తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 01 2024, 15:20

రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని తెలం గాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి సోమ వారం దర్శించుకున్నారు.

మంత్రి కొండా సురేఖకు ఆల య అర్చక బృందం, అధికా రులు ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు వేములవాడ శాసనసభ్యు లు రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి కుటుంబ సభ్యులు రాజన్నకు కోడే మొక్కు చెల్లించుకుని గర్భ గుడిలో కొలువుదీరిన శ్రీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకు న్నారు.

ఆలయ అర్చక బృందం సురేఖ కు, కుటుంబ సభ్యు లకు ఆశీర్వచనం గావించా రు. ఆలయ అధికారులు మంత్రి కుటుంబ సభ్యుల తో పాటు స్థానిక శాసనస భ్యులు ఆది శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ లకు స్వామి వారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేసి ఘనంగా సత్కరిం చారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 01 2024, 15:05

స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన ఏసిపి వెంకటేశ్వర్లు

మంచిర్యాల జిల్లా చెన్నూరు కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఉన్న స్ట్రాంగ్ రూం లను సోమ‌వారం ఉదయం జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు సందర్శించి పరిశీలించారు.

సిబ్బందికి పలు సూచనలు చేశారు. పార్లమెంట్ ఎన్ని కల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు నియోజక వర్గం లోని గ్రామీణ ప్రాంతాలలో, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ను పెంచారు.

మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చెన్నూర్, కోటపెల్లి మండలంలోని హైవే పై ప్రతినిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 01 2024, 15:03

భువనగిరి జిల్లా నారాయణపురం ఎంపీపీ ఉమాదేవి పైన అవిశ్వాస తీర్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవిపై సోమవారం నిర్వహించ నున్న అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగుతుందా అనే ఉత్కంఠ కొనసాగు తుంది.

సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11 మంది ఎంపీటీసీలు రాతపూర్వకంగా గత సంవత్సరం చౌటుప్పల్ ఆర్డీవోకు ఎంపీపీపై అవిశ్వాసానికి ఫిర్యాదు చేశారు.

అప్పట్లో ఎంపీపీ గుత్తా ఉమాదేవి కోర్టును ఆశ్ర యించగా స్టే విధించడంతో అవిశ్వాసం ఆగిపోయింది. సొంత పార్టీకి చెందిన బీఆర్ ఎస్ ఎంపీపీపైనే అవిశ్వాసా నికి ఫిర్యాదు చేయడం వెనుక పార్టీ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రోత్బలంతోనే జరిగిందని ఎంపీపీ ఆరోపించారు.

ఎంపీపీ, మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు తార స్థాయికి చేరడంతో బీఆర్ ఎస్ పార్టీ నుండి ఎంపీపీగా ఎన్నికైన గుత్తా ఉమాదేవి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అవిశ్వాసంపై ఉమాదేవి తెచ్చుకున్న స్టే ఎత్తివేయడం తో చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి అవిశ్వాసానికి నోటీసు లు జారీ చేశారు.దీంతో ఏప్రిల్ 1న అధికారులు అవిశ్వాసానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మండలంలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలలో బీఆర్ ఎస్ 9, సిపిఎం 2, సిపిఐ, కాంగ్రెస్ చెరొక స్థానాల్లో గెలువగా బీఆర్ ఎస్ నుండి ఎంపీపీగా ఎన్నికైన గుత్త ఉమాదేవి ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరగా కాంగ్రెస్ నుండి గెలుపొందిన రాచ కొండ ఎంపీటీసీ శివరాత్రి కవిత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అదేవిదంగా అవిశ్వాసంలో సిపిఎం తటస్థ వైఖరి అవ లంబిస్తుందని అధిష్టానం ప్రకటించగా సిపిఎంకు చెందిన ఎంపీటీసీ దోడ వినోద్ రెడ్డి ఇటీవలే మృతి చెందారు. ప్రస్తుతం 12 మంది ఎంపీటీసీలకు గాను కోరం సభ్యులు హాజరైతేనే అవిశ్వాసాన్ని నిర్వహిస్తారు.

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు క్యాంపులకు వెళ్లగా ప్రస్తుతం అధికార పార్టీ వైపు ఉన్న ఎంపీపీ పై అవిశ్వాసం నెగ్గు తుందా లేక వీగు తుందా?అనే ఉత్కంఠ ప్రజలందరిలో నెలకొంది.

ఇదివరకే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు కూడా జరిగిందని క్యాంపులో ఉన్న పలువురు బీఆర్ఎస్ ఎంపీ టీసీలు తమకే అనుకూలం గా ఉన్నారని కాంగ్రెస్ నేత లు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా మరో రెండు మూడు గంటల్లో ఎంపీపీపై అవిశ్వాస ఉత్కంఠకు తెరపడనుంది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 01 2024, 15:02

నేడు నల్గొండ, భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం

తెలంగాణ లోక్‌సభ ఎన్ని కలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు.

పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను న్నారు.

జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి ఆయన హాజరుకాను న్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూ హంపై నేతలకు వారు దిశానిర్దేశం చేయనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 01 2024, 14:59

తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట..ఇండ్లలోకి చేరిన నీరు

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో నిజాంసాగర్‌ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్ట తెగిపో యింది.

దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చిచేరింది. మధ్య రాత్రి వేళ ఒక్కసారిగి నీరు ఇండ్లలోకి రావడంతో కాలనీవాసులు పరుగులు పెట్టారు.

నీటి ప్రవాహానికి విద్యుత్‌ స్తంభాలు కింద పడిపోయా యి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపో యింది. అయితే కాలువ తెగిపోవడానికి ఇరిగేషన్‌ అధికారుల నిరక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

అధికారులు తక్షణమే సహా యక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో.. నీటిపారుదల అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంది.

అయితే ఆర్మూర్‌ ప్రాంతం లోని అధికారులు అవేవీ పట్టించుకోలేదు. దీంతో ప్రధాన కాలువ మురికి కూపంలో తయారై చెత్తా చెదారంతో నిండిపోయింది. కాగా,

ప్రజలకు తాగురు, రైతులకు సాగునీటి కోసం ప్రాజెక్టు అధికారులు కాలువలోకి నీటిని వదిలారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో కాలువ తెగిపోయిందని చెప్పారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 31 2024, 16:47

చెప్పు విసరడం దాడి కాదు... భావ ప్రకటన స్వేచ్ఛ: వైరల్‌గా మారిన గౌతం సవాంగ్‌ వ్యాఖ్యలు

అమరావతి: అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని గుత్తిలో గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరిన నేపథ్యంలో...

గతంలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జగన్‌ ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేసి, కక్ష సాధింపు చర్యలకు దిగినప్పుడు రైతులకు భరోసా ఇచ్చేందుకు తెదేపా అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. వైకాపా ప్రేరేపిత దుండగులు కొందరు ఆయన వాహనంపై కర్రలు, చెప్పులు విసిరారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రిపై దాడిని తీవ్రంగా పరిగణించి, దుండగులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌... అది దాడి కాదని, వారి భావప్రకటన స్వేచ్ఛ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, చెప్పులు విసరడం కూడా ఒక విధమైన భావప్రకటన స్వేచ్ఛే అన్నట్టు మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 31 2024, 16:44

సీఎం జగన్‌ మహానటుడు: నారా లోకేశ్‌

అమరావతి: తెదేపా, జనసేన కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామని చెప్పారు.

ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీలో స్థానికులతో ఆయన సమావేశమై మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో తొమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. ఇంటి పన్ను, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తాము తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ మద్య నియంత్రణ పాలసీని తీసుకొస్తామని, వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. సీఎం జగన్ రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వస్తే ఆస్కార్‌తో పాటు భాస్కర్ అవార్డులు వస్తాయని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని హత్య చేసి ఆ నెపాన్ని కుటుంబ సభ్యులపై వేసిన మహానటుడని లోకేశ్‌ విమర్శించారు. కేంద్ర హోంశాఖ లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన నేపథ్యంలో ఈ సమావేశానికి సీఆర్పీఎఫ్ (వీఐపీ వింగ్) సిబ్బంది ఆయన వెంట వచ్చారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 31 2024, 16:39

తెదేపాలో చేరాడని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి!

మందస: శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. ఆరు నెలల క్రితం వైకాపా నుంచి తెదేపాలో చేరానని.. అప్పటి నుంచి అధికార పార్టీ నేతలు తనపై కక్షగట్టారని బాధితుడు ఆరోపించాడు..

వివరాల్లోకి వెళితే.. మందస మండలం గౌడు గురంటికి చెందిన గాడి దేవరాజు ఆర్టీసీలో ఔట్‌ సోర్సింగ్‌ కింద డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం వేకువజామున స్వగ్రామం నుంచి విధుల కోసం బైక్‌పై బయలుదేరారు..

ఈ క్రమంలో బుడార్సింగి సమీపంలో కొందరు మాటువేసి తనపై కర్రలతో దాడికి పాల్పడ్డారని బాధితుడు చెప్పాడు. దాడి చేసిన వారిలో సివిల్‌ దుస్తుల్లో పోలీసులు ఉన్నారని తెలిపాడు. తెదేపాలో చేరినందుకు కక్షగట్టి వైకాపా నేతలే దాడి చేయించారని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలంటూ మందస పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించాడు. గాయాలు కావడంతో చికిత్స కోసం అతడిని హరిపురం సీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న పలాస తెదేపా అభ్యర్థి గౌతు శిరీష బాధితుడిని ఓదార్చారు. దేవరాజుపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఆమె కంటతడిపెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 29 2024, 21:11

క్రైస్తవ భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్‌ చర్చిలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. ఉదయం 11.30 గంటలకు శిలువను ఊరే గించిన అనంతరం మధ్యా హ్నం 2 గంటల వరకు ప్రార్థనలు జరిగాయి.

ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు. శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు. శిలువకు తనకు తానే లోక పాపములను పోగొట్టుటకు శిలువ ఎక్కాడు.

ఆ దినము న పలికిన 7 ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం ఈ రోజు ప్రత్యేకత. చర్చి ప్రేసీబేటరీ ఇన్‌చార్జి రెవరెండ్‌ శాంత య్య దైవ సందేశం చేశారు.

ఏసు శిలువ వేయబడిన తర్వాత తన చివరి ఏడు మాటల గురించి భక్తులకు వివరించారు. ఈ సందర్భం గా ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు.

గుడ్‌ ఫ్రైడే సందర్భంగా మెదక్‌ డయాసిస్‌ పరిధి లోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు భారీగా తరలి రావడంతో చర్చి ప్రాంతం కిటకిటలా డింది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 29 2024, 18:22

లైంగిక వేధింపులతో మరో విద్యార్థిని ఆత్మహత్య

విశాఖ మధురవాడ కొమ్మది లో విద్యార్థినిపై దారుణ లైంగిక వేధింపుల సంఘటన మళ్లీ చోటు చేసుకుంది.ఈ లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య కు దారితీసింది. ఈ సంఘటన సంచలనం రేపింది.

ఇటీవల కాలంలో వరుసగా విశాఖ మధురవాడలో ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్య లు,అత్యాచారాల సంఘట నలు నిత్యకృత్యంగా మారా యి. ఇటీవల ఒక విద్యార్థిని పై పిటి మాస్టర్ అత్యచారం సంఘటన మరవకముందే తాజాగా మరో సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

మధురవాడ ఒక విద్యా సంస్థలో దారుణ లైంగిక వేధింపుల సంఘటన మళ్లీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.ఈ తీవ్ర లైంగిక వేధింపుల సంఘట నలో తన కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదని ఒక అమాయక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

ఆమె ఆత్మహత్య చేసుకుం టూ ముందుగా వాట్సప్ చాటింగ్ ద్వారా సూసైడ్ నోట్ రాసింది. తనకు జరిగిన లైంగిక వేధింపుల సంఘటనలో తాను చదువుకుంటున్న కాలేజీలో విద్యాబుద్ధులు నేర్పించవ లసిన ఫ్యాకల్టీ విద్యార్థులతో చేతులు కలిపి లైంగిక వేధిం పులకు పాల్పడినట్లు పేర్కొంది.

తనలాగే అనేకమంది మహి ళా విద్యార్థులు లైంగిక వేధిం పులకు నిత్యం బలి అవుతు న్నారని తెలిపింది. పోలీసు లకు ఫిర్యాదు చేస్తే రహస్యం గా తీసిన ఫోటోలు, వీడి యోలు సోషల్ మీడియాలో పెట్టి ఆ విద్యార్థిని కుటుంబ పరువును బజారుకీడుస్తా మని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆత్మహత్య చేసుకున్న బాధిత విద్యార్థిని సూసైడ్ నోట్ లో పేర్కొంది.

ఈ ఘటన ఒక్కసారిగా వెలుగు చూడడం తో విద్యార్థులు,తల్లిదండ్రులు భయాందోళనకు గుర య్యారు. విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యా యులే కీచకులుగా మారుతుంటే తల్లిదండ్రుల్లో తమ పిల్లలు పై ఆందోళన మొదలియింది.

మృతురాలు తనకు జరిగిన బాధ ను తన తల్లిదండ్రు లకు వాట్సప్ ద్వారా మెసేజ్ పంపించి శుక్రవారం తెల్లవా రుజామున కళాశాల బిల్డింగ్ పై దూకి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు..