ద్విచక్ర వాహనం కింద కుక్క దూరి ప్రమాదవశాత్తు బాలిక మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆలం నరసా నాయుడు

నార్పల క్రాసింగ్ సమీపనా నడిమిదొడ్డి గ్రామానికి చెందిన తండ్రి కూతుర్లు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఉన్నట్టుండి ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.. దీంతో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందింది. ఝాన్సీ తండ్రికి గాయాలు కావడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.ఈ విషయo తెలుసుకున్న రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ దగ్గరకు వెళ్లి వారి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పి వారికి 10,000 / రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమం లో నడిమిదొడ్డి టీడీపీ నాయకులు తలారి తిప్పన్న,వెన్నపూస చంద్రమోహన్ రెడ్డి,బొగ్గు నారాయణ స్వామి,బొగ్గు నాగర్జున,కర్వేపాకు నల్లప్ప,లోడుగు జగదీష్,బొగ్గు నాగశేషు,D రాము,N సూరి,N రామాంజి పాల్గొన్నారు.

పేదల అభ్యున్నతి కోసమే మేనిఫెస్టో.. పల్లె నిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి. వీరాంజనేయులు

పేదల అభ్యున్నతి కోసమే మేనిఫెస్టో.. పల్లె నిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి. వీరాంజనేయులు

నార్పల మండలం గూగూడు గ్రామంలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం అనంతరం "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు నిర్వహించారు.

గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలను స్వీకరించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందపరచిన నవరత్నాలను పలు సంక్షేమ పథకాల పెంపును ప్రజలకు వివరించారు. 

రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్న అయితే సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగుతూ, రెట్టింపు లబ్దిని చేకూర్చే విధంగా మేనిఫెస్టో విడుదల చేశారని మీరందరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే ప్రతి సమస్యను ఎమ్మెల్యే అయిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వారికి తెలిపారు.

సమావేశం అనంతరం గ్రామంలోనే బస చేశారు.

నాడు మాట ఇచ్చారు నెరవేర్చారు.. నేడు మాట ఇస్తున్నారు నెరవేరుస్తారు .. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

నాడు మాట ఇచ్చారు నెరవేర్చారు..

నేడు మాట ఇస్తున్నారు నెరవేరుస్తారు.

◆ జగనన్న అంటే అభివృద్ధి..చంద్రబాబు అంటే కరువు

◆ ఆత్మీయ పలకరింపులు.. అడుగడుగునా నీరాజనం

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

సంక్షేమ పథకాల సారథిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకుంటే.. చంద్రబాబు నాయుడు పేరు చెబితే వెన్నుపోటు, కరువు గుర్తుకు వస్తుందని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు. 

నార్పల మండలం బొందలవాడ, రంగాపురం, జంగంరెడ్డిపల్లి, గూగూడు, మూగేతిమ్మంపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలసి గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు.

గ్రామాల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. టపాసులు కాల్చుతూ, పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. గడపగడపకు తిరుగుతూ, జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాల పెంపును ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా మరోసారి జగనన్నను చేసుకుంటే మరింత సంక్షేమాన్ని అందిస్తారని వివరించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో పేద ప్రజల అభ్యున్నతికి మరింత సంక్షేమాన్ని చేకూరే విధంగా ఉందన్నారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. అదే బాటలో 2024లో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేరుస్తారన్నారు. రెండు విడతల్లో పెన్షన్ రూ.3000 నుంచి రూ.3,500 వరకు పెంపు, వైయస్సార్ రైతు భరోసా సాయం రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతూ, ఏటా రూ. 16 వేల చొప్పున ఐదేళ్లలో రైతులకు ఒక్కొక్కరికి రూ.80వేలు చొప్పున సాయం చేయనున్నారు. ఇలా సంక్షేమాన్ని కొనసాగిస్తూ మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా మేనిఫెస్టోని రూపొందించడం పట్ల ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. 

జగనన్న మాట ఇచ్చారు అంటే చేస్తారు అనే నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు నెరవేర్చని అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వారిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరడం ఖాయం జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

గాడిదిన్న మండలంలో జోరుగా టిడిపి ఎన్నికల ప్రచారం.. టిడిపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, కేశవరెడ్డి

శింగనమల నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు గార్లదిన్నె మండల కేంద్రంలో పర్యటించి బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్న  టిడిపి, జనసేన ,బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, బండారు కిన్నెర శ్రీ గారు ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన,బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

పేదవాడి గెలుపు..భుజాలపై.. పేదల భవిష్యత్ కు పునాదులు వేసిన వైఎస్ జగనన్న.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

పేదవాడి గెలుపు..భుజాలపై.. పేదల భవిష్యత్ కు పునాదులు వేసిన వైఎస్ జగనన్న.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ ఎన్ని కూటములొచ్చిన మళ్ళీ జగనన్నే సీఎం

◆ నియోజకవర్గంలో టీడీపీ ఎన్ని జిమ్మికులు చేసిన వైసిపి జెండా ఎగరడం ఖాయం.

నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును గ్రామాల్లో గెలుపు లక్ష్యంగా అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతూ..తనను భుజాలపై ఎత్తుకుంటున్నారు.

రాష్ట్రంలో పేదల బంగారు భవిష్యత్ కు ఈ ఐదేళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునాదులు వేశారని, మరొక అవకాశం ఇస్తే, ఆ పునాదుల మీద బహుళ అంతస్తుల సౌదాన్ని నిర్మిస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

పుట్లూరు మండలం కడవకల్లు, సంజీవపురం, ఓబులాపురం, దోసలేడు, చెర్లోపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా " కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్యతో కలసి ఆయన నిర్వహించారు.

పార్టీ శ్రేణులు శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా అందరినీ ప్రకటిస్తూ, జగనన్న పాలనలో ప్రజలకు చేసిన సంక్షేమాన్ని, గత టీడీపీ పాలనలో ప్రజలకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. మళ్లీ ఇలాంటి గొప్ప సంక్షేమం పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తను మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నవరత్నాలతో ఓ పక్క పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తూనే మరోపక్క ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేశారని వివరించారు. పేదలకు విద్య వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి ఇస్తున్నారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాలు పెంపునకు సీఎం జగనన్న గట్టి పునాదులు వేశారని, పేదల అభ్యున్నతి గిట్టని ప్రతిపక్షాలు జగనన్న వేసిన పునాదులు కూల్చివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా పెత్తందారి పార్టీలన్నీ ఒక్కటయ్యాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో పేదలంతా జగనన్నకు మద్దతు ఇవ్వాలని కోరారు.

టిడిపి ఎన్ని కూటములతో వచ్చినా జగనన్న వైపు ప్రజలు ఉన్నారన్నారు. నియోజకవర్గంలో ఐదేళ్లలో కనిపించని టిడిపి అభ్యర్థి ఎన్నికల సమయం అయ్యేసరికి ఓట్ల కోసం ఇంటి వద్దకు వస్తున్నారన్నారు. ఓటమి భయంతో నానా తంటాలు పడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో జగనన్న సంక్షేమానికే ప్రజలు పట్టం కడుతారన్నారు. నియోజకవర్గంలో టిడిపికి ఓటమి తప్పదన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

పుట్లూరు మండలం ఓబుళాపురం గ్రామంలో టిడిపిలో నుంచి వైసీపీ పార్టీలోకి 5 కుటుంబాలు చేరిక

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక

పుట్లూరు మండలం ఓబుళాపురం గ్రామంలో టిడిపిలో నుంచి వైసీపీ పార్టీలోకి 5 కుటుంబాలు చేరాయి. 

ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ఆధ్వర్యంలో బి. తిరుపతయ్య, కృష్ణ మోహన్, రామకృష్ణ, గణేష్, వెంకట రాముడు వీరికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధినికి ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు.

టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గా బండారు శ్రావణి శ్రీ వినూత్న రీతిలో ఎద్దుల బండి పై వచ్చి నామినేషన్ దాఖలు

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గా బండారు శ్రావణి శ్రీ వినూత్న రీతిలో ఎద్దుల బండి పై వచ్చి నామినేషన్ దాఖలు 

మరువకొమ్మ క్రాస్ నుండి భారీ ర్యాలీ తో బయల్దేరిన అభ్యర్థి

గజమాలలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు

టీడీపీ కార్యకర్తలతో పసుపు సునామీని తలపించిన శింగనమల 

శింగనమల శివంగి అంటూ నినాదాలు

అభ్యర్థి కుటుంబ సభ్యులు,మాజీ ఎంపీ జె సి దివాకర్ రెడ్డి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి తో తహశీల్దార్ కార్యాలయని కి చేరుకున్న బండారు శ్రావణి శ్రీ

పథకాల అమలు కోసం "ఫ్యాన్" గుర్తుకే ఓటు.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

పథకాల అమలు కోసం "ఫ్యాన్" గుర్తుకే ఓటు.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ టీడీపీ హయాంలో కరువు కాటకాలే

కుల, మత, రాజకీయాలకతీతంగా పేదలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే సంక్షేమ పథకాల అమలు అవుతాయని శింగనమల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరు, పొడరాళ్ళ, వడియంపేట, బి.కొత్తపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా "కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి ఆయన చేపట్టారు.

గ్రామాల్లో మహిళలు హారతులు పడుతూ, డప్పులతో డాన్సులు వేస్తూ ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఓటర్లని అడిగి తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఓటు వేస్తే మన పిల్లలకు అందుతున్న ప్రతి లబ్ధి నిలిచిపోతుందన్నారు. బాబుకు ఓటు వేస్తే అన్నీ ముగింపులు, కత్తిరింపులేనని హెచ్చరించారు. ఓటు వేయడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అక్క చెల్లెమ్మలకు మేలు చేసే రాజ్యం కొనసాగుతుందన్నారు. పేదల పక్షాన పోరాడుతున్న సీఎం జగనన్నకు మద్దతుగా నిలుస్తూ.. చంద్రబాబుకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. ఐదేళ్లలో జరిగిన మంచిని చూసి ప్రజలందరూ అభివృద్ధికి అండగా నిలవాలన్నారు.

నియోజకవర్గంలో ఐదేళ్లలో కనిపించని టిడిపి వాళ్ళు ఎన్నికల సమయానికి ఓటు అడగడానికి వస్తున్నారని వారికి ఓటు రూపంలో గుణపాఠం చెప్పాలన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎంపీ శంకర్ నారాయణ ను ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

జగనన్న చెప్పాడంటే..అమలు చేస్తాడంతే.. జగనన్నను సీఎం చేసుకుంటే మరింత సంక్షేమం.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

జగనన్న చెప్పాడంటే..అమలు చేస్తాడంతే.. జగనన్నను సీఎం చేసుకుంటే మరింత సంక్షేమం.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు గల్లంతు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పాడంటే తప్పని సరిగా అమలు చేస్తాడని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం జంబులదిన్నె, జంబులదిన్నె కొట్టాల, తలగాసిపల్లి, గార్లదిన్నె గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి, ఎం. శంకర్ నారాయణ, జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డిలతో కలసి వీరాంజనేయులు నిర్వహించారు.

పార్టీ శ్రేణులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

వారు మాట్లాడుతూ..జగనన్న పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. చంద్రబాబు గతంలో 600 హామీలు 

 ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఈ విషయం ప్రజలు ఎప్పటికీ మరువరన్నారు.ఇప్పుడు 6 హామీలతో ప్రజల్లోకి వస్తున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని చెప్పారు.

నియోజకవర్గంలోని టిడిపి వాళ్ళు పగటి కలలు కంటూ వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారన్నారు. ప్రజలకు ఏం చేయలేని టిడిపి ఓట్ల కోసం నానా తంటాలుపడుతూ అబద్ధపు హామీలతో ప్రజల్లోకి వస్తుంటే ప్రజలు నిలదీస్తున్నారన్నారు. జగనన్న ప్రభుత్వంలో అర్హులైన అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. అబద్ధపు హామీలతో వస్తున్న చంద్రబాబు కావాలా మాట నిలబెట్టుకున్న జగనన్న కావాలా అని ప్రజలు బేరీజు చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులమైన తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

బుక్కరాయసముద్రం మండలంలో పలు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహ కార్యదర్శి కట్టప్ప గారి రామలింగారెడ్డి..

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం  గాంధీ నగర్ లోని సాకే బలప్ప కుమారుడు నాగేంద్ర వివాహ కార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం మరియు చెన్నంపల్లి గ్రామంలో కొద్దిరోజులు కిందట కాలువిరిగిన నారాయణమ్మ గారి వైద్యఖర్చుల నిమ్మితం ₹5000/-రూపాయలు ఆర్థికసాయం చేసినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి, సర్పంచ్ మల్లికార్జున, పెద్దన్న, యాగంటి, యస్వంత్, అంజి, రామాంజి ,తలారి నాగేంద్ర,చెన్నమయ్య, బండారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.