తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 07 2024, 12:17

ఫీజుల మోత

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి.

పలు ప్రైవేట్‌ బడులు. ముఖ్యంగా కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలలు ఏకంగా 25శాతం వరకు ఫీజులు పెంచేశాయి.

కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు 40-50 శాతం భారం మోపుతున్నాయి.

ఇప్పటికే చాలా బడులు కొత్త రుసుముల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయగా. మరికొన్ని ఈ నెల 15వ తేదీ తర్వాత నిర్ణయించనున్నాయి

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 07 2024, 11:59

పేరు మార్చుకొని హిందువుగా నటిస్తూ మోడీకి, BJP, RSS కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా నిధులు సమకూరుస్తున్న పాకిస్తాన్ ISI ఏజెంట్

 అబద్ధాలను ప్రచారం చేసే పాకిస్తాన్ ISI ఏజెంట్ ధృవ్ రాఠీ గురించి నిజం బయటపడింది.  

 అతని అసలు పేరు "బద్రు రషీద్" , పూర్తి పేరు బద్రుద్దీన్ రషీద్ లాహోరి

అతను పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించాడు. అతని భార్య జూలీ (క్రైస్తవ పేరు) కూడా పాకిస్థానీ, దీని అసలు పేరు జులేఖా (ముస్లిం). 

వారు కరాచీలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం యొక్క రహస్య విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు

 అక్కడ వారికి ISI మరియు పాకిస్తాన్ సైన్యం యొక్క Yమరియు Z కేటగిరి భద్రతను అందిస్తారు. 

 బద్రు రషీద్ పాకిస్తాన్ చైనా దుబాయ్మాల్దీవులు కెనడా రష్యా టర్కీ మరియు పండోర నుండి నిధులు సమకూరుస్తాడు .

 భారత వ్యతిరేకి జార్జ్ సోరోస్ ఖాతా ద్వారా మోడీ ని ఎదిరించేందుకు పెసా కు నిధులు పంపిస్తారు.

  

కానీ ఇప్పుడు ఈ హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక అంశం బట్టబయలైంది. 

 ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ తన ఇంటెలిజెన్స్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది

 భారతదేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్న వీడి గురించి వీలైనంత వరకు షేర్ చేసి, 

దేశ ప్రయోజనాల దృష్ట్యా బద్రు రషీద్ యొక్క నిజాన్ని అందరి ముందుకు తీసుకురావాలని అభ్యర్థిస్తున్నాం  

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 06 2024, 13:07

నైతిక విజయం స్వతంత్ర అభ్యర్థులదే

నైతిక విజయం స్వతంత్ర అభ్యర్థులదే

•నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి : పాలకూరి రవి గౌడ్

లోక్ సభ ఎన్నికలో నల్గొండ పార్లమెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థులుగా జీరో బడ్జెట్ తో పోటీచేసి ప్రజల మన్ననలు పొందిన వారిదే నైతిక విజయం అని నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్ధి పాలకూరి రవిగౌడ్ తెలిపారు

గాడి తప్పుతున్న ప్రజా  స్వామ్యవ్యవస్థను దారిలో పెట్టడానికి తమవంతు కృషిగా పోటీచేసి ఓటర్లులను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండ ,వ్యవస్థలో ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా, అన్ని డిపార్ట్మెంట్లలో సహకరించుకుంటూ,

రాబోయే తరానికి ఒక మంచి నడవడిక నేర్పిస్తూ ..అదే విధంగా ఎన్నికలో పోటీ చేయాలి అంటే డబ్బే ప్రధానం కాదు డబ్బులు లేకపోయినా ఎన్నికలలో పోటీ చేయగలము అని ఒక భరోసా కల్పించే విధంగా ముందుకు వచ్చి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్డులదే నైతిక విజయం అని తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 02 2024, 20:36

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే

మూఢం, శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు.

జూన్, జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

జూన్ 29, జులై 11, 12, 13, 14, 15 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయన్నారు.

