తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 18 2024, 18:08

తక్షణం కుల జనగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పొందుపరచాలి

భువనగిరి బిఎల్ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్.

 తెలంగాణ రాష్ట్రంలో కుల జనగణన చేపట్టకుండా పాత ముస పద్ధతిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ గాని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గాని బీసీ రిజర్వేషన్లను వారి ఇష్టానుసారం ప్రకటిస్తే సహించేది లేదని, వీలైతే రాష్ట్ర సెక్రటేరియట్ లేదా ఎన్నికల కమిషనర్ కార్యాలయాలను ముట్టడించడానికి కూడా వెనకాడమని అందుకే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో కుల జనగణన చేపట్టకపోతే అధత్పాతాలానికి నెట్టివేయబడుతుందని, బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పొందుపరచాలని బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులైన బీసీపీ రాష్ట్ర కార్యదర్శి కే. పర్వతాలు, ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.

 ఈరోజు భువనగిరి పట్టణంలోని పెన్షనర్స్ మీటింగ్ హాల్లో జరిగిన 20 బీసీ సంఘాల తో కూడిన 30 మంది ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని పాల్గొని మాట్లాడారు. మీటింగ్ అనంతరం జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సామూహికంగా వెళ్లి అందజేశారు.

 రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే రిపోర్ట్ లో ఉన్న కుల జనగణన వివరాలను అన్నింటిని బహిర్గతం చేయాలి. మోడీ ప్రభుత్వం పేరుకు బీసీ ప్రధాని అనే పేరు ఉన్న అగ్రవర్ణాలకు కొమ్ముగాస్తూ 10% అగ్రకులాలకు రిజర్వేషన్లను కేటాయించి, 2021లో చేపట్టాల్సిన జనగణన వివరాలను అన్నింటిని కరోనా కారణంగా మూడు సంవత్సరాలుగా వాయిదా వేశారు. ప్రతి 10 సంవత్సరాలకు నిర్వహించే జనగణన స్థానంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుల జన గణనను చేపట్టి సుదీర్ఘకాలం నుండి అన్యాయం జరుగుతున్న బీసీ ప్రజలకు చట్టసభల్లో రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం కేటాయించడం, తెలంగాణ రాష్ట్రంలో కూడా సగానికంటే ఎక్కువ ఉన్న బీసీ ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ నిర్ణయించిన 42 శాతాన్ని కూడా అంగీకరించేది లేదని, సగానికంటే ఎక్కువ బీసీ జనాభా ఉన్న తర్వాత ఏ విధంగా అశాస్త్రీయంగా చేస్తారని వారు ప్రశ్నించారు.

 ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అధ్యక్షత వహించగా, ఇందులో బీసీ వివిధ సంఘాలకు చెందిన పల్లగొరల మోడీ రాందేవ్ యాదవ్, ఎర్ర జాన్సన్ మాదిగ, సీసా శ్రీనివాస్ గౌడ్, కొడారి వెంకటేష్ యాదవ్, గుంటోజు వెంకటాచారి, వరికుప్పల కృష్ణయ్య వడ్డెర, మరిపెళ్లి శ్రీనివాస్ రజక, కప్పల రాకేష్ గౌడ్, నాగిళ్ల యాదయ్య, పూస శ్రీనివాస్ గంగపుత్ర, ఆరూరి సత్తయ్య ప్రజాపతి, మైలారం జంగయ్య, వట్టిపల్లి సుదర్శన్, గుండెబోయిన సురేష్ యాదవ్, పుట్ట వీరేష్ యాదవ్, కొమండ్లపల్లి సంతోష్ కుమార్, రేఖల ఆనంద్ గౌడ్, జంపాల వెంకన్న నాయి, మోదుకూరు గణేష్ నేత, మేఘావత్ చందు నాయక్, భూక్యా సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 17 2024, 20:46

పాస్ బుక్కులు, రేషన్ కార్డు ఉన్న వారికే రుణమాఫీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల పంట రుణాల మాఫీపై కసరత్తు చేస్తోంది. పంద్రాగస్టులోపు రుణమాఫీ అమలుకు విధివిధానాలు ఖరారు చేయడంలో నిమగ్నమైంది.

అయితే పాస్‌బుక్‌లు, రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకుని అవి ఉన్న వారికే రుణమాఫీ అమలు చేసేలా తాజాగా ఓ ప్రతిపాదనను అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపన్ను చెల్లించే వారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లు తెలిసింది.

పంట రుణాల మాఫీపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో వ్యవసాయాధికారులు రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు.

మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరనుంది. ఈలోపు రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ వివిధ ప్రామాణికాల ప్రాతిపదికన విస్తృతస్థాయిలో అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 17 2024, 20:03

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గారెంటీలు వెంటనే అమలు చేయాలి

  ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలైనా 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి అన్నారు ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అయిదువ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది.

ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బస్సు గ్యాస్ వరకే పరిమితిని కాకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు.

ప్రజలకు అవసరమైన విద్యా వైద్యం ఉచితంగా అందించుటకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

సంఘం ఆధ్వర్యంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సమగ్రంగా సర్వేలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కార్యక్రమం రూపొందించినట్లు తెలియజేశారు. సమ భావన సంఘాల మహిళలకు అందాల్సిన పావలా వడ్డీ నేటికీ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు సమభావన సంఘాల మహిళలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై అనేక అగైత్యాలు జరుగుతున్నాయని వృద్ధుల నుండి పసి పిల్లల వరకు అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం.

చేశారు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి దోషులను శిక్షించాలని తెలియజేశారు.

ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి జనబోయిన నాగమణి పాతూరి గోవర్ధన కారంపూడి ధనలక్ష్మి జిల్లా కమిటీ సభ్యురాలు గోలి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. 

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 17 2024, 15:25

నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై మండిపడ్డ కేటీఆర్

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోని కేంద్రం

ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన

పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు.. నీట్ వ్యవహారంపై స్పందించాలి

మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలి..వెంటనే బాధ్యులను శిక్షించాలి

కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ డిమాండ్

కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. ఓవైపు బీహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ఆది నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోడీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు... ప్రతీసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. 

గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. అలాంటిది.. ఇంత ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.. అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 

లక్షల మంది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసిన కేంద్రం స్పందించలేదని, పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టులో కేసు వేసినా ఒక్క వివరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చాలా చిత్రమైన సమాధానాలు చెప్పిందన్నారు. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందని, అసలు నీట్ లాంటి ఎగ్జామ్ లకు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదని, అయినప్పటికీ ఎందుకిలా చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 1563 మంది విద్యార్థులకే ఎందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారో.... దానికి ఏ ప్రాతిపదికను తీసుకున్నారో స్పష్టం చేయటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. +4, -1 విధానం ఉండే ఈ ఎగ్జామ్ లో సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ మొత్తం అంశం వివాదం కావటంతో ఇప్పుడు ఎన్టీఏ 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిందన్నారు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాకింగ్ నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానాతంటాలు పడుతున్నారని మండిపడ్డారు. 

ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీకైందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. దీనికి బలం చేకూరే విధంగా గుజరాత్, బీహార్ లో పోలీసులు నీట్ లో అవకతవకలు పాల్పడిన కొంతమందిని అరెస్ట్ చేశారని, వరుసగా బయటపడుతున్న వివాదస్పద వ్యవహారాల కారణంగా నీట్ ఎగ్జామ్ తీరుపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా అనుమానాలు బలపడుతున్నాయన్నారు. 

తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నీట్ ఎగ్జామ్ ను పెద్దసంఖ్యలో విద్యార్థులు రాశారని, నీట్ లో జరిగిన గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ ఆరోపణల కారణంగా తెలంగాణ విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించే విధంగా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు ఎన్డీఏ సర్కారుపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇంత జరగుతున్నా ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాల్సిన అవసరముంది. లక్షలాది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన ఈ అంశంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వెంటనే ప్రధాని దీనిపై స్పందించి మొత్తం అవకతవకలకు బాధ్యులెవరన్నది దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.. నీట్ లో జరిగిన అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, వారికి న్యాయం చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇందులో ఎన్టీఏ NTA - పాత్ర పై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితోపాటు.. అక్రమంగా లబ్దిపొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.. 

అత్యంత ప్రతిష్టాత్మక నీట్ ఎగ్జామ్ మాత్రమే కాదు... దేశంలోని ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్టీఏ ఆధ్వర్యంలోనే జరుగుతున్నందున తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా ఎన్టీఏ పై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు.. నీట్ లో అక్రమాల కారణంగా కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా అసలు ఊరుకునే ప్రసక్తే లేదని, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 17 2024, 07:00

సీనియర్ జర్నలిస్ట్ యలక సైదులు గౌడ్ హఠాన్మరణం.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుందాం..

SB news

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 16 2024, 15:10

రాష్ట్రంలో గాడితప్పిన శాంతిభద్రతలు

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత పాలన కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పయని నల్గొండ పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి పాలకూరి రవిగౌడ ఆవేదన వ్యక్తం చేశారు

 

ఈ సందర్భంగా రవి గౌడ మాట్లాడుతూ

 తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకులు కరువయ్యారని రవిగౌడ ఎద్దేవా చేశారు..

 ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్ష నాయకులు లేనప్పుడు ప్రజలే ప్రతిపక్ష నాయకత్వాన్ని వహించాలని ప్రజలను కోరారు..

 రాష్ట్రంలో జరుగుతున్న అలజడులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి గౌడ ప్రజలను కోరారు..

గత ప్రభుత్వ వైఫల్య కారణాల వలన భూ సమస్యల పట్ల ప్రజలు కొట్టుకుకోని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి కారణాలకు అవగాహన లేనటువంటి పాలకుల విధానాలనే కారణం ఆని రవిగౌడ ఆరోపించారు..

ప్రస్థుత ప్రభుత్వ పాలనలో 

రాష్ట్రంలో హత్యలు, పసిపిల్లలపై హత్యాచారాలు మరియు విచ్చలవిడిగా గాంజనీ వినియోగిస్తూన్న యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అలాంటి వారిని కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పూర్తిస్థాయిలో పాలనను ఏర్పాటు చేసుకోవడంలో విపలమైన కారణం చేతనే ప్రజలకు పూర్తిస్థాయిలో భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు..

ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విఫలమైన బీఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీలను ఎండగడుతూ ప్రభుత్వంపై పోరాడాలని ప్రజలకు రవిగౌడ విజ్ఞప్తి చేశారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 14 2024, 14:08

చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం BC రిజర్వేషన్లను నిర్ణయించాలి

చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం BC రిజర్వేషన్లను నిర్ణయించాలని కోరుతూ జరిగే జూన్ 18న భువనగిరిలో జిల్లాస్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయండి. BLF రాష్ట్ర కన్వీనర్, PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అభ్యర్థన

 స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్న నేటికీ పార్లమెంట్, అసెంబ్లీలో BCలకు రిజర్వేషన్లు లేకపోవడం అత్యంత దుర్మార్గం.

దాంతోపాటు రాష్ట్ర శాసనసభల్లో నిర్ణయించుకుని ముందుకు వెళ్లే స్థానిక సంస్థల్లో కూడా గత BRS ప్రభుత్వం 18% మాత్రమే రిజర్వేషన్లను పొందుపరిచి తీవ్ర అన్యాయం చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా చేయడానికి వీలులేదు.

జనాభాలో సగానికంటే ఎక్కువ ఉన్న BC ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పొందుపరచాలంటే, కుల జన గణన దేశంలో, రాష్ట్రంలో తక్షణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జూన్ 18న మంగళవారం రోజున ఉదయం 11 గం. భువనగిలోని పెన్షనర్స్ బిల్డింగులో ఏర్పాటు చేస్తున్నాము.

BC సంఘాలు, మేధావులు హాజరుకావాలని PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి కోరారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 14 2024, 11:44

రుణమాఫీ కొందరికే

షరతులు, కోతలు విధించే యోచనలో కాంగ్రెస్‌ సర్కార్‌

పీఎం కిసాన్‌ నిబంధనలను రుద్దితే 37 లక్షల మంది అన్నదాతలు పథకానికి దూరం

కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా ప్రతి సీజన్‌లో సుమారు 70 లక్షల మంది రైతులు తమకు ఉన్న మొత్తం వ్యవసాయ భూమికి పెట్టుబడి సాయం పొందారు. కానీ, పీఎం కిసాన్‌ పథకం కింద 33 లక్షల మంది రైతులకే లబ్ది.. అంటే 37 లక్షల మందికి రుణమాఫీ కాదన్న మాట

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.లక్ష వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసింది. ఇలా 2014లో 35.31 లక్షల మంది రైతులకు చెందిన రూ.16,144 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ తర్వాత 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 23 లక్షల మంది రైతులకు చెందిన రూ. 13 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది.

మొత్తం 58 లక్షల మంది రైతులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇందుకోసం రూ.29,144 కోట్లను వెచ్చించింది

 

 రావుల శ్రీనివాస్ రెడ్డి మాజీ కౌన్సిలర్

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 12 2024, 19:18

పాకిస్తాన్ జిహాదీ మూకల దిష్టిబొమ్మ దహనం చేసిన VHP బజరంగ్ దళ్

జూన్ 9న, ఇస్లామిక్ జిహాదీ పాకిస్థాన్ మద్దతుగల ఉగ్రవాదులు మాతా వైష్ణో దేవి కత్రా నుండి శివ్ ఖోడీకి వెళుతుండగా జమ్మూ మరియు కాశ్మీర్లో మతపరమైన తీర్థయాత్రకు వెళుతున్న హిందూ యాత్రికులపై మెరుపుదాడి చేసి, శివఖోడి సమీపంలో బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, బస్సుతో సహా 10 మంది యాత్రికులను చంపారు. డ్రైవర్ తో సహా. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నల్గొండ జిల్లా కేంద్రంలో హిందూ యాత్రికుల హత్యకు వ్యతిరేకంగా 12 జూన్ 2024న భజరంగ్ దళ్ - తీవ్రవాద దాడిలో మరణించిన హిందూ యాత్రికులకు నివాళులు అర్పిస్తూ- పాకిస్తాన్ ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదం యొక్క దిష్టిబొమ్మను దహనం ఇట్టి కార్యక్రమంలో

      

 బజరంగ్ దళ్ స్టేట్ కో కన్వీనర్ కన్నే బోయిన 

వెంకట్

విశ్వహిందూ పరిషత్ జిల్లా సహకార్యదర్శి జూకూరి 

సంపత్ వర్మ 

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 11 2024, 19:34

కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చాం: జస్టిస్‌ ఎల్.నరసింహారెడ్డ

కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చాం: జస్టిస్‌ ఎల్.నరసింహారెడ్డి

విద్యుత్‌ కొనుగోళ్లు అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చామని జస్టిస్‌ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు.

ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. 'విద్యుత్‌ కొనుగోళ్లలో కేసీఆర్‌ సహా 25 మందికి నోటీసులు ఇచ్చాము. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్‌ జులై 30 వరకు సమయం అడిగారు.

జూన్‌ 15 వరకు వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు తెలిపాం. 2016లో రెగ్యులేటరీ కమిషన్‌కు అర్వింద్‌ కుమార్‌ విద్యుత్‌ కొనుగోళ్లపై ఆర్థిక భారం పడుతుందని..

ఓపెన్‌ బిడ్డింగ్‌ ద్వారా డబ్బు ఆదా అవుతుందని లేఖ రాశారు. ఆ తర్వాత సెక్రటరీగా లేనని అర్వింద్‌ చెప్పారు' అని అన్నారు.