సమయపాలన,క్రమశిక్షణ,నిరంతర సాధనతో విద్యార్థుల భవిష్యత్.
![]()
కుమ్రంభీంఆసిఫాబాద్ :సమయపాలన,క్రమశిక్షణ,నిరంతర సాధనతో విద్యార్థుల భవిష్యత్ పురోగమించవచ్చునని సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ అన్నారు. ఆదివారం రోజున కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కృష్ణవేణి పాఠశాల ఆధ్వర్యంలో పద్మశాలి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులు దిశ నిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా పరీక్షల సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలి,ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ద్వారా వారు చదువులోనే కాదు జీవితంలో కూడా ముందుకు వెళతారు అని విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికను ఎంతో అద్భుతమైన రీతిలో సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ తెలియచేశారు. విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడేలా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించాలి అని ఆలోచన చేసిన కృష్ణవేణీ యాజమాన్యాన్ని వారు కొనియాడారు.సమయపాలన, క్రమ శిక్షణ, నిరంతర సాధన ద్వారా విద్యార్థులు పురోగమించవచ్చని తెలిపారు.ప్రొడక్టివ్, సూపర్ ప్రొడక్టివ్ వైపు మన గమనం ఉండాలని, తప్పుడు మనుషులతో స్నేహం, తప్పుడు పనులు చేయరాదని చెప్పారు. మీ పేరు ముందున్న ఇంటి పేరుతో కాకుండా మీ పేరు తరువాత మీ ఘనత పెట్టుకునే వైపు పయనించాలని సూచించారు. దీక్షతో ప్రయత్నిస్తే ఫలితాలు (focus-effort-result) వస్తాయని, తాత్కాలిక ఆనందం కోసం కాకుండా మంచి భవిష్యత్ కోసం కష్టపడాలని విద్యార్థులను కోరారు. ఈ నేపథ్యంలో గురువులను గౌరవించాలని, వారు చెప్పిన దారిలో పయనించాలని చెప్పారు. మన జీవితం లో అమ్మ, నాన్న, గురువు, సైనికులు, మనకు అన్నం పెట్టే రైతులే నిజమైన కథానాయకులని, వారిని గౌరవించడం మన బాధ్యత అని అన్నారు. సమయానికి విలువ ఇవ్వాలని, లేనిచో గెలుపు పరుగులో ఓడిపోవడం తద్యమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దోమల సురవర్థన్, జియా - ఉల్ - హక్ ,దోమల వేద ప్రవీణ్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లి తండ్రులు ఇందులో పాల్గొన్నారు.

కుమ్రంభీంఆసిఫాబాద్ :సమయపాలన,క్రమశిక్షణ,నిరంతర సాధనతో విద్యార్థుల భవిష్యత్ పురోగమించవచ్చునని సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ అన్నారు. ఆదివారం రోజున కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కృష్ణవేణి పాఠశాల ఆధ్వర్యంలో పద్మశాలి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులు దిశ నిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా పరీక్షల సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలి,ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ద్వారా వారు చదువులోనే కాదు జీవితంలో కూడా ముందుకు వెళతారు అని విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికను ఎంతో అద్భుతమైన రీతిలో సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ తెలియచేశారు. విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడేలా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించాలి అని ఆలోచన చేసిన కృష్ణవేణీ యాజమాన్యాన్ని వారు కొనియాడారు.సమయపాలన, క్రమ శిక్షణ, నిరంతర సాధన ద్వారా విద్యార్థులు పురోగమించవచ్చని తెలిపారు.ప్రొడక్టివ్, సూపర్ ప్రొడక్టివ్ వైపు మన గమనం ఉండాలని, తప్పుడు మనుషులతో స్నేహం, తప్పుడు పనులు చేయరాదని చెప్పారు. మీ పేరు ముందున్న ఇంటి పేరుతో కాకుండా మీ పేరు తరువాత మీ ఘనత పెట్టుకునే వైపు పయనించాలని సూచించారు. దీక్షతో ప్రయత్నిస్తే ఫలితాలు (focus-effort-result) వస్తాయని, తాత్కాలిక ఆనందం కోసం కాకుండా మంచి భవిష్యత్ కోసం కష్టపడాలని విద్యార్థులను కోరారు. ఈ నేపథ్యంలో గురువులను గౌరవించాలని, వారు చెప్పిన దారిలో పయనించాలని చెప్పారు. మన జీవితం లో అమ్మ, నాన్న, గురువు, సైనికులు, మనకు అన్నం పెట్టే రైతులే నిజమైన కథానాయకులని, వారిని గౌరవించడం మన బాధ్యత అని అన్నారు. సమయానికి విలువ ఇవ్వాలని, లేనిచో గెలుపు పరుగులో ఓడిపోవడం తద్యమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దోమల సురవర్థన్, జియా - ఉల్ - హక్ ,దోమల వేద ప్రవీణ్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లి తండ్రులు ఇందులో పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్: ఈనెల 10న ఎస్పీఎం కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం,యూనియన్ గుర్తింపుకై వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందన్నారు.రిటైర్డ్ వార్డెన్, ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు అల్లి రాజయ్య అధ్యక్షతన ఆదివారం రోజున సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈనెల 10న శనివారం ఉదయం 11 గంటలకు బాలభారతి హై స్కూల్లో కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ యొక్క సమావేశంలో మిల్లులో గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించుటకు చేపట్టవలసిన కార్యక్రమం గురించి చర్చించటం జరుగుతుందని,కాబట్టి కార్మికులు,కార్మిక సంఘాల నాయకులు తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.2014 సెప్టెంబర్ లో అక్రమంగా మూసివేసిన ఎస్ పి ఎం,కార్మికుల అనేక ఆందోళన ఫలితంగా 2018 ఆగస్టు రెండున తెరుసుకున్నప్పటికీ ఆరు సంవత్సరాలు గడుస్తున్న మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం కార్మిక వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు.కార్మికులు అనేక సమస్యలతో బాధపడుతున్నట్టు వారి బాధలు కష్టాలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని,జెకె పేపర్ మిల్లు చెప్పిందే చట్టం చేసిందే శాసనం గా కార్మికులు శ్రమదోపిడికి గురియగుచున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మిల్లు ప్రారంభమై ఆరు సంవత్సరాలు కావస్తున్న కనీస సౌకర్యమైన క్యాంటీన్ లేకపోవడం దురదృష్టకరమని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రధమ చికిత్స చేసే సౌకర్యం కూడా లేకపోవడం అత్యంత దారుణమని ప్రజా సంఘాల నాయకులు అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జయదేవ్ ,ఉపాధ్యక్షులు ఎస్పీయం మాజీ జనరల్ సెక్రటరీ, గుల్ల పెళ్లి నాగేశ్వరరావు, ఐక్యవేదిక ఉపాధ్యక్షులు, రిటైర్డ్ హెడ్మాస్టర్ బి. నర్సయ్య, కార్మిక నాయకులు కలికోట రమణయ్య, ఐక్యవేదిక జనరల్ సెక్రెటరీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, నాయకులు అడ్వకేట్ కిషోర్, బి.వేణు రాజ నరసయ్య పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్: చిరు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా చేయూతనిద్దామని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని కోట్నాక భీమ్ రావు పిల్లల ఉద్యానవనంలో ప్రతి ఆదివారం పార్కును సందర్శించే వారికి అల్పాహారం, తినుబండారాల విక్రయ కేంద్రాన్ని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్త, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం పిల్లల ఉద్యానవనమునకు కుటుంబ సభ్యులతో సందర్శనకు వచ్చేవారు బయట నుండి తినుబండారాలు కొనుగోలు చేయకుండా పార్కులోని ఏర్పాటు చేసిన చిరు వ్యాపారులు విక్రయించే కేంద్రాల వద్ద కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని అన్నారు. తద్వారా చిరు వ్యాపారులను ప్రోత్సహించి ఉపాధి కల్పించినట్టు అవుతుందని తెలిపారు. విక్రయ కేంద్రాలలో చూడ, దయివడ, బెల్లం గులాబి పూలు, తోటకూర గారెలు, ఎగ్ లెస్ కేకులు, చకోడీలు, ఖారా, బిస్కెట్లు, చిరుధాన్యాలతో తయారుచేసిన తినుబండారాలు, చిప్స్, గప్చుప్ ఇతర తిను పదార్థాలు లభిస్తాయని, సందర్శకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ తహసిల్దార్ రమేష్, మున్సిపల్ సిబ్బంది, చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది జితేందర్, మధు, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,జనవరి20, : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024లో కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఓటరు జాబితా పరిశీలకులుగా నియమించబడిన ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి బి. భారతి లక్పతి నాయక్ ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు హాజరు అవుతారని, ఈ క్రమంలో జిల్లాకు చెందిన అధికారులు తమ ప్రగతి నివేదికలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,జనవరి20, : ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024లో కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఓటరు జాబితా పరిశీలకులుగా నియమించబడిన ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి బి. భారతి లక్పతి నాయక్ ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు అవుతున్నారని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు హాజరు అవుతారని, ఈ క్రమంలో జిల్లాకు చెందిన అధికారులు తమ ప్రగతి నివేదికలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లా: వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలప దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు ఆసిఫాబాద్ ఎఫ్తర్వా అప్పలకొండ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి మండలంలోని భవానీనగర్ సమీపంలో ఎఫ్ఎస్ఓ సాయిచరణ్ బృందంతో కలిసి రెక్కీ నిర్వహించినట్లు చెప్పారు. ఒక వాహనంలో పరిశీలించగా 12 కలప దుంగలు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ రూ. 50 వేల వరకు ఉంటుందన్నారు. కలపను, వాహనాన్ని స్థానిక రేంజ్ కార్యాలయానికి తరలించారు.
Feb 05 2024, 21:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.1k