తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 17 2024, 07:00

సీనియర్ జర్నలిస్ట్ యలక సైదులు గౌడ్ హఠాన్మరణం.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుందాం..

SB news

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 16 2024, 15:10

రాష్ట్రంలో గాడితప్పిన శాంతిభద్రతలు

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత పాలన కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పయని నల్గొండ పార్లమెంట్ కాంటెస్ట్ అభ్యర్థి పాలకూరి రవిగౌడ ఆవేదన వ్యక్తం చేశారు

 

ఈ సందర్భంగా రవి గౌడ మాట్లాడుతూ

 తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకులు కరువయ్యారని రవిగౌడ ఎద్దేవా చేశారు..

 ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్ష నాయకులు లేనప్పుడు ప్రజలే ప్రతిపక్ష నాయకత్వాన్ని వహించాలని ప్రజలను కోరారు..

 రాష్ట్రంలో జరుగుతున్న అలజడులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి గౌడ ప్రజలను కోరారు..

గత ప్రభుత్వ వైఫల్య కారణాల వలన భూ సమస్యల పట్ల ప్రజలు కొట్టుకుకోని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి కారణాలకు అవగాహన లేనటువంటి పాలకుల విధానాలనే కారణం ఆని రవిగౌడ ఆరోపించారు..

ప్రస్థుత ప్రభుత్వ పాలనలో 

రాష్ట్రంలో హత్యలు, పసిపిల్లలపై హత్యాచారాలు మరియు విచ్చలవిడిగా గాంజనీ వినియోగిస్తూన్న యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అలాంటి వారిని కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పూర్తిస్థాయిలో పాలనను ఏర్పాటు చేసుకోవడంలో విపలమైన కారణం చేతనే ప్రజలకు పూర్తిస్థాయిలో భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు..

ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విఫలమైన బీఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీలను ఎండగడుతూ ప్రభుత్వంపై పోరాడాలని ప్రజలకు రవిగౌడ విజ్ఞప్తి చేశారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 14 2024, 14:08

చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం BC రిజర్వేషన్లను నిర్ణయించాలి

చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం BC రిజర్వేషన్లను నిర్ణయించాలని కోరుతూ జరిగే జూన్ 18న భువనగిరిలో జిల్లాస్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయండి. BLF రాష్ట్ర కన్వీనర్, PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అభ్యర్థన

 స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్న నేటికీ పార్లమెంట్, అసెంబ్లీలో BCలకు రిజర్వేషన్లు లేకపోవడం అత్యంత దుర్మార్గం.

దాంతోపాటు రాష్ట్ర శాసనసభల్లో నిర్ణయించుకుని ముందుకు వెళ్లే స్థానిక సంస్థల్లో కూడా గత BRS ప్రభుత్వం 18% మాత్రమే రిజర్వేషన్లను పొందుపరిచి తీవ్ర అన్యాయం చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా చేయడానికి వీలులేదు.

జనాభాలో సగానికంటే ఎక్కువ ఉన్న BC ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పొందుపరచాలంటే, కుల జన గణన దేశంలో, రాష్ట్రంలో తక్షణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జూన్ 18న మంగళవారం రోజున ఉదయం 11 గం. భువనగిలోని పెన్షనర్స్ బిల్డింగులో ఏర్పాటు చేస్తున్నాము.

BC సంఘాలు, మేధావులు హాజరుకావాలని PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి కోరారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 14 2024, 11:44

రుణమాఫీ కొందరికే

షరతులు, కోతలు విధించే యోచనలో కాంగ్రెస్‌ సర్కార్‌

పీఎం కిసాన్‌ నిబంధనలను రుద్దితే 37 లక్షల మంది అన్నదాతలు పథకానికి దూరం

కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా ప్రతి సీజన్‌లో సుమారు 70 లక్షల మంది రైతులు తమకు ఉన్న మొత్తం వ్యవసాయ భూమికి పెట్టుబడి సాయం పొందారు. కానీ, పీఎం కిసాన్‌ పథకం కింద 33 లక్షల మంది రైతులకే లబ్ది.. అంటే 37 లక్షల మందికి రుణమాఫీ కాదన్న మాట

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.లక్ష వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసింది. ఇలా 2014లో 35.31 లక్షల మంది రైతులకు చెందిన రూ.16,144 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ తర్వాత 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 23 లక్షల మంది రైతులకు చెందిన రూ. 13 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది.

మొత్తం 58 లక్షల మంది రైతులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇందుకోసం రూ.29,144 కోట్లను వెచ్చించింది

 

 రావుల శ్రీనివాస్ రెడ్డి మాజీ కౌన్సిలర్

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 12 2024, 19:18

పాకిస్తాన్ జిహాదీ మూకల దిష్టిబొమ్మ దహనం చేసిన VHP బజరంగ్ దళ్

జూన్ 9న, ఇస్లామిక్ జిహాదీ పాకిస్థాన్ మద్దతుగల ఉగ్రవాదులు మాతా వైష్ణో దేవి కత్రా నుండి శివ్ ఖోడీకి వెళుతుండగా జమ్మూ మరియు కాశ్మీర్లో మతపరమైన తీర్థయాత్రకు వెళుతున్న హిందూ యాత్రికులపై మెరుపుదాడి చేసి, శివఖోడి సమీపంలో బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, బస్సుతో సహా 10 మంది యాత్రికులను చంపారు. డ్రైవర్ తో సహా. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నల్గొండ జిల్లా కేంద్రంలో హిందూ యాత్రికుల హత్యకు వ్యతిరేకంగా 12 జూన్ 2024న భజరంగ్ దళ్ - తీవ్రవాద దాడిలో మరణించిన హిందూ యాత్రికులకు నివాళులు అర్పిస్తూ- పాకిస్తాన్ ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదం యొక్క దిష్టిబొమ్మను దహనం ఇట్టి కార్యక్రమంలో

      

 బజరంగ్ దళ్ స్టేట్ కో కన్వీనర్ కన్నే బోయిన 

వెంకట్

విశ్వహిందూ పరిషత్ జిల్లా సహకార్యదర్శి జూకూరి 

సంపత్ వర్మ 

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 11 2024, 19:34

కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చాం: జస్టిస్‌ ఎల్.నరసింహారెడ్డ

కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చాం: జస్టిస్‌ ఎల్.నరసింహారెడ్డి

విద్యుత్‌ కొనుగోళ్లు అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చామని జస్టిస్‌ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు.

ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. 'విద్యుత్‌ కొనుగోళ్లలో కేసీఆర్‌ సహా 25 మందికి నోటీసులు ఇచ్చాము. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్‌ జులై 30 వరకు సమయం అడిగారు.

జూన్‌ 15 వరకు వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు తెలిపాం. 2016లో రెగ్యులేటరీ కమిషన్‌కు అర్వింద్‌ కుమార్‌ విద్యుత్‌ కొనుగోళ్లపై ఆర్థిక భారం పడుతుందని..

ఓపెన్‌ బిడ్డింగ్‌ ద్వారా డబ్బు ఆదా అవుతుందని లేఖ రాశారు. ఆ తర్వాత సెక్రటరీగా లేనని అర్వింద్‌ చెప్పారు' అని అన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 11 2024, 15:49

కుల జనగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. బీసీ సంఘాలతో కూడిన రౌండ్ టేబుల్ సమావేశంలో బి.ఎల్.ఎఫ్. నాయకుల ఉధ్గాటన

 దేశంలో, రాష్ట్రంలో గత పాలక ప్రభుత్వాలన్నీ జగనాభాలో సగభాగానికంటే ఎక్కువగా ఉన్న బీసీ ప్రజలను మోసం చేస్తున్నారని, నేటికీ బీసీ ప్రజలకు పార్లమెంట్లో, అసెంబ్లీలో రిజర్వేషన్లు లేకపోవడం స్థానిక సంస్థల్లో కూడా బీసీ ప్రజలకు బిచ్చం వేసినట్టుగా పాలకపక్షాలు అతి తక్కువ రిజర్వేషన్లు ఇవ్వడం అత్యంత దుర్మార్గం. ఈ స్థితి ఉండడానికి వీలులేదని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం కూడా అశాస్త్రీయమైనది. 42 శాతం కంటే ఎక్కువగా గణనీయమైన సంఖ్యలో బీసీ ప్రజలు ఉంటారని తక్షణం కుల జనగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, యధాతధ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ గత వివక్ష కొనసాగుతుందని, దీనిని సహించబోమని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులజనగణన చేపట్టే వరకు, బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెంచే వరకు ప్రత్యక్ష పోరాటం సాగిస్తామని" బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర నాయకులైన బీ.సీ.పీ. రాష్ట్ర కార్యదర్శి కే. పర్వతాలు, బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర నాయకులైన ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి, బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర నాయకు లైన ఎం.సి.పి.ఐ.(యు) కేంద్ర కమిటీ సభ్యులు వస్కుల మట్టయ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

 ఈరోజు నల్లగొండలో జరిగిన బీ.సీ. సంఘాల, బి.ఎల్.ఎఫ్. భాగస్వామ్య రాజకీయ పక్షాల సమన్వయ రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. నల్లగొండలోని పెన్షనర్స్ బిల్డింగ్ లోని మీటింగ్ హాల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో 40 బీసీ సంఘాలకు చెందిన 50 మంది నాయకులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.

 ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం మూకుమ్మడిగా వెళ్లి నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కుల జనగణన చేపట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీ.సీ. ప్రజలు మోసపోతారని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 23 శాతం అమలు చేస్తామని, చెప్పి కేవలం 18 శాతం మాత్రమే అమలు చేశారని ఈ విషయంలో ఏనాడు ఎవరు ప్రశ్నించలేదని ప్రస్తుతం కూడా ఇదే స్థితి కొనసాగితే, తీవ్రంగా పోరాడుతామని మాట్లాడిన నాయకులు ప్రతినిధులందరూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

 ఈ సమావేశానికి బీ.సీ.పీ. రాష్ట్ర కార్యదర్శి కే పర్వతాలు అధ్యక్షత వహించారు. ఆహుతులు అందరికీ బి.ఎల్.ఎఫ్. తరఫున చర్చకు సాధ్యమయ్యే అంశాలతో రిపోర్టును ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ప్రవేశపెట్టి మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన విషయాలను ప్రతిపాదించారు. వీటిపైన ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్, రిటైర్డ్ తహసిల్దార్ ప్రకాష్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్, గంగపుత్ర జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్, యాదవ సంఘం జిల్లా నాయకులు వేణు కుమార్ యాదవ్, మేర సంఘం జిల్లా నాయకులు తాడూరి రమేష్ మేర, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు నేలపట్ల రమేష్ నాయి, శాలివాహన సంఘం నాయకులు వెంకన్న ప్రజాపతి, నిమ్మనగోటి కృష్ణయ్య ప్రజాపతి, విశ్వకర్మ జిల్లా నాయకులు ప్రకాష్ చారి, వడ్డెర సంఘం జిల్లా నాయకులు రమేష్, గౌడ సంఘం జిల్లా నాయకులు వడ్డగోని అంజయ్య గౌడ్, రజక సంఘం జిల్లా నాయకులు కొండూరు సత్యనారాయణ, బహుజన ఉద్యమ నాయకులు వంటేపాక యాదగిరి, బీసీ సంఘం నల్లగొండ పట్టణ అధ్యక్షులు సదాశివ, మేళ్ల శంకర్ ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్, మేడిద పురుషోత్తం ధర్మరాజు, సింగం వెంకటయ్య, సింగారం మల్లయ్య, శేఖర్ శాలివాహన సంఘం జిల్లా నాయకులు శరత్ బాబు, పి ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు బైరు వెంకన్న గౌడ్, గునగంటి సత్తయ్య గౌడ్, సుంకర బోయిన మల్లయ్య, సుంకరి నరసింహ, కప్పల రాకేష్ గౌడ్, ఎంసిపిఐ యు జిల్లా నాయకులు పోతుగంటి కాశి, వస్కుల భరత్, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా నాయకులు జక్కుల నరసింహ, బైరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

