నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 10:34

నారాయణపేట జిల్లాలో మరో చిరుత మృతి

తెలంగాణలో వరసగా పులులు మరణించడంతో సంచలనం రేపుతుంది. ఇప్పటికే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఫారెస్ట్‌లో రెండు పులులు మృతి చెందగా.. అదృశ్యమైన పులుల్లో ఒకటి శనివారం సాయంత్రం కెమెరా కంటికి చిక్కింది.

అది ప్రాణాలతోనే ఉంది అని ఊపిరి పీల్చుకునే లోపు.. ఇప్పుడు మరో చిరుత ప్రాణాలు వదలటం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. ఈసారి నారాయణపేట జిల్లాలో చిరుత మృతి చెందింది.

దామరగిద్ద మండలం కంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో మూడు చిరుత పులులు సంచరించగా.. అందులో ఒకటి మరణించింది. మరో రెండు పారిపోయాయి.

అయితే.. పొలాల్లో మూడు చిరుతలు తిరుగుతుండ టాన్ని గమనించిన స్థానికులు వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జనాల రాకను గమనించిన చిరుత కూనలు రెండు అడవిలోకి పారిపోయాయి.

అనారోగ్యంతో బాధపడు తున్న తల్లి చిరుత మాత్రం నిస్సహాయ స్థితిలో అక్కడ క్కడే తచ్చాడుతూ కనిపించింది. దీంతో.. కొందరు యువకులు పులిని ఫొటోలు, వీడియోలు తీశారు.

పులి అనారోగ్యంగా ఉంది.. ఏమనటం లేదన్న కారణంతో.. మరికొంత మంది యువకులు.. చిరుతతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈలోపు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

అయితే.. చిరుత ఉన్న ప్రదేశానికి అధికారులు చేరుకునే లోపే చిరుత ప్రాణాలు వదిలింది. చిరుత మృతి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.

చిరుత అనారోగ్యం కారణంగానే మృతి చెందిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా.. చిరుతకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు నివేదిక వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 10:31

నేటినుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర

అల్లర్ల బాధిత మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ సారథ్యం లో భారత్ జోడో న్యాయ్ యాత్ర కు కాంగ్రెస్ పార్టీ ఆదివారం శ్రీకారం చుట్టనున్నది.

నిరుద్యోగిత, ధరల పెరుగుదల, సామాజిక న్యా యం వంటి సమస్యలపై ప్రధానం గా దృష్టి సారిస్తూ, లోక్‌సభ ఎన్నికలకు సన్నాహకంగా ఈ యాత్రకు ఉపక్రమించడం పార్టీ యత్నం.

భారత్ జోడో న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాలలో 100 లోక్‌సభ సెగ్మెంట్ల మీదుగా సాగుతుంది. రాహుల్ గాంధీ గతంలో దేశవ్యాప్తంగా సాగించిన యాత్ర మాదిరిగా ఇది ‘పరివర్తన’ యాత్రగా భాసిస్తుందని పార్టీ విశ్వసిస్తున్నది.

పార్లమెంట్‌లో ప్రజల సమస్యల ప్రస్తావనకు ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వనందున భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఉపక్రమి స్తున్నామని కాంగ్రెస్ వివరిం చింది. రాజ్యాంగంలో పొందుపరచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సిద్ధాంతా లను తిరిగి నెలకొల్పడం తమ యాత్ర లక్షమని పార్టీ తెలియ జేసింది.

ఇది ఎన్నికల యాత్ర కాదని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో తమ పేలవ ప్రదర్శన దరిమిలా తమ భవిష్యత్తు మెరుగుదలను కోరుతున్నా మని పార్టీ స్పష్టం చేసింది.

ఈ నెల 22 నాటి రామ మందిరం ప్రతిష్ఠాపనపై బిజెపి దృష్టి కేంద్రీకరిస్తుం డడంతో ఈ యాత్ర ద్వారా జీవనోపాధి అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నది.

మోడీ ప్రభుత్వ 10 ఏళ్ల అన్యాయ్ కాల్’పై యాత్ర

భారత్ జోడో న్యాయ్ యాత్ర సైద్ధాంతిక యాత్ర అని, ఎన్నికల్లో ఓట్ల సముపార్జన కోసం కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

నరేంద్ర మోడీ ప్రభుత్వ పది సంవత్సరాల ‘అన్యాయ్ కాల్’కు వ్యతిరేకంగా యాత్ర చేపడుతున్నామని పార్టీ తెలిపింది.

నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 10:26

నేడు తెలుగు రాష్ట్రాలలో బోగీ పండుగ సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగీ సంబరాలు మొదల య్యాయి. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటు న్నారు.

వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ కంటే.. ఏపీలో సంక్రాంతి పండగను ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు.

ఈ పండగను ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాలను ప్రజలు సొంతూర్లకు చేరుకున్నారు.

పలు ప్రాంతాల్లో రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు సందడి చేస్తు న్నారు. గ్రామాలల్లో హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సంక్రాంతి పండగ వాతారవరణం ఉట్టిపడుతోంది.

ఏపీలో ఈ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున కోళ్ల పందెలు నిర్వహిస్తారు. ఈ పందెంలను చూసేందుకు భారీగా జనాలు వచ్చి ఎంజాయ్ చేస్తారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 22:13

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు. శనివారం యాదాద్రి క్షేత్రాన్ని ఆయన సందర్శించారు.

నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు జారీ చేసిన జాతీయ సర్టిఫికెట్ ‘భోగ్’ - బ్లిస్ ఫుల్ హైజీన్ పత్రాన్ని ఆలయ ఏఈఓ రామ్మోహన్ రావుకు అందజేశారు.

SB NEWS

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 22:03

వైసిపి పార్టీ కీ ఎంపి బాల శౌరి రాజీనామా?

మ‌చిలీప‌ట్నం వైసిపి ఎంపి బాల‌శౌరి ఆ పార్టీకి శనివారం గుడ్ బై చెప్పారు…

తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. సిఎం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితంగా ఉండే బాల శౌరికి ఎంపి సీటు మ‌ళ్లీ ఇచ్చే విష‌యంలో ప్ర‌తిష్టం భ‌న ఏర్ప‌డ‌టంతో ఇప్ప‌టికే ఎంపి అల‌క‌బూనారు..

ఇదే స‌మ‌యంలో ఆయ‌న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటి అయ్యారు.. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ఆయ‌న‌తో చ‌ర్చించారు.. భేటి సంద‌ర్భంగానే బాల శౌరిని జ‌న‌సేన‌లోకి రావ‌ల‌సిందిగా ప‌వ‌న్ ఆహ్వానించారు..

ఈ నేప‌థ్యంలోనే బాల శౌరి వైసిపికి టాటా చెప్పేశారు.. త్వ‌ర‌లోనే ఆయ‌న జ‌న‌ సేన‌లో చేర‌నున్న‌ట్లు స‌మాచారం...

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 19:52

తెలుగు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మకర సంక్రాంతి శుభాకాం క్షలు తెలిపారు.

పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

సూర్యుడి కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృ ద్ధి వెలుగులు విరజిమ్మాల న్నారు.

భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండు గలు.. అందరూ ఆనందంగా జరుపుకోవా లని మనసారా ఆకాంక్షించారు.

తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా పండుగ సంబురాలు జరుపుకోవా లని అన్నారు.

సకల జన హితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు...

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 19:51

ఏపీ డిప్యూటీ సీఎం పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై శనివారం హైదరాబాద్ లో కేసు నమోదైంది.

కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బేగంబజార్‌ పోలీస్ స్టేషన్ లో మల్లురవి ఫిర్యాదు చేశారు. దీంతో 3 సెక్షన్ల కింద నారాయణ స్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారని మల్లురవి ఆరోపించారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 19:48

ప్రజాసేవకే నా జీవితం అంకితం ... నన్ను వదిలిపెట్టకండి ...!

- మంత్రి పొన్నం ప్రభాకర్ భావోద్వేగం

ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను క్రిబ్కో ఛైర్మన్ బీరేంద్ర సింగ్, ఢిల్లీ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎండీ అనితా రావత్ సన్మానించారు. ఈ క్రమంలో.. ఆనాటి జ్ఞాపకాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. కో ఆపరేటివ్ నుంచి విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన తన ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగిందని పొన్నం చెప్పుకొచ్చారు. మంత్రి అయ్యానని తనను ఒదిలేయొద్దని.. తాను ఎప్పటికీ తమ్ముడినేనంటూ పొన్నం చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొంచెం ఎమోషనల్ అయ్యారు.అతి చిన్న వయసులోనే మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాననని.. ఐదేళ్లు ఛైర్మన్‌గా చేశానని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. క్రిబ్కో ప్రోత్సాహం వల్ల ఎంతో ఎదిగానన్నారు. క్రిబ్కో, ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలన్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో తాము సీనియర్లుగా ఉండడం వల్ల తనకు మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 7 వ తేదీన ప్రభుత్వం ఏర్పడితే.. 9వ తేదీనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఫ్రీ టికెట్ ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు.

నిన్ననే లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చా. అందరి కంటే చిన్న వయసులో కో ఆపరేటివ్‌గా పని చేశా. మీ అందరి ప్రేమను పొందాను. మీ ప్రేమ అభినమనాలు నా జీవితంలో మర్చిపోను. ఈసారి మంత్రి అయ్యాను. ఢిల్లీకి రాజయిన తల్లికి కొడుకే కాబట్టి.. మంత్రినయినా మీకు మాత్రం చిన్నోడినే. మీ ప్రేమ అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్న. మంత్రి అయ్యానని నన్ను ఒదిలేయకండి.. నేను మీ తమ్ముడిని. విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన నా ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగింది." అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 19:43

Chandrababu: చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలు.. తెదేపా నేతల ఆందోళన

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా విజయవాడ కనకదుర్గ వారధిపై భద్రతాలోపాలు కనిపించాయి. అధికారులు వారధిపై లారీ అడ్డంపెట్టి విద్యుత్‌ లైట్ మరమ్మతులు చేపట్టారు..

ఆయన పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. వారధిపై వాహనాన్ని అడ్డంగా పెట్టడంపై తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వారధిపై ట్రాఫిక్‌ స్తంభించి చంద్రబాబు జెడ్‌ప్లస్‌ వాహన శ్రేణి దాదాపు పది నిమిషాల పాటు నిలిచిపోయింది.

ఎన్‌ఎస్‌జీ కమాండోలు ట్రాఫిక్ క్లియర్‌ చేసి కాన్వాయ్‌ను ముందుకు తీసుకెళ్లారు. వంతెనపై విద్యుత్‌ పరికరాల వాహనం అడ్డుపెట్టడంపై ఎన్‌ఎస్‌జీ సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 19:42

ప్రముఖ క్లాసికల్ సింగర్ కన్నుమూత

ప్రముఖ క్లాసికల్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభా ఆత్రే(91) కన్ను మూశారు.

కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.

వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను పూణెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

ప్రభా ఆత్రే పద్మశ్రీ (1990), పద్మ భూషణ్ (2002), పద్మ విభూషణ్ (2022) అవార్డులు అందుకు న్నారు...