నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 19:48

ప్రజాసేవకే నా జీవితం అంకితం ... నన్ను వదిలిపెట్టకండి ...!

- మంత్రి పొన్నం ప్రభాకర్ భావోద్వేగం

ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను క్రిబ్కో ఛైర్మన్ బీరేంద్ర సింగ్, ఢిల్లీ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎండీ అనితా రావత్ సన్మానించారు. ఈ క్రమంలో.. ఆనాటి జ్ఞాపకాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. కో ఆపరేటివ్ నుంచి విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన తన ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగిందని పొన్నం చెప్పుకొచ్చారు. మంత్రి అయ్యానని తనను ఒదిలేయొద్దని.. తాను ఎప్పటికీ తమ్ముడినేనంటూ పొన్నం చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొంచెం ఎమోషనల్ అయ్యారు.అతి చిన్న వయసులోనే మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాననని.. ఐదేళ్లు ఛైర్మన్‌గా చేశానని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. క్రిబ్కో ప్రోత్సాహం వల్ల ఎంతో ఎదిగానన్నారు. క్రిబ్కో, ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలన్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో తాము సీనియర్లుగా ఉండడం వల్ల తనకు మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 7 వ తేదీన ప్రభుత్వం ఏర్పడితే.. 9వ తేదీనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఫ్రీ టికెట్ ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు.

నిన్ననే లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చా. అందరి కంటే చిన్న వయసులో కో ఆపరేటివ్‌గా పని చేశా. మీ అందరి ప్రేమను పొందాను. మీ ప్రేమ అభినమనాలు నా జీవితంలో మర్చిపోను. ఈసారి మంత్రి అయ్యాను. ఢిల్లీకి రాజయిన తల్లికి కొడుకే కాబట్టి.. మంత్రినయినా మీకు మాత్రం చిన్నోడినే. మీ ప్రేమ అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్న. మంత్రి అయ్యానని నన్ను ఒదిలేయకండి.. నేను మీ తమ్ముడిని. విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన నా ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగింది." అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 19:43

Chandrababu: చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలు.. తెదేపా నేతల ఆందోళన

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా విజయవాడ కనకదుర్గ వారధిపై భద్రతాలోపాలు కనిపించాయి. అధికారులు వారధిపై లారీ అడ్డంపెట్టి విద్యుత్‌ లైట్ మరమ్మతులు చేపట్టారు..

ఆయన పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. వారధిపై వాహనాన్ని అడ్డంగా పెట్టడంపై తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వారధిపై ట్రాఫిక్‌ స్తంభించి చంద్రబాబు జెడ్‌ప్లస్‌ వాహన శ్రేణి దాదాపు పది నిమిషాల పాటు నిలిచిపోయింది.

ఎన్‌ఎస్‌జీ కమాండోలు ట్రాఫిక్ క్లియర్‌ చేసి కాన్వాయ్‌ను ముందుకు తీసుకెళ్లారు. వంతెనపై విద్యుత్‌ పరికరాల వాహనం అడ్డుపెట్టడంపై ఎన్‌ఎస్‌జీ సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 19:42

ప్రముఖ క్లాసికల్ సింగర్ కన్నుమూత

ప్రముఖ క్లాసికల్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభా ఆత్రే(91) కన్ను మూశారు.

కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.

వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను పూణెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

ప్రభా ఆత్రే పద్మశ్రీ (1990), పద్మ భూషణ్ (2002), పద్మ విభూషణ్ (2022) అవార్డులు అందుకు న్నారు...

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 19:40

మంత్రి పొన్నం ప్రభాకర్ తో విక్రమ్ సింగ్ భేటీ

మాజీ దివంగత మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ హైదరాబాద్ లో బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో శని వారం భేటీ అయ్యారు.

సోమాజిగూడలోని మంత్రి నివాసంలో విక్రమ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు విక్రమ్ గౌడ్ వెల్లడించారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 16:54

Nara Lokesh: రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరంచాలి.. నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు..

తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరించాలని ఆకాంక్షించారు..

సంక్షేమంతో ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని కోరారు. తెలుగుజాతికి స్వర్ణయుగం తీసుకురావడమే తెలుగుదేశం పార్టీ సంక్రాంతి సంకల్పమని స్పష్టం చేశారు. భోగభాగ్యాల భోగి, సకల శుభాల సంక్రాంతి, కన్నుల పండువగా కనుమ పండగలు జరుపుకోవాలని సూచించారు..

మరోవైపు.. తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ఏడాది అయోధ్య రామ మందిరం ప్రారంభం కాబట్టి అందరికీ ప్రత్యేకమేనన్నారు..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 16:52

AP News: ఆనంతో కోటంరెడ్డి కీలక భేటీ..

నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘ చర్చలు నిర్వహించారు..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టీడీపీ గెలుపునకు వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చేసేందుకు ప్రణాళికలు రచించారని సమాచారం.

సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ప్రణాళిక అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది. ఆనం, కోటంరెడ్డి భేటీతో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్‌ చోటు చేసుకుంది..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 16:51

చెత్త కుప్పలో శిశువు

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని తెల‌క‌ప‌ల్లి మండ‌లం తాళ్ల‌ప‌ల్లిలో అమాన‌వీయ ఘ‌ట‌న శనివారం చోటు చేసుకుంది.

అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చెత్త‌కుప్ప‌లో ప‌డేశారు. శిశువు ఏడుపును గ‌మ‌నించిన స్థానికులు.. త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు, ఐసీడీఎస్ అధికారుల‌కు స‌మాచారం అందించారు.

ప్రాణాల‌తో ఉన్న మ‌గ శిశువును పోలీసులు నాగ‌ర్‌క‌ర్నూల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం శిశువు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు.

శిశువు త‌ల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 16:49

AP NEWS: ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..?

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు..

ఓటర్ల జాబితా మరియు EPICలకు సంబంధించి లేఖలో కొన్ని సమస్యలను లేవనెత్తారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో వేలకొద్దీ నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. మార్చి 2021లో జరిగిన తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో నకిలీ ఓట్లు పోలయ్యాయని లేఖలో ఫిర్యాదు చేశారు.

EPIC కార్డుల డిజిటల్ ప్రింట్‌ అవుట్ల డేటాను కూడా సమర్పించారని.. అందులో 35000 ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్ చేశారని తేలిందన్నారు. డీఈవో ఇచ్చిన సమాచారం మేరకు క్రిమినల్‌ కేసు నమోదు చేశారని పురంధరేశ్వరి లేఖలో ఫిర్యాదు చేశారు..

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 15:06

ప్రయాణికులతో బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిటకిట

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌ వైపు వెళ్లే రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తోంది. సికింద్రా బాద్‌ నుంచి కాకినాడ, విశాఖపట్నం, ఇంటర్‌సిటీ, వంటి ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రయాణికులు మూడు నెలల ముందుగానే టికెట్‌ రిజర్వేషన్లు చేయిం చుకున్నారు.

వాటిల్లోకి సాధారణ ప్రయాణికులు ఎక్కేస్తుం డడంతో రిజర్వేషన్‌ తీసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట

మహాత్మాగాంధీ, జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో బస్సుల్లో 1.6 లక్షల మంది ప్రయా ణాలు సాగిస్తే రెండు రోజు లుగా రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు జిల్లాలకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఏపీ, తెలంగాణ జిల్లాలకు రెగ్యులర్‌ సర్వీసులతో పాటు గురువారం రాత్రి 8 గంటల వరకు 975 ప్రత్యేక బస్సులు నడిపినట్లు రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌ తెలిపారు.

రాత్రి 12 గంటల వరకు 1250 బస్సులు జిల్లాలకు వెళ్లే అవకాశముందన్నారు. శనివారం రద్దీ మరింత పెరిగితే బస్సుల సంఖ్య పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

జిల్లాలకు వెళ్లే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహా లక్ష్మి పేరుతో మహి ళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆయా బస్సుల్లో ప్రయాణానికి పోటీ పడుతున్నారు.

శివారు ప్రాంతాల నుంచే పలు జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడు పుతోంది. ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. పలు ప్రాంతాల్లో ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.

ఆర్టీసీ బస్సులు రద్దీగా మారడంతో ప్రైవేట్‌ బస్సుల్లో రెట్టింపు చార్జీలు చెల్లించి సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు క్యూ కట్టారు. ఏపీ, తెలంగాణ జిల్లాలకు వెళ్లే బస్సులతో మియాపూర్‌, కూకట్‌పల్లి, అమీర్‌పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జాం సమస్యలు నెల కొన్నాయి.

నిజంనిప్పులాంటిది

Jan 13 2024, 15:03

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

అనంతపురం: కాంట్రాక్టర్లను వైకాపాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు..

అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి గుత్తేదారుని బెదిరించి, కూలీలను కిడ్నాప్ చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ కాంట్రాక్టర్‌ వెళ్లి పశ్చిమ బెంగాల్‌ ఎంపీ ఖాన్‌చౌదరికి ఫిర్యాదు చేశారని చెప్పారు.

దీనిపై ఇతర రాష్ట్రాల ఎంపీలు స్పందించినా అనంతపురం జిల్లా పోలీసులు ఎందుకు స్పందించడంలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఊడిగం చేయడానికేనా ఖాకీ డ్రస్సు ఇచ్చిందంటూ నిలదీశారు. సిగ్గులేని ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నా.. సీఎం స్పందించడం లేదంటే దీంట్లో ఆయనకూ భాగం ఉందని ఆరోపించారు..