 చివరిలో సమావేశానికి సకాలంలో విచ్చేసి విలువైన సూచనలు సలహాలు ఇచ్చి భవిష్యత్తులో వేలాదిమంది బీసీ ప్రజలచే నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించాలని, కుల జన గణనలతో సంబంధం లేకుండా అతి తక్కువ రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఎలక్షన్ కమిషనర్ ఆఫీసును కూడా ముట్టడించడానికి బీసీ ప్రజలు సిద్ధం కావాలని ఎం సి పి ఐ యు కేంద్ర కమిటీ సభ్యులు వస్కుల మట్టయ్య చెబుతూ విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 08 2024, 13:07

ఆదిత్యానాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసిన మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు

చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడు

ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలయిందనడానికి ఈ నియామకమే నిదర్శనం

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవిని లాగేస్తారన్న భయంతో చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటాడా ?

నాడు జలయజ్ఞం ప్రాజెక్టుల నుండి నిన్న పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యాదాస్ ది కీలకపాత్ర

ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి

తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకిగా ముద్రపడ్డ వ్యక్తిని ఏ ప్రయోజనాల కోసం ఈ పదవిలో కూర్చోబెట్టారు ?

వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు 

కానీ ఆంధ్రకు కృష్ణా ప్రాజెక్టుల నుండి నీటిని తరలించడంలో ఆయనది కీలకపాత్ర

తెలంగాణ ఏర్పడినప్పటి నుండి గత పదేళ్లుగా ఆయన ఏపీ తరపున కొట్లాడిన వ్యక్తి ఆయన తెలంగాణకు న్యాయం చేస్తాడా?

కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనక కాంగ్రెస్ ఆలోచన ఏంటి ?

పోతిరెడ్డిపాడు, దుమ్ముగూడెం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో తెలంగాణ నీటిని తరలించడంలోనూ ఆదిత్యాదాస్ దే కీలకపాత్ర .. అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రయోజనాల కోసం కృషిచేస్తాడా ?

తెలంగాణ ప్రాజెక్టులు, జల వనరుల మీద అపారమైన అనుభవం, అవగాహన ఉన్న ఎందరో జల నిపుణులు ఉన్నారు వారిని పక్కనపెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎంచుకోవడం వెనక కారణాలేంటి ?

కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉంది

ఆదిత్యానాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుండి తొలగించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 07 2024, 15:52

చాంపియన్ అవార్డు గ్రహీత సురేష్ గుప్తను అభినందించిన మాతృశ్రీ సా. సా. సా. సేవా సంస్థ

తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి గ్రీన్ చాంపియన్ - 2024 అవార్డు ను రాష్ట్ర పర్యావరణాతవే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డైరెక్టర్ వాణి ప్రసాద్ నుంచి నల్గొండ పర్యావరణ ప్రేమికుడుమిట్టపల్లి సురేష్ గుప్త  బుధవారం న అందుకున్నారు.

సురేష్ గుప్త ను కవి, రచయిత, రంగస్థల నటులు, మాతృశ్రీ సంతపూరె విమలా బాయి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు Dr. సంత పురి నారాయణ్ రావు ప్రధాన కార్యదర్శి.

Dr. పగిల్ల శ్రీనివాసు లు శుభాకాంక్షలు తెలిపారు. వారు మరిన్ని విశిష్ట సేవలు సమాజానికి అందించాలని 

వారు కోరారు.

Sb

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 07 2024, 12:17

ఫీజుల మోత

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి.

పలు ప్రైవేట్‌ బడులు. ముఖ్యంగా కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలలు ఏకంగా 25శాతం వరకు ఫీజులు పెంచేశాయి.

కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు 40-50 శాతం భారం మోపుతున్నాయి.

ఇప్పటికే చాలా బడులు కొత్త రుసుముల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయగా. మరికొన్ని ఈ నెల 15వ తేదీ తర్వాత నిర్ణయించనున్నాయి