఎరుకల చంద్రయ్య, లోడి గోపాల్, కానుకుంట్ల నరసింహ, సంఘపాక నరసింహం, గుండబోయిన మహేష్, వట్టిప్పల ఐలయ్య, మేడి బాబు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 08 2024, 21:00

స్వర్ణ గిరి క్షేత్రాన్ని సందర్శించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదరావు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రాన్ని సోమవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, జనత టీవీ చైర్మన్ కప్పర ప్రసాద్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ బాబా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ ఖాజా, ఫసియుద్దిన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి జి వెంకన్న తదితరులు  పాల్గొన్నారు.

VijayaKumar

Jul 08 2024, 18:57

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: KGKS యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ

రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు భువనగిరి లోని వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రాగిరి కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారికి, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర ప్రతినిధి బృందం ఇప్పటికే రెండుసార్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి పురోగతి లేదన్నారు. వృత్తిలో ప్రమాదం వలన వందలాదిమంది గీత కార్మికులు చెట్టు పై నుండి పడి చనిపోవడం, వికలాంగులు కావడం జరుగుతుంది. ఇప్పటికే 520 మంది ప్రమాదానికి గురయ్యారు వీరిలో 76 మంది చనిపోయారంటే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. వీటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. టాడి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారి చొరవతో *సేఫ్టీ రోప్* 2022 లో యాదగిరిగుట్టలో రూపొందినప్పటికీ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా జాప్యం చేస్తుంది. తక్షణమే ఇచ్చి గీత కార్మికులకు ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియా నెలరోజుల లోపు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు.ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. మెడికల్ బోర్డు విధానం తొలగించలేదు. *ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు తక్షణమే వీటిపై స్పందించాలి*. టాడి కార్పొరేషన్ నుండి ఇచ్చే తక్షణ సహాయం తీవ్ర జాప్యం జరిగింది వాటిని వెంటనే అందివ్వాలి. బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన 22.20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్ ని ఎలాంటి సంబంధం లేని టూరిజం డిపార్ట్మెంట్ నుంచి తొలగించి టాడి కార్పొరేషన్ కి అప్పగించాలి అన్నారు. *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు* మాట్లాడుతూ ప్రతి జిల్లాలో నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి యువతి యువకులకు ఉపాధి కల్పించాలి అన్నారు.చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి జీవో నెంబర్ 560 ప్రకారం 5 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఆగస్టు 18 లోపు నిర్మించాలి. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి.50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుని కి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. *జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు మాట్లాడుతూ* నందనములో తాటి ఉత్పత్తుల పరిశ్రమ పనులు తక్షణమే పూర్తి చేసి గీత కార్మికులకు ఉపాధి కల్పించాలి అన్నారు. ప్రమాద నివారణకు ఇచ్చే సేఫ్టీ మోకులు యాదగిరిగుట్ట నుండి పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఆగస్టు రెండు నుండి 18 వరకు జిల్లాలో అమరుల యాదిలో కార్యక్రమం చేపడుతున్నామని దానిని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు , గీతా కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర సలహాదారు మాటూరు బాలరాజు జిల్లా కమిటీ నాయకులు ధూపట్టి వెంకటేష్ బత్తిని బిక్షం అంతటి అశోక్ గాజుల ఆంజనేయులు మచ్చ నరసింహ పాండాల మైసయ్య మట్ట బాలరాజు. కుర్మిండ్ల ఈశ్వర్.బావల పెళ్లి బాలరాజు. పులి బిక్షము. చెరుకు బాలరాజు. కొండమడుగు శ్రీనివాస్.పరకాల అంజయ్య. బొడిగ బిక్షపతి. కోలా కృష్ణ. పల్సము స్వామి.బత్తిని సత్యనారాయణ. పాండవుల లక్ష్మణ్. పబ్బతి మల్లయ్య. కొక్కొండ లింగయ్య. శ్రీరామ్మూర్తి పూజారి కుమారస్వామి. ఎర్ర రవీందర్. కునూరు మల్లేశం. గడ్డమీద నిఖిల్. గడ్డమీద సోములు. రంగ కొండల్. తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 08 2024, 16:53

భువనగిరి పట్టణంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి

భువనగిరి పట్టణం బాహార్ పేట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాగాయత్ స్కూల్ లో ఎర్పాటు చేసిన టీచ్ ఫర్ చేంజ్ ప్రోగ్రాంలో హజరై డిజిటల్ క్లాస్ రూంల ప్రారంబోత్సవంలో పాల్గోన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,భువనగిరి కలెక్టర్ శ్రీ జెండగే హనుమంత్ కొండిబా ,సినీ నటి మంచు లక్ష్మీ ,పిన్నపురెడ్డి శ్రీదర్. మంచు లక్ష్మి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి జిల్లా అధికారులు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. శాలువా తో సన్మానించారు .సరస్వతి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా 2022 నుంచి మా టీం ఇక్కడ పనిచేస్తున్నారని టీచ్ ఫర్ చేంజ్ సంస్థ  నిర్వాహకులు తెలిపారు.

VijayaKumar

Jul 08 2024, 16:28

మెగా డీఎస్సీ 25 వేల పోస్టులతో నిర్వహించి వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయాలని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడి: పల్ల గొర్ల మోదీ రాందేవ్

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో అధ్యక్షతన సోమవారం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడి చేయడం జరిగింది. ఈ  ముట్టడి కార్యక్రమానికి వేలాదిమంది DSC నిరుద్యోగ అభ్యర్థులు తరలిరాగా, మెగా డీఎస్సీ 25 వేల పోస్టులు భర్తీ చేయాలని ,ఎగ్జామ్ కు రెండు నెలలు గడువు ఇవ్వాలని రాష్ట్రంలో వివిధ శాఖలో ఖాళీగా ఉన్న 2.50లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడి జరిగింది .వేలాది మందిని అరెస్టులు చేసి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నీలం వెంకటేష్ పగిళ్ళ సతీష్ ,పల్లగొర్ల మోదీరాందేవ్ ,ప్రీతం కుమార్ నిఖిల్ పటేల్, స్వాతి, తదితరులు పాల్గొన్నారు వారందరినీ అరెస్టు చేయడం జరిగిందని పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలిపారు.