తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 11 2024, 15:49

కుల జనగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. బీసీ సంఘాలతో కూడిన రౌండ్ టేబుల్ సమావేశంలో బి.ఎల్.ఎఫ్. నాయకుల ఉధ్గాటన

 దేశంలో, రాష్ట్రంలో గత పాలక ప్రభుత్వాలన్నీ జగనాభాలో సగభాగానికంటే ఎక్కువగా ఉన్న బీసీ ప్రజలను మోసం చేస్తున్నారని, నేటికీ బీసీ ప్రజలకు పార్లమెంట్లో, అసెంబ్లీలో రిజర్వేషన్లు లేకపోవడం స్థానిక సంస్థల్లో కూడా బీసీ ప్రజలకు బిచ్చం వేసినట్టుగా పాలకపక్షాలు అతి తక్కువ రిజర్వేషన్లు ఇవ్వడం అత్యంత దుర్మార్గం. ఈ స్థితి ఉండడానికి వీలులేదని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం కూడా అశాస్త్రీయమైనది. 42 శాతం కంటే ఎక్కువగా గణనీయమైన సంఖ్యలో బీసీ ప్రజలు ఉంటారని తక్షణం కుల జనగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, యధాతధ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ గత వివక్ష కొనసాగుతుందని, దీనిని సహించబోమని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులజనగణన చేపట్టే వరకు, బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెంచే వరకు ప్రత్యక్ష పోరాటం సాగిస్తామని" బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర నాయకులైన బీ.సీ.పీ. రాష్ట్ర కార్యదర్శి కే. పర్వతాలు, బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర నాయకులైన ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి, బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర నాయకు లైన ఎం.సి.పి.ఐ.(యు) కేంద్ర కమిటీ సభ్యులు వస్కుల మట్టయ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

 ఈరోజు నల్లగొండలో జరిగిన బీ.సీ. సంఘాల, బి.ఎల్.ఎఫ్. భాగస్వామ్య రాజకీయ పక్షాల సమన్వయ రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. నల్లగొండలోని పెన్షనర్స్ బిల్డింగ్ లోని మీటింగ్ హాల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో 40 బీసీ సంఘాలకు చెందిన 50 మంది నాయకులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.

 ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం మూకుమ్మడిగా వెళ్లి నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కుల జనగణన చేపట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీ.సీ. ప్రజలు మోసపోతారని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 23 శాతం అమలు చేస్తామని, చెప్పి కేవలం 18 శాతం మాత్రమే అమలు చేశారని ఈ విషయంలో ఏనాడు ఎవరు ప్రశ్నించలేదని ప్రస్తుతం కూడా ఇదే స్థితి కొనసాగితే, తీవ్రంగా పోరాడుతామని మాట్లాడిన నాయకులు ప్రతినిధులందరూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

 ఈ సమావేశానికి బీ.సీ.పీ. రాష్ట్ర కార్యదర్శి కే పర్వతాలు అధ్యక్షత వహించారు. ఆహుతులు అందరికీ బి.ఎల్.ఎఫ్. తరఫున చర్చకు సాధ్యమయ్యే అంశాలతో రిపోర్టును ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ప్రవేశపెట్టి మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన విషయాలను ప్రతిపాదించారు. వీటిపైన ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్, రిటైర్డ్ తహసిల్దార్ ప్రకాష్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్, గంగపుత్ర జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్, యాదవ సంఘం జిల్లా నాయకులు వేణు కుమార్ యాదవ్, మేర సంఘం జిల్లా నాయకులు తాడూరి రమేష్ మేర, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు నేలపట్ల రమేష్ నాయి, శాలివాహన సంఘం నాయకులు వెంకన్న ప్రజాపతి, నిమ్మనగోటి కృష్ణయ్య ప్రజాపతి, విశ్వకర్మ జిల్లా నాయకులు ప్రకాష్ చారి, వడ్డెర సంఘం జిల్లా నాయకులు రమేష్, గౌడ సంఘం జిల్లా నాయకులు వడ్డగోని అంజయ్య గౌడ్, రజక సంఘం జిల్లా నాయకులు కొండూరు సత్యనారాయణ, బహుజన ఉద్యమ నాయకులు వంటేపాక యాదగిరి, బీసీ సంఘం నల్లగొండ పట్టణ అధ్యక్షులు సదాశివ, మేళ్ల శంకర్ ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్, మేడిద పురుషోత్తం ధర్మరాజు, సింగం వెంకటయ్య, సింగారం మల్లయ్య, శేఖర్ శాలివాహన సంఘం జిల్లా నాయకులు శరత్ బాబు, పి ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు బైరు వెంకన్న గౌడ్, గునగంటి సత్తయ్య గౌడ్, సుంకర బోయిన మల్లయ్య, సుంకరి నరసింహ, కప్పల రాకేష్ గౌడ్, ఎంసిపిఐ యు జిల్లా నాయకులు పోతుగంటి కాశి, వస్కుల భరత్, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా నాయకులు జక్కుల నరసింహ, బైరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

 చివరిలో సమావేశానికి సకాలంలో విచ్చేసి విలువైన సూచనలు సలహాలు ఇచ్చి భవిష్యత్తులో వేలాదిమంది బీసీ ప్రజలచే నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించాలని, కుల జన గణనలతో సంబంధం లేకుండా అతి తక్కువ రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఎలక్షన్ కమిషనర్ ఆఫీసును కూడా ముట్టడించడానికి బీసీ ప్రజలు సిద్ధం కావాలని ఎం సి పి ఐ యు కేంద్ర కమిటీ సభ్యులు వస్కుల మట్టయ్య చెబుతూ విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 08 2024, 13:07

ఆదిత్యానాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసిన మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు

చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడు

ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలయిందనడానికి ఈ నియామకమే నిదర్శనం

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవిని లాగేస్తారన్న భయంతో చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటాడా ?

నాడు జలయజ్ఞం ప్రాజెక్టుల నుండి నిన్న పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యాదాస్ ది కీలకపాత్ర

ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి

తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకిగా ముద్రపడ్డ వ్యక్తిని ఏ ప్రయోజనాల కోసం ఈ పదవిలో కూర్చోబెట్టారు ?

వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు 

కానీ ఆంధ్రకు కృష్ణా ప్రాజెక్టుల నుండి నీటిని తరలించడంలో ఆయనది కీలకపాత్ర

తెలంగాణ ఏర్పడినప్పటి నుండి గత పదేళ్లుగా ఆయన ఏపీ తరపున కొట్లాడిన వ్యక్తి ఆయన తెలంగాణకు న్యాయం చేస్తాడా?

కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనక కాంగ్రెస్ ఆలోచన ఏంటి ?

పోతిరెడ్డిపాడు, దుమ్ముగూడెం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో తెలంగాణ నీటిని తరలించడంలోనూ ఆదిత్యాదాస్ దే కీలకపాత్ర .. అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రయోజనాల కోసం కృషిచేస్తాడా ?

తెలంగాణ ప్రాజెక్టులు, జల వనరుల మీద అపారమైన అనుభవం, అవగాహన ఉన్న ఎందరో జల నిపుణులు ఉన్నారు వారిని పక్కనపెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎంచుకోవడం వెనక కారణాలేంటి ?

కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉంది

ఆదిత్యానాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుండి తొలగించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 07 2024, 15:52

చాంపియన్ అవార్డు గ్రహీత సురేష్ గుప్తను అభినందించిన మాతృశ్రీ సా. సా. సా. సేవా సంస్థ

తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి గ్రీన్ చాంపియన్ - 2024 అవార్డు ను రాష్ట్ర పర్యావరణాతవే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డైరెక్టర్ వాణి ప్రసాద్ నుంచి నల్గొండ పర్యావరణ ప్రేమికుడుమిట్టపల్లి సురేష్ గుప్త  బుధవారం న అందుకున్నారు.

సురేష్ గుప్త ను కవి, రచయిత, రంగస్థల నటులు, మాతృశ్రీ సంతపూరె విమలా బాయి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు Dr. సంత పురి నారాయణ్ రావు ప్రధాన కార్యదర్శి.

Dr. పగిల్ల శ్రీనివాసు లు శుభాకాంక్షలు తెలిపారు. వారు మరిన్ని విశిష్ట సేవలు సమాజానికి అందించాలని 

వారు కోరారు.

Sb

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 07 2024, 12:17

ఫీజుల మోత

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి.

పలు ప్రైవేట్‌ బడులు. ముఖ్యంగా కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలలు ఏకంగా 25శాతం వరకు ఫీజులు పెంచేశాయి.

కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు 40-50 శాతం భారం మోపుతున్నాయి.

ఇప్పటికే చాలా బడులు కొత్త రుసుముల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయగా. మరికొన్ని ఈ నెల 15వ తేదీ తర్వాత నిర్ణయించనున్నాయి

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 07 2024, 11:59

పేరు మార్చుకొని హిందువుగా నటిస్తూ మోడీకి, BJP, RSS కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా నిధులు సమకూరుస్తున్న పాకిస్తాన్ ISI ఏజెంట్

 అబద్ధాలను ప్రచారం చేసే పాకిస్తాన్ ISI ఏజెంట్ ధృవ్ రాఠీ గురించి నిజం బయటపడింది.  

 అతని అసలు పేరు "బద్రు రషీద్" , పూర్తి పేరు బద్రుద్దీన్ రషీద్ లాహోరి

అతను పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించాడు. అతని భార్య జూలీ (క్రైస్తవ పేరు) కూడా పాకిస్థానీ, దీని అసలు పేరు జులేఖా (ముస్లిం). 

వారు కరాచీలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం యొక్క రహస్య విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు

 అక్కడ వారికి ISI మరియు పాకిస్తాన్ సైన్యం యొక్క Yమరియు Z కేటగిరి భద్రతను అందిస్తారు. 

 బద్రు రషీద్ పాకిస్తాన్ చైనా దుబాయ్మాల్దీవులు కెనడా రష్యా టర్కీ మరియు పండోర నుండి నిధులు సమకూరుస్తాడు .

