తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 24 2024, 19:13

అంగన్వాడీల వేతనాలు పెంచాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలి

AITUC కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్

అంగన్వాడీల వేతనాలు 18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తక్షణమే వేతనాలు పెంచాలని ఇతర హామీలు అమలు చేయాలని

ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. AITUC ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడిల సమస్యలను పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజుల సమ్మె చేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని,కాంగ్రెస్ పార్టీ అంగన్వాడి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే 18 వేల వేతనం చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు 5 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు లక్ష రూపాయలు ఆయాకు 50 వేలు మాత్రమే చెల్లిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని అన్నారు. అంగన్వాడి లపై పనిబారం తగ్గించాలని ,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని , ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. గ్రామస్థాయిలో అన్ని రకాల పనులు అంగన్వాడీల చేత చేయిస్తూ అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. అంగన్వాడి సెంటర్ కు గుడ్లు నాణ్యత లేకుండా వస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించాలని కోరారు. గత ప్రభుత్వం జారీ చేసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించిన జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని కోరారు. గతంలో సమ్మె కాలపు 24 రోజుల వేతనం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్లో అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారని దీనివలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందడం లేదని అన్నారు.

అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు గా ఆయాలుగా పనిచేస్తున్న నేటికీ గౌరవ వేతనం పొందుతూ వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి అద్దెలు కూరగాయల బిల్లులు గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ,జిల్లా ఉపాధ్యక్షురాలు శాంత కుమారి, కోట్ల శోభ, శంతాబాయి,సాయి సుజిత ,బి రాణి, అన్నపూర్ణ,ప్రభావతి, అంజలి,రమణ,వణజా, విజయ,టీ సరిత,దస్లి,జగదేశ్వరీ, పద్మావతి, సునీత, కేదారి,స్వప్న బక్కమ్మ,ch తారక, జయంతి జంగమ్మ, జ్యోతి, ప్రమీల, అరుణ విజయలక్ష్మి, భద్రమ్మ, రెడ్డి బాయ్,AITUC డివిజన్ కార్యదర్శి విశ్వనాధులు లెనిన్, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 24 2024, 13:06

ఇంటి స్థలాలకు ప్రభుత్వ భూములు కానీ, భూ-కొనుగోలు పథకం ద్వారా భూములు సేకరించి, నిలువ నీడలేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి, ఇండ్లు నిర్మించాలి

ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్

 నకిరేకల్ మండలంలో అనేక గ్రామాల్లో 50 సంవత్సరాల క్రితం నిరుపేదలకు ఇంటి స్థలాలను ఇచ్చి, ఇండ్లు కూడా నిర్మించారని గత సుదీర్ఘకాలంగా ఆయా దళిత, బిసి కుటుంబాలు రెండు, మూడు కుటుంబాలుగా పెరగడం వలన ఆయా ఇళ్లల్లో నివసించలేని దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని,

ఈ స్థితిలో ప్రభుత్వం నిలువ నీడలేని నిరుపేదలకు ఇంటి స్థలాల కోసం ధనాడ్య వర్గాలు అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను పేదల ఇండ్ల స్థలాలకు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానంటున్న ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని పేదల ఎడల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి కోరారు.

 ఈరోజు నకిరేకల్ మండలం నోములలో జరిగిన పేదల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

 ఇందులో గ్యార సాలయ్య మాచర్ల ఎల్లయ్య గ్వార పీరయ్య మామిడి బిక్షం మాచర్ల గోపి మాచర్ల పరమేష్ ఎర్ర ప్రమీల తదితరు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 22 2024, 10:48

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై సేద్యం చేస్తున్న పేదరైతాంగానికి పట్టాలు ఇవ్వాలి.ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి

 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రభుత్వ భూములను సేద్యం చేస్తున్న పేదలకు భూ యాజమాన్య పట్టాలు ఇస్తానని ప్రకటించింది.

