వలిగొండ మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్
![]()
వలిగొండ మండలం 37 గ్రామపంచాయతీ లతో జిల్లాలోని అతిపెద్ద మండలం గా ఉండడంతోపాటు విద్యుత్,వ్యవసాయ మోటర్లపై ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న మండల రైతాంగానికి ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం మండల కేంద్రంలో అందుబాటులో లేక భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు రామన్నపేటకు ట్రాన్స్ఫార్మర్లను తీసుకెళ్లడానికి రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని వేలాది రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి వస్తుందని వెంటనే వలిగొండలో స్థానిక సబ్స్టేషన్ యందు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు బుధవారం రోజున సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం కోసం డిమాండ్ చేస్తూ అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని గత ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించలేదన్నారు ఇప్పటికైనా వెంటనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక ఎమ్మెల్యే స్పందించి వలిగొండ మండల కేంద్రంలో గల సబ్స్టేషన్ యందు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగాపార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి పార్టీలు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రైతులు పండించిన దొడ్డు,సన్న తేడా లేకుండా అన్ని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని,రైతు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు మాట్లాడుతూ మండల పరిధిలోని అనేక గ్రామాలకు లింక్ రోడ్లుగా ఉన్న గ్రామీణ రోడ్లు ధ్వంసమై ప్రజలను ప్రయాణికులను,రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు వెంటనే సుంకిశాల నుండి వెల్వర్తి వరకు, వెలువర్తి నుండి ఆరూరు వరకు, కెర్చిపల్లి నుండి పులిగిల్ల వరకు,గోకారం నుండి నెలపట్ల వరకు,అరూర్ నుండి తుర్కపల్లి వరకు, బీటి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు అదే విధంగా ధర్మారెడ్డి పల్లి కాలువ వెంట ఉన్న కల్వర్టులను,తూములు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు నూతన కల్వర్టులు,తూములను నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్,చీర్క శ్రీశైలం రెడ్డి,మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు,కందడి సత్తిరెడ్డి,మొగిలిపాక గోపాల్, వాకిటి వెంకట్ రెడ్డి,కొండే కిష్టయ్య,కర్ణ కంటి యాదయ్య, కవిడే సురేష్,దుబ్బ లింగం,భీమనబోయిన జంగయ్య,చీర్క మల్లారెడ్డి,దయ్యాల సత్యరాములు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం కోసం డిమాండ్ చేస్తూ అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని గత ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించలేదన్నారు ఇప్పటికైనా వెంటనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక ఎమ్మెల్యే స్పందించి వలిగొండ మండల కేంద్రంలో గల సబ్స్టేషన్ యందు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగాపార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి పార్టీలు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రైతులు పండించిన దొడ్డు,సన్న తేడా లేకుండా అన్ని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని,రైతు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు మాట్లాడుతూ మండల పరిధిలోని అనేక గ్రామాలకు లింక్ రోడ్లుగా ఉన్న గ్రామీణ రోడ్లు ధ్వంసమై ప్రజలను ప్రయాణికులను,రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు వెంటనే సుంకిశాల నుండి వెల్వర్తి వరకు, వెలువర్తి నుండి ఆరూరు వరకు, కెర్చిపల్లి నుండి పులిగిల్ల వరకు,గోకారం నుండి నెలపట్ల వరకు,అరూర్ నుండి తుర్కపల్లి వరకు, బీటి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు అదే విధంగా ధర్మారెడ్డి పల్లి కాలువ వెంట ఉన్న కల్వర్టులను,తూములు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు నూతన కల్వర్టులు,తూములను నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్,చీర్క శ్రీశైలం రెడ్డి,మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు,కందడి సత్తిరెడ్డి,మొగిలిపాక గోపాల్, వాకిటి వెంకట్ రెడ్డి,కొండే కిష్టయ్య,కర్ణ కంటి యాదయ్య, కవిడే సురేష్,దుబ్బ లింగం,భీమనబోయిన జంగయ్య,చీర్క మల్లారెడ్డి,దయ్యాల సత్యరాములు తదితరులు పాల్గొన్నారు.

రెసిడెన్షియల్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఉన్నత స్థాయికి వెళుతున్నారు ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం లక్ష్యంగా మంచి విద్యను బోధించడం జరుగుతుంది. ఉచితంగా అందిస్తున్న విద్యను అభ్యసించి పై స్థాయికి వెళ్ళాలని కోరారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి వారు కూడా భాగస్వాములు అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కౌన్సిలర్ శ్రీమతి ఉబ్బు వరమ్మ వెంకటయ్య, ఆలె నాగరాజు,శ్రీధర్ బాబు, బొడిగె బాలకృష్ణ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం" సందర్భంగా తేదీ 12-06-2024 బుధవారం ఉదయం 09 గంటలకు భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశానుసారం, యాదాద్రి భువనగిరి జిల్లా జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆద్వర్యంలో "బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన" కోసం సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సదస్సులో ప్రభుత్వఅధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, వ్యాపారులు, వివిధ కర్మాగారాల యాజమాన్యాలు , ప్రజలు పాల్గొని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాలల హక్కుల పరిరక్షణ కోసం, బడి ఈడు పిల్లలు బడిలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు.
