యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి రాఘవేంద్ర ఫార్మసి కళాశాలపై చర్యలు తీసుకోవాలి... AISA PDSU NSUI..
రాఘవేంద్ర ఫార్మసి కళాశాల విద్యార్థులు కన్వీనర్ కోట కింద ప్రవేశం పొందడానికి వచ్చినటువంటి విద్యార్థులను అధిక ఫీజులతో వేధిస్తున్నారు* *ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాఘవేంద్ర ఫార్మసీ కళాశాల ముఖ దారం నందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కళాశాల యాజమాన్యంతో అక్రమంగా కట్టించుకునేటువంటి ఫీజులపై వాదించడం జరిగింది ఈ సందర్భంగా ఐసా రాష్ట్ర అధ్యక్షులు వేమన, పి డి ఎస్ యు ,జిల్లా కోశాధికారి బండారు శంకర్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ రాఘవేంద్ర ఫార్మసి కళాశాల నందు విద్యార్థుల చేత నిబంధనకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను నిర్బంధాలకు గురిచేసి ఏ విద్యార్థి అయితే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మేం కడుతున్నాము మరి అదనంగా ఎందుకు ఫీజులు కట్టాలి అని కళాశాల యాజమాన్యాన్ని విద్యార్థులు ప్రశ్నించినప్పుడు ఆ విద్యార్థులపై కళాశాల యాజమాన్యం బెదిరింపు ధోరణితో మాట్లాడి వాళ్లను వీడియో గ్రాఫ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది దీనిని పూర్తిగా ఖండిస్తూ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పుడు మీరు ఎవరికైనా చెప్పుకోండి యూనివర్సిటీ అధికారులకు చెప్పుకున్న మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేము ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది కానీ యూనివర్సిటీ అధికారులు మాత్రం యాజమాన్యానికి కొమ్ము కాస్తూ ఫీజుల దోపిడీని అరికట్టాల్సినటువంటి అధికారులే ఇలా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో కుమ్మక్కై పేద విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను ఫీజుల రూపంలో వేధిస్తున్నారని వాపోయారు విద్యార్థులకు జగనన్న విద్యార్థులు ద్వారా వస్తున్న సొమ్ముతోపాటు ప్రతి విద్యార్థి చేత అడ్డదారిలో 15000 రూపాయల కట్టించుకుని విద్యార్థులకు రికార్డ్స్ ఇస్తున్నాం మరియు ఇతర సాకు చెబుతూ కళాశాల యాజమాన్యం మాట తిప్పేస్తుంది కాబట్టి ఈ కళాశాలపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఈ కార్యక్రమంలో ఐసా నాయకులు రాజు నాయక్ వంశీకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు
గూగుడు జంట దేవాలయాలల్లో, మసీదు లో,చర్చ్ లో ప్రత్యేక పూజలు చేసిన: అలం నరసా నాయుడు..
గూగుడు జంట దేవాలయాలల్లో, మసీదు లో,చర్చ్ లో ప్రత్యేక పూజలు చేసిన: అలం నరసా నాయుడు.. జగన్ రెడ్డి అక్రమ కేసులకు భయపడేది లేదు ప్రజాక్షేత్రంలో తెల్చుకుంటాం*.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పై అక్రమంగా కేసు పెట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వేదిస్తున్నడంతో చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని చంద్రుడిగా బయటకు రావాలని నార్పల మండలం గూగుడు గ్రామంలో హిందూ,ముస్లిం జంట దేవాలయాలు కుళ్ళాయస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలలో, మసీదు లలో,చర్చ్ లలో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా lరాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు మాట్లాడుతూ మచ్చలేని చంద్రుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలని జంట దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. వైయస్సార్సీపి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు పై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు ఈ సైకో ప్రభుత్వానికి త్వరలో ప్రజలు ఓటు రూపంలో బుద్ది చెబుతారు అని అన్నారు. విద్యుత్ బిల్లులు ధరలు పెంచేస్తూ సంక్షేమ పథకాలకు కోత విధిస్తూ నవ మోసాల ప్రభుత్వంగా పేరుగాంచిందని ధ్వజమెత్తారు. అభివృద్ధిని మరచిపోయి ప్రశ్నించే వారిని వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేకత పెరగడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు అన్న భయంతోనే చంద్రబాబు అరెస్టుకు వైఎస్సార్ పార్టీ కుట్ర పన్నారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులకు భయపడేది లేదు ప్రజాక్షేత్రంలో టెల్చుకుంటాం అని అన్నారు. టిడిపి హయాంలో 6 లక్షల కోట్లు అవినీతి జరిగిందని అన్నారు కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో 60 రూపాయలు అవినీతిని కూడా నిరూపించుకొలేక పోయారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు బుత్ ఇంచార్జ్ లు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నవరత్నల్లోని ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అమలు చేయడంలో దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవం సృష్టించారు.. ఎమ్యెల్యే..
ప్రతి సంక్షేమ పథకం అమలు ఒక విప్లవమే : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి* నవరత్నల్లోని ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అమలు చేయడంలో దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవం సృష్టించారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాల లబ్దిని వారికి కేటాయించిన బుక్ లెట్ ద్వారా వివరించారు. స్థానికంగా సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో గ్రామాల్లోని అన్నీ వర్గాలకు మంచి జరిగిందన్నారు. మంచి జరిగితేనే రానున్న ఎన్నికల్లో జగనన్నకు మద్దతుగా నిలవాలని కోరారు. దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి మరోసారి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో గుమ్మేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని దేవుని కోరుతూ శ్రీవారికి ప్రత్యేక పూజలు...
శ్రీవారి సేవలో టిడిపి నాయకులు చంద్రబాబు విడుదల కావాలని శ్రీవారికి ప్రత్యేక పూజలు శింనమల మండలం గుమ్మేపల్లి గ్రామానికి చెందిన టిడిపి నాయకులు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు.మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వెంటనే జైలు నుండి విడుదల కావాలని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. వారం రోజులపాటు స్వామి వారి సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈకార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ తెలుగు యువత నాయకులు బ్యాళ్ళ సుదర్శన్,టిడిపి నాయకులు తోట ఓబుళపతి,నాగేపల్లి రమణ,డేగల ఓబులపతి,బెస్త రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం 14 వ బెటాలియన్ హెడ్ క్వార్టర్ నందు బి కంపెనీ ARC కోర్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథి గా కమాండెంట్ R.గంగాధర్ రావు, IPS హాజరు..
అనంతపురం 14 వ బెటాలియన్ హెడ్ క్వార్టర్ నందు బి కంపెనీ ARC కోర్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథి గా కమాండెంట్ R.గంగాధర్ రావు, IPS హాజరయ్యారు. కోర్స్ లో భాగంగా ఇండోర్, అవుట్డోర్, లో ప్రతిభ కనబరచిన సిబ్బందికి బహుమతులు అందించడము ఈ కోర్సు వలన సిబ్బంది యోక్క సర్వీస్ బుక్ ని అప్డేట్ కి సంబంధించి సందేహాలు,వారి యొక్క జీత భత్యాల , లోన్స్ గురించి మరియు సిబ్బంది కి సంబంధించిన సమాచారం అయిన అప్డేట్ చేసుకొన్నారు, APGLI, GPF,CPS, లీవ్ రూల్స్ కి సంబందిచిన అన్ని విషయాల మీద క్లాసు లు చెప్పటం జరిగింది. ఈ కోర్సు వలన సిబ్బంది అందరు మానసికంగా మరియు శారీరకంగా ధృడంగా తయారు అవుతారు అని మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపటానికి ఇలాంటి చక్కటి అవకాశాన్ని కల్పించారు అని Addl.DGP , APSP Bns కి ప్రతేక్య ధన్యవాదాలు తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ కమాండెంట్ డి. వి. రమణ మూర్తి, ట్రైనింగ్ ఇంచార్జ్ డియస్పి రమణ మూర్తి ఆర్.ఐ. లు రాము, నాగేంద్ర , లొకేశ్వర నాయుడు, రామ రావు, ట్రైనింగ్ ఆర్.యస్.ఐ మరియు ఇతర సిబ్బంది పాల్గొనటం జరిగింది.
తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారి హౌస్ అరెస్ట్ దుర్మార్గం.. మాసూల చంద్రమోహన్..
జిల్లా తెలుగుదేశంపార్టీ నాయకులు* పొలిట్ బ్యుారో సభ్యులు, పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు హౌస్ అరెస్టు అక్రమం అని జిల్లా తెలుగుదేశంపార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాసూల చంద్రమోహన్ ఖండించారు.రాయదుర్గం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన,కాలువ పైన అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నందున ప్రజాస్వామ్యబద్ధంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్దకే వెళ్లి తేల్చుకుంటాను అని చెప్పి బయలుదేరుతున్న కాలువ శ్రీనివాసులు గారిని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.పోలీసులు వైసిపి వారు సభలకు అనుమతి ఇస్తారు,టిడిపి వారికి నిరసనలకు అనుమతి లేదంటారు ఇదేక్కటి న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం,
తాడిపత్రి టౌన్ NGO లో MRPS MSP ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కరపత్రం విడుదల చేయడం జరిగినది తాడిపత్రి నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతం చేద్దాం...
ఫ్లాష్... ఫ్లాష్.... ఫ్లాష్.... ఫ్లాష్.. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి సైన్యం తాడిపత్రి SC వర్గీకరణ సాధనకై..... 10.10.2023 తేదీ ఈ రోజున అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ NGO లో MRPS MSP ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కరపత్రం విడుదల చేయడం జరిగినది తాడిపత్రి నియోజకవర్గంలో పాదయాత్ర విజయవంతం చేద్దాం... ....*అత్యవసర సర్క్యూలర్*.... M.పెద్దిరాజు మాదిగ మహాజన సోషలిస్టు పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి మాట్లాడుతూ... మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు పాదయాత్రకు మద్దతుగా 12.10.2023 తేదీ తాడిపత్రి టౌన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఉదయం 10 గంటలకు ప్రారంభం తాడిపత్రి మండలం. పెద్దపప్పూరు మండలం. యాడికి మండలం. పెద్దవడుగూరు మండలం తాడపత్రి నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగి మాదిగ పేటలో ప్రతి ఇంటింటికి తిరిగి కరపత్రం ఇచ్చి వేలాదిమంది చలో హైదరాబాద్ కు తరలిస్తాం..... *మాదిగల విశ్వరూప మహాపాదయాత్ర లను విజయవంతం చేద్దాం*.... *S C వర్గీకరణ కు చట్టబద్ధత కల్పించుకుందాం*.. తాడిపత్రి నియోజవర్గం MSP, MRPS మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలకు సామాజిక ఉద్యమ నమస్కారాలు... *అభినవ అంబెడ్కర్, మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం.* షెడ్యుల్డ్ కులాల వర్గీకరణ చట్టబద్ధత కై నవంబర్ 07 న హైదరాబాద్ కేంద్రంగా జరుగు *మాదిగల విశ్వరూప మహాసభను* లక్షలాది మంది తో విజయవంతం చేయడానికి గాను *మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాదిగల విశ్వరూప మహాపాదయాత్ర కు సంఘీభావంగా తాడిపత్రి నియోజకవర్గంలో 12.10.2023 తేదీ తాడపత్రి టౌన్ అంబేద్కర్ విగ్రహం వద్దకు MRPS MSP మరియు అనుబంధ సంఘం నాయకులు ఉదయం 10 గంటలకు పాదయాత్ర విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సామాజిక ఉద్యమ వందనాలతో..... ఆర్టీసీ రిటైర్డ్ కండక్టర్ కంబయ్య మాదిగ సిబి రవి మాదిగ MRPS తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి కంబగిరి మాదిగ MRPS పెద్దపప్పూరు మండల అధ్యక్షులు వెంకటేష్ మాదిగ MRPS తాడపత్రి మండల అధ్యక్షులు నరసింహులు మాదిగ MRPS సీనియర్ నాయకులు పుల్లయ్య మాదిగ ఎస్సీ ఎస్టీ వేదిక రాష్ట్ర కార్యదర్శి రత్నం మాదిగ MRPS సీనియర్ తెల్లబల్ల శ్రీనివాసులు మాదిగ MRPS సీనియర్ నాయకులు శివుడు మాదిగ MRPS సీనియర్ నాయకులు బాబయ్య మాదిగ MRPS సీనియర్ నాయకులు భాస్కర్ మాదిగ MRPS సీనియర్ నాయకులు దస్తగిరి మాదిగ MRPS సీనియర్ నాయకులు మనోహర్ మాదిగ MRPS యువ నాయకుడు సుదర్శన్ మాదిగ MRPS యువ నాయకుడు నంద మాదిగ MRPS యువ నాయకుడు నారాయణస్వామి మాదిగ MRPS యువ నాయకులు గార్లదిన్నె మహిళా నాయకురాలు లక్ష్మీదేవి మాదిగ రాష్ట్ర మహిళా నాయకురాలు తులసి మాదిగ జిల్లా మహిళా నాయకురాలు
శింగనమల నియోజకవర్గం పేరుకు మాత్రమే SC రిజర్వుడు నియోజకవర్గం ఎస్సీ సమస్యలు పట్టించుకోని వైసిపి ఎమ్మెల్యే...
శింగనమల నియోజకవర్గం పేరుకు మాత్రమే SC రిజర్వుడు నియోజకవర్గం ఎస్సీ సమస్యలు పట్టించుకోని వైసిపి ఎమ్మెల్యే... అనేక సమస్యల వలయం లో బుక్కరాయసముద్రం మండలంలోని భద్రంపల్లి గ్రామం లోని ఎస్సీ కాలనీ* శింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం లోని భద్రంపల్లి లో ఎస్సీ కాలనీ లో గత మూడు నెలలుగా తీవ్ర నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఎస్సీ కాలనీ వాసులు ఎక్కడో మూడు కీలో మీటర్ల దూరంలో పంట పొలాల్లో కి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్న కాలనీ వాసులు ఓట్ల కోసం మత్రమే ఎమ్మెల్యే గారు నాయకులు వస్తారు కాని మా సమస్యను పట్టించుకొన్న పాపాన పోలేదు అని కాలనీ వాసులు అంటున్నారు అలాగే ఎస్సీ కాలనీ కి ఉన్న స్మశాన వాటిక ను కబ్జా చేశారని కనీసం మాకు స్మశనవాటిక కోసం స్థలం కూడ కేటాయించలేదని కాలనీ వాసులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇంత సమస్య ఉన్న కూడా కనీసం ఎమ్మెల్యే గారు అధికారులు చర్యలు తీసుకోకపోవటం చాలా దారుణం అని వారి సమస్యను జనసేన పరిష్కారం చేస్తుందని వారం రోజుల లోపు ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ ఈ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించకుంటే శింగనమల జనసేన పార్టీకి ఆధ్వర్యంలో కలెక్టరు కార్యాలయం కి వెళ్లి కలెక్టర్ గారికి ఎస్సీ కాలని సమస్యలు తెలియజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మురళి కృష్ణ గారు జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్ గారు జిల్లా సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి గారు పురుషోత్తం రెడ్డి గారు కృష్ణమూర్తిగారు జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సంతోష్ యాదవ్ గారు బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు జి ఎర్రిస్వామి గారు వీర మహిళలు సరిత గారు అనసూయ గారు నియోజవర్గ నాయకులు అరటి తాహిర్ గారు అంచల సద్దాం ఖాన్ గారు తదితరులు పాల్గొన్నారు.
కాల్వ శ్రీనివాసులు గారిని రాయదుర్గానికి వెళ్లకుండా అరెస్టు చేయడం దుర్మార్గం.. అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి..
కాల్వ శ్రీనివాసులు గారిని రాయదుర్గానికి వెళ్లకుండా అరెస్టు చేయడం దుర్మార్గం.. అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి. *తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు గారి హౌస్ అరెస్ట్ ని ఖండించిన: సింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనయుడు టిడిపిఎస్సీసెల్* *రాష్ట్రఅధ్యక్షులు* *MS.రాజు జిల్లా అధికార ప్రతినిధులు డేగల కృష్ణమూర్తి పర్వతనేని శ్రీధర్ బాబు మాజీ జెడ్పిటిసి ఆలం వెంకట నరసానాయుడు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య రాయదుర్గం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నందున ప్రజాస్వామ్యబద్ధంగా పోలీస్ స్టేషన్ వద్దకే వెళ్లి తేల్చుకుంటాను అని చెప్పి బయలుదేరుతున్న కారువ శ్రీనివాసులు గారిని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రివర్యులు కాల్వ శ్రీనివాసులు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఒక పోలిట్ బ్యూరో సభ్యులని పది రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై 10 కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు* ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ టిఎన్టియుసి రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాల్ల నాగేంద్ర నియోజకవర్గ తెలుగు అధ్యక్షుడు అధ్యక్షుడు నరేంద్ర కుమార్ యాదవ్ జిల్లా బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి కొయ్యగురా పెద్దన్న మాజీ ఎంపీటీసీ చిక్కాల చండ్రాయుడు నియోజవర్గ కార్యదర్శి నారాయణస్వామి నాగలాగుడ్డం శివ ఎస్సీ సెల్ నియోజవర్గం అధ్యక్షుడు దాల్ వీర్ నారాయణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మొండిపోగుల ఎర్రిస్వామి రాచేపల్లి రవీంద్రనాథ్ రెడ్డి మట్లగుంది పుల్లయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు
జోనల్ 5 ఇంచార్జ్ బీద రవిచంద్ర యాదవ్ ని కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..
జోనల్ 5 ఇంచార్జ్ బీద రవిచంద్ర యాదవ్ ని కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు శింగనమల : అనంతపురం రాంనగర్ నందు కమ్మభవన్ దగ్గర అనంతపురం అర్బన్ రిలే నిరాహార దీక్ష శిబిరంలో తెలుగుదేశం పార్టీ రాయలసీమ జోనల్ పై ఇంచార్జ్ *మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ గారిని కలిసి పుష్పగుచ్చం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు* ఈ కార్యక్రమంలో *మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప, తెలుగు రైతు పార్లమెంట్ అధికార ప్రతినిధి తలారి తిప్పన్న, శింగనమల నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి* రంగస్వామి తదితరులు పాల్గొన్నారు