వెనువెంటనే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూపట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వ భూములపై పేదలకు రాజ్యాంగం హక్కులు కల్పించింది. గత పాలకపక్షాలన్నీ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రైవేట్ శక్తులకు కైంకర్యం చేశాయి. కనీసం పేదలు సేద్యం చేస్తున్న భూములకైన ముందు పట్టాలు ఇచ్చి, ఇది పేదప్రజల ప్రభుత్వం అని నిరూపించుకోవాలి." ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి కోరారు.

 ఈరోజు నకిరేకల్ మండలం నోముల, కేతేపల్లి మండలం బొప్పారం గ్రామాల్లో జరిగిన రైతుల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సమావేశాల్లో PRPS మండల అధ్యక్షుడు గ్యార సాలయ్య, నాయకులు గ్యార లక్ష్మయ్య, మాచర్ల లింగయ్య, మామిడి భిక్షం, గుండె లింగయ్య, మామిడి నాగయ్య, దుర్గం పరశురాములు, బట్ట సైదులు, ఆనంతుల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 21 2024, 12:46

రింగ్ రోడ్డు కాదుదొంగ రోడ్డు

తమ అనుచరుల లబ్ధికోసమే ప్లాన్ 3

ఉప సమహరించుకోకుంటే... ఉద్యమిస్తాం.... కంచర్ల.

కలక్టర్ కు వినతి పత్రం సమర్పించిన.. బాధితులు

నేడు మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో... నల్లగొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలవారు.. పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం లో... కలెక్టర్ నారాయణ రెడ్డి గారిని కలుసుకొని... వినతి పత్రం సమర్పించారు..

సందర్బంగా కలెక్టర్ తాము స్వయంగా... స్థల పరిశీలన జరిపి.. ప్రభుత్వం తోనూ ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులతోను మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు...

అనంతరం... మీడియా తో మాట్లాడుతూ కంచర్ల...

ఇది రింగ్ రోడ్ కాదు దొంగ రోడ్ అని... తమ అనుచరులకు దోచి పెట్టడానికి..

మంత్రి నాటకం ఆడుతున్నారని... 3000 కుటుంబాలను తాము కష్టపడి చమటోడ్చి... సంపాదించుకున్న ప్లాట్లు.. ఇండ్లు.. నష్ట పోతున్నా పట్టించు కోకుండా...అధికారం ఉందనే అహంకారం తో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని...బాధితుల గోడు పట్టించుకోవట్లేదని న్నారు... అందరికి ఆమోదయోగ్యమైన.. ప్లాన్ 1,2, వదిలేసి.. తమ అనుచరుల లబ్ధికోసం ప్లాన్ 3 ఎంచుకున్నారని ఆరోపించారు... తక్షణం... ప్లాన్ 3 ఉపసంహారించుకోవాలని.. లేకుంటే బాధితుల తరుపున తాము పోరాడుతామని... 

15 రోజుల సమయం ఇస్తున్నామని... ఈలోగా ప్లాన్ 3 ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే...ఎంతమంది బాధితులున్నారో వారందరి తో కలిసి.. పాదయాత్ర చేస్తామని... ఆతర్వాత.. ఉత్తర్వులు రద్దు చేసేవరకు దశల వారీగా ఉద్యమిస్తామని..ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

భారీ ఎత్తున రింగ్ రోడ్ బాధితులతో పాటు...జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రెగట్టే మల్లిఖార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,కాంచనపల్లి రవీందర్ రావు,జమాల్ ఖాద్రి,కౌన్సిలర్ మారగోని గణేష్,మెరుగు గోపి,షంశుద్దీన్, గంజి రాజేందర్,వజ్జే శ్రీనివాస్,దొడ్డి రమేష్, సైదిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 20 2024, 11:29

తెలంగాణకు హోం మంత్రి కావలెను!

తెలంగాణకు హోం మంత్రి కావలెను!

తొమ్మిదిన్నరేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల శాంతిభద్రతలు క్షీణించాయి.

