నార్పల మండలం బి పప్పూరు గ్రామం లో తమ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేపట్టిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం బి పప్పూరు గ్రామం లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.
ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ వైకాపా నాయకులు ప్రజాధరణ పొందలేక పోయారని జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలకు తీవ్ర వ్యతిరేకత వస్తోందని, అందువల్లనే నాయకులు, కార్యకర్తలు వైసిపిని వీడి టీడీపీలో చేరుతున్నారని కూటమి లక్ష్యాలు టీడీపీ ప్రజాకార్షక పధకాలను మెచ్చి టీడీపీకి మద్దతు తెలుపుతున్నారని రానున్న ఎన్నికల్లో NDA కూటమి విజయం ఖాయమని మళ్ళీ జగన్ అధికారం చేపడితే రాష్ట్రం మరో బీహార్ అవుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు కు ఓటు వేయాలని గ్రామస్థులను ఆలం నరసానాయుడు తెలియజేసారు.
అలాగే
వైసిపి పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లోకి చేరికలు
బి పప్పూరు,గూగూడు గ్రామాలకు చెందిన పలువురు వైసిపి నాయకులు,కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లోకి చేరిన పి లక్ష్మి నారాయణ రెడ్డి,హరిజన హరి,సాకే శ్రీనా, తలారి తిరుపతయ్య,ఆత్మకూరు నల్లప్ప,ఆత్మకూరు రాజశేఖర్,ఆత్మకూరు రమేష్, వెంకటరాముడు,గంగాధర్,మస్తాన్,మస్తాన్,రాజేష్,రాజశేఖర్,పెద్దిరాజులు, శీనప్ప శ్రీరాములు వీరందరు తెలుగుదేశం పార్టీ లోకి చేరారు.వారికి పార్టీ లోకి ఆహ్వానించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు
ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
May 07 2024, 07:04