నార్పల మండల కేంద్రంలో అదుపు తప్పిన ట్రాక్టర్ ముగ్గురికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల క్రీడా మైదానం నందు ట్రాక్టర్ అదుపు తప్పి ప్రమాదం జరగడం వల్ల ముగ్గురికి తీవ్ర గాయాలు... వెంటనే ప్రమాదం జరిగిన చోటికి పోలీస్ లు చేరుకొని గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించడం జరిగింది..
నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతపురం 37 వ డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ మహిళ నాయకురాలు నిహా అయేషా
సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో పసుపు ప్రభంజనం సృష్టించి,రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారిని మంగళగిరిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతపురం అర్బన్ నియోజవర్గం 37 వ డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ మహిళ నాయకురాలు నిహా అయేషా.. ఈ సందర్భంగా నిహా అయేషా మాట్లాడుతూ:రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు సైకో జగన్ పాలనకు చమర గీతం పాడి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో కుంటు పడిన అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో భాగంగా అనంతపురం నియోజవర్గం అభివృద్ధివైపు అడుగులు వేస్తుందని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురాన్ని సుందరవణంగా తీర్చి దిద్దుతారని తెలియజేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇంతటి ఘన విజయానికి సహకారం అందించిన అర్బన్ నియోజవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..
కామాఖ్య దేవాలయంలో మొక్కు తీర్చుకున్న హేమంత్ యాదవ్...
కామాఖ్య దేవాలయంలో మొక్కు తీర్చుకున్న హేమంత్ యాదవ్

2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండారు శ్రావణి శ్రీ గారు విజయం అయిన సందర్భంగా అస్సాం రాష్ట్రంలో గల కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోవడం జరిగింది.
పోలీసుల దాడిలో గాయపడిన తెలుగుదేశంపార్టీ నాయకుడు తిరుపాలు ను పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..
పోలీసుల దాడిలో గాయపడిన తెలుగుదేశంపార్టీ నాయకుడు తిరుపాలు ను పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు.. నిన్న సాయంత్రం పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం నాయకుడు తిరుపాలును అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మాట్లాడుతూ..... పోలీసులు ఇప్పటికైనా మారాలని ఇంకా వైసీపీ నాయకులు చెప్పినట్లు తెలుగుదేశం నాయకులు పై దాడులు చేస్తే సహించేది లేదని వారు తెలియజేశారు గాయపడిన తిరుపాల్ ను ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని ఆయనకు భరోసా ఇవ్వడం జరిగింది
ఖైదీ.. మృతి..
అనంతపురం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద టిప్పర్ ఢీకొని ఓపెన్ ఎయిర్ జైలో శిక్ష అనుభవిస్తున్న ఈరన్న (50) S/o రంగయ్య కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చెందిన ఖైదీ అక్కడిక్కడే మృతి..
వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు..
వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు...

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో నివాసంఉంటున్న సుగాలి జ్యోతిబాయ్ కూతురు వాణి భాయ్ వివాహంకు ₹10000 ఆర్థిక సహాయం చేసిన *నిరుపేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి *మన శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు* మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో.... బీసీ సెల్ పార్లమెంట్ అధికార ప్రతినిధి గోసుల సుబ్బయ్య. ఐ టి డి పి మండల అధ్యక్షులు మదమంచి శ్రీధర్. గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు అనీఫ్. ఆవుల సుధాకర్. బోయ లింగరాజు గ్రామ నాయన . గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నారా చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ గారిని కలిసిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే

అమరావతి ఉండవల్లి నివాసంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెల్పిన శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు బండారు కిన్నెర శ్రీ* గారు 2024 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలుపొందిన బండారు శ్రావణి శ్రీ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని అమరావతి ఉండవల్లిలోని నివాసం నందు కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారికి* శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు..
2024 సార్వత్రిక ఎన్నికలు ఫలితాల్లో శింగనమల నియోజకవర్గం NDA కూటమి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ MLA గారు,MP గా అంబికా లక్ష్మినారాయణ గారి విజయానికి కృషి చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారికి* శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాజీఎంపీటీసీ చెదళ్ళ నారాయణ స్వామి, సోము శేఖర్, ప్రకాష్, సురేష్,కుళ్లాయప్ప, వెంకట నాయుడు, శ్రీనివాస్, రాజు, మరియు బుక్కరాయసముద్రం మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
ముస్లిం మైనార్టీ ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
ముస్లిం మైనార్టీ ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..

శింగనమల నియోజకవర్గము : బుక్కరాయసముద్రం పంచాయతీలోని ఎల్.బి. కాలనీ నివాసి శ్రీమతి కౌసర్ గారి ఆడబిడ్డ వివాహానికి ₹5000/- రూపాయలు మరియు జన చైతన్య నగర్ నివాసి శ్రీమతి సలీమా ల ఆడబిడ్డ వివాహానీకు ₹5000/- రూపాయలు ఆర్థిక సాయంను అందించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ముస్లిం మైనార్టీల ఆడబిడ్డల పెండ్లిండ్ల కు సహాయం చేయడము చాలా సంతోషాన్నిస్తుందని తెలిపారు. చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆడబిడ్డల వివాహాల కోసం రూ.1 లక్ష రూపాయల పథకం అందిస్తారని పేర్కొన్నారు. *ఆడ బిడ్డల వివాహాలకు సహాయం చేసిన కాటప్పగారి రామలింగారెడ్డి గారికి మైనార్టీ మహిళలు ధన్యవాదాలు తెలిపారు*. ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకురాలు జుగును, టిడిపి నాయకులు పూల శంషాద్, దూదేకుల రసూల్ బీ, చాపల మహబూబ్ బీ, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శ్రావణి కి అభినందనలు తెలిపిన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాసుల చంద్రమోహన్..
ఎమ్మెల్యే శ్రావణి కి అభినందనలు తెలిపిన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాసుల చంద్రమోహన్ సింగనమల ఎమ్మెల్యేగా గెలుపొందిన బండారు శ్రావణి శ్రీ గారికి అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తిరిగి ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు కావడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ రాష్ట్ర తెలుగు యువత మాజీ కార్యదర్శి జిల్లా అఖిల భారత కాపు సమైక్య కార్యదర్శి మాసుల చంద్రమోహన్ టి ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు గోగుల నాగభూషణ పెద్ద నాగమణి కార్యకర్తలు నాయకులు అభినందనలు తెలిపినారు తెలుగుదేశం పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని ప్రజలు నిరూపించినారు అని తెలియజేసినారు