భవ్యశ్రీ కి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎన్ఎస్ యుఐ..
భవ్యశ్రీ కి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకుడు మంజునాథ్ చిత్తూరు జిల్లాకు చెందినటువంటి భవ్యశ్రీ అనే అమ్మాయికి న్యాయం చేయాలని రాప్తాడు (మం) గొందిరెడ్డిపల్లి గ్రామంలో ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకుడు మంజునాథ్ కొవ్వొత్తులు వెలిగించి భవ్యశ్రీ కి న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థి భవ్య శ్రీ పై హత్య జరిగి 10 రోజులు అవుతున్న నిందితులను గుర్తించి, ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అదేవిధంగా దశ లేని ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా ఏ ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేసిన దాఖలాలు లేవని ఇలాంటి చట్టాలు పేరుకే తప్ప ఆడబిడ్డల రక్షణకు పనికిరావని తెలిపారు.మైనర్ బాలిక భవ్య శ్రీ ని కిరాతకంగా హత్య చేసిన దుర్మార్గులను తొందరగా గుర్తించి ఉరిశిక్ష విధించి భవ్యశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, ఆ కుటుంబ బాధ్యతలు ప్రభుత్వం తీసుకొని 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి భవ్య శ్రీ హత్యకు గల కారణాలు వెలికి తీసి భవ్య శ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో లోకేష్, మహేంద్ర, మల్లికార్జున, మనోజ్, జయప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసిన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి, సర్పంచ్ డేగల లలితమ్మ
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇంటిలో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి సర్పంచ్ డేగల లలితమ్మ డేగల శ్రీనివాసులుఓబుళపతి ఓం నాథ్ మల్లికార్జున రమేష్ హేమ లావణ్య బోయ శ్రీనవాసులు డేగల హరీష్ గ్రామస్తులతో కలిసి కొవ్వొత్తుల నిరసన కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు*
చిన్న జలాలపురముగ్రామంలో బాబుతో నేను అనే కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసిన.. గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటరమణ, ఐ టి డి పి నవీన్ కిరణ్ కుమార్..
అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలంనరసానాయుడు గారి ఆదేశాల తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో..... శింగనమల మండలం చిన్న జలాల పురముగ్రామంలో బాబుతో నేను అనే కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసిన గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటరమణ, ఐ టి డి పి నవీన్ కిరణ్ కుమార్ ప్రజలకు నారా చంద్రబాబునాయుడు అక్రమ కేసుపై ప్రజలకు వివరంగా వివరించడం అయినది. ఈ కార్యక్రమంలో చిన్న లింగన్న, వెంకటరమణ స్వామి, ఎర్రి స్వామి, అశోక్, వీర నాగన్న,సాయి,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
గృహసారదుల బీమాను 100% పూర్తి చేసి జిల్లాలో సింగనమల నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉన్నందున అభినందనలు తెలిపిన స్టేట్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి..
*ఫ్లాష్..న్యూస్...*

అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గం గృహసారదుల బీమాను 100% పూర్తి చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నది. అదేవిధంగా సింగనమల నియోజకవర్గం లో బుక్కరాయసముద్రం మొదటి స్థానంలో ఉన్నందున అభినందనలు తెలిపిన స్టేట్ కోఆర్డినేటర్ చెల్లా మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సింగనమల నియోజకవర్గంలోని వివిధ మండలాల జెసిఎస్ ఇన్చార్జిలను వారు ప్రశంసించారు
వినూత్న రీతిలో గొడుగుపట్టి నిరసన..
వినూత్న రీతిలో గొడుగుపట్టి నిరసన.... శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా 19 వరోజు నియంత పాలన పై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష *ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారి* సూచన మేరకు *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారి* అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష జరిగింది. ముఖ్యమంత్రి ప్రజలకు వెంట్రుకలు కూడా ఉండకుండా అన్ని పీకేస్తాడని చెప్పేందుకు నిరసనగా ఈరోజు నీలే నిరాహార దీక్షలో గొడుగు పట్టుకుని నిరసన చేశారు.నార్పల మండలo నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా *టిడిపి జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ హింసకు గురి చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బాబుకు తోడుగా నియంతపై పోరాటంకు మద్దతుగా మేము సైతం అంటూ టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 20వ రోజుకు చేరుకున్నాయి.టిడిపి పార్టీకి వస్తున్న ఆదరణ చూసి అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కి తగిన బుద్ధి చెప్పి టిడిపి పార్టీ 175 కి 175 సీట్లు గెలుస్తాయన్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఇంచార్జులు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ఆసియా క్రికెట్ జట్టుకు ఎంపికైన బా రెడ్డి అనుషాను అభినందించిన జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ.
అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ఆసియా క్రికెట్ జట్టుకు బండ్లపల్లి గ్రామానికి చెందిన బా రెడ్డి అనుష ఎంపిక కావడం అనంతపురం జిల్లా నార్పల మండలానికి చాలా గర్వంగా ఉందని అనంతపురం జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ గారు అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల అభివృద్ధి కొరకు ప్రాధానమిస్తున్నారు అదేవిధంగా భారత్ మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎత్తుకు ఎదగాలని ఆమెను ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైఎస్ఆర్సిపి బండ్లపల్లి నాయకులు భాస్కర్ రెడ్డి గారు వెంకట నారాయణ రెడ్డి గారు దేవన్స్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు రామచంద్ర గౌడ్ ఆజప్ప గారు దుర్గం సర్పంచ్ సాకే రామాంజనేయులు గారు వైఎస్ఆర్సిపి నాయకులు వేదాంతం మోహన్ గారు ప్రభుదాసు గారు గోవిందప్ప గారు తదితరులు పాల్గొన్నారు
రేపు గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేయు దీక్షకు సాంఘీ భావం తెలుపునున్న టీడీపీ సీనియర్ నాయకులు రామలింగారెడ్డి..
అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు ఆలంనరసానాయుడు గారి ఆదేశాల మేరకు .. శింగనమలనియోజకవర్గం శింగనమల మండల కేంద్రంలో రిలేనిరాహార దీక్ష శిబిరంలో రేపు గాంధీ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్నందున వల్లనా ఈ దీక్షకు సంఘీభావంగా బుక్కరాయసముద్రం మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, టీడీపీ పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు మరియు పెద్దయేతున్న టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చెయ్యాలిఅని కోరుచున్నాము. మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిఅని కోరుచున్నాము *ఇట్లు* *కాటప్పగారి రామలింగారెడ్డి మాజీజడ్పీటీసీ* *జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు* శింగనమల నియోజకవర్గం
గుమ్మేపల్లిలో స్వచ్ఛత హై సేవ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ డేగల లలితమ్మ..
సింగనమల మండలం గుమ్మేపల్లి గ్రామపంచాయతీ గుమ్మేపల్లి గ్రామంలో సర్పంచ్ డేగల లలితమ్మ ఆధ్వర్యంలో స్వచ్ఛత హై సేవ మన పరిసరాలను, గ్రామాన్ని పరిశుభ్రత తో ఉంచాలని తద్వారా రాష్ట్రంలో మరియు దేశంలోస్వచ్ఛ సంకల్పం సాధించి దేశాన్ని స్వచ్ఛ భారత్ గా మార్చడంలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపు నివ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో పంచాయతీ సెక్రెటరీ నాగరాజు గ్రామ ప్రజలు గణేష్ శ్రీనివాసులు సుబ్బారాయుడు ఓబుళపతి నారాయణమ్మ డేగల కిరణ్ మరియు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శ్రమదానం చేసిన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం జిల్లా: జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో (స్వచ్ఛతా హీ సేవా) లో భాగంగా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శ్రమదానం చేసిన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ , జెడ్పీటీసీ,మండల కన్వీనర్,JCs మండల కన్వీనర్, సర్పంచ్,నాయకులు, అధికారులు, పంచాయతి పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
భారెడ్డి అనూష ను సన్మానించిన ... చామలూరు దంపతులు...
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలం ,బండ్లపల్లి గ్రామానికి చెందిన భారెడ్డీ అనూష అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ఎన్నిక అవ్వడం దేశం తరఫున మహిళల ఆసియా కప్ క్రికెట్ జట్టులో ప్రాతినిధ్యం వహించడం మా అందరికీ గర్వంగా ఉందని భవిష్యత్ లో మహిళా వరల్డ్ కప్ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకొని ,భారత జట్టు కెప్టెన్ గా ఆ స్థాయికి ఎదిగాలని మేము కోరుకుంటున్నామని చామలూరు రాగే హరిత మాజీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్ పర్సన్ , చామలూరు రాజగోపాల్, వై యస్ ఆర్ సి పి యస్ సి సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆశిస్తున్నామని అలాగే ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.మా సొంత మండలం కు చెందిన అమ్మాయి ఈ స్థాయికి ఎదిగిందంటే చాలా సంతోషం,గర్వంగా ఉందని భవిష్యత్ లో జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకు వెలతావని ఆయన క్రీడాకారులను ప్రోత్సహిస్తారు ముఖ్యంగా మహిళలు అంటే ఇంకా చాలా మంచి ప్రోత్సాహం అందిస్తారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శిద్దరాచేర్ల సర్పంచ్ సాకే రామాంజినేయులు ,యం యస్ హనుమంతరాయుడు, నారాయణ స్వామి,రాజా , ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు