గంజాయి మత్తులో యువత... యువతలో మార్పును తీసుకొచ్చే దిశలో వలిగొండ పోలీసులు
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి విక్రయించినట్లైనా సేవించినట్లైనా.., తెలిసిన సమాచారం ఇవ్వగలరని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వలిగొండ ఎస్సై డి మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా వారు పలు చట్టాల గురించి వివరించారు. NDPS చట్టం అంటే NDPS చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఉత్పత్తి/తయారీ/సాగు, స్వాధీనం, అమ్మకం, కొనుగోలు, రవాణా, నిల్వ మరియు/లేదా ఏదైనా మాదక ఔషధం లేదా సైకోట్రోపిక్ పదార్ధాల వినియోగం నుండి నిషేధిస్తుంది. *మొదట 1985లో అమలులోకి వచ్చినది ఈ చట్టo* చట్టం ప్రకారం, నార్కోటిక్ డ్రగ్స్లో కోకా లీఫ్, గంజాయి (జనపనార), నల్లమందు మరియు గసగసాల గడ్డి ఉన్నాయి; మరియు సైకోట్రోపిక్ పదార్ధాలలో ఏదైనా సహజ లేదా సింథటిక్ పదార్థం లేదా సైకోట్రోపిక్ పదార్ధాల ద్వారా తీయబడిన ఏదైనా ఉప్పు (పౌడర్) లేదా తయారీ ఉంటుంది. సైకోట్రోపిక్ డ్రగ్ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు దాని అక్రమ రవాణా యొక్క పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ చట్టం కింద జరిమానాలు తీవ్రంగా ఉంటాయి. ఈ చట్టం కింద నేరాలకు ఒక సంవత్సరం నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు నేరాన్ని బట్టి జరిమానా విధించబడుతుంది. చట్టం ప్రకారం, ప్రేరేపణ, నేరపూరిత కుట్ర మరియు నేరానికి పాల్పడే ప్రయత్నాలు కూడా నేరానికి సమానమైన శిక్షను పొందుతాయి. నేరం చేయడానికి సిద్ధపడటం కూడా సగం పెనాల్టీని ఆకర్షిస్తుంది. పునరావృత నేరాలకు ఒకటిన్నర రెట్లు జరిమానా మరియు కొన్ని సందర్భాల్లో మరణశిక్ష విధించబడుతుంది. NDPS చట్టంలోని నిబంధనల ప్రకారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 1986లో ఏర్పాటైంది . NCB అనేది మాదకద్రవ్యాల చట్ట అమలుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతర కార్యాలయాలు & రాష్ట్ర/కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమన్వయం చేయడానికి మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించిన విషయాలకు సంబంధించి బాధ్యత వహించే నోడల్ ఏజెన్సీ . చట్టం ప్రకారం, చట్టం కింద దోషిగా నిర్ధారించబడిన డ్రగ్-సంబంధిత నేరాల నుండి వ్యక్తి సంపాదించిన ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, స్తంభింపజేయవచ్చు మరియు జప్తు చేయవచ్చు. *NDPS చట్టం ప్రకారం శిక్షలు* అన్ని నేరాలు నాన్ బెయిలబుల్. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే, మాదకద్రవ్యాల దోషులు ఉత్తీర్ణత, ఉపశమనం మరియు ఉత్తీర్ణులైన శిక్షలను మార్చడం ద్వారా ఎటువంటి ఉపశమనం పొందలేరు. *నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ తగ్గింపు (NAPDDR) ఈ లక్ష్యాల దిశగా పనిచేస్తుంది.* *NDPS చట్టం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు* *ప్రశ్న 1* NDPS చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం, 1985 కూడా NDPS చట్టంగా పిలువబడుతుంది, ఏదైనా మత్తుమందు లేదా సైకోట్రోపిక్ పదార్ధం యొక్క ఉత్పత్తి, సాగు, అమ్మకం, కొనుగోలు, రవాణా, నిల్వ మరియు/లేదా వినియోగంతో కూడిన ఏదైనా కార్యాచరణలో పాల్గొనకుండా ఏ వ్యక్తిని నిషేధిస్తుంది. *ప్రశ్న2* నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల మధ్య తేడా ఏమిటి? వైద్య దృక్కోణం నుండి, సైకోట్రోపిక్స్ అనేది ఒక వ్యక్తి యొక్క స్పృహ లేదా అపస్మారక మానసిక జీవితంపై మనస్సుపై పనిచేసే రసాయన పదార్ధాలను నిర్దేశిస్తుంది. నార్కోటిక్స్లో మూర్ఖత్వం, కండరాల సడలింపు మరియు సున్నితత్వాన్ని తగ్గించడం లేదా తొలగించడం వంటి పదార్థాలు ఉంటాయని తెలిపారు.


గురుకులాలలో మౌలిక వసతులు కల్పించాలి ఏఐఎస్ఎఫ్* ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో గురుకులాలలో మౌనిక వసతులు కల్పించాలని , గురుకుల పాఠశాలల్లో మరుగుదొడ్లు వంటశాలలు పరిశుభ్రంగా ఉంచాలని నాణ్యమైన భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు గత సంవత్సరంలో జరిగిన అవకతవకలు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని యాదాద్రి రివిజనల్ కోఆర్డినేటర్ రజిని గారికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరంలో గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ విద్యార్థి మరణం ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రీజనల్ కోఆర్డినేటర్ రజని గారు నిత్యం గురుకులాల పర్యవేక్షణ చేయాలని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మేడ్చల్ జిల్లా జనగాం జిల్లాల లోని అన్ని బాలుర, బాలికల పాఠశాలలు కళాశాలలు సందర్శించాలని వారిని కోరారు గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని రీజనల్ కోఆర్డినేటర్ గారు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ, ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు సందీప్ విద్యార్థుల తల్లిదండ్రులు బాల నరసింహ దయాకర్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి ఎంపీ నేటి స్థానిక జిల్లా మంత్రి భువనగిరి ఎమ్మెల్యే, ఎంపీ లు త్రిబుల్ ఆర్ బాధితులకు మేము అధికారంలోకి వస్తే అలైన్మెంట్ ను మారుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు గత ప్రభుత్వం త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం ముందు చేసిన అలైన్మెంట్ను మార్చి చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను కోల్పోయే విధంగా రోడ్డు నిర్మాణం కోసం చేర్పులు, మార్పులు చేసిందన్నారు .
దీనిపై భూ నిర్వాసితులతో పాటు రైతు సంఘాలు సంస్థలు అనేక రాజకీయ పార్టీలు ఆందోళన నిర్వహించాయన్నారు నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేటి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిపిస్తే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను మారుస్తామని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారా? లేదో దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మండల పరిధిలోని వర్కట్ పల్లి,గోకారం,పహిల్వాన్ పురం,పొద్దుటూర్,రెడ్ల రేపాక ఐదు గ్రామాల్లో ఈ రోడ్డు రావడంతో అనేకమంది చిన్న సన్నకారు రైతులు తమ భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు మరొకపక్క చౌటుప్పల్ ఆర్డీవో జంక్షన్ల కోసం 103 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తుందని దీనికి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని ప్రకటించారన్నారు రైతులు భూములు ఇవ్వమని తెగేసి చెబుతున్న మళ్లీ రైతులతో ఆర్డీవోల పరిధిలో అభిప్రాయ సేకరణ చేయాలని పాస్ పుస్తకాలు మిగతా డాక్యుమెంట్లు తీసుకురావాలని అధికారులు ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు ఇప్పటికైనా స్థానిక జిల్లా మంత్రి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు వెంటనే స్పందించాలని అలైన్మెంట్ను మార్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు..
విద్యార్థుల భవిష్యత్ మన చేతుల్లో ఉంది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తో పనిచేయాలని కోరారు . పాఠశాల మరియు విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడానికి పిల్లలకు సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలి అనే పట్టుదల తో ఉన్నాం . స్థానిక సమస్యల గురించి సిఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తాను. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన తొలి సారి కొండమడుగు బడి బాట రావడం చాల అదృష్టంగా భావిస్తున్నాను. సమిష్టిగా కృషి చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సునీత , స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,బీబీనగర్ ఎంపిపి సుధాకర్ ,ZPTC గోలి ప్రణిత పింగల్ రెడ్డి , PACS చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి , DRDO కృష్ణన్,స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Jun 15 2024, 13:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.5k