 భారత వ్యతిరేకి జార్జ్ సోరోస్ ఖాతా ద్వారా మోడీ ని ఎదిరించేందుకు పెసా కు నిధులు పంపిస్తారు.

  

కానీ ఇప్పుడు ఈ హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక అంశం బట్టబయలైంది. 

 ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ తన ఇంటెలిజెన్స్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది

 భారతదేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్న వీడి గురించి వీలైనంత వరకు షేర్ చేసి, 

దేశ ప్రయోజనాల దృష్ట్యా బద్రు రషీద్ యొక్క నిజాన్ని అందరి ముందుకు తీసుకురావాలని అభ్యర్థిస్తున్నాం  

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 06 2024, 13:07

నైతిక విజయం స్వతంత్ర అభ్యర్థులదే

నైతిక విజయం స్వతంత్ర అభ్యర్థులదే

•నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి : పాలకూరి రవి గౌడ్

లోక్ సభ ఎన్నికలో నల్గొండ పార్లమెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థులుగా జీరో బడ్జెట్ తో పోటీచేసి ప్రజల మన్ననలు పొందిన వారిదే నైతిక విజయం అని నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్ధి పాలకూరి రవిగౌడ్ తెలిపారు

గాడి తప్పుతున్న ప్రజా  స్వామ్యవ్యవస్థను దారిలో పెట్టడానికి తమవంతు కృషిగా పోటీచేసి ఓటర్లులను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండ ,వ్యవస్థలో ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా, అన్ని డిపార్ట్మెంట్లలో సహకరించుకుంటూ,

రాబోయే తరానికి ఒక మంచి నడవడిక నేర్పిస్తూ ..అదే విధంగా ఎన్నికలో పోటీ చేయాలి అంటే డబ్బే ప్రధానం కాదు డబ్బులు లేకపోయినా ఎన్నికలలో పోటీ చేయగలము అని ఒక భరోసా కల్పించే విధంగా ముందుకు వచ్చి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్డులదే నైతిక విజయం అని తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 02 2024, 20:36

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే

మూఢం, శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు.

జూన్, జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

జూన్ 29, జులై 11, 12, 13, 14, 15 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయన్నారు.

ఆ తర్వాత చతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు శుభ ముహూర్తాలు లేవని, మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉన్నాయని పురోహితులు వివరించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 02 2024, 18:20

నూతన పట్టు వస్త్రలంకరణ మహోత్సవము లో పాల్గొన్న తండు సైదులు గౌడ్

మాడుగులపల్లి మండలం లోనీ చెరువుపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తెల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవము లో బిఆర్ఎస్ జిల్లా నాయకులు

తండు నరసింహ గౌడ్ గుండు వెంకన్న గౌడ్ పోలగోని శ్రీనివాస్ గౌడ్

మాల మహానాడు ప్రధాన కార్యదర్శి జాకటి బాలరాజు మైనార్టీ జిల్లా నాయకుడు మహమ్మద్ జానీ పాషా గారు మరియు తదితరులు పాల్గొన్నారు చిన్నారులను ఆశీర్వదించిన

BRS పార్టీ రాష్ట్ర నాయకులు Ex జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 02 2024, 18:16

తిప్పర్తి మండలం లోని నూకల వారి గూడెం పట్టు వస్త్రాలంకరణమహోత్సవము లో పాల్గొన్న తండు సైదులు గౌడ్

తిప్పర్తి మండలం లోని నూకల వారి గూడెం పట్టు వస్త్రాలంకరణమహోత్సవము లో పాల్గొన్న తండు సైదులు గౌడ్

 తిప్పర్తి మండలం లోనీ నూకల వారి గూడెం కి చెందిన నూకల సత్యనారాయణ కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవము లో బి ఆర్ఎస్ జిల్లా నాయకులు తండు నరసింహ గౌడ్ గుండు వెంకన్న గౌడ్ పోలగోని శ్రీనివాస్ గౌడ్ లింగంపల్లి శేఖర్

ముదిరాజ్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి జాగటి బాలరాజు మైనార్టీ జిల్లా నాయకుడు మహమ్మద్ జానీ పాషా గారు మరియు తదితరులు పాల్గొన్నారు టి ఎన్ ఆర్ ఫంక్షన్ హల్ లో హాజరై చిన్నారులను ఆశీర్వదించిన

BRS పార్టీ రాష్ట్ర నాయకులు Ex జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 02 2024, 10:19

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం.

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు..

ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్‌ కోసం మొత్తం ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు.

నాలుగు టేబుళ్లపై 300 ఓట్లు, మరో టేబుల్‌పై 237 ఓట్ల చొప్పున లెక్కిస్తారు.

ఈ ఎన్నికల్లో మన్నె జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌), నవీన్‌కుమార్‌రెడ్డి (భారాస), సుదర్శన్‌గౌడ్‌ (స్వతంత్ర) పోటీ చేశారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. మార్చి 28న పోలింగ్‌ నిర్వహించగా.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు సాగుతుండడంతో ఉప ఎన్నిక కౌంటింగ్‌ను ఇప్పటివరకు పెండింగులో ఉంచారు.