ఆ తర్వాత చతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు శుభ ముహూర్తాలు లేవని, మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉన్నాయని పురోహితులు వివరించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 02 2024, 18:20

నూతన పట్టు వస్త్రలంకరణ మహోత్సవము లో పాల్గొన్న తండు సైదులు గౌడ్

మాడుగులపల్లి మండలం లోనీ చెరువుపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తెల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవము లో బిఆర్ఎస్ జిల్లా నాయకులు

తండు నరసింహ గౌడ్ గుండు వెంకన్న గౌడ్ పోలగోని శ్రీనివాస్ గౌడ్

మాల మహానాడు ప్రధాన కార్యదర్శి జాకటి బాలరాజు మైనార్టీ జిల్లా నాయకుడు మహమ్మద్ జానీ పాషా గారు మరియు తదితరులు పాల్గొన్నారు చిన్నారులను ఆశీర్వదించిన

BRS పార్టీ రాష్ట్ర నాయకులు Ex జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 02 2024, 18:16

తిప్పర్తి మండలం లోని నూకల వారి గూడెం పట్టు వస్త్రాలంకరణమహోత్సవము లో పాల్గొన్న తండు సైదులు గౌడ్

తిప్పర్తి మండలం లోని నూకల వారి గూడెం పట్టు వస్త్రాలంకరణమహోత్సవము లో పాల్గొన్న తండు సైదులు గౌడ్

 తిప్పర్తి మండలం లోనీ నూకల వారి గూడెం కి చెందిన నూకల సత్యనారాయణ కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవము లో బి ఆర్ఎస్ జిల్లా నాయకులు తండు నరసింహ గౌడ్ గుండు వెంకన్న గౌడ్ పోలగోని శ్రీనివాస్ గౌడ్ లింగంపల్లి శేఖర్

ముదిరాజ్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి జాగటి బాలరాజు మైనార్టీ జిల్లా నాయకుడు మహమ్మద్ జానీ పాషా గారు మరియు తదితరులు పాల్గొన్నారు టి ఎన్ ఆర్ ఫంక్షన్ హల్ లో హాజరై చిన్నారులను ఆశీర్వదించిన

BRS పార్టీ రాష్ట్ర నాయకులు Ex జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 02 2024, 10:19

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం.

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు..

ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్‌ కోసం మొత్తం ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు.

నాలుగు టేబుళ్లపై 300 ఓట్లు, మరో టేబుల్‌పై 237 ఓట్ల చొప్పున లెక్కిస్తారు.

ఈ ఎన్నికల్లో మన్నె జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌), నవీన్‌కుమార్‌రెడ్డి (భారాస), సుదర్శన్‌గౌడ్‌ (స్వతంత్ర) పోటీ చేశారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. మార్చి 28న పోలింగ్‌ నిర్వహించగా.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు సాగుతుండడంతో ఉప ఎన్నిక కౌంటింగ్‌ను ఇప్పటివరకు పెండింగులో ఉంచారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

May 23 2024, 19:33

కొత్తగూడెం జిల్లా లో ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చర్ల మండలం డిప్యూటీ తహశీల్దారు భరణిబాబు ఈరోజు ఎసిబికి చిక్కారు. 

భరణిబాబు 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు.

పాసుపుస్తకం ఇచ్చేందుకు రైతును డిటి భరణిబాబు లంచం అడగడంతో సదరు వ్యక్తి ఎసిబిని ఆశ్రయించాడు. 

దీంతో వలపన్ని డిప్యూటీ తహశీల్దారును ఎసిబి అధికారులు పట్టుకు న్నారు....

తప్పు చేస్తే దొరకక తప్పదు

May 23 2024, 17:05

పిన్నెల్లి లొంగిపోతారని ప్రచారం నరసరావుపేటలో పోలిసులు పహారా

నరసరావుపేట: మాచర్ల (Macherla) వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) లొంగిపోతారన్న అనుమానంతో పల్నాడు (Palnadu) జిల్లా నరసరావుపేట పోలీసులు అప్రమత్తమయ్యారు..

నరసరావుపేట కోర్టు ఆవరణలో పోలీసులు పహారా కాస్తున్నారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి ఏ1 నిందితుడిగా ఉన్నారు.

ఆయన కోసం ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిన్న తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు..

ఎమ్మెల్యే కారును గుర్తించి గన్‌మెన్‌, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి గురువారం నరసరావుపేట కోర్టులో లొంగిపోవచ్చన్న అనుమానంతో అప్రమత్తమైనట్టు పోలీసులు తెలిపారు. కేవలం అనుమానం మాత్రమేనని ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

May 18 2024, 17:16

పల్నాడు కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీ.. ఈసీ ఉత్తర్వులు

అమరావతి: పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లట్కర్‌ శ్రీకేశ్‌ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాసేపట్లో పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల ఎస్పీల నియామకంపై ఉత్తర్వులు వెలువడే అవకాశముంది..

ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది.

పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ.. ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది.

అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే..