ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు చేపట్టిన దీక్ష శిబిరానికి హాజరైన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిలు డేగల కృష్ణమూర్తి పర్వాతనేని శ్రీధర్ బాబు
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నార్పల మండల కేంద్రంలో సింగనమల నియోజకవర్గం ద్వి సభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న శిబిరానికి నియోజకవర్గ పరిశీలకులు ముక్తియర్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధిలు డేగల కృష్ణమూర్తి పర్వాతనేని శ్రీధర్ బాబు మాజీ జెడ్పిటిసి సభ్యులు ఆలం వెంకట్ నరసానాయుడు కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శన్ నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసి ఈ రోజుకి 25 రోజులు కావస్తుందని ఎలాంటి ఆధారాలు లేని కేసులో ఇన్ని రోజులు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమఅరెస్ట్ చేయడం దారుణమని నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని న్యాయమే మమ్మల్ని గెలిపిస్తుందని వారు పిలుపునిచ్చారు* ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్లు ఎర్రి నాగప్ప అశోక్ చంద్రశేఖర్ నాయుడు దొడ్లో రామాంజనేయులు సదాశివరెడ్డి నరేంద్ర కుమార్ యాదవ్ చెన్రాయుడు కొయ్యగూర పెద్దన్న దాల్ వీరనారాయణ నారాయణ నారాయణ స్వా మి రాజు రెడ్డిపల్లి నాయుడు తదితరులు పాల్గొన్నారు
వైసిపి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు నాయుడు గారి కి ఆదరణ రోజు రోజు కు పెరుగు తోంది....పరిశీలకులు ముక్తియర్ గారు, ఆలం నరసానాయుడు గారు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి తోడుగా 22 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష రాష్ట్ర కార్యదర్శి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారి అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ముక్తియార్ గారు, పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు,జిల్లా అధికార ప్రతినిధి లు పర్వతనేని శ్రీధర్ బాబు గారు, డేగల కృష్ణమూర్తి గారు,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శన్ నాయుడు గారు,మండల సీనియర్ నాయకులు BKS కన్వీనర్ అశోక్,మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ, మాజీ సర్పంచ్ నారాయణస్వామి, మండల నాయకులు సి.కేశన్న, బాబయ్య, రెడ్డిపల్లి నాయుడు, నరేంద్ర కుమార్ యాదవ్, ఎస్సీ సెల్ రాజు, ఎల్లనూరు మండల నాయకులు శేఖర్, రామాంజనేయులు, మేడుకుర్తి రాముడు, సదాశివరెడ్డి, సంజీవ రాయుడు,పవన్,హనుమంతు, సుబ్బారెడ్డి, పుట్లూరు మండల నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ శివశంకర్ రెడ్డి, యూనిట్ ఇన్చార్జిలు ఆదినారాయణ రెడ్డి, m శ్రీనివాసరెడ్డి, j రామాంజనేయులు, t n t u c రవిచంద్ర, బూత్ కన్వీనర్లు రామానాయుడు, y లక్ష్మయ్య, శింగనమల మండల నాయకులు ex ఎంపీటీసీ చండ్రాయుడు, నారాయణస్వామి, కోయగూరు పెద్దన్న, దాల్ వీర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్బంగా ముక్తియార్ గారు ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ, దేశం గర్వించే నేత నారా చంద్రబాబు నాయుడు గారిని జైలులో పెట్టాలనే కక్ష్య తప్ప ఆయన అరెస్టుకు ఎలాంటి కారణాలు, ఆధారాలు లేవు. లక్షకోట్ల రూపాయలు అవినీతితో ఆనాడే ఉమ్మడి రాష్ట్రాన్ని దోచేసి 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి Y.S జగన్ అరాచక విధానాలను అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేల చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంత్రుత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ప్రజల మధ్యన వుండి ప్రజాసమస్యల గురుంచి మాట్లాడే బాబుగారి అరెస్టును జీర్ణించుకోలేక పోతున్నాము జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ్లాష్ న్యూస్.. నందమూరి నారా కుటుంబం మీద నోటికి వచ్చినట్లు విమర్శలు చేయడం మానుకోండి : దండు శ్రీనివాసులు..

దండు శ్రీనివాసులు మాట్లాడుతూ..... ఇది మీకు తెలుసా..... సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ప్రబోధించిన మహనీయుని సందేశం తో .... తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ కూతురు నడుపుతోంది .తల్లి పేరు మీద ఒక ట్రస్ట్ ఒక కొడుకు నడుపుతున్నారు అవి NTR TRUST BASAVATHARAKAM TRUST మీకు తెలుసా NTR TRUST లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో భువనేశ్వరి గారి పాత్ర ఏమిటంటే కొన్ని వేల మంది పేద విద్యార్థులకు... అనాథ పిల్లలకు...కుల మత వర్గ జాతి ప్రాంతం విభేదాలకు ఏ మాత్రం తావులేకుండా LKG నుంచి PG వరకు కార్పొరేట్ తల తన్నె రీతిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం,దుస్తులు,ఆహారం,హాస్టల్ వసతి తో పాటు Civils లోIIT లో Engineering లో గొప్ప కోచింగ్ తో శిక్షణ ఇస్తున్నారు. అలాగే కొన్ని లక్షలు మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన... నింపుతున్న మహా తల్లి నారా భువనేశ్వరి గారు ఏ రోజు అయినా పబ్లిసిటీ చూసారా?.. హైదరాబాద్లో... చల్లపల్లి లో అత్యాధునిక టెక్నాలజీ పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో భవనాలు,అత్యాధునిక,సౌకర్యాలతో ఆమె నడుపుతున్నారు ఈ NTR TRUST schools colleges లలో ఇంకో వైపు అన్ని పెద్ద పెద్ద నగరాల్లో NTR TRUST BLOOD BANKS ఇప్పుడు రక్తం దానంలో ముందంజలో ఉన్నాయి ఇది ఆమె విజయవంతంగా నడుపుతున్నారు హెరిటేజ్ ఫుడ్స్ నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ క్రింద కొన్ని కోట్ల రూపాయల దానం చేసి ఒక పెద్ద భవనం నిర్మించారు....ఈ NTR TRUST EDUCATION institution ప్రాంగణంలో ఇంకో ప్రక్క *నందమూరి బాలకృష్ణ* గారు తన తల్లి జ్ఞాపకార్థం *బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్* ద్వారా ఇనిస్టిట్యూట్ అత్యంత నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు ఇది ఇండియాలోనే ఒక గొప్ప క్యాన్సర్ ఆసుపత్రి ఇది దేశంలో లాభాలు ఆశించని ఆసుపత్రుల్లో.... మొదటి పది స్థానాలలో ఉంది కొన్ని లక్షలు మంది కుటుంబాలు ఉచితం గా చికిత్స పొందుతూ... ఊరట పొందుతున్నారు. ప్రజాసేవలో ఉండే కుటుంబాల్లో నందమూరి నారావారి కుటుంబంలా గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు.

పేద, బడుగు,బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాగోగులను జగనన్న కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు చెబితేనే పింఛన్లు, పథకాలు వచ్చేవి..! రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో "జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..! పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాగోగులను జగనన్న కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం "జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా సాధారణ డాక్టర్ తో పాటు ప్రత్యేక వైద్యులు, ఇతర సిబ్బంది గ్రామాలకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లు గుర్తిస్తే మెరుగైన వైద్యం కోసం సిఫారసు చేస్తారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గొందిరెడ్డిపల్లికి చెరువుకు ప్రతి ఏటా నీళ్ళు ఇస్తున్నాం. రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇది చాలా సంతోషకరం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు చెబితేనే పింఛన్లు, పథకాలు వచ్చేవి. డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. వైయస్ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు ఎక్కడ రూపాయి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ చేస్తున్నారు. జగనన్న ఇస్తున్న పథకాలపై విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. ఇచ్చింది చెప్పుకోకపోతే అది తప్పు అవుతుంది. చంద్రబాబు దొంగతనం చేశాడు కాబట్టే జైల్లో ఉన్నాడు. దొంగతనం చేసిన వాళ్లు జైల్లో కాక మరి ఎక్కడ ఉంటారు. టిడిపి వాళ్లు ఎవరైనా అడిగితే ఇదే మాట నిలదీయండి. చంద్రబాబు లాంటి వారి గురించి ఎక్కువ మాట్లాడకపోవాల్సిన అవసరం లేదు. నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు..! గొందిరెడ్డిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ భవనాలను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారథులు, మండల నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్ లుమరియు అధికారులు పాల్గొన్నారు.. 
सिक्किम में ल्होनक झील पर अचानक फटा बादल और बाढ़ में 15 से 20 फीट तक ऊंची लहरें देर तक मचाती रही तबाही, फोटो में देखिए यह भयावह मंजर
బొమ్మనహాల్ పాండురంగస్వామి గుడి నుంచినే మకల్లు ఆంజనేయస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు..
రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ - నేమకల్లు రహదారిపై ఆవిష్కృతమైన తెలుగుదేశం శ్రేణుల ఐక్యతకు సజీవ సాక్ష్యంలా దుష్టపాలకుల కుట్రల కారణంగా జైలుపాలైన *జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి* మేలు జరగాలన్న సంకల్పంతో నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయం దాకా *మాజీ మంత్రి వర్యులు కాలవ శ్రీనివాసులు గారు సాగిన పాదయాత్రలో పాల్గొన్న *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ గారు, బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కూచి హరి గారు. వందలాది మంది పాల్గొన్నారు. ఉదయం బొమ్మనహాల్ పాండురంగస్వామి గుడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర నేమకల్లు వరకు ప్రభంజనంలా సాగింది.
ఉచిత తాగునీటి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..!
అనంతపురం రూరల్ మండలం రాచనపల్లి సర్పంచ్ అంజి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత తాగనీటి వాటర్ ప్లాంట్ ను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్పంచ్ అంజి యాదవ్ ను అభినందించారు. పంచాయతీ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు..
ఒప్పందం ప్రకారం గడువు ముగిసిన రాజీనామాకు సిద్ధం కానీ ఎంపీపీ.. మరో వర్గం మీడియాకు వెల్లడి..
వివరాల్లోకెళ్తే..

బుక్కరాయసముద్రం మండల ఎంపీపీగా దాసరి సునీత గారిని రెండు సంవత్సరాల క్రితం ఎన్నుకోవడం జరిగింది నియోజవర్గం అధిష్టానం దగ్గర చేసుకున్న ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 24వ తేదీకి గడువు ముగిసిన రాజీనామా చేయలేదంటూ కొద్దిరోజుల క్రితం మరో వర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తో విన్నవించుకున్నారు ఎమ్మెల్యే గారు గడువు ముగిసిన వెంటనే నేను మాట్లాడుతానని సమాధానం ఇచ్చారు ఒప్పందం ప్రకారం మొదటి ఎంపీపీ చేసేవారికి రెండు సంవత్సరములు రెండోసారి అధికారం చేపట్టేవారు మూడు సంవత్సరాలు ఉంటారని ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మొన్న జరిగిన పార్టీ సమావేశంలో అధినాయకుడు ఆలూరు సాంబశివ రెడ్డి ఎంపీపీ భర్త బుల్లె నారాయణస్వామిని పిలిపించుకొని రాజీనామా చేయాలని అడిగారని దీనికి భిన్నంగా ఎంపీపీ భర్త సమాధానం ఇచ్చారని మరి ఆరు నెలలు గడువు అడిగారని విశ్వనీయవర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లో ఉన్నందున ఎమ్మెల్యే దంపతులు రెండోసారి ఎంపీపీగా వెంకటలక్ష్మిని నియమించేందుకు సమాలోచనలు తర్జనభర్జనలు చేస్తున్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని వర్గాలను ఆదుకోవడమే సీఎం జగనన్న ఆశయం.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజల శ్రేయస్సే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. పుట్లూరు మండలం చెర్లోపల్లి, ఓబులాపురం, దోసలేడు గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల బుక్ లెట్లను పంపిణీ చేసి ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ఎంత లబ్ది కలిగిందో వివరించారు. జగనన్న పాలనలో పేదల ఇంట సంక్షేమ పథకాల పంట పండుతోదన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతతో అవినీతి రహిత పాలనను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని అన్నారు. జగనన్న పాలనను చూసి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గురువారం అనగా 05.10.2023 వ తేదీన జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం పై అవగాహన సదస్సు కు ప్రతి ఒక్కరు హాజరు కావాలి..
జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం పై అవగాహన సదస్సు. గురువారం అనగా 05.10.2023 వ తేదీన అనంతపురం చెరువు కట్ట వద్ద వున్న శ్రీ షిర్డీ సాయి కళ్యాణమండపం నందు ఉదయం 9.00గంటలకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం లో 50% సబ్సిడీ తో గొర్రెల పెంపకం యూనిట్లు, దేశీ జాతి కోడి పిల్లల పెంపకం యూనిట్లు, సీమ పందుల పెంపకం యూనిట్లు మరియు పశుగ్రాసం సైలేజ్ యూనిట్లు పొందుటకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడమైనది . ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వారు చేపడుతున్న పథకం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని ఆసక్తి కల పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగ యువకులకు మరియు పై తెలిపిన యూనిట్ల పట్ల ఆసక్తి కల రైతులకు పశు సంవర్థక శాఖ అధికారులు మరియు బ్యాంక్ అధికారులు ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలనే విషయం పై అవగాహన కల్పించనున్నా రు. కావున బుక్కరాయసముద్రం నార్పాల శింగనమల మండలాల్లోని ఆసక్తి కల రైతులు నిరుద్యోగ యువకులు ఈ సదస్సుకు హాజరు కావలసింది గా కోరుచున్నాను - డా.ఏ.వి. రత్న కుమార్, సహాయ సంచాలకులు పశుసంవర్ధక శాఖ, బుక్కరయసముద్రం