నార్పల మండల కేంద్రంలో టిడిపి ఉమ్మడి అభ్యర్థులు బండారు శ్రావణి శ్రీ గారి, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలుపు కోసం విస్తృత ప్రచారం
అనంతపురం జిల్లా శిoగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రం లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన శిoగనమల నియోజకవర్గ టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారు,టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు ఇంటింటికి తిరుగుతూ, ఈ 5 సంవత్సరాల YCP ప్రభుత్వం
ఆరాచకాలను తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు,ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను* ప్రజలకు వివరించారు. అలాగే సాయంత్రం మెయిన్ రోడ్డు గాంధీ సర్కిల్ లో మీటింగ్ జరిగింది.ర్యాలీ నిర్వహించి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు..
కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .
May 01 2024, 07:14