యాదాద్రి భువనగిరి జిల్లా : మధ్యాహ్న భోజన వంట కార్మికులకు రావలసిన పెండింగ్ మెస్ బిల్లులు, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో నెలకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేసి కోడిగుడ్లు మరియు వంటగ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేసి, నాణ్యమైన బియ్యాన్ని పాఠశాలలకు పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కోరారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామానికి చెందిన కసర బోయిన లింగయ్య మాజీ మత్స్యగిరి గుట్ట డైరెక్టర్ కూతురు, కుమారుడి వస్త్ర అలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గరిసె రవి , మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆవుల స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ అరూర్ ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు చిలకమర్రి కనకా చారి ,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బండారు మహిపాల్ రెడ్డి ,అరూరు మాజీ సర్పంచ్ చెమ్మయ్య ,మాజీ ఎంపీటీసీ చంద్రయ్య ,అరూరు హై స్కూల్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల సత్యనారాయణ, జినుకల మల్లేష్ యాదవ్, ప్రైమరీ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య, మండల కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్, వెలిమినేటి సంతోష్ కుమార్, కసర బోయిన సాయి మల్లు, గడ్డల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ మండల కమిటీ సభ్యులు కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి (ధర్మ భిక్షం) గారి ఆశయ సాధనకై కూలీ, భూమి పోరాటాలను ఉదృతంగా కొనసాగిద్దామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ భువనగిరి మండలం చీమలకొండూరు గ్రామంలో రాత్రి జరిగిన కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి గారి సంతాప సభలో పాల్గొని మాట్లాడుతూ పిలుపునిచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, కొండ అశోకు, మండల కమిటీ సభ్యులు సిల్వేరు ఎల్లయ్య, పాండాల మైసయ్య, మాజీ మండల కమిటీ సభ్యులు వడ్డెబోయిన వెంకటేష్, సిపిఎం శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు, ముత్తిరెడ్డిగూడెం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, ముస్త్యలపల్లి శాఖ కార్యదర్శి కళ్లెం లక్ష్మి నరసయ్య , శాఖ సభ్యులు రావుల పోషాలు, రావుల కిష్టయ్య , పల్లెర్ల వినోదు , గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
కూలి రేట్ల పెంపుకై కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు బయలుదేరి వెళ్లిన హమాలీ కార్మికులు ..* తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సప్లయి కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు కూలి రేట్లు క్వింటాకు ఎగుమతి దిగుమతి రూ.40/-పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో కూలి రేట్లు పెంచాలని *చలో కమిషనర్ భవన్ (మహాధర్నా)* సందర్బంగా భువనగిరి నుండి కార్మికులు హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు రెండు సంవత్సరాలకు ఒకసారి కూలి రేట్లు పెంచేందుకు గత ప్రభుత్వాలు జీవో విడుదల చేశాయని దాని ప్రకారం జనవరి 2024 సంవత్సరం నుండి హమాలీ కార్మికుల రేట్లు పెంచాలని కానీ సివిల్ సప్లయి కమీషనర్ ఆరు నెలలు గడిచిన పట్టించుకోవడంలేదని అన్నారు. హమాలీ కార్మికులు చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా అందించే నిత్యవసర వస్తువులను పేద బడుగు బలహీన వర్గాలకు అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
కానీ హమాలీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీగురిచేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లిన రేపు మాపు అంటూ కాలయాపన చేస్తుంది, తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు హమాలి కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రతి కార్మికునికి ఈ ఎస్ ఐ, పి ఎఫ్, బోనస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు హమాలీ కార్మికులకు బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం 50 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులకు నెలకు 5వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు ,మహిళా స్వీపర్లకు నెలకు రూ.10వేలు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్ భువనగిరి పాయింట్ అధ్యక్షులు ముదిగొండ బసవయ్య, నాయకులు మామిండ్ల సత్యనారాయణ, గొరవంతల శ్రీను, బొజ్జ గణేష్, పిన్నం జగన్, పల్లెర్ల మైసయ్య, కొండ మల్లేష్, స్వామి, వెంకటేష్, బాలరాజ్, నర్సింహా, మల్లేష్, పాండు, తదితరులు పాల్గొన్నారు.
Jun 12 2024, 17:43
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.8k