జగనన్ననే మళ్ళీ సీఎం చేసుకుందాం.. అందరూ సమిష్టిగా పని చేద్దాం.. 175 నియోజకవర్గాల్లో ప్రభంజనం సృష్టిద్దాం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
జగనన్ననే మళ్ళీ సీఎం చేసుకుందాం.. అందరూ సమిష్టిగా పని చేద్దాం.. 175 నియోజకవర్గాల్లో ప్రభంజనం సృష్టిద్దాం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
పాల్గొన్న ఎంపీ తలారి రంగయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, పేదల పక్షపాతిగా నిలిచిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్ లో " ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ఈ కార్యక్రమాన్ని ఇంటింటా విస్త్రతంగా ప్రచారం చేయడంలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జగనన్న కుల, మత పార్టీలు చూడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్నారన్నారు. శింగనమల నియోజకవర్గం ఎన్నడూ లేని విదంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. నీళ్లు అడిగినందుకు తన మీద, నాయకుల మీద అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. జగనన్న పాలనలో ఎవ్వరి మీద కేసులు పెట్టలేదన్నారు. కానీ నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నియోజక వర్గంలో సాగు,తాగు నీరుకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఎన్నో ఏళ్లుగా నెరవేరని శింగనమల చెరువును లోకలైజేషన్ చేయించామన్నారు. గతంలో టీడీపీ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదు కాబట్టే, ప్రజలకు వారిమీద నమ్మకం కోల్పోయి గద్దె దింపారన్నారు. 2014- 19 మధ్య చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు నెరవేర్చలేదని, కానీ 2019 నుంచి ఈ నాలుగేళ్ళల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ఈ హామీలు, నవరత్నాల వివరాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గ్రామ, సచివాలయాల స్థాయిలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసి పల్లె నిద్ర చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, గృహసారథులు, మండల కన్వీనర్లు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
Oct 08 2023, 17:57