ఘర్షణలు, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.

గత ఆరు నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు తెలంగాణకు హోం మంత్రి లేడు.. ప్రజల భద్రతను పట్టించుకునే దిక్కే లేదు.

అందుకే వెంటనే

తెలంగాణకు హోం మంత్రి కావలెను

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 18 2024, 18:12

జులై 7న వరంగల్ లో జరిగే 30 ఏళ్ల మాదిగల ఆత్మగౌరవ కవాతును జయప్రదం చేయండి - MRPS

ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ MSP ముఖ్య కార్యకర్తల సమావేశం MSP నియోజకవర్గ ఇన్చార్జి మచ్చ ఏడుకొండలు మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా MSP జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, MRPS నల్గొండ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ గార్లు హాజరై సంయుక్తంగా మాట్లాడుతూ.

భారత రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు షెడ్యూల్ కులాలలోని అన్ని ఉపకులాలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా పంపిణీ జరగాలని అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటాలకు పురుడుబోసిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించి జులై 7 నాటికి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ* గారి నాయకత్వంలో ఏర్పడి నేటికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. ప్రపంచంలో ఇంత ఘన చరిత్ర కలిగిన ఉద్యమం దండోరా ఉద్యమం అని అన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన నాటి నుండి కేవలం మాదిగల కోసమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల ప్రజా సమస్యల మీద వృద్ధులు, వికలాంగులు, వితంతులు పెన్షన్ల పెంపు కోసం మరియు గుండె జబ్బు చిన్నారుల, ఉచిత వైద్యం కోసం చేసిన పోరాటమే ఆరోగ్యశ్రీ కార్డు రూపకల్పనకు దారిదీసిందని తెలిపారు. 

ఎమ్మార్పీఎస్ చేసిన పోరాటమే సమాజంలో అన్ని వర్గాలకు మేలు కలిగిందని తెలిపారు. 

తమ లక్ష్యసాధనైనా ఎస్సీ వర్గీకరణకు అతి త్వరలోనే నూతనంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని 

 ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

జులై 7 నాటికి ఎమ్మార్పీ శ్రేణులు గ్రామ మండల పూర్తిస్థాయి కమిటీలను పూర్తిచేసుకుని

నల్ల షర్టు బ్లాక్ పాయింట్తో డ్రెస్ కోడ్ తో జూలై 7న వరంగల్లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతుకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా మాదిగ పల్లెలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ వరంగల్ కేంద్రానికి తరలిరావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో MRPS నియోజక వర్గ ఇంచార్జి సండ్ర నాగరాజు మాదిగ, దైద రవి మాదిగ, MRPS జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంబయ్య మాదిగ , కలకొండ హరీష్ మాదిగ, రావులపటి శ్రీను మాదిగ, మంద అంజి మాదిగ, మహంకాళి సురేష్ మాదిగ, మోహన్ మాదిగ, దైద సురేష్ మాదిగ, మంద శివ మాదిగ, మంద శ్రీను మాదిగ, వాళ్లపుదాసు నాగయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

   

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 18 2024, 18:08

తక్షణం కుల జనగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పొందుపరచాలి

భువనగిరి బిఎల్ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్.

 తెలంగాణ రాష్ట్రంలో కుల జనగణన చేపట్టకుండా పాత ముస పద్ధతిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ గాని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గాని బీసీ రిజర్వేషన్లను వారి ఇష్టానుసారం ప్రకటిస్తే సహించేది లేదని, వీలైతే రాష్ట్ర సెక్రటేరియట్ లేదా ఎన్నికల కమిషనర్ కార్యాలయాలను ముట్టడించడానికి కూడా వెనకాడమని అందుకే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో కుల జనగణన చేపట్టకపోతే అధత్పాతాలానికి నెట్టివేయబడుతుందని, బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పొందుపరచాలని బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులైన బీసీపీ రాష్ట్ర కార్యదర్శి కే. పర్వతాలు, ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.

 ఈరోజు భువనగిరి పట్టణంలోని పెన్షనర్స్ మీటింగ్ హాల్లో జరిగిన 20 బీసీ సంఘాల తో కూడిన 30 మంది ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని పాల్గొని మాట్లాడారు. మీటింగ్ అనంతరం జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సామూహికంగా వెళ్లి అందజేశారు.

 రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే రిపోర్ట్ లో ఉన్న కుల జనగణన వివరాలను అన్నింటిని బహిర్గతం చేయాలి. మోడీ ప్రభుత్వం పేరుకు బీసీ ప్రధాని అనే పేరు ఉన్న అగ్రవర్ణాలకు కొమ్ముగాస్తూ 10% అగ్రకులాలకు రిజర్వేషన్లను కేటాయించి, 2021లో చేపట్టాల్సిన జనగణన వివరాలను అన్నింటిని కరోనా కారణంగా మూడు సంవత్సరాలుగా వాయిదా వేశారు. ప్రతి 10 సంవత్సరాలకు నిర్వహించే జనగణన స్థానంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుల జన గణనను చేపట్టి సుదీర్ఘకాలం నుండి అన్యాయం జరుగుతున్న బీసీ ప్రజలకు చట్టసభల్లో రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం కేటాయించడం, తెలంగాణ రాష్ట్రంలో కూడా సగానికంటే ఎక్కువ ఉన్న బీసీ ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ నిర్ణయించిన 42 శాతాన్ని కూడా అంగీకరించేది లేదని, సగానికంటే ఎక్కువ బీసీ జనాభా ఉన్న తర్వాత ఏ విధంగా అశాస్త్రీయంగా చేస్తారని వారు ప్రశ్నించారు.

 ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అధ్యక్షత వహించగా, ఇందులో బీసీ వివిధ సంఘాలకు చెందిన పల్లగొరల మోడీ రాందేవ్ యాదవ్, ఎర్ర జాన్సన్ మాదిగ, సీసా శ్రీనివాస్ గౌడ్, కొడారి వెంకటేష్ యాదవ్, గుంటోజు వెంకటాచారి, వరికుప్పల కృష్ణయ్య వడ్డెర, మరిపెళ్లి శ్రీనివాస్ రజక, కప్పల రాకేష్ గౌడ్, నాగిళ్ల యాదయ్య, పూస శ్రీనివాస్ గంగపుత్ర, ఆరూరి సత్తయ్య ప్రజాపతి, మైలారం జంగయ్య, వట్టిపల్లి సుదర్శన్, గుండెబోయిన సురేష్ యాదవ్, పుట్ట వీరేష్ యాదవ్, కొమండ్లపల్లి సంతోష్ కుమార్, రేఖల ఆనంద్ గౌడ్, జంపాల వెంకన్న నాయి, మోదుకూరు గణేష్ నేత, మేఘావత్ చందు నాయక్, భూక్యా సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 17 2024, 20:46

పాస్ బుక్కులు, రేషన్ కార్డు ఉన్న వారికే రుణమాఫీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల పంట రుణాల మాఫీపై కసరత్తు చేస్తోంది. పంద్రాగస్టులోపు రుణమాఫీ అమలుకు విధివిధానాలు ఖరారు చేయడంలో నిమగ్నమైంది.

అయితే పాస్‌బుక్‌లు, రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకుని అవి ఉన్న వారికే రుణమాఫీ అమలు చేసేలా తాజాగా ఓ ప్రతిపాదనను అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపన్ను చెల్లించే వారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లు తెలిసింది.

పంట రుణాల మాఫీపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో వ్యవసాయాధికారులు రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు.

మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరనుంది. ఈలోపు రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ వివిధ ప్రామాణికాల ప్రాతిపదికన విస్తృతస్థాయిలో అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 17 2024, 20:03

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గారెంటీలు వెంటనే అమలు చేయాలి

  ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలైనా 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అయిదువ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది.

ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బస్సు గ్యాస్ వరకే పరిమితిని కాకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు.

ప్రజలకు అవసరమైన విద్యా వైద్యం ఉచితంగా అందించుటకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

సంఘం ఆధ్వర్యంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సమగ్రంగా సర్వేలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కార్యక్రమం రూపొందించినట్లు తెలియజేశారు. సమ భావన సంఘాల మహిళలకు అందాల్సిన పావలా వడ్డీ నేటికీ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు సమభావన సంఘాల మహిళలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై అనేక అగైత్యాలు జరుగుతున్నాయని వృద్ధుల నుండి పసి పిల్లల వరకు అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం.

చేశారు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి దోషులను శిక్షించాలని తెలియజేశారు.

ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి జనబోయిన నాగమణి పాతూరి గోవర్ధన కారంపూడి ధనలక్ష్మి జిల్లా కమిటీ సభ్యురాలు గోలి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. 

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 17 2024, 15:25

నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై మండిపడ్డ కేటీఆర్

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోని కేంద్రం

ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన

పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు.. నీట్ వ్యవహారంపై స్పందించాలి

మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలి..వెంటనే బాధ్యులను శిక్షించాలి

కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ డిమాండ్

కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. ఓవైపు బీహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ఆది నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోడీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు... ప్రతీసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. 

గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. అలాంటిది.. ఇంత ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.. అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 

లక్షల మంది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసిన కేంద్రం స్పందించలేదని, పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టులో కేసు వేసినా ఒక్క వివరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చాలా చిత్రమైన సమాధానాలు చెప్పిందన్నారు. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందని, అసలు నీట్ లాంటి ఎగ్జామ్ లకు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదని, అయినప్పటికీ ఎందుకిలా చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 1563 మంది విద్యార్థులకే ఎందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారో.... దానికి ఏ ప్రాతిపదికను తీసుకున్నారో స్పష్టం చేయటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. +4, -1 విధానం ఉండే ఈ ఎగ్జామ్ లో సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ మొత్తం అంశం వివాదం కావటంతో ఇప్పుడు ఎన్టీఏ 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిందన్నారు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాకింగ్ నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానాతంటాలు పడుతున్నారని మండిపడ్డారు. 

ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీకైందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. దీనికి బలం చేకూరే విధంగా గుజరాత్, బీహార్ లో పోలీసులు నీట్ లో అవకతవకలు పాల్పడిన కొంతమందిని అరెస్ట్ చేశారని, వరుసగా బయటపడుతున్న వివాదస్పద వ్యవహారాల కారణంగా నీట్ ఎగ్జామ్ తీరుపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా అనుమానాలు బలపడుతున్నాయన్నారు. 

తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నీట్ ఎగ్జామ్ ను పెద్దసంఖ్యలో విద్యార్థులు రాశారని, నీట్ లో జరిగిన గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ ఆరోపణల కారణంగా తెలంగాణ విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించే విధంగా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు ఎన్డీఏ సర్కారుపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇంత జరగుతున్నా ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాల్సిన అవసరముంది. లక్షలాది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన ఈ అంశంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వెంటనే ప్రధాని దీనిపై స్పందించి మొత్తం అవకతవకలకు బాధ్యులెవరన్నది దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.. నీట్ లో జరిగిన అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, వారికి న్యాయం చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇందులో ఎన్టీఏ NTA - పాత్ర పై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితోపాటు.. అక్రమంగా లబ్దిపొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.. 

అత్యంత ప్రతిష్టాత్మక నీట్ ఎగ్జామ్ మాత్రమే కాదు... దేశంలోని ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్టీఏ ఆధ్వర్యంలోనే జరుగుతున్నందున తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా ఎన్టీఏ పై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు.. నీట్ లో అక్రమాల కారణంగా కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా అసలు ఊరుకునే ప్రసక్తే లేదని, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు.