పెనకచర్ల డ్యామ్, సౌత్ కెనాల్ కు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన ద్విసభ్య కమిటీ సబ్యూలు ముంటిమడుగు కేశవరెడ్డి..

సింగణమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సబ్యూలు ముంటిమడుగు కేశవరెడ్డి ,అన్న గారి ఆధ్వర్యంలో గార్లదిన్నె మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు కలిసి పెనకచర్ల డ్యామ్, సౌత్ కెనాల్ వాటర్ వదిలే విషయమై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందచేయడానికి గార్లదిన్నె మండల నాయకులు రైతులు. ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. నీళ్లు వదిలే విషయం మీద కలెక్టర్ గారు వాటికీ సంబందించిన అధికారులతో మాట్లాడి, సాగు, నీరు త్రాగు. వదిలే విషయం మాట్లాడి రైతులకి తగిన న్యాయం చేస్తాం అని మాట ఇవ్వడం జరిగింది.

నల్లపరెడ్డిపల్లి గ్రామం లో బాబుతో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమంలో ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసా నాయుడు..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామం లో బాబు తో నేను కరపత్రాల పంపిణి మరియు ప్రజావేదిక -రచ్చబండ కార్యక్రమం *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు అందిచడం జరిగింది.ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసిన అరాచక పాలన సాగుతుందన్నారు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన చంద్రబాబు గారిని ఇన్ని ఇబ్బందులు పెట్టడం చాలా దురదృష్టకరం. నియంత సైకో జగన్ సాగిస్తున్న విధ్వంస పాలనపై ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి మహోద్యమంగా మార్చిన చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని 20 ఏళ్ల ముందుకు తీసుకువెళ్తే జగన్ లాంటి క్రిమినల్ ని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు. టిడిపి పై ఎన్ని అక్రమ కేసులు దాడులు చేసిన రాబోయే రోజుల్లో రేట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వైసిపి ప్రభుత్వం ఇలాగే తమపై కేసులు దాడులు ఆపని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు యూనిట్ ఇంచార్జ్, బుత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు నల్లపరెడ్డిపల్లి, గుంజేపల్లి గ్రామ టీడీపీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగు రాష్ట్ర సదస్సుకు తరలి రండి...

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో మండలం కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ అనుబంధ సంఘం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు వలసల నివారణ ఉపాధి పనులు తక్షణం ప్రారంభించాలని రాష్ట్ర సదస్సు నేడు అనంతపురం నగరంలోని సంగమేస్ ఫంక్షన్ హాల్ లో జరుగును. ఈ రాష్ట్ర సదస్సుకు మండల వ్యాప్తంగా వ్యవసాయ కూలీలు రైతు కూలీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుచున్నాం. బుక్కరాయసముద్రం మండల కార్యదర్శి మర్రి స్వామి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజవర్గ కార్యదర్శి శ్రీనివాసులు మండల కార్యదర్శి తిరుపతయ్య, శ్రీనివాసులు, తదితరులు.

చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుంచి నిర్దోసిగా విడుదల కావాలి అని శ్రీ పెద్దమ్మ స్వామి కీ ప్రతేక పూజలు నిర్వహించిన మాజీజడ్పీటీసీ రామలింగారెడ్డి
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ప్రసిద్ధ శ్రీ పెద్దమ్మ స్వామినీ దర్శించి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరగా జైలు నుంచి నిర్దోసి గా విడుదల కావాలి అని శ్రీ పెద్దమ్మ స్వామి కీ ప్రతేక పూజలు నిర్వహించిన జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీజడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి
న్యాయానికి సంకెళ్లు పిచ్చోడి రాజ్యములో.. ఆలం నరసానాయుడు..
జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు రిమాండ్ కు నిరసనగా శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం కేంద్రంలో ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు 5నిమిషాల పాటు నిర్వహించిన "న్యాయానికి సంకెళ్లు " అనే కార్యక్రమంలో భాగంగా, చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు* పాల్గొన్నారు. ఈ సందర్బంగా *రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు* మాట్లాడుతూ అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేల చంద్రబాబు నాయుడు గారి ని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంత్రుత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ప్రజల మధ్యన వుండి ప్రజాసమస్యల గురుంచి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారి ని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుని తీరుతాం! రాష్ట్రంలో తిరిగి ధర్మ పాలనను తీసుకువస్తాం!. ఆలం నరసానాయుడు
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో కడిగిన ముత్యములా బయటకు రావాలని నార్పల మండలం చాములూరు గ్రామం మసీద్ లో ప్రతేక ప్రార్థన కార్యక్రమం లో పాల్గొన్న *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితి పై ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గారికి ఉద్దేశపూర్వకంగా వసతులు కల్పించకుండా అనారోగ్యానికి గురిచేసి చంద్రబాబు నాయుడు గారి మానసికంగా దెబ్బ తీయాలని సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడన్నారు. చంద్రబాబు గారి కి ఎటువంటి హాని కలిగిన సీఎం జగనే నైతిక  బాధ్యత వహించాలని అన్నారు.కడిగిన ముత్యములా చంద్రబాబు గారు బయటకు వస్తారు అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ఎర్రినాగప్ప, pl లక్ష్మి నారాయణ, బోరు నాగర్జున, నాగేంద్ర,కేశవరెడ్డి, నాగిరెడ్డి, శేఖర్ రెడ్డి,సత్తయ్య, భక్త వక్చల్, నాగర్జున,నాగేంద్ర,నల్లప్ప,బుషణ నిరంజన్,ప్రసాద్,శ్రీరాములు చాములూరు,నిలువురాయి టీడీపీ నాయకులు వెంకటశివ, అంగడి కుళ్లాయప్ప,వన్నూర్ కుళ్లాయప్ప,రాముడు,భాస్కర్, బాషా,ఆనంద్,ఆది,బొజ్జులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
పులివెందులలో టీడీపీ కార్యాలయంలో చేతులకు నల్ల రిబ్బన్లు, బేడీల లాగా కట్టుకొని నిరసన వ్యక్తం చేసిన రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి పై బనాయించిన అక్రమ కేసులకు నిరసన గాను మరియు ఆయన ఆరోగ్యం పట్ల చూపుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గాను, *న్యాయానికి సంకెళ్లు* *కార్యక్రమం కడప జిల్లా పులివెందులలో టీడీపీ కార్యాలయంలో చేతులకు నల్ల రిబ్బన్లు, బేడీల లాగా కట్టుకొని నిరసన వ్యక్తం చేసిన రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ కార్యనిర్వాహ కార్యదర్శి వాసాపురం బాబు పుట్లూరు మండల పార్టీ కన్వీనర్ బాల రంగయ్య అనంతపురం ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు మాజీ ఎంపీటీసీ చిక్కాల చండ్రయుడు  నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి లోలురు నారాయణస్వామి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి దాల్ వీర్ నారాయణ తదితరులు కడప జిల్లా పులివెందులలో న్యాయానికి సంకెళ్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*
సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేసిన బుక్కరాయసముద్రం టిడిపి శ్రేణులు
చట్టాల్ని చుట్టం చేసుకొని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, న్యాయానికి సంకెళ్లు వేసిన సైకో జగన్ అరాచకాలపై నిరసనగా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో పెద్దమ్మ గుడి దగ్గర జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీదర్ బాబు గారు మాజీ జడ్పీటిసి కె.రామలింగారెడ్డి గారు ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు నిరసన చేయడం జరిగంది . ఈ కార్యక్రమంలో ఆశోక్ కేశన్న లక్ష్మి నారాయణ S.నారాయణ స్వామి నరేంద్రయాదవ్ సురేష్ చౌదరి బాబయ్య చితంబరి హరి చెన్నమయ్య వడ్డే రామకృష్ణ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెస్ రాజు గారి ప్రజాస్వామ్యపరిరక్షణ సైకిల్ యాత్ర శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారి ప్రజాస్వామ్యపరిరక్షణసైకిల్* *యాత్ర* కు శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామం లో *ఎమ్మెస్ రాజు గారికి* ఘన స్వాగతం పలికిన పుట్లూరు కన్వినర్ బాలరంగయ్య,మడ్డిపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మడ్డిపల్లి కులశేఖర్రెడ్డి, మడ్డిపల్లి రామచంద్ర రెడ్డి,ఓబులాపురం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయుడు,శివయ్య నాయుడు,క్రిష్టయ్య, భాస్కర్, చక్రవర్తి, కడవకల్లు పెద్దయ్య, నాగార్జున, మడ్డిపల్లి క్రిష్టయ్య,బిసి బ్రహ్మయ్య,బాలాపురం శ్రీనివాస్ నాయుడు, కొందిడిరుకుంఠ సుదర్శన్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి, లక్ష్మయ్య,సురేపల్లి రామానాయుడు,బోడపాటి ఆదినరసింహులు, నడింపల్లి భాస్కర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
బ్రిడ్జ్ నిర్మాణ పనుల పరిశీలన
శింగనమల మండలం తరిమెల నుంచి చిట్టూరు గ్రామానికి పెన్నానది పైన నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను అరిందమ్ మోదక్ (భారత ప్రభుత్వం ఉన్నతాధికారి డిప్యూటీ డైరెక్ట్ జనరల్ )(ఎంపీ ల్యాండ్స్),తో కలసి రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జ్ నిర్మాణం 137 మీటర్లు పొడవు,8.40 మీటర్లు వెడల్పు విస్తీర్ణంతో, ఎంపీ నిధులతో దాదాపు రూ.3.60 కోట్లు ఖర్చుతో నిర్మాణం జరగబోతుంది. ఈ కార్యక్రమంలో డిసియంయస్ డైరెక్టర్ శ్రీరామి రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు కంచిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్పంచు ఓబులేష్, సంబంధిత అధికారులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.